*తెనాలి పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు కీర్తిశేషులు శ్రీ ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ వారు ఒంగోలు జాతి జాతీయ స్థాయి ఎడ్ల బల మరియు పశుపాల ప్రదర్శన, వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శన మాజీ మంత్రివర్యులు శాసనమండలి సభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి సారధ్యంలోగత నెల 29 నుండి అత్యంత వైభవంగా చేయుచున్నారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారి ఆహ్వానించి వారి చేతుల మీదగా పోటీల్లో పాల్గొన్న రైతులకు షీల్డులు అలాగే గెలుపొందిన ఎడ్ల జతల రైతులకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది.*
*ముందుగా సభా వేదిక మీద ఏర్పాటుచేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రుల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.ఆ తర్వాత కీర్తిశేషులు శ్రీ ఆలపాటి శివరామకృష్ణయ్య గారి విగ్రహానికి నివాళులర్పించి, జ్యోతి ప్రజ్వలన చేశారు*
*ఈ సందర్భంగా శాసన మండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు వేదికపై మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారధ్యంలో, మాజీ మంత్రివర్యులు, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారి సహాయ సహకారాలతో తెనాలి వేమూరు నియోజకవర్గాల రైతాంగం యొక్క ప్రోత్సాహంతోటి దిగ్విజయంగా 14 సంవత్సరాల క్రితం ప్రారంభించి ఈనాటికి ఆలపాటి శివ రామకృష్ణ గారి పేరు మీదుగా ఎడ్ల ప్రదర్శనని నిర్వహించడం జరుగుతోంది.*
*తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమతోటి రాజేంద్రప్రసాద్ గారు ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా రైతాంగానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్ని తీసుకొని నిర్వహించడం జరుగుతుంది. వ్యవసాయదారుడు కాబట్టి వ్యవసాయం మీద ప్రేమ, అభిమానం రైతాంగం బాగుండాలి రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి రైతుకు సంబంధించిన కార్యక్రమాలు తీసుకొంటున్నారు. వారి తండ్రి శివరామకృష్ణయ్య గారు కూడా వ్యవసాయదారులు. ఆయన వ్యవసాయంలో విశేషమైనటువంటి అనుభవం గడించారు. పెద్దలు విద్యావంతులు అటువంటి తండ్రికి ప్రయోజకులు, సమర్థులైనటువంటి కుమారులు ఉన్నారు. అందుకే ఈనాటికి శివరామకృష్ణయ్య గారి పేరు ఈనాటికి కూడా ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా వారు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూన్నారు అని అన్నారు.*
*శివరామకృష్ణయ్య గారి జన్మ సార్థకం చేసినటువంటి వారి తనయులని అందరం కూడా అభినందించాలి. వారి కుమారులు ఆయన పేరు మీద ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం మనమందరం కూడా ఆదర్శంగా తీసుకోవలసిన అవసరం ఉన్నది.*
*ఈరోజు వ్యవసాయం ట్రాక్టర్లతోటి టెక్నాలజీ తోటి నిర్వహించుకునే పరిస్థితి వచ్చింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఎడ్ల బల ప్రదర్శన ద్వారా రైతులను ప్రోత్సహిస్తూన్నారు. ఒంగోలు జాతి ఎడ్లను పోషించడానికి ఇలాంటి ప్రదర్శనలే కారణం. రాజేంద్ర ప్రసాద్ గారి లాంటివారు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి పశు పోషకులకు కూడా ఒక నమ్మకం. మనం ఈ ఎడ్లను కనుక పోషిస్తే దాని ద్వారా ఈ జాతి అభివృద్ధి చెందుతుంది. దీనికి ఆదరాభిమానాలు ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు మన రాష్ట్రంలో చాలా నిర్వహిస్తున్నారు అని వారికి కూడా ఒక నమ్మకం కలిగి ఈనాటికి కూడా రైతాంగం ఎడ్లు పోషించి ప్రదర్శనకు తీసుకు వస్తున్నారంటే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్లనే.*
*మరి అటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే నక్కా ఆనంద్ బాబు గారు అలాగే వారికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వారి యొక్క మిత్రులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు.*