శ్యావల్యాపురం మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది
,కేంద్ర రాష్ట్ర బిజెపి దిశానిర్దేశం మేరకు రాష్ట్ర అధ్యక్షులు pvn మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు, శావల్యాపురం మండల సీనియర్ నాయకులు అడుసుమల్లి వీరేంద్ర గారు ,ఈపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోరంట్ల సత్యనారాయణ గారు, వినుకొండ నియోజకవర్గం మాజీ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు, మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమాన్ని మండలంలోని ఇర్లపాడు గ్రామంలో స్థానిక బిజెపి నేత వెనిగండ్ల ఆంజనేయులు గారి నిర్వహణలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గ్రామస్తులు ఆరు అర్జీలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా గ్రామీణ రక్షిత మంచినీటి గత 15 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉందని దీనికి జల్ జీవన్ మిషన్ (jjm)పథకం మంజూరు చేయాలని, అలాగే గ్రామంలో పూర్తిస్థాయిలో సైడ్ డ్రైనేజీలు నిర్మించాలని, అలాగే పాత కరెంటు స్తంభాల వల్ల ప్రమాదం పొంచి ఉందని వాటి స్థానంలో కొత్త కరెంటు స్తంభాలు నిర్మించాలని, శుభ కార్యాలు వివిధ రకాల ఫంక్షన్లో నిర్వహించినందుకు ఏ విధమైన మండపాలు లేనందున కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని, అలాగే nregs కింద పొలాలకు వెళ్లి రహదారులు నిర్మించాలని, ఈర్ల రాజా అనే వ్యక్తి నాకు కనీసం నివసించడానికి అడుగు జాగా కూడా లేదని నాకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని నివసించేందుకు గ్రామంలో ప్రభుత్వ భూమిని మంజూరు చేయాలని దరఖాస్తు ద్వారా ప్రభుత్వాన్ని కోరారు, కార్యక్రమంలో టిడిపి నాయకులు కంచేటి రామయ్య గారు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.