kapunews



TRENDING NOW



బాపూజీ వృద్ధాశ్రమంలో అన్నదానం
యషిక క్షేత్ర పుట్టినరోజు వేడుకలు

చిలకలూరిపేట:

పట్టణానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గోవిందు శంకర శ్రీనివాసన్ తన మనవరాలు యషిక క్షేత్ర పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా స్థానిక చీరాల రోడ్డులో ఉన్న బాపూజీ వృద్ధాశ్రమంలో ఘనంగా అన్నదానం నిర్వహించారు.
ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆశ్రమంలోని వృద్ధులను గోవిందు శంకర శ్రీనివాసన్ స్వయంగా పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన మిత్రులతో కలిసి వృద్ధులకు స్వయంగా భోజనం వడ్డించి సేవాభావాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుమారుడు వెంకట సత్య సాయి కిరణ్ మరియు డాక్టర్ గోవిందు తేజస్విని దంపతుల కుమార్తె అయిన యషిక క్షేత్ర పుట్టినరోజును గౌరవ వృద్ధుల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.వృద్ధుల ఆశీస్సులు చిన్నారి భవిష్యత్తుకు మేలుకలిగిస్తాయని, అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. వృద్ధులందరూ యషిక క్షేత్రను ఆశీర్వదించాలని కోరారు.వృద్ధులను ఆదరించి అక్కున చేర్చుకుంటున్న బాపూజీ వృద్ధాశ్రమం నిర్వాహకులు మురికిపూడి ప్రసాద్, ఆరాధ్యుల రామకృష్ణలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ ఎల్ఐసి ఏజెంట్ అల్లిమియా, షబ్బీర్, తోట లక్ష్మీనారాయణ, వట్టెం శ్రీనివాసరావు, నిమ్మల మురళీకృష్ణ తదితరులు పాల్గొని యషిక క్షేత్రకు శుభాకాంక్షలు తెలియజేశారు.



అనుదీప్ హత్య పై విచారణ జరపాలి హంతకులను అరెస్ట్ చేయాలి - చందు జనార్దన్ 

కుట్ర దారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి -
లేని పక్షం లో చాట్రాయ్ లో నిరవధిక నిరసన చేస్తా—రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్

అంబటి అనుదీప్ హత్య పై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేసిన రాష్ట్ర కాపు జే ఏ సీ అధ్యక్షులు చందు జనార్ధన్.శనివారం విజయవాడ లో ఆయన కాపు జే ఏ సి కార్యాలయం లో  మాట్లాడుతు నూజివీడు నియోజక వర్గం లో చా ట్రాయ్ లో కాపు కుటుంబ సభ్యుడైన అంబటి అనుదీప్ మరణం హత్యేనని మండలం అంతా ఘోషిస్తువుంటే స్థానిక స్టేషన్ అధికారులు చోద్యం చూస్తున్నారని చందు జనార్దన్ ఆరోపించారు.ఈరోజు చట్రాయ్ లో అనుదీప్ యొక్క దశదినకర్మ ను కుటుంబం నిర్వహించిందని అంబటి అనుదీప్ కి సంతాపం తెలుపుతూ వారి కుటుంబానికి కాపు జే ఏ సి పక్షాన సానుభూతిని తెలియ చేశారు.
అనుదీప్ ది హత్యేనని చా ట్రాయ్ పోలీస్టేషన్ లో తండ్రి అంబటి గోపాలరావు ఫిర్యాదు చేశారు.కానీ స్టేషన్ అధికారులు చర్యలు తీసుకోలేదు 
అనుదీప్ హత్యపై మండల నాయకత్వం,మరియు జనసేన నాయకులు జగన్ రాష్ట్ర కాపు జే ఏ సి నాయకత్వం సంఘటన పై వివరించగా బుధవారం వెంటనే 3 గంటలకు అనుదీప్ నివాసానికి వెళ్లడం జరిగింది.కాపు కుటుంబ సభ్యులు మండల నాయకత్వం 300 మంది రావడం వారందరి ఆవేదన వినడం సమావేశం జరపడం జరిగింది 
అనుదీప్ తండ్రి మాట్లాడుతూ తన కుమారుడిని హతమార్చారని,పోలీస్ యంత్రాంగం పూర్తిగా నేరస్తులకు వంత పాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అదే బాటలో అక్కడ ఉన్న అందరూ స్పష్టం చేయడం జరిగింది.
అనుదీప్ హత్య పై సమగ్ర దర్యాప్తు చేయాలి దోషులను కఠినంగా శిక్షించాలి 
 నేరస్తులకు వంత పాడిన స్టేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలి కుట్రలో భాగస్తులను అరెస్ట్ చేయాలని రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్ధన్ నేడు డిమాండ్ చేశారు.
జిల్లా ఉన్నతాధికారులు ఈ అంశాలపై వెంటనే చర్యలు తీసుకొపోతే రాష్ట్ర కాపు జే ఏ సి  చా ట్రాయ్ లో నిరవధిక నిరసన కార్యక్రమం చేపడుతుందని ప్రకటించారు



జాతీయ ప్రయోజనాల విషయంలో సంయమనం పాటించడం ఒక పరిణతి చెందిన నిర్ణయం - శశి థరూర్..

ఒక ప్రధాన అంతర్జాతీయ అంశంపై బహిరంగంగా స్పందించకపోవడాన్ని బలహీనతగా కాకుండా, వ్యూహాత్మక సంయమనంగా పరిగణించవచ్చు. ఇది సంక్లిష్టమైన భౌగోళిక-రాజకీయ పరిస్థితులలో భారత్ ఒక స్థిరమైన, పరిణతి చెందిన నిర్ణయాన్ని తీసుకుంటుందని చూపిస్తుంది.

ఏదైనా ఒక దేశానికి మద్దతుగా లేదా వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల ఇతర దేశాలతో ఉన్న సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. అలా కాకుండా, సంయమనం పాటించడం ద్వారా అన్ని దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించవచ్చు. ఇది భారతదేశ ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాలకు దోహదపడుతుంది.

ఏదైనా ఒక సమస్యపై త్వరితగతిన స్పందించడం వల్ల ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. అలా కాకుండా, చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయడం వల్ల అంతర్జాతీయ శాంతి, భద్రతలను కాపాడవచ్చు. ఇది భారతదేశ సాఫ్ట్ పవర్ ను పెంచుతుంది.

అంతర్జాతీయ అంశాలపై స్పందించే ముందు సమస్యను నిశితంగా పరిశీలించడం, వివిధ కోణాల నుండి ఆలోచించడం, భవిష్యత్తు పరిణామాలను అంచనా వేయడం అవసరం.
భారతదేశ విదేశీ విధానం ఎలా ముందుకు వెళ్లాలో అలానే వెళ్తుందని శశి థరూర్ అభిప్రాయ పడ్డారు..

గల్ఫ్‌లో విషాదం: క్షిపణి దాడిలో మహబూబాబాద్ జిల్లా వాసి మృతి

సౌదీ అరేబియా మరియు ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఒక నిరుపేద కుటుంబంలో తీరని శోకాన్ని నింపాయి. మహబూబాబాద్ జిల్లా, నెల్లికుదురు మండలం, బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామానికి చెందిన రవిగోపాల్ అనే వ్యక్తి సౌదీలో జరిగిన క్షిపణి దాడిలో ప్రాణాలు కోల్పోయారు.

ఉపాధి నిమిత్తం గత కొంతకాలంగా సౌదీ అరేబియాలో పనిచేస్తున్న రవిగోపాల్, ఇరాన్ జరిపిన డ్రోన్ మరియు క్షిపణి దాడుల సమయంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

తమ కుటుంబానికి ఆధారమైన ఇంటి యజమానిని కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామస్తులు, బంధువులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

 
గద్వాల్: పంచాయతీ కార్యదర్శికి ఏసీబీ షాక్

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్లాస్పురం పంచాయతీ కార్యదర్శి రంగన్న, పేద లబ్ధిదారుడికి మంజూరైన ఇందిరమ్మ ఇంటికి క్లియరెన్స్ ఇవ్వడానికి రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో, ఏసీబీ అధికారులు రంగన్నను ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో రూ.15 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పేదలకు అందాల్సిన పథకాల విషయంలో లంచం అడిగితే సహించేది లేదని ఏసీబీ అధికారులు తెలిపారు.

హైవేలపై ఫాస్టాగ్ ఉపయోగించకపోతే రెట్టింపు ఫైన్..

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. టోల్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ
సవరించిన 'జాతీయ రహదారి రుసుము
నిబంధనలు-2026'ను మార్చి 17 నుండి అమలులోకి తెచ్చింది. ఇకపై ఫాస్టాగ్ (FASTag) లేకుండా లేదా టోల్ చెల్లించకుండా వెళ్లే వాహనదారులకు నేరుగా ఇ-నోటీసులు
పంపబడతాయి. టోల్ చెల్లించకపోతే, యజమానికి 72 గంటల్లోపు చెల్లించకపోతే, ఆ మొత్తం టోల్ చెక్కు రెట్టింపు చేస్తారు.


 
పేదల కోసం మెగాస్టార్ గొప్ప నిర్ణయం! 

పేదవారికి ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్నట్టు Chiranjeevi తెలిపారు. ఉగాది సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

“ఒక కుటుంబంలో ఒక్కరు చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం ఎదుగుతుంది. అందుకే పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలనుకుంటున్నాను” అని అన్నారు.

ఇదే సమయంలో తమిళ హీరో Suriya నిర్వహిస్తున్న Agaram Foundation కార్యక్రమాలు తనకు స్ఫూర్తినిచ్చాయని చెప్పారు. “సూర్య గారు నన్నే ఇన్‌స్పిరేషన్ అంటారు… కానీ నిజానికి ఆయన చేస్తున్న సేవలు నాకు ప్రేరణ” అని మెగాస్టార్ పేర్కొన్నారు.

సమాజానికి ఉపయోగపడే ఇలాంటి నిర్ణయాలు మరెంతో మందికి స్ఫూర్తి కావాలి!

ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే లైసెన్స్ లేదా ఆర్సీ సీజ్

కొత్త నిబంధనలతో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్న తెలంగాణ ప్రభుత్వం 

చలాన్ వచ్చిన 45 రోజుల్లో వాహనదారులు ఫిర్యాదు చేసి తమ అభ్యంతరాలను తెలిపేందుకు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న పోలీస్ యంత్రాంగం

వాహనదారుడి ఫిర్యాదును పరిశీలించి, అధికారులు నిర్ణయం తీసుకున్నాక, ఆ నిర్ణయానికి అంగీకరిస్తే 30 రోజుల్లో చలాన్ కట్టాలని, లేదంటే 50% చలాన్ కట్టి కోర్టుకు వెళ్లొచ్చని, కోర్టుకు వెళ్లకపోతే చలాన్ కట్టడానికి 15 రోజులు గడువు ఇచ్చేవిధంగా నిబంధనలు అమలు చేసేలా ప్రణాళికకు పోలీస్ శాఖ ఏర్పాట్లు

ఫిర్యాదు గురించి పూర్తి పరిష్కారం లభించినా కూడా చలాన్ కట్టకపోతే లైసెన్స్, ఆర్సీ సీజ్ అవ్వడమే కాకుండా, వాహనానికి సంబంధించిన అన్ని ఆర్టీఏ సేవలు డీ–యాక్టివేట్ అయ్యేలా, చలాన్ చెల్లిస్తేనే ఆర్టీఏ సేవలు తిరిగి యాక్టివేట్ అయ్యేలా నిబంధనలు

ఈ అంశంపై త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్న పోలీస్ శాఖ అధికారులు



గ్యాస్ బుకింగ్ పేరుతో కొత్త మోసం.. వాట్సాప్‌లో వచ్చే ఫైల్స్‌తో జాగ్రత్త!

ఎల్పీజీ గ్యాస్ బుకింగ్స్ పేరుతో కొత్త తరహా సైబర్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. ‘GAS BILL UPDATE APK’ వంటి హానికరమైన ఫైల్స్‌ను వాట్సాప్ ద్వారా పంపి వినియోగదారులను మోసం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం గురువారం ఓ ప్రకటనలో హెచ్చరించింది. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇలాంటి అనుమానాస్పద ఫైల్స్‌ను, అప్లికేషన్లను ఎట్టిపరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ లేదా ఇన్‌స్టాల్ చేయవద్దని అధికారులు తెలిపారు. వీటి ద్వారా సైబర్ నేరగాళ్లు వినియోగదారుల వ్యక్తిగత డేటా, బ్యాంకు ఖాతాల వివరాలను దొంగిలించే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. గ్యాస్ బుకింగ్స్ కోసం కేవలం అధికారిక ప్లాట్‌ఫామ్స్‌ను మాత్రమే ఉపయోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు, దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు అవసరమైన ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. గ్యాస్ కొరతపై వదంతులు నమ్మవద్దని, ఆందోళనతో సిలిండర్లు బుక్ చేసుకోవద్దని కోరింది. గ్యాస్ సరఫరాను నిరంతరాయంగా కొనసాగించేందుకు పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకసారి బుకింగ్ చేసుకునేలా విరామాన్ని సవరించారు.

గ్యాస్‌పై ఒత్తిడి తగ్గించేందుకు కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అలాగే, కొత్త పీఎన్ జీ కనెక్షన్లను ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించింది. మొత్తం మీద గ్యాస్ సరఫరాకు ఢోకా లేదని భరోసా ఇస్తూనే, సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం ప్రజలను కోరుతోంది.


అక్షర చిట్‌ఫండ్‌ ఛైర్మన్‌ అరెస్టు శ్రీనివాసరావు

ఆదిలాబాద్‌: చిట్టీల పేరిట డిపాజిట్లు సేకరించి మోసానికి పాల్పడిన అక్షర చిట్‌ఫండ్‌ ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పేరాల శ్రీనివాసరావును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్‌ ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ వెల్లడించారు.

హనుమకొండ జిల్లా వడ్డెపల్లికి చెందిన శ్రీనివాసరావు 2009లో సొంతంగా చిట్‌ఫండ్‌ వ్యాపారం మొదలుపెట్టారు. 

రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిట్టీ స్కీంలను ప్రారంభించారు.వందల మంది నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించారు. 

గడువు ముగిసిన తర్వాత ఖాతాదారులకు తిరిగి డబ్బులు చెల్లించకుండా ఆర్థిక మోసాలకు పాల్పడ్డారు. 

ఆదిలాబాద్‌ టూటౌన్‌ పరిధిలోనే 12 కేసులు నమోదవగా బాధితులకు రూ.1.11కోట్లు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో 96 చీటింగ్‌ కేసులు నమోదు కావటంతో ఆరు నెలలుగా తప్పించుకు తిరుగుతున్నారు. 

పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఆదిలాబాద్‌లో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు.శ్రీనివాసరావుకు కరీంనగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్నాయని.. వాటిలో ఇప్పటికే కొన్ని జప్తు కాగా మిగతా వాటిని కూడా చట్టపరంగా జప్తునకు చర్యలు తీసుకుంటామన్నారు.

*భద్రాచలం:గోదావరి నదిలో స్నానానికి వెళ్లినవారిలో ఐదుగురు యువకులు గల్లంతుకాగా.. వారిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.*

ఈ ఘటన శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సరిహద్దు ప్రాంతం కూనవరంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. అమరావతిలోని ఎస్ఆర్ఎం కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న ఏడుగురు విద్యార్థులు కూనవరం రోడ్డులోని గోదావరి నదిలో స్నానాలు చేసేందుకు దిగారు. నది లోతు తెలియకపోవడంతో ప్రమాదవశాత్తూ వారిలో ఐదుగురు యువకులు గల్లంతవగా, మిగిలిన ఇద్దరు ఒడ్డుకు చేరుకొన్నారు. గమనించిన స్థానికులు వారికోసం బోట్లపై వెళ్లి గాలింపు చర్యలు చేపట్టగా.. చారుగుండ్ల శ్రీకర్ (భద్రాచలం), పొడిచేటి అభిరామ్ (భద్రాచలం), నవదీప్ (ఉయ్యూరు) మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరు గోక తేజ (ఉయ్యూరు), పాశం సతీష్ కుమార్ (మదనపల్లి) కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

*మంత్రి తుమ్మల దిగ్భ్రాంతి*

గోదావరి ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాలింపు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

భవిష్యత్లో గోదావరి పరివాహక ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని రెవెన్యూ, పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు.

పదవీకాలం పొడిగించమని బీసీసీఐని కోరిన అజిత్ అగార్కర్

భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తన పదవీకాలాన్ని 2027 వన్డే ప్రపంచకప్ వరకు పొడిగించాలని బీసీసీఐని కోరినట్లు సమాచారం. 2023లో బాధ్యతలు చేపట్టిన అగార్కర్ హయాంలో టీమిండియా అద్భుత విజయాలు సాధించింది. గత మూడేళ్లలో నాలుగు ఐసీసీ ఫైనల్స్ కు చేరగా అందులో మూడు సార్లు(టీ20 వరల్డ్ కప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025, టీ20 వరల్డ్ కప్ 2026) విజేతగా నిలిచింది.
ఈవిజయాల నేపథ్యం లోనే ఆయన తన సేవలను కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు
తెలుస్తోంది.



దేశంలోనే తొలి 'ఆల్-ఉమెన్' రైల్వే స్టేషన్.. ఎక్కడంటే..?

ముంబైలోని మాటుంగా రైల్వే స్టేషన్ దేశంలోనే తొలి 'ఆల్-ఉమెన్' స్టేషన్గా అరుదైన రికార్డు సృష్టించింది. ఇక్కడ స్టేషన్ మాస్టర్ నుండి పాయింట్మెన్ వరకు మొత్తం 41 మంది సిబ్బంది మహిళలే కావడం విశేషం. మహిళా సాధికారతకు చిహ్నంగా 2017లో ప్రారంభమైన ఈ ప్రయోగాన్ని గుర్తిస్తూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్-2018లో చోటు కల్పించారు. రైల్వే విధులను సైతం మహిళలు సమర్థవంతంగా నిర్వహించగలరని మాటుంగా రైల్వే స్టేషన్ నిరూపిస్తోంది.

నిర్మాణ రంగానికి షాక్.. పెరగనున్న సిమెంట్ ధరలు!

ముడి చమురు ధరలు పెరగడం వల్ల మార్చి చివరిలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో సిమెంట్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని 'నువామా' నివేదిక వెల్లడించింది. పెట్ కోక్ ధరలు, ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడమే దీనికి ప్రధాన కారణమని డీలర్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్చిలో ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, ఏప్రిల్ నుంచి కంపెనీలు భారాన్ని పెంచనున్నాయి.



సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జాతీయ  కార్యదర్శిగా నియమితులైన సింగరేసు పోలయ్య


 సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన జాతీయ  కార్యదర్శిగా నియమితులైన సింగరేసు పోలయ్య . జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా సింగరేసు పోలయ్య తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన సింగరేసు పోలయ్య.

 సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన సింగరేసు పోలయ్య.

 అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన సింగరేసు పోలయ్య.

 సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన జాతీయ  కార్యదర్శి సింగరేసు పోలయ్య .
 హిందువులకు ఆరాధ్య దైవం అయిన గోమాతను సంరక్షించుకునే బాధ్యతలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి సింగరేణి పోలయ్య అన్నారు.