kapunews



TRENDING NOW





లోక్ సభ, అసెంబ్లీ స్థానాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

▪️లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంచాలని నిర్ణయం.
▪️543 నుంచి 816కి పెరగనున్న పార్లమెంట్ స్థానాలు.
▪️4,123 నుంచి 6,185కి పెరగనున్న అసెంబ్లీ స్థానాలు.
▪️తెలంగాణలో 179కి, ఏపీలో 263 కు చేరనున్న అసెంబ్లీ స్థానాలు.
▪️ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టనున్న కేంద్రం.


బిపిఎల్ (దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న) విద్యార్థులకు విద్యా రుణాల లభ్యతను మరింత పెంచాలి

*-ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకంను ఎక్కువగా విస్తరించాల్సి ఉంది*
*-నిబంధనలకు అనుగుణంగా విద్యా రుణాలు ఇవ్వని బ్యాంకర్లపై చర్యలు తీసుకోవాలి*
*-ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విద్యార్థులకు రుణ లభ్యత తక్కువగా ఉంది..  పల్నాడు వంటి వెనుకబడిన ప్రాంతాల్లో ఇది ఎక్కువ*
*ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు కేంద్రం అండగా నిలవాలి*
*-లోక్ సభలో కేంద్రాన్ని ప్రశ్నించిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు* 
*-పిఎం విద్యాలక్ష్మి పథకం డిమాండ్ ఆధారితమైనది.. నిర్దిష్ట కోటా ఏమీ లేదు : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్*
---------------

దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న (బిపిఎల్ ), ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు  ఉన్నత విద్యనభ్యసించటంలో వడ్డీ రాయితీ రుణాల లభ్యత ప్రస్తుతం తక్కువగా ఉందని, వీటిని మరింత విస్తరించాలని, పూచీకత్తు లేని రుణాలు పొందటంలో నిబంధనలు ఉన్నప్పటికీ, పూచీకత్తు కోరుతున్న బ్యాంకులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు ఈరోజు లోక్ సభలో డిమాండ్ చేశారు. రుణాల పంపిణీలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ, రేషన్ కార్డుల వినియోగంతో సహా అర్హత ప్రమాణాలను సరళీకరించాలని ఎంపీ కోరారు. 
భారతదేశంలో ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి (గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో) సుమారు 29.5%కి చేరుకున్నప్పటికీ, కేవలం 4% మంది విద్యార్థులు మాత్రమే రుణాలను పొందగలుగుతున్నారని,  పల్నాడు వంటి వెనుకబడిన ప్రాంతాలలో ఈ లభ్యత మరింత తక్కువగా ఉందని ఎంపీ కృష్ణ దేవరాయలు ఆందోళన వ్యక్తం చేశారు. 
ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం కింద దేశవ్యాప్తంగా వడ్డీ రాయితీ కింద ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్యను లక్షకు పరిమితం చేశారన్నారు. ఉన్నత విద్యలో దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు కేవలం 3,429 సీట్లను మాత్రమే కేటాయించారని, ఇది ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విద్యా అవకాశాలను గణనీయంగా పరిమితం చేస్తోందని, దీన్ని విస్తరించాలని కోరారు. దీనిపై విద్యాశాఖ సహాయ మంత్రి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. పిఎం విద్యాలక్ష్మి పథకం అనేది డిమాండ్ ఆధారితమైనదని,, దీనికి రాష్ట్రాలు, జిల్లాల వారీగా గానీ నిర్దిష్ట కోటా ఏమీ లేదని, ఇది విస్తృత శ్రేణి విద్యాసంస్థలలోని అర్హులైన విద్యార్థులందరికీ అందుబాటులో ఉంటుందని
పేర్కొన్నారు. ఈ పథకం మితమైన వడ్డీ రేట్లతో,  తిరిగి చెల్లింపు నిబంధనలతో హామీ అవసరం లేని రుణాలను అందిస్తుందని, దీనిపై విస్తృత అవగాహన కల్పించి, పథకాన్ని వినియోగించుకోవాలని మంత్రి పేర్కొన్నారు.
ప్రస్తుత నిబంధన లక్ష మంది లబ్ధిదారుకే  ఉన్నప్పటికీ, డిమాండ్‌ను బట్టి దీనిని సమీక్షించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ పథకం కింద ఎటువంటి పూచీకత్తు అవసరం లేదని కూడా మంత్రి పునరుద్ఘాటించారు.



కేంద్రీయ విద్యాలయ ప్రవేశాలు 2026–27:


*ముఖ్యమైన తేదీలు:*
• ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 20 మార్చి 2026 (ఉదయం 10 గంటలకు)
• చివరి తేదీ: 2 ఏప్రిల్ 2026
• 2వ తరగతి పైగా (ఖాళీలు ఉంటే – ఆఫ్‌లైన్): 2–4 ఏప్రిల్ 2026
• మెరిట్ జాబితా: మార్చి–ఏప్రిల్ 2026
• తరగతులు ప్రారంభం: జూన్ 2026

*అర్హత (1వ తరగతి):*
• వయస్సు: 31 మార్చి 2026 నాటికి 6 సంవత్సరాలు ఉండాలి
• ఎటువంటి పరీక్ష / ఇంటర్వ్యూ లేదు
• ఎంపిక లాటరీ విధానం (Draw of Lots) ద్వారా జరుగుతుంది

*ఎలా దరఖాస్తు చేయాలి:*
1. https://kvsangathan.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించండి
2. Admission 2026–27 పై క్లిక్ చేయండి
3. మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకోండి
4. దరఖాస్తు ఫారమ్ నింపండి
5. అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయండి
6. సమర్పించి ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి

*అవసరమైన పత్రాలు:*
• జనన సర్టిఫికేట్
• చిరునామా రుజువు
• కుల ధృవపత్రం (ఉంటే)
• ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (పై తరగతులకు)
• పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

*రిజర్వేషన్ (సీట్లు అందుబాటులో ఉన్నవారు):*
• SC / ST
• OBC
• EWS
• దివ్యాంగులు (PH)

*ఎంపిక విధానం:* 
• లాటరీ (Draw of Lots) ద్వారా ఎంపిక
• ఎంపిక జాబితా ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.



పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా గారికి వినతి పత్రం సమర్పించిన పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్

 పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్లా గారికి రాష్ట్రంలో ప్రధాన సమస్య అయిన సంచార జాతుల కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం క్రోసూరు మండలంలో ప్రధాన సమస్య అయినటువంటి మరుగుదొడ్లు మరియు పంట కాలవల మెయింటినెన్స్ గురించి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారు పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు క్రోసూరు మండల బీజేపీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

గౌరవనీయులైన శ్రీమతి కృతిక శుక్ల 
జిల్లా కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్,
పల్నాడు జిల్లా 

విషయం: రాష్ట్రంలోని సంచార, అర్ధ సంచార మరియు డీనోటిఫైడ్ తెగల (DNTs) వారికి కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి కల్పించవలెనని వినతి.

అమ్మ..

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయినప్పటికీ, రాష్ట్రంలోని సంచార, అర్ధ సంచార మరియు డీనోటిఫైడ్ తెగల (DNTs) వారిని ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా గుర్తించకపోవడం, కుల ధృవీకరణ పత్రాలు లేకపోవడం వల్ల కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు వీరికి అందకపోవడం దురదృష్టకరం.

కేంద్ర ప్రభుత్వం నియమించిన జాతీయ డీనోటిఫైడ్, నామాడిక్ & సెమీ-నామాడిక్ తెగల కమిషన్ సిఫార్సులు మరియు దేశవ్యాప్తంగా ఈ తెగలు ఎదుర్కొంటున్న సమస్యలు (ముఖ్యంగా కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయడంలో ఆలస్యం) దృష్టిలో ఉంచుకుని, ఈ విషయం తక్షణం పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని, ఈ తెగల వారిని గుర్తించి కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసి, ప్రభుత్వం నుండి వచ్చే అన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలను వర్తింపజేయవలసిందిగా మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవపూర్వకంగా కోరుతున్నాం.

                        ఇట్లు
           ఏలూరి శశి కుమార్ 
            పల్నాడు జిల్లా అధ్యక్షులు
      భారతీయ జనతా పార్టీ


బాపూజీ వృద్ధాశ్రమంలో అన్నదానం
యషిక క్షేత్ర పుట్టినరోజు వేడుకలు

చిలకలూరిపేట:

పట్టణానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గోవిందు శంకర శ్రీనివాసన్ తన మనవరాలు యషిక క్షేత్ర పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా స్థానిక చీరాల రోడ్డులో ఉన్న బాపూజీ వృద్ధాశ్రమంలో ఘనంగా అన్నదానం నిర్వహించారు.
ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆశ్రమంలోని వృద్ధులను గోవిందు శంకర శ్రీనివాసన్ స్వయంగా పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన మిత్రులతో కలిసి వృద్ధులకు స్వయంగా భోజనం వడ్డించి సేవాభావాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుమారుడు వెంకట సత్య సాయి కిరణ్ మరియు డాక్టర్ గోవిందు తేజస్విని దంపతుల కుమార్తె అయిన యషిక క్షేత్ర పుట్టినరోజును గౌరవ వృద్ధుల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.వృద్ధుల ఆశీస్సులు చిన్నారి భవిష్యత్తుకు మేలుకలిగిస్తాయని, అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. వృద్ధులందరూ యషిక క్షేత్రను ఆశీర్వదించాలని కోరారు.వృద్ధులను ఆదరించి అక్కున చేర్చుకుంటున్న బాపూజీ వృద్ధాశ్రమం నిర్వాహకులు మురికిపూడి ప్రసాద్, ఆరాధ్యుల రామకృష్ణలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ ఎల్ఐసి ఏజెంట్ అల్లిమియా, షబ్బీర్, తోట లక్ష్మీనారాయణ, వట్టెం శ్రీనివాసరావు, నిమ్మల మురళీకృష్ణ తదితరులు పాల్గొని యషిక క్షేత్రకు శుభాకాంక్షలు తెలియజేశారు.



అనుదీప్ హత్య పై విచారణ జరపాలి హంతకులను అరెస్ట్ చేయాలి - చందు జనార్దన్ 

కుట్ర దారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి -
లేని పక్షం లో చాట్రాయ్ లో నిరవధిక నిరసన చేస్తా—రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్

అంబటి అనుదీప్ హత్య పై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేసిన రాష్ట్ర కాపు జే ఏ సీ అధ్యక్షులు చందు జనార్ధన్.శనివారం విజయవాడ లో ఆయన కాపు జే ఏ సి కార్యాలయం లో  మాట్లాడుతు నూజివీడు నియోజక వర్గం లో చా ట్రాయ్ లో కాపు కుటుంబ సభ్యుడైన అంబటి అనుదీప్ మరణం హత్యేనని మండలం అంతా ఘోషిస్తువుంటే స్థానిక స్టేషన్ అధికారులు చోద్యం చూస్తున్నారని చందు జనార్దన్ ఆరోపించారు.ఈరోజు చట్రాయ్ లో అనుదీప్ యొక్క దశదినకర్మ ను కుటుంబం నిర్వహించిందని అంబటి అనుదీప్ కి సంతాపం తెలుపుతూ వారి కుటుంబానికి కాపు జే ఏ సి పక్షాన సానుభూతిని తెలియ చేశారు.
అనుదీప్ ది హత్యేనని చా ట్రాయ్ పోలీస్టేషన్ లో తండ్రి అంబటి గోపాలరావు ఫిర్యాదు చేశారు.కానీ స్టేషన్ అధికారులు చర్యలు తీసుకోలేదు 
అనుదీప్ హత్యపై మండల నాయకత్వం,మరియు జనసేన నాయకులు జగన్ రాష్ట్ర కాపు జే ఏ సి నాయకత్వం సంఘటన పై వివరించగా బుధవారం వెంటనే 3 గంటలకు అనుదీప్ నివాసానికి వెళ్లడం జరిగింది.కాపు కుటుంబ సభ్యులు మండల నాయకత్వం 300 మంది రావడం వారందరి ఆవేదన వినడం సమావేశం జరపడం జరిగింది 
అనుదీప్ తండ్రి మాట్లాడుతూ తన కుమారుడిని హతమార్చారని,పోలీస్ యంత్రాంగం పూర్తిగా నేరస్తులకు వంత పాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అదే బాటలో అక్కడ ఉన్న అందరూ స్పష్టం చేయడం జరిగింది.
అనుదీప్ హత్య పై సమగ్ర దర్యాప్తు చేయాలి దోషులను కఠినంగా శిక్షించాలి 
 నేరస్తులకు వంత పాడిన స్టేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలి కుట్రలో భాగస్తులను అరెస్ట్ చేయాలని రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్ధన్ నేడు డిమాండ్ చేశారు.
జిల్లా ఉన్నతాధికారులు ఈ అంశాలపై వెంటనే చర్యలు తీసుకొపోతే రాష్ట్ర కాపు జే ఏ సి  చా ట్రాయ్ లో నిరవధిక నిరసన కార్యక్రమం చేపడుతుందని ప్రకటించారు



జాతీయ ప్రయోజనాల విషయంలో సంయమనం పాటించడం ఒక పరిణతి చెందిన నిర్ణయం - శశి థరూర్..

ఒక ప్రధాన అంతర్జాతీయ అంశంపై బహిరంగంగా స్పందించకపోవడాన్ని బలహీనతగా కాకుండా, వ్యూహాత్మక సంయమనంగా పరిగణించవచ్చు. ఇది సంక్లిష్టమైన భౌగోళిక-రాజకీయ పరిస్థితులలో భారత్ ఒక స్థిరమైన, పరిణతి చెందిన నిర్ణయాన్ని తీసుకుంటుందని చూపిస్తుంది.

ఏదైనా ఒక దేశానికి మద్దతుగా లేదా వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల ఇతర దేశాలతో ఉన్న సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. అలా కాకుండా, సంయమనం పాటించడం ద్వారా అన్ని దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించవచ్చు. ఇది భారతదేశ ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాలకు దోహదపడుతుంది.

ఏదైనా ఒక సమస్యపై త్వరితగతిన స్పందించడం వల్ల ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. అలా కాకుండా, చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయడం వల్ల అంతర్జాతీయ శాంతి, భద్రతలను కాపాడవచ్చు. ఇది భారతదేశ సాఫ్ట్ పవర్ ను పెంచుతుంది.

అంతర్జాతీయ అంశాలపై స్పందించే ముందు సమస్యను నిశితంగా పరిశీలించడం, వివిధ కోణాల నుండి ఆలోచించడం, భవిష్యత్తు పరిణామాలను అంచనా వేయడం అవసరం.
భారతదేశ విదేశీ విధానం ఎలా ముందుకు వెళ్లాలో అలానే వెళ్తుందని శశి థరూర్ అభిప్రాయ పడ్డారు..

గల్ఫ్‌లో విషాదం: క్షిపణి దాడిలో మహబూబాబాద్ జిల్లా వాసి మృతి

సౌదీ అరేబియా మరియు ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఒక నిరుపేద కుటుంబంలో తీరని శోకాన్ని నింపాయి. మహబూబాబాద్ జిల్లా, నెల్లికుదురు మండలం, బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామానికి చెందిన రవిగోపాల్ అనే వ్యక్తి సౌదీలో జరిగిన క్షిపణి దాడిలో ప్రాణాలు కోల్పోయారు.

ఉపాధి నిమిత్తం గత కొంతకాలంగా సౌదీ అరేబియాలో పనిచేస్తున్న రవిగోపాల్, ఇరాన్ జరిపిన డ్రోన్ మరియు క్షిపణి దాడుల సమయంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

తమ కుటుంబానికి ఆధారమైన ఇంటి యజమానిని కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామస్తులు, బంధువులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

 
గద్వాల్: పంచాయతీ కార్యదర్శికి ఏసీబీ షాక్

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్లాస్పురం పంచాయతీ కార్యదర్శి రంగన్న, పేద లబ్ధిదారుడికి మంజూరైన ఇందిరమ్మ ఇంటికి క్లియరెన్స్ ఇవ్వడానికి రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో, ఏసీబీ అధికారులు రంగన్నను ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో రూ.15 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పేదలకు అందాల్సిన పథకాల విషయంలో లంచం అడిగితే సహించేది లేదని ఏసీబీ అధికారులు తెలిపారు.

హైవేలపై ఫాస్టాగ్ ఉపయోగించకపోతే రెట్టింపు ఫైన్..

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. టోల్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ
సవరించిన 'జాతీయ రహదారి రుసుము
నిబంధనలు-2026'ను మార్చి 17 నుండి అమలులోకి తెచ్చింది. ఇకపై ఫాస్టాగ్ (FASTag) లేకుండా లేదా టోల్ చెల్లించకుండా వెళ్లే వాహనదారులకు నేరుగా ఇ-నోటీసులు
పంపబడతాయి. టోల్ చెల్లించకపోతే, యజమానికి 72 గంటల్లోపు చెల్లించకపోతే, ఆ మొత్తం టోల్ చెక్కు రెట్టింపు చేస్తారు.


 
పేదల కోసం మెగాస్టార్ గొప్ప నిర్ణయం! 

పేదవారికి ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్నట్టు Chiranjeevi తెలిపారు. ఉగాది సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

“ఒక కుటుంబంలో ఒక్కరు చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం ఎదుగుతుంది. అందుకే పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలనుకుంటున్నాను” అని అన్నారు.

ఇదే సమయంలో తమిళ హీరో Suriya నిర్వహిస్తున్న Agaram Foundation కార్యక్రమాలు తనకు స్ఫూర్తినిచ్చాయని చెప్పారు. “సూర్య గారు నన్నే ఇన్‌స్పిరేషన్ అంటారు… కానీ నిజానికి ఆయన చేస్తున్న సేవలు నాకు ప్రేరణ” అని మెగాస్టార్ పేర్కొన్నారు.

సమాజానికి ఉపయోగపడే ఇలాంటి నిర్ణయాలు మరెంతో మందికి స్ఫూర్తి కావాలి!

ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే లైసెన్స్ లేదా ఆర్సీ సీజ్

కొత్త నిబంధనలతో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్న తెలంగాణ ప్రభుత్వం 

చలాన్ వచ్చిన 45 రోజుల్లో వాహనదారులు ఫిర్యాదు చేసి తమ అభ్యంతరాలను తెలిపేందుకు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న పోలీస్ యంత్రాంగం

వాహనదారుడి ఫిర్యాదును పరిశీలించి, అధికారులు నిర్ణయం తీసుకున్నాక, ఆ నిర్ణయానికి అంగీకరిస్తే 30 రోజుల్లో చలాన్ కట్టాలని, లేదంటే 50% చలాన్ కట్టి కోర్టుకు వెళ్లొచ్చని, కోర్టుకు వెళ్లకపోతే చలాన్ కట్టడానికి 15 రోజులు గడువు ఇచ్చేవిధంగా నిబంధనలు అమలు చేసేలా ప్రణాళికకు పోలీస్ శాఖ ఏర్పాట్లు

ఫిర్యాదు గురించి పూర్తి పరిష్కారం లభించినా కూడా చలాన్ కట్టకపోతే లైసెన్స్, ఆర్సీ సీజ్ అవ్వడమే కాకుండా, వాహనానికి సంబంధించిన అన్ని ఆర్టీఏ సేవలు డీ–యాక్టివేట్ అయ్యేలా, చలాన్ చెల్లిస్తేనే ఆర్టీఏ సేవలు తిరిగి యాక్టివేట్ అయ్యేలా నిబంధనలు

ఈ అంశంపై త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్న పోలీస్ శాఖ అధికారులు



గ్యాస్ బుకింగ్ పేరుతో కొత్త మోసం.. వాట్సాప్‌లో వచ్చే ఫైల్స్‌తో జాగ్రత్త!

ఎల్పీజీ గ్యాస్ బుకింగ్స్ పేరుతో కొత్త తరహా సైబర్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. ‘GAS BILL UPDATE APK’ వంటి హానికరమైన ఫైల్స్‌ను వాట్సాప్ ద్వారా పంపి వినియోగదారులను మోసం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం గురువారం ఓ ప్రకటనలో హెచ్చరించింది. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇలాంటి అనుమానాస్పద ఫైల్స్‌ను, అప్లికేషన్లను ఎట్టిపరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ లేదా ఇన్‌స్టాల్ చేయవద్దని అధికారులు తెలిపారు. వీటి ద్వారా సైబర్ నేరగాళ్లు వినియోగదారుల వ్యక్తిగత డేటా, బ్యాంకు ఖాతాల వివరాలను దొంగిలించే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. గ్యాస్ బుకింగ్స్ కోసం కేవలం అధికారిక ప్లాట్‌ఫామ్స్‌ను మాత్రమే ఉపయోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు, దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు అవసరమైన ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. గ్యాస్ కొరతపై వదంతులు నమ్మవద్దని, ఆందోళనతో సిలిండర్లు బుక్ చేసుకోవద్దని కోరింది. గ్యాస్ సరఫరాను నిరంతరాయంగా కొనసాగించేందుకు పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకసారి బుకింగ్ చేసుకునేలా విరామాన్ని సవరించారు.

గ్యాస్‌పై ఒత్తిడి తగ్గించేందుకు కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అలాగే, కొత్త పీఎన్ జీ కనెక్షన్లను ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించింది. మొత్తం మీద గ్యాస్ సరఫరాకు ఢోకా లేదని భరోసా ఇస్తూనే, సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం ప్రజలను కోరుతోంది.


అక్షర చిట్‌ఫండ్‌ ఛైర్మన్‌ అరెస్టు శ్రీనివాసరావు

ఆదిలాబాద్‌: చిట్టీల పేరిట డిపాజిట్లు సేకరించి మోసానికి పాల్పడిన అక్షర చిట్‌ఫండ్‌ ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పేరాల శ్రీనివాసరావును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్‌ ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ వెల్లడించారు.

హనుమకొండ జిల్లా వడ్డెపల్లికి చెందిన శ్రీనివాసరావు 2009లో సొంతంగా చిట్‌ఫండ్‌ వ్యాపారం మొదలుపెట్టారు. 

రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిట్టీ స్కీంలను ప్రారంభించారు.వందల మంది నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించారు. 

గడువు ముగిసిన తర్వాత ఖాతాదారులకు తిరిగి డబ్బులు చెల్లించకుండా ఆర్థిక మోసాలకు పాల్పడ్డారు. 

ఆదిలాబాద్‌ టూటౌన్‌ పరిధిలోనే 12 కేసులు నమోదవగా బాధితులకు రూ.1.11కోట్లు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో 96 చీటింగ్‌ కేసులు నమోదు కావటంతో ఆరు నెలలుగా తప్పించుకు తిరుగుతున్నారు. 

పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఆదిలాబాద్‌లో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు.శ్రీనివాసరావుకు కరీంనగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్నాయని.. వాటిలో ఇప్పటికే కొన్ని జప్తు కాగా మిగతా వాటిని కూడా చట్టపరంగా జప్తునకు చర్యలు తీసుకుంటామన్నారు.

*భద్రాచలం:గోదావరి నదిలో స్నానానికి వెళ్లినవారిలో ఐదుగురు యువకులు గల్లంతుకాగా.. వారిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.*

ఈ ఘటన శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సరిహద్దు ప్రాంతం కూనవరంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. అమరావతిలోని ఎస్ఆర్ఎం కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న ఏడుగురు విద్యార్థులు కూనవరం రోడ్డులోని గోదావరి నదిలో స్నానాలు చేసేందుకు దిగారు. నది లోతు తెలియకపోవడంతో ప్రమాదవశాత్తూ వారిలో ఐదుగురు యువకులు గల్లంతవగా, మిగిలిన ఇద్దరు ఒడ్డుకు చేరుకొన్నారు. గమనించిన స్థానికులు వారికోసం బోట్లపై వెళ్లి గాలింపు చర్యలు చేపట్టగా.. చారుగుండ్ల శ్రీకర్ (భద్రాచలం), పొడిచేటి అభిరామ్ (భద్రాచలం), నవదీప్ (ఉయ్యూరు) మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరు గోక తేజ (ఉయ్యూరు), పాశం సతీష్ కుమార్ (మదనపల్లి) కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

*మంత్రి తుమ్మల దిగ్భ్రాంతి*

గోదావరి ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాలింపు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

భవిష్యత్లో గోదావరి పరివాహక ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని రెవెన్యూ, పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు.