kapunews



TRENDING NOW


మెట్‌పల్లిలో ‘జనసేన’ జోష్.. గ్లాస్ గుర్తుకు ఓటేయాలంటూ గబ్బర్ సింగ్ బృందం సందడి!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో రాజకీయ వేడి రాజుకుంది. శనివారం జనసేన పార్టీ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ‘గబ్బర్ సింగ్’ బృందం పట్టణంలో విస్తృత ప్రచారం నిర్వహించింది. పురపాలక పరిధిలోని పలు వార్డుల్లో పర్యటించిన ఈ బృందం సభ్యులు సాయి బాబా, రమేష్, రిమ్సన్ రాజేష్ మరియు మహేష్‌లు.. మార్పు కోసం ఒక్కసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
గ్లాస్ గుర్తుకే తమ ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా పట్టణ ప్రధాన వీధుల గుండా భారీ బైక్ ర్యాలీ నిర్వహించడంతో జనసైనికుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన పనిచేస్తుందని, ప్రజలంతా గ్లాస్ గుర్తును ఆదరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




రష్యా చమురు కొనుగోళ్ల గురించి ట్రంప్ చేసిన ప్రకటనపై స్పందించిన భారత్.. ఏమందంటే..

రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందని' అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించింది.

భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, "దేశ ఇంధన సరఫరా విషయానికొస్తే, 140 కోట్ల భారతీయుల ఇంధన భద్రతకే తొలి ప్రాధాన్యమని ప్రభుత్వం అనేక సందర్భాల్లో బహిరంగంగా ప్రకటించింది. అందుకోసం మార్కెట్ పరిస్థితులు, మారుతున్న అంతర్జాతీయ వాతావరణానికి అనుగుణంగా మా ఇంధన వనరుల్లో వైవిధ్యం తీసుకురావడం మా వ్యూహంలో ప్రధానం. దీనిని దృష్టిలో ఉంచుకునే భారత్ అన్ని చర్యలూ చేపట్టింది. అలానే కొనసాగిస్తుంది" అని అన్నారు.

దీనికి ముందు, రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మారియా జఖారోవా బుధవారం మాట్లాడుతూ రష్యాతో ఇంధన సహకారంపై భారత్ తన వైఖరిని పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

ఈ వాణిజ్యం రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో స్థిరత్వాన్ని కొనసాగించడానికి దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు


ఆస్ట్రేలియా బాటలో భారత్.. పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం?

చిన్నారులను డిజిటల్ వ్యసనం నుంచి రక్షించేందుకు కేంద్రo
 వారికి ప్రభుత్వం కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి వయో పరిమితులు విధించే అంశంపై ప్రస్తుతం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలోని సూచనలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర ఐటీ కార్యదర్శి ఎస్. కృష్ణన్ వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ఐసీఏఎన్ఎన్ సదస్సులో ఆయన ఈ కీలక విషయాలను పంచుకున్నారు.

ముఖ్యంగా ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇప్పటికే పిల్లల కోసం ప్రత్యేక వయో నిబంధనలు అమలు చేస్తున్నాయి. అదే తరహాలో భారత్‌లోనూ వయసు ధ్రువీకరణను తప్పనిసరి చేసే బాధ్యతను సోషల్ మీడియా సంస్థలకే అప్పగించే అవకాశం ఉంది. ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం, హానికరమైన కంటెంట్ వల్ల చిన్నారుల మానసిక స్థితి దెబ్బతింటోందని, ఇటీవలి ఘజియాబాద్ ఘటనలే ఇందుకు ఉదాహరణని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆన్‌లైన్ టీచింగ్‌ను తగ్గించి, పిల్లలకు సులువైన విద్యా పరికరాలను అందించాలని ఆర్థిక సర్వే సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్, గోవా వంటి రాష్ట్రాలు కూడా సొంతంగా వయసు నిబంధనలు తెచ్చే ఆలోచనలో ఉండటం విశేషం. చీఫ్ ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ కూడా డిజిటల్ ప్రపంచంలో పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.



2027 డిసెంబరు నాటికీ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ : చంద్రబాబు



ఆంధ్రప్రదేశ్ ను భూవివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 2027 డిసెంబరు నాటికి సర్వే పూర్తి చేసి రాష్ట్రంలో రైతులు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కలుగొట్ల గ్రామంలో మీ భూమి- మీహక్కు కింద పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. భవిష్యత్ లో ఎవరూ ట్యాంపరింగ్ చేయకుండా, ఒక్క పైసా అవినీతికి తావు లేకుండా రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్ తో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎవరైనా ట్యాంపరింగ్ కు ప్రయత్నిస్తే నేరుగా జైలుకే వెళతారని, అవసరమైతే పీడీ యాక్టు కింద కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ...మీ భూమికి భద్రత కల్పించడం నాకు ఆనందాన్నిస్తోంది. భూమి ఆస్తి ఒక్కటే కాదు..అది మన జీవనాధారం. కుటుంబానికి భద్రత. భవిష్యత్‌కు నమ్మకం. కూటమి ప్రభుత్వం భూమి- నీరు-సాగుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. వివాదాలు లేని భూములు, పుష్కలంగా ప్రతి ఎకరాకు నీరు, లాభాలు తెచ్చిపెట్టేలా సాగును ప్రోత్సహించటమే లక్ష్యాలుగా పెట్టుకుని పనిచేస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వడమే నా జీవితాశయం. కర్నూలు జిల్లాలో పశ్చిమ తాలూకాకు నీరు అందిస్తే రాష్ట్ర మంతటా నీరు ఇచ్చినట్టే. వారసత్వంగా వచ్చిన ఆస్తిపై వేరే వారి ఫొటోలు వేయడమేంటని గత ఎన్నికల్లో నేను ప్రశ్నించాను. గత పాలకులు తప్పుడు విధానాలతో ప్రజలను బానిసలు చేయాలని కుట్ర చేశారు. లోపభూయిష్టమైన ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తెచ్చారు. ప్రజల జుట్టు వాళ్ల చేతుల్లో పెట్టుకుని ఆడించాలని చూశారు. పట్టాదారు పాసు పుస్తకాలపై, పొలం సరిహద్దు రాళ్లపై వారి ఫొటోలు, పేర్లు ముద్రించుకున్నారు. వాళ్లు అడిగిన భూములు ఇవ్వకపోతే 22 ఏలో పెట్టారు. కక్ష తీర్చుకోవడానికి అన్ని ఆయుధాలు ఉపయోగించారు. ప్రజలను భయబ్రాంతులను చేసేందుకు పులివెందుల నుంచి మనుషులను తెచ్చుకున్నారు. రీ సర్వే పేరుతో రూ.700 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. పట్టాదారు పాసు పుస్తకాలపై ఫొటోలు వేసుకోవడం శాడిజం కాదా? లక్షల ఎకరాల ప్రైవైటు భూములను ప్రభుత్వ భూములుగా మార్చేశారు. రికార్డులు తారుమారు చేశారు. తాడేపల్లి ప్యాలెస్ పక్కన హెలీప్యాడ్ కోసం..70 ఏళ్లుగా పక్కా డాక్యుమెంట్లు ఉన్న భూమిని ఒక వ్యక్తి దగ్గర బలవంతంగా తీసుకుని ప్రభుత్వ భూమిగా మార్చేశారు. ఇదేమని అడిగితే 22 ఏలో పెట్టి వివాదం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల వద్ద నుంచి వస్తున్న ఫిర్యాదుల్లో 80 శాతం పైగా అర్జీలు రెవెన్యూ పరమైనవే వస్తున్నాయి. రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించి ఏమీ తెలీనట్టు గత ఐదేళ్లు బ్రహ్మాండంగా పాలన చేసినట్టు మాట్లాడుతున్నారు. మీరు సమర్థవంతంగా పని చేస్తే ఇన్ని సమస్యలు ఎలా వచ్చాయి? నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాను. నా జీవితంలో ఇలాంటి భూ సమస్యలు ఎప్పుడూ చూడలేదని" సీఎం చంద్రబాబు అన్నారు.

పైసా అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ

"అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశాం. భవిష్యత్ లో ఎవరూ ప్రజల భూమిపై కన్ను వేయకుండా భద్రత కల్పిస్తున్నాం. ప్రతీ పాస్ పుస్తకానికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్, యూనిక్ నెంబర్ ఉంటుంది. ఎవరైనా సరే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా భూమి వివరాలను వెంటనే తెలుసుకోవచ్చు. మీ పాసు పుస్తకంలో ఉన్న క్యూఆర్ కోడ్ ను మీ ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే అందులో వచ్చే మ్యాప్ మిమ్మల్ని నేరుగా మీ పొలం వద్దకు తీసుకు వెళుతుంది. డాక్యుమెంట్ల వివరాలను ట్యాంపర్ చేయకుండా బ్లాక్ చైన్ లాంటి పటిష్ట వ్యవస్థను తెస్తున్నాం. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత. మీ రికార్డులన్నీ మీ అనుమతితోనే చేస్తున్నాం. ముందుగా డ్రాఫ్ట్ పట్టా దార్ పాస్‌బుక్ జారీ చేసి అందులో వ్యక్తిగత వివరాలు, భూమి వివరాలు సరిగ్గా ఉన్నాయో, లేవో భూ యజమానులు నిర్ధారించుకునే అవకాశం ఇచ్చాం. eKYC ధృవీకరణ తప్పనిసరిగా తీసుకుంటున్నాం. దీంతో తప్పులు దొర్లేందుకు వీలుపడదు. పైసా అవినీతి లేకుండా పట్టాదారు పుస్తకాలు ఇస్తున్నాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు గ్రామాల చొప్పున రాష్ట్రంలో మొత్తం 279 గ్రామాల్లో ముందుగా పంపిణీ చేపట్టాం. ప్రస్తుతం 1,16,870 డ్రాఫ్ట్ పాస్‌ బుక్స్ సిద్ధంగా ఉన్నాయి. వీటిలో 91,038 డ్రాఫ్ట్ పాస్‌ బుక్స్ eKYC కూడా పూర్తయ్యింది. కర్నూలు జిల్లాలోని 13 గ్రామాల్లో 8,347 మందికి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. కలుగట్ల గ్రామంలో 1,178 కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేసుకుంటున్నాం. ఇప్పటివరకూ 37 లక్షల 40 వేల పట్టా దారు పాస్ పుస్తకాలు సిద్ధమయ్యాయి. ఇందులో 19 లక్షలు లక్షలు ఇప్పటికే పంపిణీ చేయగా..18 లక్షల 40 వేలు ఏప్రిల్ లోగా పంపిణీ చేస్తాం. ఇది కాకుండా 9,500 గ్రామాల్లో సర్వే చేయాలి. అవి చేస్తే 60 లక్షల మందికి కొత్తగా పాస్ పుస్తకాలు ఇచ్చే అవకాశం వస్తుంది. 2027 డిసెంబర్ నాటికి ప్రతి ఒక్కరికీ పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జాయింట్ ఎల్పీఎంల విషయంలో వివాదాలు పరిష్కరించుకోవాలని" ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

సీమలో ప్రాజెక్టులు టీడీపీ ఘనతే

"రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల ఘనత టీడీపీదే. హంద్రినీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ సహా అనేక ప్రాజెక్టులు రావడానికి నాడు తెలుగుదేశం పార్టీ చూపిన చొరవే కారణం. తెలుగుగంగ సీమను సస్యశ్యామలం చేయడంతో పాటు చెన్నై దాహార్తి తీరుస్తోంది. నదుల అనుసంధానం చేసి సీమను సస్యశ్యామలం చేస్తాము. అనంతపురం జిల్లాలో నీటి సంరక్షణకు మేము తీసుకున్న చర్యలతో ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. సీమను హార్టికల్చర్ హబ్ గా తయారుచేస్తున్నాం. దేశంలో ఎక్కువ పండ్లు పండేది రాయలసీమలోనే. రాష్ట్రంలో 400 లక్షల మెట్రిక్ టన్నుల పండ్లు ఉత్పత్తి అయితే అందులో 220 లక్షల మెట్రిక్ టన్నులు సీమ నుంచే వస్తున్నాయి. రాబోయే రోజుల్లో 500 లక్షల మెట్రిక్ టన్నుల పండ్లు ఉత్పత్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వంలో 8 సార్లు చార్జీలు పెంచారు. రూ. 32 వేల కోట్ల మేర విద్యుత్ భారాన్ని మోపారు. రూ.1.20 లక్షల కోట్ల అప్పు చేశారు. కూటమి ప్రభుత్వం భవిష్యత్ లో కరెంటు చార్జీలు పెంచబోదని హామీ ఇస్తున్నాను. నేనూ రాయలసీమలోనే పుట్టాను. ఎన్టీఆర్ కూడా సీమ ముద్దు బిడ్డే. మూడేళ్లలో కడప స్టీల్ ప్లాంట్ పనులు పూర్తి చేసే బాధ్యత నాది. కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులు పెడుతున్నాం. సీమలో స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్, ఆటో మొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వస్తున్నాయని" ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

సాగునీటి రంగానికి మా మొదటి ప్రాధాన్యత

"2014 -19 మధ్య సాగునీటి రంగానికి రూ. 68 వేల కోట్లు ఖర్చు చేశాం. గత పాలకులు పోలవరం ప్రాజెక్టు పాలిట శనిలా దాపురించారు. అసమర్థత, నిర్లక్ష్యంతో రూ. 440 కోట్ల విలువైన డయాఫ్రాం వాల్ దెబ్బతింది. దీని కోసం అదనంగా రూ. 1000 కోట్లు ఖర్చయింది. సమయం కూడా వృథా అయ్యింది. 2027లో పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తాం. పట్టి సీమ ద్వారా కృష్ణాడెల్టాకు గోదావరి నీరిచ్చి, శ్రీశైలం నీటిని సీమకు మళ్లించాం. పదేళ్లుగా సీమలో కరువు లేకపోవటానికి మా దూరదృష్టే కారణం. నీరుంది కాబట్టే కియాలాంటి పరిశ్రమలు వచ్చాయి. మచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులు ఉంచుకుని రాయలసీమ లిఫ్ట్ పేరుతో నాటకాలు ఆడారు. కర్నూలు జిల్లాకు నీరిచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. రాజోలి బండ, గురు రాఘవేంద్ర, వేదవతి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చే నీరు కర్నూలు జిల్లా ఉపయోగించుకుంటే నీటి సమస్య చాలా వరకూ తీరుతుంది. ఎమ్మిగనూరులో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇది వస్తే 2 వేల మంది చేనేతలకు ఉపాధి లభిస్తుంది. గాజుల దిన్నె పూర్తి చేస్తాం. రూ.138 కోట్లతో ఎమ్మిగనూరు బైపాస్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది. ఎమ్మిగనూరు, ఆదోని మీదుగా రైల్వే లైన్లపై దృష్టి పెడతాం. సీమలో 120 ప్రాజెక్టులకు అనుమతి ఇస్తే గత పాలకులు అన్నిటినీ రద్దు చేశారని" ముఖ్యమంత్రి తెలిపారు.

శ్రీవారి లడ్డూ తయారీలో రసాయనాలు

"అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని వాడారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన నివేదికతో మేం మాట్లాడుతుంటే.. సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. రసాయనాలు కలిసినట్టు నివేదికలో ఉందని వాళ్ల బాబాయ్ కూడా మాట్లాడుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలుపెట్టాం. గత పాలకుల హయాంలో తయారు చేసిన లడ్డూకి ఇప్పటి లడ్డూ ప్రసాదానికి నాణ్యతలో ఎంతో వ్యత్యాసం ఉంది. శ్రీశైలంలోనూ రసాయనాలు వాడి ప్రసాదం కల్తీ చేశారు. తప్పు చేసి నన్ను క్షమాపణ చెప్పమంటున్నారు. పరామర్శల పేరుతో గుంటూరు వెళ్లేందుకు 6 గంటలు రోడ్డు బ్లాక్ చేసి మరే వాహనాలు వెళ్లకుండా ఇబ్బందులు పెట్టారు. గతంలో కాన్వాయ్ కింద సింగయ్య అనే వ్యక్తిని తొక్కించి చంపారు. బంగారుపాళ్యంలో మామిడి కాయలను కింద పడేసి బల ప్రదర్శనకు దిగారు. బలప్రదర్శన ఎన్నికల సమయంలో చేయాలి. ఇలాంటి వారిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోను. శాంతిభద్రతల నిర్వహణలో కఠినంగా ఉంటాను. ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేయటంతో పాటు ప్రతీ రైతునూ ఆదుకుంటాం. ఉల్లికి రేటు లేకపోతే హెక్టారుకు రూ.50 వేల చొప్పున చెల్లించాం. మామిడి, కోకో పోగాకు లాంటి పంటలకూ సబ్సీడీ ఇచ్చి ఆదుకున్నాం." అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్, స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 60వ డివిజన్ ను దత్తత తీసుకుంటా:ఖమ్మం MP గౌ శ్రీ రామసహాయం రఘురామిరెడ్డి

CPM పార్టీ బలపరిచిన 60వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసుల.ఉమారాణి  చేతిగుర్తుకు ఓటేసి గెలిపిస్తే 60వ డివిజన్‌ను స్వయంగా దత్తత తీసుకుని, MPLADS (ఎంపీ నిధుల) ద్వారా రెండు తాగునీటి బోర్లు మంజూరు చేయించి వాటర్ ప్లాంట్‌ ఏర్పాటు చేసి 60వ డివిజన్ ప్రజల దాహార్తిని తీర్చుతాను.అర్హులైన ప్రతి ఒక్కరికీ 75 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించడంతో పాటు, 'ఇందిరమ్మ ఇళ్లు' నిర్మించి ఇస్తాము. తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ గృహనిర్మాణ సమాచార శాఖల మంత్రి వర్యులు గౌ శ్రీ పొంగులేటి.శ్రీనివాసరెడ్డిగారితో మాట్లాడి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇంటి స్థలాల పట్టాలను  త్వరితగతిన లబ్ధిదారులకు అందజేస్తాను. ప్రత్యేక నిధులను కేటాయించి ప్రజలను ఇబ్బంది పెడుతున్న కోతులు మరియు వీధికుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారంనికి కృషి చేస్తాను.హస్తంగుర్తుపై పోటీ చేస్తున్న శ్రీమతి కాసుల ఉమారాణి గారిని గెలిపించడం ద్వారా ఈ అభివృద్ధి పనులు చేయడం సాధ్యపడుతుందని హామీఇచ్చి చేతిగుర్తుకు మీ అమూల్యమైన ఓటువేసి గెలించాలని అభ్యర్థించారు.

కాసుల.ఉమారాణి వెంకట్ మాట్లాడుతూ గత 25 సం,,లుగా కొత్తగూడెం  పట్టణప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల కష్టనష్టాలలో అండగా ఉంటూ, భరోసా కల్పిస్తూ, రాజకీయ ప్రయోజనాలు, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు అర్హులకు అందిస్తూ ప్రతిఫలం ఆశించకుండా సేవసేసే కుటుంబానికి, నీతిగా నిజాయితీగా ఉండే మీ మట్టిమనిషి చేతిగుర్తు పై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

అధికారంలోలేనివారు, గారడి మాటలతో, మోసపూరిత కుట్రలతో, డబ్బుసంచులతో మిమ్మల్ని అయేమయం గందరగోళం చేసి ఓటు వేయించుకోవాలని ఐదంతస్తుల భవంతిలోనుండి వచ్చి ఓటేయ్యాలని అడుగుతారని, గెలిచిన తర్వాత వారి ఇంటిగేటు కూడా తాకనివ్వరని, ఐదోఅంతస్తు ACగదిలో ఉండి ఇంట్లో లేరు అని  వాచ్మెన్ తో చెప్పిస్తారని, ప్రతి పనికి రేటు కట్టి  పిడించేవారికి మాటలు నమ్మి మోసపోకుండా మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకు వేసి కాసుల.ఉమారాణిని గెలిపించి 60వ డిజనన్ అభివృద్ధికి భాగస్వాములు కావాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవి ప్రసన్న, కూచిపూడి.జగన్, పూణెo.శ్రీనివాస్, సర్పంచ్ లైలా, ఉప సర్పంచ్ మహేష్, ఐకి.సత్యనారాయణ, జయప్రకాష్, ఆకుల.సుధాకర్, కాసుల.సాయి, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


అల్లూరు గ్రామంలో 53 మంది మహిళలకు ఉజ్వల గ్యాస్ సిలిండర్ల పంపిణీ.

వీరులపాడు మండలం అల్లూరు గ్రామంలో శనివారం నాడు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం క్రింద అర్హులైన 53 మంది మహిళలకు గ్యాస్ సిలిండర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు కూటమి నేతలతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య గారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉజ్వల యోజన పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల మహిళలకు పొగలేని వంట గదులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. మహిళల ఆరోగ్య పరిరక్షణతో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ప్రజలకు నేరుగా ఉపయోగపడే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా పేద కుటుంబాల మహిళలకు ఉజ్వల గ్యాస్ పథకం ఎంతో ఉపయుక్తంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్లు అందుకున్న మహిళలు ఎన్డీయే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.


నకరికల్లు మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది 


భారత ప్రధాన మంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన జనతా వారధి కార్యక్రమంలో నకరికల్ మండల ఇన్చార్జిగా పాల్గొని మండల ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వారి నుంచి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులు పంపించటం జరిగింది.

              ఈ కార్యక్రమంలో నకిరకల్లు బీజేపీమండల 
అధ్యక్షులు మున్వర్ బాజీ గారు,మండల సీనియర్ నాయకులు అనుమోలు శ్రీనివాసరావు గారు,మండల ప్రధాన కార్యదర్శి మోహన కృష్ణ గారు,కోటపాటి వీరాంజనేయులు గారు, ఎర్ల నాగరాజు గారు తదితర నాయకులు,అభిమానులు పాల్గొన్నారు


జనతా వారిది కార్యక్రమంలో భాగంగా  కట్టమూరు గ్రామంలో రైతు కల్లూరి నరసింహారావు తన సమస్యను సత్తెనపల్లి మండలం  కో కన్వీనర్ జవాజి రమణకు అర్జీ ఇవ్వడం జరిగింది తక్షణమే మేము తాసిల్దారు గారికి సమస్యలను వారి వద్దకు తీసుకెళ్లగా  కల్లూరు నరసింహారావు భూమిని ఆన్లైన్ అడంగల్ వెబ్ నందు తప్పు సర్వే నెంబర్ నమోదు అవ్వటం వల్ల మిగిలిన రైతులు కూడా ఇబ్బంది పడటం జరిగింది. దానిని ఎమ్మార్వో గారి  దృష్టికి కన్వీనర్ సురేష్ గారు కోకన్వీనర్ జవాజీ రమణ మరియు బిజెపి కార్యకర్తలు  తోటపాలెం ఏలియా, నెల్లూరి నరేంద్రబాబు, ప్రసాదు గ్రామతీసుకెళ్లి పక్కన రైతులు సమస్యను వివరంగా చెప్పడం జరిగింది తక్షణమే తాసిల్దారు గారు సర్వేయర్ మరియు విఆర్ఓ రోవర్ తో కొలతలు తీసి కల్లూరు నరసింహారావు యొక్క భూమిని కొలిపించడం జరిగింది సదరు రైతు సంతోషం వ్యక్తం చేయటమే గాక పార్టీ యొక్క కార్యక్రమాన్ని మెచ్చుకోవడం జరిగింది ఇలాంటి కార్యక్రమము మా ద్వారా చేపించిన జిల్లా అధ్యక్షులు శశి కుమార్ గారికి మరియు కట్టా శంకర్రావు గారికి మరియు పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాము

పల్నాడు జిల్లా నరసరావుపేట కార్యాలయంలో జరిగిన జనతా వారిది కార్యక్రమం

జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఈవేళ పల్నాడు జిల్లా నరసరావుపేటలోని జిల్లా కార్యాలయం వద్ద అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించడం జరిగింది.
కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్, జాతీయ కౌన్సిల్ సభ్యులు వల్లేపు కృపారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నాభట్ల ఆదిత్య, నరసరావుపేట రెండవ పట్టణ అధ్యక్షులు అడపా ఫణిభూషణ్, నరసరావుపేట రూరల్ మండలం అధ్యక్షులు పొందుగల వెంకటేశ్వరరావు, నరసరావుపేట రెండవ పట్టణ ప్రధాన కార్యదర్శి ముప్పవరపు సంపత్, కిసాన్ మోర్చా నాయకులు మైలవరపు సుబ్బారావు, జనసేన పార్టీ నాయకులు అదృఫ్, తెడ్డు వెంకటేశ్వర్లు, B వెంకటేశ్వర్లు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

పల్నాడు జిల్లా జనతా వారిది టీం ఆధ్వర్యంలో  శుక్రవారం విజయవాడ రాష్ట్ర కార్యాలయం లొ జరిగిన జనతా వారధి కార్యక్రమం లొ పాల్గొనడం జరిగింది

*రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి నేతృత్వంలో 06-02-2026 వ తేది శుక్రవారం విజయవాడ రాష్ట్ర కార్యాలయం లో జరిగిన జనతా వారధి కార్యక్రమనికి పల్నాడు జిల్లా జనతా వారధి కన్వినర్ మరియు పల్నాడు జిల్లాఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పాల్గొని చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం లొ ఏంటో చరిత్ర కలిగిన కొండవీటి కోట పై శ్రీకృష్ణ దేవరాయులు కాంశ్య విగ్రహం ఏర్పాటు గురించి అలాగే చిలకలూరిపేట నియోజకవర్గం లొ ఏంటో కాలంగా పెండింగ్ లొ ఉన్న ఫార్మ్ 22-a లొ ఉన్న స్థలాలు రెగ్యులర్ అయ్యేలాగా ప్రభుత్వం పై వత్తిడి తెచ్చి ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయాలని జనతా వారధి రాష్ట్ర టీమ్ లీడర్ కిలారు దిలీప్  బీజేపీ రాష్ట్ర లీడర్ ఎమ్మెల్సీ పోతుల సునీత గారి ద్వారా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ రెండు సమస్యలు పై త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశం లొ ప్రయత్నం చేస్తావని హామీ ఇవ్వడం జరిగింది   ఈ కార్యక్రమం లొ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు గోగినేని వెంకటరమణ పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ కిసాన్ మౌర్చ రాష్ట్ర నాయకులు నల్లూరి రాంబాబు మైనారిటీ మోర్చా చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని తదితరులు ఈ కార్యక్రమం లొ పాల్గొన్నారు*


పల్నాడు జిల్లా జనతా వారిది టీం ఆధ్వర్యంలో  గురువారం గురజాల లొ జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది

*రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి నేతృత్వంలో 05-02-2026 వ తేది గురువారం గరజాల పాత పాట అమ్మవారు గుడి సెంటర్ లో జనతా వారధి కార్యక్రమనికి పల్నాడు జిల్లా జనతా వారధి కన్వినర్ మరియు పల్నాడు జిల్లాఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రజల వద్దనుండి పిర్యాదులు స్వీకరించరు. ఈ కార్యక్రమం లొ గురజాల మండల బిజెపి జనతా వారిది కన్వీనర్ పిండి రామాంజనేయులు మండల అధ్యక్షురాలు నాగమణి సీనియర్ నాయకులు కో కన్వీనర్ తవిటి రమేష్ కంచుకోటయ్య గారు ఇమిటి శెట్టి శ్రీనివాసరావు గారు .ఫిర్యాదులు. పాగళ్ళు క్రాంతి పసుపులేటి వేణుగోపాల్ ఫిర్యాదులు ఇచ్చారు  సదరు ఈ విషయం పై ప్రభుత్వ అధికారులు తో మాట్లాడడం జరిగింది వారు త్వరలో సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. గురజాల మండల కమిటీ మరియు గురజాల జనతా వారధి టీమ్ ప్రజల కు ప్రతి గురువారం జరిగే జనతా వారధి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని తెలియజేసారు*


నల్గొండలో ఏసీబీ ఉచ్చు: రూ. 20,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

​నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో ఫిబ్రవరి 2న తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు జరిపిన దాడిలో ఒక మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
​ఘటన వివరాలు:
​అరెస్టయిన అధికారి: గుర్రంపోడు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్.
​లంచం మొత్తం: రూ. 20,000.
​కారణం: ఆన్‌లైన్ రికార్డులలో భూమి వివరాల పునరుద్ధరణ (restoration) దరఖాస్తును ప్రాసెస్ చేసి, పై అధికారులకు పంపేందుకు ఈ లంచం డిమాండ్ చేశారు.
​మండల పరిషత్ కార్యాలయంలో (MRO Office) లంచం తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి, నిందితుడి నుంచి ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు


ఏసిబి వలలో చిక్కిన తణుకు టౌన్ పోలీస్ స్టేషన్ రైటర్ సుబ్బారావు

తణుకులో ఏసీబీ మెరుపు దాడి
లంచం తీసుకుంటూ ఏసీబీ కు చిక్కిన హెడ్ కానిస్టేబుల్

తణుకు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. 
చీటింగ్ కేసు వ్యవహారంలో లంచం డిమాండ్ చేసిన హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు రూ.5,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినట్లు సమాచారం...



పల్నాడు జిల్లా జనతా వారిది టీం ఆధ్వర్యంలో  ప్రధానమైనటువంటి సమస్య  "దివ్యాంగుల సర్టిఫికెట్లు" విషయం పై కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది

*రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి నేతృత్వంలో  ఈ సోమవారం జనత వారధి లో దివ్యాంగుల సర్టిఫికెట్లు సమస్యల పైన వినతి పత్రం పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల గారికి ఇవ్వటం జరిగింది*

 *తదుపరి జిల్లా వ్యాప్తంగా వచ్చిన రేషన్ డీలర్ షిప్ సమస్యలు రెవెన్యూ సమస్యలు తదితర అంశాలపై ప్రభుత్వ అధికారులకు జనత భారతి టీం కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అలాగే వాటి సమస్యను త్వరితగారి దిన పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయటం సదరు విషయాలపై ప్రభుత్వ అధికారులు త్వరితగతిన మీరు ఫిర్యాదు ఇచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని పల్నాడు జిల్లా జనతా వారిది టీం కి చెప్పడం జరిగింది*

 *ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జనతా భారతి కన్వీనర్ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నాభట్ల ఆదిత్య పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు ఇత్తడి కిరణ్ కిసాన్ మౌర్చ రాష్ట్ర నాయకులు మైలవరపు సుబ్బారావు యూవ మౌర్చ మాజీ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమ్మడిశెట్టి అమరేంద్ర నరసరావుపేట 2 టౌన్ ప్రధాన కార్యదర్శి ముప్పావరపు సంపత్ కుమార్ శావల్యాపురం మండల అధ్యక్షులు గట్టుపల్లి శ్రీనివాసరావు పల్నాడు జిల్లా జనతా వారధి మీడియా ఇన్ఛార్జ్ కోమటి వాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు*

ఈరోజు జరిగిన 2026-2027సంవత్సర బడ్జెట్ సమావేశం వీక్షించిన చిలకలూరిపేట బిజెపి నాయకులు

 *ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిలకలూరిపేట బిజెపి నాయకులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలసీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజలకు వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉందని బడ్జెట్ సమావేశాన్ని వీక్షించిన బిజెపి నాయకులు అన్నారు*

 *పేద ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ ప్రవేశించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ తరఫున శుభాభినందనలు తెలియజేశారు*

 *ఈ కార్యక్రమంలో బిజెపి ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు సింగరేసు పోలయ్య పట్టణ ఉపాధ్యక్షులు కోటచంద్ర మీడియా ఇంచార్జ్  రావికింది రామకృష్ణ బిజెపి సీనియర్ నాయకులు కస్తూరి వెంకటేశ్వర్లు ఉప్పాల భాస్కరరావు కోమటి వాసు మైనారిటీ సెల్ పట్టణ అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని గుమ్మ బాలకృష్ణ, రాయుడు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు*