kapunews



TRENDING NOW



శావల్యాపురం మండలంలో జనతా వారది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

 కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశ నిర్దేశం మేరకు,రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్, శావల్యాపుర మండల సీనియర్ నాయకులు శ్రీ అసుమల్లి వీరేంద్ర గారు ,ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు ,వినుకొండ నియోజకవర్గం మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు, ఈరోజు జనతా వారధి కార్యక్రమాన్ని శావల్యాపురం మండల పరిధిలోని బొందిని పాలెం గ్రామంలో మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక బిజెపి నేత రావినూతల ఆదాం నిర్వహణలో చేయడం జరిగింది, కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు ఎనిమిది దరఖాస్తులు ఇవ్వడం జరిగింది పంచాయతీ ఆఫీస్ నుండి స్మశానానికి వెళ్లే రహదారిని సిసి రోడ్డు వేయించాలని, అలాగే గ్రామంలో ఉన్నటువంటి రహదారులకు సైట్ డ్రైనేజీలు నిర్మించాలని,అలాగే గత 17 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్నటువంటి రక్షిత మంచినీటి పథకానికి ,నిధులు మంజూరు చేయాలని, రైతు భరోసా,కిసాన్ సమ్మాన్ నిధి  అమలు కొరకు రైతులు దరఖాస్తులు ఇచ్చారు.వీటి పరిష్కారం కొరకై  బిజెపిపార్టీ తమవంతు ప్రయత్నం చేస్తుందని దరఖాస్తుదారులకు చెప్పడం జరిగింది

భారతీయ న్యాయ సంహిత (BNS) లోని పవర్‌ఫుల్ సెక్షన్ 248 గురించి తెలుసుకుందాం

- *సెక్షన్ 248*: ఎవరైనా తప్పుడు కేసు పెట్టినప్పుడు లేదా అన్యాయంగా మీపై నేరం మోపినప్పుడు, మీరు కూడా వారి మీద కేసు వేయడానికి ఈ సెక్షన్ మీకు హక్కు ఇస్తుంది.
- *శిక్ష*: మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టారని మీరు నిరూపించగలిగితే, ఎదురు వ్యక్తిపై కేసు వేసి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేలా చేయవచ్చు.
- *పరిహారం*: ఈ కేసు మీరు గెలిస్తే, మీపై పెట్టిన ఫేక్ కేసు వల్ల మీకు జరిగిన నష్టం, అవమానం కోసం పరిహారం కూడా పొందవచ్చు.

 *సెక్షన్ 248 ఎప్పుడు వర్తిస్తుంది?*

- మీపై ఎవరైనా తప్పుడు కేసు పెట్టినప్పుడు.
- మీపై ఎవరైనా అన్యాయంగా నేరం మోపినప్పుడు.
- మీకు ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టినప్పుడు.

సెక్షన్ 248 ఎలా వినియోగించాలి?

- మీరు పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
- మీపై పెట్టిన కేసు తప్పుదని నిరూపించడానికి ఆధారాలు సేకరించాలి.
- న్యాయస్థానంలో మీ కేసు వాదించాలి.

సెక్షన్ 248 వల్ల ప్రయోజనాలు:

- తప్పుడు కేసుల నుండి మీరు రక్షించబడతారు.
- మీపై పెట్టిన కేసు వల్ల మీకు జరిగిన నష్టం, అవమానం కోసం పరిహారం పొందవచ్చు.
- నేరస్థులకు తగిన శిక్ష పడుతుంది.
- *తప్పుడు కేసు*: మీపై ఎవరైనా తప్పుడు కేసు పెట్టినట్లయితే, మీరు సెక్షన్ 248 కింద కేసు వేయవచ్చు.
- *ఆధారాలు*: మీపై పెట్టిన కేసు తప్పుదని నిరూపించడానికి ఆధారాలు సేకరించాలి.
- *న్యాయస్థానం*: కేసు న్యాయస్థానంలో వాదించాలి.
- *శిక్ష*: ఎదురు వ్యక్తికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవచ్చు.
- *పరిహారం*: మీకు జరిగిన నష్టం, అవమానం కోసం పరిహారం పొందవచ్చు.

సెక్షన్ 248 వినియోగించడానికి అవసరమైన పత్రాలు:

- ఫిర్యాదు
- ఆధారాలు
- సాక్ష్యాలు
- న్యాయస్థానం ఫీ



రాజమహేంద్రవరంలో నిబంధనలు ఉల్లంఘించిన అంతర్రాష్ట్ర ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.

బుధవారం, గురువారం రెండు రోజుల్లో 5 స్లీపర్ కోచ్ బస్సులను సీజ్ చేశారు.

- ఈ బస్సుల్లో ప్రయాణీకుల భద్రతను పక్కన పెట్టి పలు నిబంధనల ఉల్లంఘనలు జరిగాయన్నారు .
- అదనపు డీజిల్ ట్యాంకులను అక్రమంగా అమర్చడం, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లను లగేజీతో మూసివేయడం, వెనుక ఎమర్జెన్సీ డోర్ లేకపోవడం వంటి లోపాలు బయటపడ్డాయన్నారు.
- సీజ్ చేసిన 5 బస్సులకు సంబంధించి సుమారు ₹2,15,000/- పన్ను మరియు అపరాధ రుసుము బస్సు యజమానులు చెల్లించాల్సి ఉంటుందన్నారు.

జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ హెచ్చరించారు: "నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు."



వాళ్ల డబ్బులు వాళ్లకు ఇవ్వడానికి ఎందుకింత నిర్లక్ష్యం? 

జూన్ 10వ తేదీ లోపు బెనిఫిట్స్ రాలేదని ఒక్క రిటైర్డ్ ఉద్యోగి కూడా చెప్పకూడదు

రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ విషయంలో ఆర్థిక శాఖపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

కాంగ్రెస్ ప్రభుత్వం తమ బెనిఫిట్స్ ఇవ్వడంలేదని, రిటైర్డ్ ఉద్యోగులు వేసిన 754 పిటిషన్ల పట్ల విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు

ఒక్కో పిటీషన్లో దాదాపు ఒకటి నుండి 10 మంది పిటిషనర్లు ఉన్నారని, ఒక్కో పిటీషన్లో ఎంత మందికి బెనిఫిట్స్ ఇచ్చారో పూర్తి నివేదిక అందజేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు

రిటైర్డ్ ఉద్యోగులు చాలా సున్నితంగా ఉంటారని, వారి జీవితాలతో చెలగాటం ఆడొద్దని ఆర్థిక శాఖకు హైకోర్టు హెచ్చరిక

జూన్ 10వ తేదీకి కేసు వాయిదా వేస్తూ, ఆ లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని, తదుపరి విచారణలోగా ఒక్క పిటిషనర్ కూడా బెనిఫిట్స్ రాలేదని చెప్పకూడదని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు...

 
 
పపిల్లల ప్రాణాలతో చెలగాటం: అప్పాపురం అంగన్‌వాడీలో ‘కుళ్ళిన’ దందా!

​గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పాపురం గ్రామం ఎస్సీ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రం పసిపిల్లల పాలిట శాపంగా మారింది. బలవర్థకమైన ఆహారం అందించాల్సిన చోట, కుళ్ళిపోయి కంపు కొడుతున్న కోడిగుడ్లను చిన్నారులకు పెడుతూ అధికారులు వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పౌష్టికాహారం పేరుతో ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతూ, చిన్నారులకు మాత్రం విషతుల్యమైన ఆహారాన్ని అంటగడుతున్న ఈ నిర్లక్ష్యపు తీరుపై తల్లిదండ్రులు నిప్పులు చెరుగుతున్నారు. లాభాల కక్కుర్తితో కాంట్రాక్టర్లు, పర్యవేక్షణ లేని అధికారులు కలిసి చేస్తున్న ఈ ‘కుళ్ళిన’ దందాపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసిపిల్లల నోటికాడ ముద్దను విషం చేస్తున్న ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే, ఈ నిరసన జ్వాలలు మరింత ఉగ్రరూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది.



99, 100వ ఆస్కార్ వేడుకల షెడ్యూల్
విడుదల!

ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ అవార్డుల 99వ వేడుకను 2027 మార్చి 14న, 100వ వేడుకను 2028 మార్చి 5న నిర్వహించనున్నట్లు అకాడమీ ప్రకటించింది. అయితే, 2029 నుండి వేదికను హాలివుడ్లో డాల్బీ థియేటర్ నుంచి పీకాక్ థియేటర్కు మారుస్తున్నట్లు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వెల్లడించింది. అంతేకాకుండా, గ్లోబల్ రీచ్ కోసం దశాబ్దాల టీవీ ప్రసారాలకు స్వస్తి పలికింది. 2029 నుండి నేరుగా యూట్యూబ్లో ప్రసారం చేయాలని నిర్ణయించడం విశేషం.




సంపన్న అభ్యర్థి లీమారోస్.. రూ.1,049 కోట్ల ఆస్తులు

సంపన్న అభ్యర్థి లీమారోస్.. రూ.1,049 కోట్ల ఆస్తులు
తమిళనాడులోని తిరుచ్చి జిల్లా లాల్గుడి నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా లీమారోస్ (58) పోటీ చేస్తున్నారు. ఆమెకు రూ.1,049 కోట్ల ఆస్తులు ఉన్నాయి. లాటరీ టికెట్ల విక్రయ సంస్థ అధినేత మార్టిన్ సతీమణి అయిన లీమారోస్ ఇటీవల అన్నాడీఎంకేలో చేరి బరిలోకి దిగారు. సోమవారం నామినేషన్‌తోపాటు సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను ఆమె వెల్లడించారు. తనకు రూ.139.63 కోట్ల చరాస్తులు, రూ.909.94 కోట్ల స్థిరాస్తులు, రూ.8.57 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు.

4 రాష్ట్రాల ఎన్నికల తర్వాత దేశమంతటా ‘సర్’!

తుది దశ ఓటర్ల జాబితా సవరణ(సర్)ను 4 రాష్ట్రాల ఎన్నికల తర్వాత నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. AP, తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటక సహా 17 రాష్ట్రాలు, 5 UTల్లో ఈ నెల 29 నుంచి చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటిదాకా 10 రాష్ట్రాలు, 3 UTల్లో 'సర్’ పూర్తయింది. అస్సాంలో స్పెషల్ రివిజన్ నిర్వహించారు. మొత్తం 60 కోట్ల మంది ఓటర్ల వివరాలను పరిశీలించారు. తుది దశలో 39 కోట్ల మంది వివరాలు రివ్యూ చేయనున్నారు.

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ సలహాదారులు గా నియమితులైన గోవిందు శంకర్ శ్రీనివాసన్


 సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ సలహాదారులు గా నియమితులైన గోవిందు శంకర్ శ్రీనివాసన్ . జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా గోవిందు శంకర్ శ్రీనివాస్ తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన గోవిందు శంకర్ శ్రీనివాస్.

 సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన గోవిందు శంకర్ శ్రీనివాస్.

 అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన గోవిందు శంకర్ శ్రీనివాస్.

 సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన గోవిందు శంకర్ శ్రీనివాస్ .
 హిందువులకు ఆరాధ్య దైవం అయిన గోమాతను సంరక్షించుకునే బాధ్యతలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ సలహాదారులు గోవిందు శంకర్ శ్రీనివాస్ అన్నారు.

 
 
రవాణా శాఖ లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎన్ఫోర్స్మెంట్ పెంచి ఆదాయాన్ని పెంచాల

*ఆదాయం లో టార్గెట్ రీచ్ అయిన పలు జిల్లాల రవాణా శాఖ అధికారులకు అభినందనలు..*

 *పలువురు అధికారులు పని తీరు మెరుగుపర్చుకోవాలని హెచ్చరిక*

*సారథి 8 నెలల్లోనే దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది.*

*వాహన్ పోర్టల్ డేటా పూర్తిచేసుకొని టెక్నికల్ సమస్యలు లేకుండా చూసుకోవాలి*

*జూన్ 1 కి ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ ప్రారంభించుకునేలా పనులు వేగవంతం చేయాలి*

*AMVI లకు ఇచ్చిన శిక్షణ మాదిరి ఇతర రవాణా శాఖ అధికారులకు విడతల వారిగా శిక్షణ ఇవ్వాలి*

*రోడ్డు ప్రమాద మరణాలు తగ్గించడానికి రహవీర్ స్కీమ్, క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పై ప్రజలకు అవగాహన కల్పించాలి*

*17 జిల్లాలో రవాణా శాఖ కార్యాలయాలకు స్థలాలను గుర్తించాలి*

*అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి*

 *- రవాణా శాఖ రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్*

రవాణా శాఖ లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎన్ఫోర్స్మెంట్ బలోపేతం చేస్తూ ఆదాయాన్ని పెంచుకునేలా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో రవాణా శాఖ అధికారులతో రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. 2024-25 లో రవాణా శాఖ 6910.90 కోట్లు ఆదాయం వసూలు కాగా ,2025-26 లో 7097 .38 కోట్లు వసూలు చేయడం జరిగింది. ఈవీ పాలసీ ద్వారా రవాణా శాఖ ఆదాయం కొంతమేర తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. తగ్గిన ఆదాయాన్ని ఎన్ఫోర్స్మెంట్ బలోపేతం చేస్తూ ఆదాయ మార్గాలు పెంచుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో ఇచ్చిన టార్గెట్ రీచ్ అయి లైఫ్ టాక్స్ ,త్రైమాసిక టాక్స్ వసూలు లో మంచి పనితీరు కనబరచిన అధికారులను అభినందించారు.  పలువురు అధికారులకు పనితీరు మెరుగు పరచుకోవాలని హెచ్చరించారు. 

నిజామాబాద్ - మహారాష్ట్ర , ఆదిలాబాద్ - మహారాష్ట్ర,  మెదక్ - కర్ణాటక  తదితర సరిహద్దు జిల్లాల రవాణా శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్టీవో కార్యాలయాల్లో పెండింగ్ లైసెన్స్ ఇతర పౌర సేవలకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.  రవాణా శాఖ లో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నాయి రవాణా సేవలు పారదర్శకంగా సమర్థవంతంగా వాహనదారులకు అందేలా డీలర్ల వద్ద వాహనాల రిజిస్ట్రేషన్ జరుగుతుందనీ రిజిస్టేషన్ విషయంలో వాహనదారులకు ఇబ్బందులు లేకుండా రవాణా శాఖ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. వాహన్ పోర్టల్ ద్వారా సేవలు డేటా పూర్తిచేసుకొని టెక్నికల్ సమస్యలు లేకుండా చూసుకోవాలని తెలిపారు. సారథి అమలులోకి వచ్చిన తర్వాత 8 నెలల్లోనే దేశంలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. ఏఎంవీఐ లకు ఇచ్చిన శిక్షణ మాదిరి ఇతర రవాణా శాఖ అధికారులకు విడతల వారిగా శిక్షణ ఇవ్వాలనీ అధికారులకు సూచించారు.రవాణా శాఖ గౌరవాన్ని పెంపొందించేలా అధికారులు పని చేయాలని సూచించారు. రవాణా శాఖ లో తమ పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలు పూర్తి చేసి ఇతర సమస్యలు కమిషనర్ లేదా తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఈనెల 13 నుండి నిర్వహించే అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని పోలీస్ ,రవాణా శాఖ సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో అతి వేగం ,మద్యం సేవించి వాహనాలు నడపడం,ఆటో ల ఓవర్ లోడ్  ,సీటు బెల్టు పెట్టుకోకపోవడం , హెల్మెట్ లేకపోవడం లాంటి వల్ల మరణాలు సంభవిస్తున్నాయని వాటిపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈనెల 13-18 మధ్య అరైవ్ అలైవ్ కార్యక్రమంలో 15 నుండి 18 వ తేదీ మధ్యలో ఉమ్మడి జిల్లాల వారిగా రవాణా శాఖ మంత్రి గా తను ,ఆర్టీసీ ఎండీ , డీజీపీ,రవాణా శాఖ కమిషనర్ సంయుక్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో 37 ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ మంజూరు అయ్యాయని జూన్ 1 న తొలి టెస్టింగ్ స్టేషన్ ప్రారంభించుకునేలా పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సంవత్సరం రోడ్డు భద్రతా మాసోత్సవాలు బాగా జరిగాయని కేంద్ర ప్రభుత్వం కూడా అభినందించిందని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్ ల ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి రేడియం రిఫ్లెక్టివ్ ను కచ్చితత్వం చేయాలన్నారు. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ కోసం కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం దాదాపు ఈవీ పాలసీ తీసుకొచ్చిందని ఇప్పటి వరకు దాదాపు వెయ్యి కోట్లు టాక్స్ మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్క్రాపెజ్ పాలసీ తీసుకొచ్చిందని ఇప్పుడు రాష్ట్రంలో మూడు కేంద్రాలు ఉండగా జిల్లా కేంద్రానికి ఒక ఆర్వీఎస్ఎఫ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వెహికిల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ నిర్భయ ఫ్రేమ్ అందుబాటులోకి రానుందని తెలిపారు.


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రహవీర్ స్కీమ్ , క్యాష్ లెస్ ట్రీట్మెంట్ లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు అత్యవసరంగా హాస్పిటల్ కి తీసుకెళ్లిన వారికి రహవీర్ అవార్డు కింద 25 వేలు బహుమతి అందించనున్నారు. రహవీర్ అమలులోకి వచ్చిన తర్వాత తొలి రహవీర్ నల్గొండ జిల్లాకు చెందిన గణపతి వెంకన్న కి 25 వేల రూపాయల చెక్కు ఇచ్చి అభినందించారు. Pm rahath కింద రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు లక్షా 50 వేల రూపాయల వరకు ఉచిత చికిత్స అందించవచ్చని ప్రజలకు వీటిపై విసృత అవగాహన కల్పించాలని సూచించారు.ఇప్పటి వరకు 25 ప్రాంతాల్లో రవాణా శాఖకు స్థలాలు ఉన్నాయని 17 జిల్లాల్లో రవాణా శాఖ కార్యాలయాలకు స్థలాలు గుర్తించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకోవాలని ఆదేశించారు. రవాణా శాఖ కార్యాలయాల్లో డ్రైవింగ్ లైసెన్స్,ఆర్సీ పెండింగ్ కార్డులు ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక , మైనింగ్ , ఓవర్ లోడింగ్ వాహనాలపై ఎన్ఫోర్స్మెంట్ పెంచాలన్నారు. 

ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాల్లో ప్రోత్సాహకానికి ప్రభుత్వ విజ్ఞప్తి తో పలు కంపెనీలు ముందుకు వచ్చాయని ప్రభుత్వ ఉద్యోగులు ఈవి వాహనాలకు బ్రాండ్ అంబాసిడర్ లుగా ఈవి వాహనాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. 


సమీక్షా సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, జెటిసి లు చంద్రశేఖర్ గౌడ్, శివ లింగయ్య, రమేష్, డీటీసీ లు , డీటీవో లు, ఆర్టీవో లు, ఏంవీఐ లు , ఏఎంవీఐ లు పాల్గొన్నారు.


*కందుల కొనుగోలు గడువు మే 4 వరకు పొడిగింపు*

- మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

*అమరావతి, ఏప్రిల్ 7:* రాష్ట్రంలో కందుల కొనుగోలు గడువు మే 4 వరకు పొడిగించడం జ‌రిగింద‌ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్ల‌డించారు. ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి కందులు (రెడ్ గ్రామ్/తూర్) కొనుగోలు గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించడం రైతులకు ఎంతో ఊరటనిచ్చే నిర్ణయం అని అన్నారు. రాష్ట్రంలో ధర మద్దతు పథకం (PSS) కింద కొనుగోలు కొనసాగుతుందని మంత్రి తెలిపారు. కొనుగోలు గడువును పొడిగించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తిని ప‌రిశీలించిన‌ కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ, మే 4 వరకు పొడిగింపునకు ఆమోదం తెలిపిందన్నారు. రైతులు తమ పంటను నష్టపోకుండా విక్రయించుకునేలా చూడటం కూట‌మి ప్రభుత్వ బాధ్యత. రైతు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర అందేలా ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారు అని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తోంది. పంటల కొనుగోలు, గిట్టుబాటు ధర, మార్కెటింగ్ వంటి అన్ని అంశాల్లో రైతులకు న్యాయం జరిగేలా చర్యలు కొనసాగిస్తాము అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

 
 
ప్రేమ బంధం కన్నీటి సంద్రం.. భార్య ఎదుటే భర్త దుర్మరణం

*శ్రీకాళహస్తి: పదేళ్లు క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ప్రేమకు చిహ్నంగా ఇద్దరు మగపిల్లలు పుట్టడంతో సంతోషానికి అవధుల్లేవు.*

రోజంతా ఇద్దరూ కాయకష్టం చేసి పిల్లల్ని చదివించుకుంటున్నారు. వారి ఆనందాన్ని చూసి విధి కన్నుకుట్టింది. ఊహించని ప్రమాదంతో కళ్లముందే కట్టుకున్న భర్త కడతేరిపోవడంతో భార్యతో పాటు పిల్లలు కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. ఈ హృదయ విధారక ఘటన.. శ్రీకాళహస్తి పట్టణం శుకబ్రహ్మాశ్రమం సమీపం మంగళవారం చోటు చేసుకుంది. కేవీబీపురం మండలం ఆదరం గ్రామానికి చెందిన వినోద్ (32) పదేళ్ల క్రితం మనీషాను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కుటుంబ పోషణ నిమిత్తం ఇద్దరూ శ్రీకాళహస్తి పట్టణానికి సమీపంలోని రాజీవ్నగర్లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు. వినోద్ తాపీమేస్త్రీగా పనులకు వెళ్తుంటే, మనీషా అతని సహాయకురాలిగా కూలి పనులకు వెళ్తుంది.

*వస్తున్నానంటూ..తిరిగిరాని లోకాలకు....*

మంగళవారం ఐదో అంతస్తు వద్ద సిమెంటు పూత పని జరుగుతోంది. టిఫిన్ తినేందుకు మనీషా వినోదు పిలిచింది. కొంత మేర పని ఉందని చేసి వస్తున్నానని చెప్పిన వినోద్ అక్కడ అమర్చిన కర్రలు జారడంతో పట్టు తప్పి పైనుంచి కిందపడిపోయాడు. రక్తగాయాలతో పడిన ఉన్న వినోద్ను చూసి మనీషా తల్లడిల్లిపోయింది. భర్తకు ఏమీ కాదని, తనను వదలి వెళ్లడంటూ ఎంతో ఆర్తితో చివరి వరకు ప్రయత్నించింది. తీరా ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికి మృతి చెందాడని తెలిసి కన్నీరుమున్నీరై విలపించింది. హృదయ విధారక ఘటనతో రాజీవ్నగర్, ఆదరంలోనూ పలువురు కన్నీటి పర్యంతమయ్యారు.


 
 
శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుని, వాటికి తక్షణ పరిష్కారం చూపడమే ధ్యేయంగా  పట్టణంలోని పీఆర్ గెస్ట్ హౌస్  నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించడం జరిగింది.

*ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల వినతులను వ్యక్తిగతంగా పరిశీలించాను. సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు మరియు ఇతర వ్యక్తిగత సమస్యలపై అందిన దరఖాస్తులను సంబంధిత అధికారులతో మాట్లాడి, అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆదేశించాను.*

*నా దృష్టిలో పదవి అనేది కేవలం హోదా కాదు, ప్రజలకు సేవకుడిగా అండగా నిలవడానికి దక్కిన ఒక గొప్ప అవకాశం. మీ సమస్య ఏదైనా, మీకు తోడుగా ఉండటానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.*

*పల్నాడు జిల్లా : నరసరావుపేటలో క్రికెట్ బుకీలు అరెస్టు..!*

*ఐలా బజార్‌లో క్రికెట్ బెట్టింగ్ జరుగుతోందని పోలీసులకు సమాచారం.. క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఆరుగురు అరెస్టు..!*

*బెట్టింగ్ ముఠా సభ్యులు షేక్ ఖాసీం, షేక్ మస్తాన్ వలీ, షేక్ రఫీ జాన్, పసుపులేటి నాగరాజు, శిఖా చక్రవర్తి, పతేలా వెంకటేశ్వరరావు అరెస్టు.*

*నిందితుల నుంచి రూ.4.58 లక్షల నగదు, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లు స్వాధీనం.*

*బెట్టింగ్ ముఠాను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులకు బహుమతులు అందించిన డీఎస్పీ.*


డిసెంబర్‌లో ఆడబిడ్డల పుట్టింటి సారె.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! 

తెలంగాణ రాజకీయాల్లో 'సెంటిమెంట్' మరియు 'సంక్షేమం' ఎప్పుడూ కీలకమే. తాజాగా ఆదిలాబాద్ గడ్డపై నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా లోకానికి ఒక తీపి కబురు అందించారు.

గతంలో ఇందిరమ్మ పాలనలో చీరల పంపిణీ జరిగిన తీరును గుర్తు చేసుకుంటూ.. "నాడు మా అక్కలు పాలపిట్టల్లా మెరిసిపోయారు, ఇప్పుడు మళ్ళీ అదే ఉత్సాహాన్ని నింపుతాం" అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. ఈసారి డిసెంబర్ నెలలో రాష్ట్రంలోని మహిళలందరికీ 'చిలకపచ్చ రంగు' చీరలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు.

కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా, దీనికి అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను అక్కడికక్కడే కోరడం విశేషం. ప్రభుత్వం ఇచ్చే ఈ కానుకను ఒక 'పుట్టింటి సారె'గా భావించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ డిసెంబర్ నాటికి తెలంగాణ ఆడబిడ్డల ముఖాల్లో చిలకపచ్చ వెలుగులు చూడబోతున్నాం!