kapunews



TRENDING NOW




అనంతపురంలో ఆపిల్!

ఆ ఆపిల్ కాదు మండుటెండల్లో మంచు ఫలాలు!

ఎక్కడైనా మండుటెండలు కాసే రాయలసీమ గడ్డపై ఆపిల్ పండ్లు పండటం సాధ్యమేనా? కశ్మీర్ చలి, హిమాచల్ ప్రదేశ్ మంచు లేకుండా అనంతపురంలో ఆపిల్ సాగు చేయడమంటే.. అది ప్రకృతిని సైతం ఆశ్చర్యపరిచే విజయం! 

ఒకప్పుడు కరువుకు కేరాఫ్ అడ్రస్‌ అనంతపురం. కేవలం వేరుశనగ లేదా పొద్దు తిరుగుడు మాత్రమే కనిపించేది. అక్కడ  కియా కార్లను పండించడానికి కంకణం కట్టుకున్నాడు నాయుడు. కాలువలు ద్వారా నీటి ప్రవాహాలు మొదలయ్యాయి. చెరువులు నిండాయి. భూగర్భ జలాలు పైకి ఉబికాయి. ఎక్కడికక్కడ చెక్ డ్యామ్ ల నుండి కావాల్సిన వారికల్లా డ్రిప్ పరికరాలు వచ్చాయి. హార్టికల్చర్ లో అద్భుతాలు సృష్టించడం మొదలెట్టిన అన్నదాతలు మరో అడుగు ముందుకేసి కాశ్మీర్ ఆపిల్ వరైటీని మరింత తియ్యగా పండించే ధైర్యం చేశారు.
 
నిజానికి ఆపిల్ అంటేనే మనకు గుర్తొచ్చేది మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు. కానీ అనంతపురంలోని గార్లదిన్నె, కుందుర్పి, పెద్దపప్పూరు మండలాల్లోని రైతులు ఈ అసాధ్యాన్నే సుసాధ్యం చేశారు.

ఇక్కడ పండుతున్న కశ్మీర్ లోచిల్లీ డెలిషియస్ (KLD)
రకం ఆపిల్స్, సాధారణ కశ్మీర్ ఆపిల్స్ కంటే మరింత తియ్యగా ఉండటం విశేషం.

మొదటి పంటలోనే ఎకరాకు సుమారు ఒక టన్ను దిగుబడి రావడం వ్యవసాయ రంగంలోనే ఒక సంచలనం. నాణ్యమైన పండ్లకు కిలో రూ.170 వరకు ధర పలుకుతోంది, ఇది రైతులకు లాభదాయకమైన ఆదాయ వనరుగా మారింది. సగం మాత్రమే కార్పొరేట్ మార్కెట్లకు విక్రయించిన రమణారెడ్డి మిగిలిన వాటిని అక్కడ చూడ్డానికి వచ్చేవారికి రుచిచూడడానికి గర్వంగా పంచుతున్నారు.

ఈ మార్పు వెనుక దశాబ్దాల కృతజ్ఞతతో కూడిన కృషి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాయలసీమను "ఉద్యానవన హబ్"గా మార్చాలనే సంకల్పంతో తీసుకున్న చర్యలే నేడు ఫలితాలను ఇస్తున్నాయి.

హంద్రీ-నీవా వంటి ప్రాజెక్టుల ద్వారా వెనుకబడిన ప్రాంతాలకు నీటిని చేరవేయడం వల్ల భూగర్భ జలాలు పెరిగి, రైతులకు ధైర్యం వచ్చింది. దేశంలోనే అత్యధికంగా డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలను అందించి, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించేలా రైతులను ప్రోత్సహించారు.
 
ఒకప్పుడు నీటి చుక్క కోసం అల్లాడిన నేల మీద, నేడు విదేశీ నాణ్యతతో కూడిన పండ్లు పండుతున్నాయి. కశ్మీర్ చలి కంటే అనంతపురం రైతుల గుండెల్లో ఉన్న పట్టుదలే గొప్పదని ఈ పంట నిరూపించింది. కరువు సీమ నుంచి కోట్లు కురిపించే సీమగా అనంతపురం మారుతున్న ఈ ప్రయాణం అద్భుతం.. అమోఘం!

నీరు ఉంటే నేల బంగారం అవుతుందని అందరికీ తెలుసు.. కానీ అదే నీటితో ఎడారిలోనూ ఆపిల్స్ పండించవచ్చని అనంతపురం నిరూపిస్తోంది!



*నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసి తల్లిని చంపిన కొడుకు*

బెంగళూరులోని RR నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

 పక్షవాతంతో బాధపడుతున్న 75 ఏళ్ల తల్లిని ఆమె కుమారుడు వెంకటేష్ కనికరం లేకుండా అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసి హత్య చేశాడు. 

తల్లి సంరక్షణ భారంగా మారిందనే కారణంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు.

 ఘటనాస్థలంలోనే వృద్ధురాలు మృతి చెందగా, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

జగన్ మత్స్యకారుల కడుపుకొడితే.. చంద్రబాబు వారి బతుకుదెరువు అయ్యారు : ప్రత్తిపాటి
 
• పోర్టులు, తీరప్రాంతాలను తన తాబేదార్లకు దోచిపెట్టినప్పుడు జగన్ కు మత్స్యకారుల జీవనోపాధి కనిపించలేదా? : ప్రత్తిపాటి
•  జీవో 217 తో మత్స్యకారుల కడుపుకొట్టినప్పడు జగన్ కు వారి బతుకుదెరువు గుర్తురాలేదా? : ప్రత్తిపాటి
• మత్స్యకార బీమా, డీజిల్ రాయితీ. వేట నిషేధ భృతి, వేట సామర్థ్యం పెంపునకు మంగళం పాడిన ఘనుడు జగన్ : ప్రత్తిపాటి

“ అవినీతి.. దౌర్జన్యం..దోపిడీలకు పాల్పడి  జైలుపాలైన వైసీపీనేతల్ని పరామర్శించే జగన్..అలవాటులో పొరపాటుగా మత్స్యకారుల వద్దకు వెళ్లినట్టున్నాడు. ఆయన ప్యాలెస్ లలో ఉండటమే రాష్ట్రానికి శ్రేయస్కరం.. ప్రజలకు సంతోషకరం.  అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారుల కష్టార్జితాన్ని, ఫిష్ మార్ట్ ల పేరుతో వైసీపీ కార్యకర్తలకు దోచిపెట్టిన జగన్.. నేడు మత్స్యకారుల సంక్షేమంపై మొసలి కన్నీరు కారుస్తున్నాడు. రాష్ట్రంలోని పోర్టులను తన తాబేదార్లకు, తీరప్రాంతాన్ని తన పార్టీ నాయకులకు ధారాధత్తం చేసినప్పుడు జగన్ కు మత్స్యకారుల ఉపాధి గుర్తురాలేదా? మత్స్యకారుల కడుపుకొట్టేలా, వారికి జీవనోపాధి లేకుండా జీవో ఎం.ఎస్- 217 తన ప్రభుత్వంలో విడుదల చేసినప్పుడు జగన్ కు వారి బతుకు దెరువు కనిపించలేదా? అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారులపై పగబట్టిన జగన్.. నేడు వారికి అండగా నిలుస్తున్నట్టు రాజకీయ రంగులు మారుస్తున్నాడు. గతంలో జగనన్నతోడు.. మత్స్యకార భరోసా పేరిట జాలర్లను నమ్మకమనే వలలో బంధించి, మోసం, వంచన అనే చేపల్ని వారికి బహుమతిగా అందించిన ఘరానా మోసగాడు జగన్.  ఎన్ని కట్టుకథలు చెప్పినా.. ఎన్ని వేషాలు వేసినా.. జగన్ మనసునిండా మత్స్యకారులపై నిలువెల్లా విద్వేషమే ఉంటుందనేది ఎప్పటికీ కాదనలేని పచ్చి నిజం.  

*ఆది నుంచి మత్స్యకారులకు అండగా నిలిచింది చంద్రబాబే*
మత్స్యకారులకు ఆదినుంచి అండగా నిలిచి, వారికి అన్నివేళల్లో రక్షకుడిగా నిలిచింది చంద్రబాబే. బీమా, ఉపాధి కల్పన, డీజిల్ రాయితీ, ఫిషింగ్ జెట్టీల నిర్మాణం, వేట సామర్థ్యం పెంపు, జీపీఎస్ పరికరాలు అందచేతతో మత్స్యకారుల జీవనోపాధి మార్గాలు పెంచింది టీడీపీ ప్రభుత్వమే. కాకినాడ, మచిలీపట్నం హార్బర్ల అభివృద్ధితో వారి జీవనోపాధికి భరోసా కల్పించింది చంద్రబాబు.
ఫిషరీస్ ఎగుమతుల ప్రోత్సాహానికి కోల్డ్ చెయిన్ వ్యవస్థ, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుది. వేట నిషేధ సమయంలో నిత్యావసరాలు, బియ్యం అందించి మత్స్యకార కుటుంబాలకు అండగా నిలిచిన ఏకైక నాయకుడు చంద్రబాబు. ప్రకృతి విపత్తులు, తుపాన్లను ముందే పసిగట్టి, జాగ్రత్తపడేలా సాంకేతిక పరిజ్ఞానంతో వారి జీవితాలకు భద్రత కల్పించడం ద్వారా అసలైన బతుకుదెరువు అందించిన చంద్రబాబు.., మత్స్యకారులకు నిజమైన రక్షకుడు అయ్యాడు .” అని మాజీమంత్రి ప్రత్తిపాటి బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.



సోషల్ మీడియాపై ఏపీ పోలీసుల ప్రత్యేక నిఘా.. భారీగా కేసుల నమోదు

సోషల్ మీడియా దుర్వినియోగంపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తీవ్ర హెచ్చరిక

రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వారిపై 1,549 కేసులు, 1,344 మంది అరెస్ట్

పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా సోషల్ మీడియా మానిటరింగ్ సెల్స్ ఏర్పాటు

పదేపదే తప్పు చేస్తే వ్యవస్థీకృత నేరాల కింద చర్యలు తప్పవని స్పష్టీకరణ


సామాజిక మాధ్యమాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తీవ్రంగా హెచ్చరించారు. అసభ్యకరమైన, రాజకీయ ప్రేరేపిత, మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు పెట్టేవారిని, వదంతులు వ్యాప్తి చేసేవారిని ఉపేక్షించేది లేదని ఓ పత్రికా ప్రకటనలో స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన, విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై ఇప్పటివరకు 1,549 కేసులు నమోదు చేసి 1,344 మందిని అరెస్టు చేశామని తెలిపారు. చట్టవిరుద్ధమైన 4,529 కంటెంట్‌లను తొలగించామని చెప్పారు. ఇలాంటి చర్యలను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా 'సోషల్ మీడియా మానిటరింగ్ సెల్స్' ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లపై ఈ బృందాలు నిరంతరం నిఘా ఉంచుతాయని డీజీపీ పేర్కొన్నారు. పదేపదే ఈ తరహా నేరాలకు పాల్పడే వ్యక్తులు, సంఘటిత బృందాలపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన కఠిన చట్టాలను ప్రయోగిస్తామని హెచ్చరించారు. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సహించబోమని ఆయన తేల్చిచెప్పారు.


సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి పల్నాడు జిల్లా కార్యదర్శి గా నియమితులైన తోట సతష్ నాయుడు

 సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన పల్నాడు జిల్లా కార్యదర్శి గా నియమితులైన తోట సతీష్ నాయుడు. జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా తోట సతీష్ నాయుడు తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన తోట సతీష్ నాయుడు.

 సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన తోట సతీష్ నాయుడు.

 అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన తోట సతీష్ నాయుడు.

 సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన తోట సతీష్ నాయుడు.

 హిందువులకు ఆరాధ్య దైవం అయిన గోమాతను సంరక్షించుకునే బాధ్యతలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా పల్నాడు జిల్లా కార్యదర్శి తోట సతీష్ నాయుడు అన్నారు.


 
*రూ.26.46 కోట్లతో జలధార - జలహారతి పనులు*

*జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా*

పల్నాడు జిల్లాలో భూగర్భ జల మట్టం పెంచేందుకు రానున్న మూడు నెలల్లో రూ.26.46 కోట్లు వెచ్చించి పనులు చేపట్టనున్నామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. మొత్తం 274 నీటి సంఘాల ద్వారా 357 పనులు చేపట్టనున్నామన్నారు.మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జలధార - జల హారతి కార్యక్రమం కింద సాగు నీటి సంఘాల ద్వారా చేపట్టనున్న పనులకు ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని భూగర్భ జల మట్టం 3 మీటర్ల నుంచి 6 మీటర్ల మేరకు పెరిగే అవకాశం ఉందన్నారు. మొత్తం 227 చెరువులలో పూడిక తీత పనులు, కాల్వల పునరుద్ధరణ పనులు చేపట్టి సాగునీటి & తాగునీటి సరఫరా, భూగర్భ జల మట్టం మెరుగుపరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి, జిల్లా భూగర్భజల శాఖ అధికారి రామ్ బాలాజీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు....



 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషనర్ సభ్యురాలు Dr శ్రీ పోలి శెట్టి నాగమానస గారికి ప్రత్యేక శుభాకాంక్షలు

అమలాపురం జనసేన పార్టీ లో ఒక వీర మహిళగా ఎన్నో గొప్పగొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా జనసేన పార్టీకి ఎంతో అండగా నిలబడ్డారు.

ముఖ్యంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఉదాహారణకి కాకినాడ లో పార్టీ శ్రేణులపై YCP దాడి చేసినప్పుడు చెక్కుచెదరక వెన్నుచూపి పోరాట పటిమ చూపించడం వీరమహిళలుగా ఎంతో గర్వకారణం.

*జనసేన పార్టీ అద్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీమతి మానస గారి సేవలు గుర్తించి ప్రతిష్ఠాత్మక మైన AP Child Rights* *Commissioner* *Member గా నియమించి ఎంతో గౌరవం ఇవ్వడం, అందరినీ తృప్తిపరిచింది* .

*Dr పోలి శెట్టి మానస గారు* రాబోయే కాలంలో మరిన్ని ఉన్నత మైన పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ …

   రవణం స్వామి నాయుడు 
 *అఖిల భారత చిరంజీవి యువత*



కార్యాలయాల చుట్టూ తిరగక్కర్లేదు.. తెలంగాణలో రిజిస్ట్రేషన్ సేవలు ఇక వాట్సాప్‌లోనే!

డిజిటల్ పాలనలో తెలంగాణ ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన ముందడుగు వేసింది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్, స్టాంపుల విభాగానికి సంబంధించిన కీలక సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వాటిని నేరుగా వాట్సాప్ ద్వారా అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు ఈ సేవలను విస్తరించినట్లు మీసేవ కమిషనర్ టి. రవికిరణ్ ప్రకటించారు. ఈ నూతన విధానంతో భూమి పత్రాలు, సర్టిఫైడ్ కాపీల వంటి పనుల కోసం ఇకపై రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, తమ మొబైల్ ఫోన్ నుంచే పనులు పూర్తి చేసుకోవచ్చు.

పౌర సేవలు మరింత సులభం
గతేడాది నవంబర్ 18న ప్రారంభించిన 'మీసేవ వాట్సాప్ చాట్‌బాట్' సేవలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్న నేపథ్యంలో ఈ సేవలను మరింత విస్తరించారు. పౌరులు తమ ఫోన్‌లో 8096958096 నంబర్‌ను సేవ్ చేసుకుని, వాట్సాప్‌లో ‘హాయ్’ అని సందేశం పంపడం ద్వారా ఈ సేవలను పొందవచ్చు. ఈ చాట్‌బాట్ ద్వారా రిజిస్ట్రేషన్ పత్రం సర్టిఫైడ్ కాపీ, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ), స్టాంపుల కొనుగోలు, ఫ్రాంకింగ్, డెఫిసిట్ చెల్లింపులు, సొసైటీలు, ఫర్మ్‌ల రిజిస్ట్రేషన్, అపరాధ రుసుము చెల్లింపు, సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు వంటి అనేక సేవలు అందుబాటులో ఉంటాయి.

ఈ సేవలను వినియోగించుకోవడం చాలా సులభం. వాట్సాప్‌లో కావాల్సిన సేవను ఎంచుకుని, అవసరమైన వివరాలను ఫామ్‌లో నింపిన తర్వాత, ఆన్‌లైన్ ద్వారానే రుసుము చెల్లించవచ్చు. సర్టిఫైడ్ కాపీల కోసం దరఖాస్తు చేస్తే, అధికారులు ఆమోదించిన వెంటనే ఆ పత్రాలు నేరుగా వాట్సాప్‌కే పంపబడతాయి. ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్‌ను మీసేవ కేంద్రాల ద్వారా పొందవచ్చు. స్టాంప్స్, పెనాల్టీ చెల్లించిన వారు సంబంధిత పత్రాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల పౌరుల సమయం ఆదా అవ్వడమే కాకుండా, దళారుల ప్రమేయం తగ్గి పారదర్శకత పెరుగుతుందని, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీ కూడా గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.


శావల్యాపురం మండలంలో జనతా వారది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

 కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశ నిర్దేశం మేరకు,రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్, శావల్యాపుర మండల సీనియర్ నాయకులు శ్రీ అసుమల్లి వీరేంద్ర గారు ,ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు ,వినుకొండ నియోజకవర్గం మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు, ఈరోజు జనతా వారధి కార్యక్రమాన్ని శావల్యాపురం మండల పరిధిలోని బొందిని పాలెం గ్రామంలో మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక బిజెపి నేత రావినూతల ఆదాం నిర్వహణలో చేయడం జరిగింది, కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు ఎనిమిది దరఖాస్తులు ఇవ్వడం జరిగింది పంచాయతీ ఆఫీస్ నుండి స్మశానానికి వెళ్లే రహదారిని సిసి రోడ్డు వేయించాలని, అలాగే గ్రామంలో ఉన్నటువంటి రహదారులకు సైట్ డ్రైనేజీలు నిర్మించాలని,అలాగే గత 17 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్నటువంటి రక్షిత మంచినీటి పథకానికి ,నిధులు మంజూరు చేయాలని, రైతు భరోసా,కిసాన్ సమ్మాన్ నిధి  అమలు కొరకు రైతులు దరఖాస్తులు ఇచ్చారు.వీటి పరిష్కారం కొరకై  బిజెపిపార్టీ తమవంతు ప్రయత్నం చేస్తుందని దరఖాస్తుదారులకు చెప్పడం జరిగింది

భారతీయ న్యాయ సంహిత (BNS) లోని పవర్‌ఫుల్ సెక్షన్ 248 గురించి తెలుసుకుందాం

- *సెక్షన్ 248*: ఎవరైనా తప్పుడు కేసు పెట్టినప్పుడు లేదా అన్యాయంగా మీపై నేరం మోపినప్పుడు, మీరు కూడా వారి మీద కేసు వేయడానికి ఈ సెక్షన్ మీకు హక్కు ఇస్తుంది.
- *శిక్ష*: మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టారని మీరు నిరూపించగలిగితే, ఎదురు వ్యక్తిపై కేసు వేసి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేలా చేయవచ్చు.
- *పరిహారం*: ఈ కేసు మీరు గెలిస్తే, మీపై పెట్టిన ఫేక్ కేసు వల్ల మీకు జరిగిన నష్టం, అవమానం కోసం పరిహారం కూడా పొందవచ్చు.

 *సెక్షన్ 248 ఎప్పుడు వర్తిస్తుంది?*

- మీపై ఎవరైనా తప్పుడు కేసు పెట్టినప్పుడు.
- మీపై ఎవరైనా అన్యాయంగా నేరం మోపినప్పుడు.
- మీకు ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టినప్పుడు.

సెక్షన్ 248 ఎలా వినియోగించాలి?

- మీరు పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
- మీపై పెట్టిన కేసు తప్పుదని నిరూపించడానికి ఆధారాలు సేకరించాలి.
- న్యాయస్థానంలో మీ కేసు వాదించాలి.

సెక్షన్ 248 వల్ల ప్రయోజనాలు:

- తప్పుడు కేసుల నుండి మీరు రక్షించబడతారు.
- మీపై పెట్టిన కేసు వల్ల మీకు జరిగిన నష్టం, అవమానం కోసం పరిహారం పొందవచ్చు.
- నేరస్థులకు తగిన శిక్ష పడుతుంది.
- *తప్పుడు కేసు*: మీపై ఎవరైనా తప్పుడు కేసు పెట్టినట్లయితే, మీరు సెక్షన్ 248 కింద కేసు వేయవచ్చు.
- *ఆధారాలు*: మీపై పెట్టిన కేసు తప్పుదని నిరూపించడానికి ఆధారాలు సేకరించాలి.
- *న్యాయస్థానం*: కేసు న్యాయస్థానంలో వాదించాలి.
- *శిక్ష*: ఎదురు వ్యక్తికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవచ్చు.
- *పరిహారం*: మీకు జరిగిన నష్టం, అవమానం కోసం పరిహారం పొందవచ్చు.

సెక్షన్ 248 వినియోగించడానికి అవసరమైన పత్రాలు:

- ఫిర్యాదు
- ఆధారాలు
- సాక్ష్యాలు
- న్యాయస్థానం ఫీ



రాజమహేంద్రవరంలో నిబంధనలు ఉల్లంఘించిన అంతర్రాష్ట్ర ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.

బుధవారం, గురువారం రెండు రోజుల్లో 5 స్లీపర్ కోచ్ బస్సులను సీజ్ చేశారు.

- ఈ బస్సుల్లో ప్రయాణీకుల భద్రతను పక్కన పెట్టి పలు నిబంధనల ఉల్లంఘనలు జరిగాయన్నారు .
- అదనపు డీజిల్ ట్యాంకులను అక్రమంగా అమర్చడం, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లను లగేజీతో మూసివేయడం, వెనుక ఎమర్జెన్సీ డోర్ లేకపోవడం వంటి లోపాలు బయటపడ్డాయన్నారు.
- సీజ్ చేసిన 5 బస్సులకు సంబంధించి సుమారు ₹2,15,000/- పన్ను మరియు అపరాధ రుసుము బస్సు యజమానులు చెల్లించాల్సి ఉంటుందన్నారు.

జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ హెచ్చరించారు: "నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు."



వాళ్ల డబ్బులు వాళ్లకు ఇవ్వడానికి ఎందుకింత నిర్లక్ష్యం? 

జూన్ 10వ తేదీ లోపు బెనిఫిట్స్ రాలేదని ఒక్క రిటైర్డ్ ఉద్యోగి కూడా చెప్పకూడదు

రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ విషయంలో ఆర్థిక శాఖపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

కాంగ్రెస్ ప్రభుత్వం తమ బెనిఫిట్స్ ఇవ్వడంలేదని, రిటైర్డ్ ఉద్యోగులు వేసిన 754 పిటిషన్ల పట్ల విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు

ఒక్కో పిటీషన్లో దాదాపు ఒకటి నుండి 10 మంది పిటిషనర్లు ఉన్నారని, ఒక్కో పిటీషన్లో ఎంత మందికి బెనిఫిట్స్ ఇచ్చారో పూర్తి నివేదిక అందజేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు

రిటైర్డ్ ఉద్యోగులు చాలా సున్నితంగా ఉంటారని, వారి జీవితాలతో చెలగాటం ఆడొద్దని ఆర్థిక శాఖకు హైకోర్టు హెచ్చరిక

జూన్ 10వ తేదీకి కేసు వాయిదా వేస్తూ, ఆ లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని, తదుపరి విచారణలోగా ఒక్క పిటిషనర్ కూడా బెనిఫిట్స్ రాలేదని చెప్పకూడదని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు...

 
 
పపిల్లల ప్రాణాలతో చెలగాటం: అప్పాపురం అంగన్‌వాడీలో ‘కుళ్ళిన’ దందా!

​గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పాపురం గ్రామం ఎస్సీ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రం పసిపిల్లల పాలిట శాపంగా మారింది. బలవర్థకమైన ఆహారం అందించాల్సిన చోట, కుళ్ళిపోయి కంపు కొడుతున్న కోడిగుడ్లను చిన్నారులకు పెడుతూ అధికారులు వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పౌష్టికాహారం పేరుతో ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతూ, చిన్నారులకు మాత్రం విషతుల్యమైన ఆహారాన్ని అంటగడుతున్న ఈ నిర్లక్ష్యపు తీరుపై తల్లిదండ్రులు నిప్పులు చెరుగుతున్నారు. లాభాల కక్కుర్తితో కాంట్రాక్టర్లు, పర్యవేక్షణ లేని అధికారులు కలిసి చేస్తున్న ఈ ‘కుళ్ళిన’ దందాపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసిపిల్లల నోటికాడ ముద్దను విషం చేస్తున్న ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే, ఈ నిరసన జ్వాలలు మరింత ఉగ్రరూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది.



99, 100వ ఆస్కార్ వేడుకల షెడ్యూల్
విడుదల!

ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ అవార్డుల 99వ వేడుకను 2027 మార్చి 14న, 100వ వేడుకను 2028 మార్చి 5న నిర్వహించనున్నట్లు అకాడమీ ప్రకటించింది. అయితే, 2029 నుండి వేదికను హాలివుడ్లో డాల్బీ థియేటర్ నుంచి పీకాక్ థియేటర్కు మారుస్తున్నట్లు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వెల్లడించింది. అంతేకాకుండా, గ్లోబల్ రీచ్ కోసం దశాబ్దాల టీవీ ప్రసారాలకు స్వస్తి పలికింది. 2029 నుండి నేరుగా యూట్యూబ్లో ప్రసారం చేయాలని నిర్ణయించడం విశేషం.




సంపన్న అభ్యర్థి లీమారోస్.. రూ.1,049 కోట్ల ఆస్తులు

సంపన్న అభ్యర్థి లీమారోస్.. రూ.1,049 కోట్ల ఆస్తులు
తమిళనాడులోని తిరుచ్చి జిల్లా లాల్గుడి నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా లీమారోస్ (58) పోటీ చేస్తున్నారు. ఆమెకు రూ.1,049 కోట్ల ఆస్తులు ఉన్నాయి. లాటరీ టికెట్ల విక్రయ సంస్థ అధినేత మార్టిన్ సతీమణి అయిన లీమారోస్ ఇటీవల అన్నాడీఎంకేలో చేరి బరిలోకి దిగారు. సోమవారం నామినేషన్‌తోపాటు సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను ఆమె వెల్లడించారు. తనకు రూ.139.63 కోట్ల చరాస్తులు, రూ.909.94 కోట్ల స్థిరాస్తులు, రూ.8.57 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు.