kapunews



TRENDING NOW


 
గద్వాల్: పంచాయతీ కార్యదర్శికి ఏసీబీ షాక్

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్లాస్పురం పంచాయతీ కార్యదర్శి రంగన్న, పేద లబ్ధిదారుడికి మంజూరైన ఇందిరమ్మ ఇంటికి క్లియరెన్స్ ఇవ్వడానికి రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో, ఏసీబీ అధికారులు రంగన్నను ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో రూ.15 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పేదలకు అందాల్సిన పథకాల విషయంలో లంచం అడిగితే సహించేది లేదని ఏసీబీ అధికారులు తెలిపారు.

హైవేలపై ఫాస్టాగ్ ఉపయోగించకపోతే రెట్టింపు ఫైన్..

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. టోల్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ
సవరించిన 'జాతీయ రహదారి రుసుము
నిబంధనలు-2026'ను మార్చి 17 నుండి అమలులోకి తెచ్చింది. ఇకపై ఫాస్టాగ్ (FASTag) లేకుండా లేదా టోల్ చెల్లించకుండా వెళ్లే వాహనదారులకు నేరుగా ఇ-నోటీసులు
పంపబడతాయి. టోల్ చెల్లించకపోతే, యజమానికి 72 గంటల్లోపు చెల్లించకపోతే, ఆ మొత్తం టోల్ చెక్కు రెట్టింపు చేస్తారు.


 
పేదల కోసం మెగాస్టార్ గొప్ప నిర్ణయం! 

పేదవారికి ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్నట్టు Chiranjeevi తెలిపారు. ఉగాది సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

“ఒక కుటుంబంలో ఒక్కరు చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం ఎదుగుతుంది. అందుకే పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలనుకుంటున్నాను” అని అన్నారు.

ఇదే సమయంలో తమిళ హీరో Suriya నిర్వహిస్తున్న Agaram Foundation కార్యక్రమాలు తనకు స్ఫూర్తినిచ్చాయని చెప్పారు. “సూర్య గారు నన్నే ఇన్‌స్పిరేషన్ అంటారు… కానీ నిజానికి ఆయన చేస్తున్న సేవలు నాకు ప్రేరణ” అని మెగాస్టార్ పేర్కొన్నారు.

సమాజానికి ఉపయోగపడే ఇలాంటి నిర్ణయాలు మరెంతో మందికి స్ఫూర్తి కావాలి!

ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే లైసెన్స్ లేదా ఆర్సీ సీజ్

కొత్త నిబంధనలతో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్న తెలంగాణ ప్రభుత్వం 

చలాన్ వచ్చిన 45 రోజుల్లో వాహనదారులు ఫిర్యాదు చేసి తమ అభ్యంతరాలను తెలిపేందుకు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న పోలీస్ యంత్రాంగం

వాహనదారుడి ఫిర్యాదును పరిశీలించి, అధికారులు నిర్ణయం తీసుకున్నాక, ఆ నిర్ణయానికి అంగీకరిస్తే 30 రోజుల్లో చలాన్ కట్టాలని, లేదంటే 50% చలాన్ కట్టి కోర్టుకు వెళ్లొచ్చని, కోర్టుకు వెళ్లకపోతే చలాన్ కట్టడానికి 15 రోజులు గడువు ఇచ్చేవిధంగా నిబంధనలు అమలు చేసేలా ప్రణాళికకు పోలీస్ శాఖ ఏర్పాట్లు

ఫిర్యాదు గురించి పూర్తి పరిష్కారం లభించినా కూడా చలాన్ కట్టకపోతే లైసెన్స్, ఆర్సీ సీజ్ అవ్వడమే కాకుండా, వాహనానికి సంబంధించిన అన్ని ఆర్టీఏ సేవలు డీ–యాక్టివేట్ అయ్యేలా, చలాన్ చెల్లిస్తేనే ఆర్టీఏ సేవలు తిరిగి యాక్టివేట్ అయ్యేలా నిబంధనలు

ఈ అంశంపై త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్న పోలీస్ శాఖ అధికారులు



గ్యాస్ బుకింగ్ పేరుతో కొత్త మోసం.. వాట్సాప్‌లో వచ్చే ఫైల్స్‌తో జాగ్రత్త!

ఎల్పీజీ గ్యాస్ బుకింగ్స్ పేరుతో కొత్త తరహా సైబర్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. ‘GAS BILL UPDATE APK’ వంటి హానికరమైన ఫైల్స్‌ను వాట్సాప్ ద్వారా పంపి వినియోగదారులను మోసం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం గురువారం ఓ ప్రకటనలో హెచ్చరించింది. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇలాంటి అనుమానాస్పద ఫైల్స్‌ను, అప్లికేషన్లను ఎట్టిపరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ లేదా ఇన్‌స్టాల్ చేయవద్దని అధికారులు తెలిపారు. వీటి ద్వారా సైబర్ నేరగాళ్లు వినియోగదారుల వ్యక్తిగత డేటా, బ్యాంకు ఖాతాల వివరాలను దొంగిలించే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. గ్యాస్ బుకింగ్స్ కోసం కేవలం అధికారిక ప్లాట్‌ఫామ్స్‌ను మాత్రమే ఉపయోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు, దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు అవసరమైన ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. గ్యాస్ కొరతపై వదంతులు నమ్మవద్దని, ఆందోళనతో సిలిండర్లు బుక్ చేసుకోవద్దని కోరింది. గ్యాస్ సరఫరాను నిరంతరాయంగా కొనసాగించేందుకు పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకసారి బుకింగ్ చేసుకునేలా విరామాన్ని సవరించారు.

గ్యాస్‌పై ఒత్తిడి తగ్గించేందుకు కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అలాగే, కొత్త పీఎన్ జీ కనెక్షన్లను ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించింది. మొత్తం మీద గ్యాస్ సరఫరాకు ఢోకా లేదని భరోసా ఇస్తూనే, సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం ప్రజలను కోరుతోంది.


అక్షర చిట్‌ఫండ్‌ ఛైర్మన్‌ అరెస్టు శ్రీనివాసరావు

ఆదిలాబాద్‌: చిట్టీల పేరిట డిపాజిట్లు సేకరించి మోసానికి పాల్పడిన అక్షర చిట్‌ఫండ్‌ ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పేరాల శ్రీనివాసరావును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్‌ ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ వెల్లడించారు.

హనుమకొండ జిల్లా వడ్డెపల్లికి చెందిన శ్రీనివాసరావు 2009లో సొంతంగా చిట్‌ఫండ్‌ వ్యాపారం మొదలుపెట్టారు. 

రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిట్టీ స్కీంలను ప్రారంభించారు.వందల మంది నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించారు. 

గడువు ముగిసిన తర్వాత ఖాతాదారులకు తిరిగి డబ్బులు చెల్లించకుండా ఆర్థిక మోసాలకు పాల్పడ్డారు. 

ఆదిలాబాద్‌ టూటౌన్‌ పరిధిలోనే 12 కేసులు నమోదవగా బాధితులకు రూ.1.11కోట్లు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో 96 చీటింగ్‌ కేసులు నమోదు కావటంతో ఆరు నెలలుగా తప్పించుకు తిరుగుతున్నారు. 

పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఆదిలాబాద్‌లో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు.శ్రీనివాసరావుకు కరీంనగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్నాయని.. వాటిలో ఇప్పటికే కొన్ని జప్తు కాగా మిగతా వాటిని కూడా చట్టపరంగా జప్తునకు చర్యలు తీసుకుంటామన్నారు.

*భద్రాచలం:గోదావరి నదిలో స్నానానికి వెళ్లినవారిలో ఐదుగురు యువకులు గల్లంతుకాగా.. వారిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.*

ఈ ఘటన శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సరిహద్దు ప్రాంతం కూనవరంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. అమరావతిలోని ఎస్ఆర్ఎం కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న ఏడుగురు విద్యార్థులు కూనవరం రోడ్డులోని గోదావరి నదిలో స్నానాలు చేసేందుకు దిగారు. నది లోతు తెలియకపోవడంతో ప్రమాదవశాత్తూ వారిలో ఐదుగురు యువకులు గల్లంతవగా, మిగిలిన ఇద్దరు ఒడ్డుకు చేరుకొన్నారు. గమనించిన స్థానికులు వారికోసం బోట్లపై వెళ్లి గాలింపు చర్యలు చేపట్టగా.. చారుగుండ్ల శ్రీకర్ (భద్రాచలం), పొడిచేటి అభిరామ్ (భద్రాచలం), నవదీప్ (ఉయ్యూరు) మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరు గోక తేజ (ఉయ్యూరు), పాశం సతీష్ కుమార్ (మదనపల్లి) కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

*మంత్రి తుమ్మల దిగ్భ్రాంతి*

గోదావరి ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాలింపు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

భవిష్యత్లో గోదావరి పరివాహక ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని రెవెన్యూ, పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు.

పదవీకాలం పొడిగించమని బీసీసీఐని కోరిన అజిత్ అగార్కర్

భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తన పదవీకాలాన్ని 2027 వన్డే ప్రపంచకప్ వరకు పొడిగించాలని బీసీసీఐని కోరినట్లు సమాచారం. 2023లో బాధ్యతలు చేపట్టిన అగార్కర్ హయాంలో టీమిండియా అద్భుత విజయాలు సాధించింది. గత మూడేళ్లలో నాలుగు ఐసీసీ ఫైనల్స్ కు చేరగా అందులో మూడు సార్లు(టీ20 వరల్డ్ కప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025, టీ20 వరల్డ్ కప్ 2026) విజేతగా నిలిచింది.
ఈవిజయాల నేపథ్యం లోనే ఆయన తన సేవలను కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు
తెలుస్తోంది.



దేశంలోనే తొలి 'ఆల్-ఉమెన్' రైల్వే స్టేషన్.. ఎక్కడంటే..?

ముంబైలోని మాటుంగా రైల్వే స్టేషన్ దేశంలోనే తొలి 'ఆల్-ఉమెన్' స్టేషన్గా అరుదైన రికార్డు సృష్టించింది. ఇక్కడ స్టేషన్ మాస్టర్ నుండి పాయింట్మెన్ వరకు మొత్తం 41 మంది సిబ్బంది మహిళలే కావడం విశేషం. మహిళా సాధికారతకు చిహ్నంగా 2017లో ప్రారంభమైన ఈ ప్రయోగాన్ని గుర్తిస్తూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్-2018లో చోటు కల్పించారు. రైల్వే విధులను సైతం మహిళలు సమర్థవంతంగా నిర్వహించగలరని మాటుంగా రైల్వే స్టేషన్ నిరూపిస్తోంది.

నిర్మాణ రంగానికి షాక్.. పెరగనున్న సిమెంట్ ధరలు!

ముడి చమురు ధరలు పెరగడం వల్ల మార్చి చివరిలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో సిమెంట్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని 'నువామా' నివేదిక వెల్లడించింది. పెట్ కోక్ ధరలు, ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడమే దీనికి ప్రధాన కారణమని డీలర్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్చిలో ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, ఏప్రిల్ నుంచి కంపెనీలు భారాన్ని పెంచనున్నాయి.



సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జాతీయ  కార్యదర్శిగా నియమితులైన సింగరేసు పోలయ్య


 సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన జాతీయ  కార్యదర్శిగా నియమితులైన సింగరేసు పోలయ్య . జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా సింగరేసు పోలయ్య తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన సింగరేసు పోలయ్య.

 సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన సింగరేసు పోలయ్య.

 అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన సింగరేసు పోలయ్య.

 సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన జాతీయ  కార్యదర్శి సింగరేసు పోలయ్య .
 హిందువులకు ఆరాధ్య దైవం అయిన గోమాతను సంరక్షించుకునే బాధ్యతలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి సింగరేణి పోలయ్య అన్నారు.
"
శంషాబాద్‌" లో సాధ్యంకాని "విమాన హబ్" ఆలోచన… "అమరావతి" లో అమలు చేయాలన్న చంద్రబాబు ప్రణాళిక !!

దుబాయ్ తరహా ఫ్లైట్ మెయింటెనెన్స్ హబ్ కల… ఇప్పుడు అమరావతిలో 7000 ఎకరాల్లో అమలు లక్ష్యం

Nara Chandrababu Naidu ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో Rajiv Gandhi International Airport (శంషాబాద్ ఎయిర్‌పోర్టు) అభివృద్ధిపై పెద్ద ప్రణాళిక రూపొందించారు. సుమారు 5000 ఎకరాల భూమిని వినియోగించి, దాన్ని దుబాయ్ తరహాలో భారీ అంతర్జాతీయ విమాన కేంద్రంగా మార్చాలని ఆయన ఆలోచించారు.

ఈ ప్రణాళికలో భాగంగా అక్కడే విమానాల ఫ్లైట్ మెయింటెనెన్స్, రిపేర్ మరియు ఓవర్‌హాల్ (MRO) సెంటర్ ఏర్పాటు చేయాలనే లక్ష్యం కూడా ఉంది. ఈ సెంటర్ ఏర్పడితే ప్రపంచంలోని అనేక విమానాలు శంషాబాద్‌కు వచ్చి సర్వీసింగ్ చేయించుకునే అవకాశముండేదని అప్పట్లో నిపుణులు భావించారు.

అయితే 2004లో ప్రభుత్వం మారడంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగలేకపోయారు. దీంతో ఆ ఫ్లైట్ మెయింటెనెన్స్ సెంటర్ ప్రాజెక్టు అమలు కాలేదు. అది అమలై ఉంటే శంషాబాద్‌కు ప్రస్తుతం ఉన్నదానికంటే మూడు రెట్లు ఎక్కువ అంతర్జాతీయ విమానాలు వచ్చేవని చెబుతున్నారు. సింగపూర్, మలేషియా, కొలంబో, ముంబై, ఢిల్లీ వంటి నగరాల నుంచి మరింత విమాన రాకపోకలు పెరిగి, అది ఒక పెద్ద అంతర్జాతీయ హబ్‌గా మారే అవకాశం ఉండేది.

ఈ ఆలోచనను తరువాత కూడా కొనసాగించిన చంద్రబాబు, కొత్త రాజధాని Amaravatiలో సుమారు 7000 ఎకరాల భూమితో ఒక ఫ్లైట్ హబ్ మరియు మెయింటెనెన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. శంషాబాద్‌లో సాధ్యం కాకపోయినా, కనీసం అమరావతిలో అయినా ఈ ప్రాజెక్టును అమలు చేయాలనే తపన ఆయనకు ఉందని అంటున్నారు.

అలాగే విశాఖపట్నం సమీపంలోని Bhogapuram ప్రాంతంలో కూడా ఇలాంటి విమాన సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ప్రయత్నం ప్రణాళికలు రూపొందించారు. అయితే 2019 తరువాత రాజకీయ పరిస్థితులు మారడంతో ఆ ప్రణాళికలు ముందుకు సాగలేకపోయాయి.

ఇటీవల  "Hero Shivaji" కూడా అమరావతిలో పెద్ద ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తే అది మరో దుబాయ్‌లా మారే అవకాశం ఉందని వ్యాఖ్యానించడం ఇదే నేపథ్యంలోనని విశ్లేషకులు చెబుతున్నారు.

భారతదేశంలో ప్రస్తుతం పూర్తి స్థాయి భారీ విమాన మెయింటెనెన్స్ హబ్‌లు చాలా తక్కువగా ఉండటం, ఎక్కువ విమానాలు విదేశాలకు వెళ్లి సర్వీసింగ్ చేయించుకోవాల్సి రావడం వల్లే చంద్రబాబు ఈ ఆలోచనను ముందుకు తెచ్చారని చెప్పబడుతోంది. 
.



నిరుద్యోగులకు ఇది నిజమైన ఉగాది పండుగ.... మేడికొండ విజయ్

తెలుగు యువత నాయకులు, అవనిగడ్డ నియోజకవర్గం

*మాట ఇచ్చాడు  జాబ్ క్యాలెండర్ తెచ్చాడు లోకేష్ బాబు*

    యువత భవిష్యత్తుకు జాబ్ క్యాలెండర్ ఉగాది కానుకగా నిరుద్యోగులకు మంత్రి నారా లోకేష్  గారు ప్రకటించడం హర్షనీయమని మేడికొండ విజయ్ పేర్కొన్నారు,  ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారికి,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి,యువగళం రథసారథి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి  విజయ్ కృతజ్ఞతలు తెలిపారు ఉగాది పర్వదినం సందర్భంగా 10,060 పోస్టులతో కూడిన భారీ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం నిరుద్యోగులకు నిజమైన పండుగని ఆయన కొనియాడారు యువగళం పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని లోకేష్ నెరవేస్తున్నారని అన్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాష్ట్రానికి భారీ పరిశ్రమలు తీసుకొస్తూనే జాబ్ క్యాలెండర్ ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు, గత వైసిపి ప్రభుత్వ హయంలో జగన్ నిరుద్యోగులను నిండా ముంచారని యువత ఆశలను అడియాశలు చేశారని విమర్శించారు, కూటమి ప్రభుత్వ హయంలో నిరుద్యోగులకు భరోసా లభిస్తుందని క్రమబద్ధంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సాగుతుందని మేడికొండ విజయ్  స్పష్టం చేశారు, యువత భవిష్యత్తుకు ఈ జాబ్ క్యాలెండర్ గొప్ప పునాది అని ధీమా వ్యక్తం చేశారు.



సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన వరికూటి నాగేశ్వరరావు


 సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన వరికూటి నాగేశ్వరావు. జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా వరికూటి నాగేశ్వరరావు తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన వారికూటి నాగేశ్వరరావు.

 సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన వరికూటి నాగేశ్వరరావు.

 అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ వారి అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన వరికూటి నాగేశ్వరరావు.

 సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన జాతీయ ప్రధాన కార్యదర్శి వరికూటి నాగేశ్వరరావు.



పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సనాతన హిందూ సాంప్రదాయ పండుగలకు ప్రభుత్వ నిధులు కేటాయించాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది

 *సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సనాతన హిందూ సాంప్రదాయ పండుగలకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా బీజేపీ యువ నాయకులు ఇంగ్గుటూరి రాజశేఖర్ రెడ్డి సంఘ రాష్ట్ర కార్యదర్శి సింగరేసు పోలయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు*

 *వినతి పత్రం స్వీకరించిన డిఆర్ఓ గారు వెంటనే దేవాదాయ శాఖ వారిని పిలిచి ఈ సమస్యపై స్పందించి నిధులు కేటాయించాలని కోరారు*

*పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి సమర్పించిన వినతి పత్రం*

*విషయం: వసంత నవరాత్రులు, ఉగాది మరియు శ్రీరామ నవమి ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించాలి – ఉగాది కొనుగోలు మార్కెట్లలో ప్రజలకు తగిన సదుపాయాలు కల్పించాలి – సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి వినతి*

*ఇటీవల సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులకు  ప్రజలు, ఆలయ కమిటీలు, ధర్మదాతలు మరియు భక్తుల నుండి ముఖ్యమైన వినతులు అందాయి. త్వరలో ప్రారంభం కానున్న వసంత నవరాత్రులు, ఉగాది మరియు శ్రీరామ నవమి పర్వదినాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ సహకారం అవసరమని వారు కోరారు*

*భారతీయ సంస్కృతిలో వసంత ఋతువు అత్యంత పవిత్రమైన మరియు ఆధ్యాత్మికమైన కాలంగా భావించబడుతుంది. ఉగాది నుండి ప్రారంభమయ్యే వసంత నవరాత్రులు మరియు అనంతరం జరిగే శ్రీరామ నవమి ఉత్సవాలు భక్తులకు అత్యంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన పర్వదినాలు. ఈ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రామాలయాల్లో శ్రీరాముడికి ప్రత్యేక పూజలు, హోమాలు, సీతారామ కల్యాణాలు, భజనలు, హరికథలు వంటి కార్యక్రమాలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతాయి*

*అదే సమయంలో వసంత నవరాత్రులు అమ్మవారికి కూడా అత్యంత ప్రియమైన పర్వదినాలుగా భావించబడుతాయి. అందువల్ల గ్రామాలలో ఉన్న అమ్మవారి ఆలయాలు మరియు గ్రామ దేవతల ఆలయాల్లో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహించడం అనాదిగా కొనసాగుతున్న సంప్రదాయం*

*ఈ ఉత్సవాలు ప్రజల్లో భక్తి, ఐక్యత, సంస్కృతి మరియు సంప్రదాయాల పరిరక్షణకు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి*

*అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక గ్రామాలు మరియు పట్టణాల్లో ఉన్న రామాలయాలు, అమ్మవారి ఆలయాలు మరియు గ్రామ దేవతల దేవాలయాల్లో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల ఆలయ కమిటీలు మరియు భక్తులు ఇబ్బందులు పడుతున్నారని జనతా వారధి పర్యటనలో వెల్లడైంది*

*కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించి అన్ని ఆలయాల్లో వసంత నవరాత్రులు, ఉగాది మరియు శ్రీరామ నవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాము*

ఈ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ముఖ్యమైన ఏర్పాట్లు:
• ఆలయ ప్రాంగణాల శుభ్రపరిచే పనులు
• విద్యుత్ దీపాలంకరణలు మరియు ఆలయాల అలంకరణ
• వసంత నవరాత్రుల ప్రత్యేక పూజలు మరియు హోమాల నిర్వహణ
• శ్రీ సీతారామ కల్యాణం నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు
• భక్తులకు ప్రసాదం మరియు అన్నదానం కార్యక్రమాలు
• హరికథలు, భజనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు
• భక్తులకు తాగునీరు మరియు ఇతర మౌలిక సదుపాయాలు
• భక్తులకు కూర్చునే సదుపాయాలు మరియు తాత్కాలిక పందిళ్లు
• భక్తుల భద్రత కోసం తగిన ఏర్పాట్లు
• ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత నిర్వహణ

*అలాగే ఉగాది సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉగాది పచ్చడి కోసం అవసరమైన పదార్థాలు, పండ్లు, పూలు మరియు ఇతర వస్తువులను కొనుగోలు చేసే మార్కెట్ ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది*

అందుకోసం:
• మార్కెట్ ప్రాంతాల్లో శుభ్రత నిర్వహణ
• తాగునీటి సదుపాయం
• ట్రాఫిక్ నియంత్రణ
• తాత్కాలిక షెడ్లు మరియు ప్రజలకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు
• భద్రత మరియు ప్రజా సౌకర్యాల ఏర్పాటు

ఇలాంటి ఏర్పాట్లు ప్రభుత్వ సహకారంతో జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా వసంత నవరాత్రులు, ఉగాది మరియు శ్రీరామ నవమి ఉత్సవాలు మరింత వైభవంగా నిర్వహించబడటమే కాకుండా భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుంది.
-కాబట్టి రాష్ట్రంలోని అన్ని రామాలయాలు, అమ్మవారి ఆలయాలు మరియు గ్రామ దేవతల దేవాలయాల్లో వసంత నవరాత్రులు, ఉగాది మరియు శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించి, దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని గౌరవనీయ రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ గారిని వినమ్రంగా కోరుతున్నాము


*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి*
*ఆంధ్రప్రదేశ్*