kapunews



TRENDING NOW




జిల్లా కోర్టుల అంశంపై శాసన మండలిలో ప్రసంగించిన గౌరవ శాసనమండలి సభ్యులు  మర్రి రాజశేఖర్ 

*మర్రి రాజశేఖర్ గారు శాసన మండలిలో జిల్లా కోర్టుల వ్యవస్థపై ప్రాముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు.*

*ప్రస్తుతం రాష్ట్రంలో 28 జిల్లాలు ఏర్పాటు చేయబడినప్పటికీ, కొన్ని జిల్లాల్లో ప్రిన్సిపల్ జిల్లా కోర్టులు ఇంకా పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనే కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఉదాహరణకు, పల్నాడు జిల్లా పరిధిలోని నరసరావుపేట లో జిల్లా కోర్టు పనిచేస్తున్నప్పటికీ, ప్రిన్సిపల్ కోర్టు మాత్రం ఉమ్మడి జిల్లా కేంద్రమైన గుంటూరు లో కొనసాగుతోందని వివరించారు.*

*ఈ కారణంగా పల్నాడు జిల్లాకు చెందిన న్యాయవాదులు మరియు ప్రజలు మొదట గుంటూరుకు వెళ్లి కేసులు ఫైల్ చేసి, అక్కడి నుంచి ఫైళ్లను నరసరావుపేటకు ట్రాన్స్‌ఫర్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. దీని వల్ల సమయం, ఖర్చు మరియు శ్రమ పరంగా వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.*

*కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు, ఆయా జిల్లాల్లో పనిచేస్తున్న జిల్లా కోర్టులను ప్రిన్సిపల్ జిల్లా కోర్టులుగా ప్రకటించేందుకు హైకోర్టుకు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ గారిని కోరారు.*



పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల గారికి పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి తరపున పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు వినతి పత్రం సమర్పించడం జరిగింది


గౌరవనీయులైన పల్నాడు జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్న ఫిర్యాదు 


హిందు సంస్కృతి మూలాలు ధ్వంసం చేయడమే జగన్ లక్ష్యం, హిందు సమాజాన్ని అవమానిస్తూ ఆనందం పొందుతున్నారు

జగన్మోహన్ రెడ్డి పాలనలో హిందూ సమాజం పై దాడి జరిగింది. తిరుమల డిక్లరేషన్ పై సంతకం చేయకుండా దర్శనానికి వెళ్లి హిందు విశ్వాశాలపై నమ్మకం లేదని తెలిపాడు. ఈ చర్య ద్వారా హిందూ దేవతలు ఆరాధనలపై విశ్వాసం లేదని అర్ధం అయ్యింది. కెమికల్ నెయ్యితో శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ చేసి తీవ్ర  అపచారం చేయడమే కాకుండా శాసనమండలి సాక్షిగా చెప్పులు ధరించి కలియుగ దైవం వెంకటేశ్వర స్వాము చిత్ర పఠంతో నినాదాలు చేసి తధనంతరం ఆ ఫోటోలను అక్కడే విసిరేసి వెళ్ళిపోయారు. ఈ సంఘటన చాలా బాధాకరం.

వైఎస్సార్సీపి ప్రభుత్వంలో హిందూ సంస్కృతి మూలాల్లో కొట్టాలనే కుట్ర జరిగింది.

వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో హిందూ ఆలయాల ధ్వంసం హిందూ దేవత మూర్తుల విగ్రహాల ధ్వంసం ఆలయ రథాల దగ్ధం మరియు ధ్వంసం జరిగినది

ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 2024 మధ్య కాలంలో  హిందూ సంస్కృతి మూలాలను నాశనం చేయాలనే ప్రయత్నంలో జరిగిన దాడులపై సమగ్ర విచారణ చేయాలి అని ప్రజలు కోరుచున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి 2024 వరకు YSRCP ప్రభుత్వ కాలంలో హిందూ ఆలయాలు, విగ్రహాలు, రథాలపై జరిగిన అనేక దాడులు ధ్వంసాలు గమనార్హం. ఈ ఘటనల్లో అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్లక్ష్య చర్యలు సమాజంలో భయాన్ని పెంచాయి. అంతే కాకుండా ఫిర్యాదు చేసినవారిపైనే తిరిగి కేసులు పెట్టి అమాయక హిందువులను వేధించారు. ఒక మత ఛాందశవాది ఇతర మత విశ్వాసాలపై గౌరవం లేనివాడు ముఖ్యమంత్రి అయితే ఎంత ప్రమాదమో ప్రజలకి అర్ధం అయ్యింది. 

భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న "జనతా వారధి" కార్యక్రమంలో భాగంగా మేము ప్రజల వద్దకు వెళ్తున్నప్పుడు వారి నుంచి వస్తున్న విన్నపం "మా హిందూ ఆలయాల ధ్వంసం విగ్రహాల ధ్వంసం దగ్ధం పై చర్యలు తీసుకోవాలని ఇది కచ్చితంగా కుట్రపూరితంగా అప్పటి పాలకుల ప్రోత్సాహంతో చేశారని వారందరిపై చర్యలు తీసుకొని నేరస్తులు ఎవరో తెలియచేసి ప్రజాస్వామ్యానికి నమ్మకం కలిగించాలి" అని కోరుచున్నారు. ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల కుట్రలు దాడులు జరిగాయి. 2020 నెల్లూరులో కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి రధం ధ్వంసం చేశారు. 2020 సెప్టెంబర్ లో తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ రథాన్ని దగ్ధం చేశారు. 2024 సెప్టెంబర్ లో అనంతపురం రామాలయం రధాన్ని దగ్ధం చేశారు. 2019 మార్చిలో కాకినాడ రూరల్ లో ఒక చర్చి పాస్టర్ రెండు హిందూ ఆలయాలు ధ్వంసం చేసి అందులో విగ్రహాలను తీసుకువెళ్లిపోయారు. 2020 జనవరిలో పిఠాపురం లో పేరుగాంచిన ఆలయాల్లో దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేశారు. 2020 సెప్టెంబర్ లో చిత్తూరులో నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 2021 లో రాజమండ్రిలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం చేతులు నరికారు. 2021 లో విజయనగరం జిల్లా నెల్లిమర్లలో రామతీర్థం పుణ్యక్షేత్రం శ్రీరాముని విగ్రహ శిరస్సు ధ్వంసం చేశారు ఇంకా ఎన్నో దారుణాలు చేశారు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రోజు హిందూ మూలాలను నాశనం చేసే రచన జరిగింది. ఇప్పటికి కూడా అదే ఆలోచనలతో వున్నారు అని అర్ధం అవుతుంది. ప్రజల ముందు జగన్మోహన్ రెడ్డి ముసుగు తొలగింది. ఇది భరించలేని జగన్మోహన్ రెడ్డి తన దుర్మార్గపు అనుచరులతో కలసి సమాజన్ని కించపరుస్తున్నారు.

క్షమించరాని తప్పులు చేసి కూడా భగవంతుణ్ణి అవమానపరుస్తూ శాసనమండలిలో నిరసన పేరుతో ప్రవర్తించిన తీరుని చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం 2019 నుంచి 2024 వరకు హిందూ ఆలయాల ధ్వంసం, దేవత మూర్తుల విగ్రహాలు ధ్వంసం, రధాలు దగ్ధం రధాలు ధ్వంసం అన్ని సంఘటనలపై నిజమైన నేరస్తులను ప్రజల ముందు ఉంచి, లడ్డు ప్రసాదంలో కెమికల్ నెయ్యి నిందుతులు సహకరించిన  వ్యక్తులను శిక్షించాలి. శాసనమండలిలో కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అవమానించిన సభ్యుల పై చర్యలు తీసుకోవాలని కోరుచున్నారు.
ఈ కార్యక్రమం లొ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు పల్నాడు జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా జనతా వారధి మీడియా ఇంచార్జి కోమటి వాసు చిలకలూరిపేట పట్టణ ఉపాధ్యక్షులు కోట చంద్ర చిలకలూరిపేట మైనార్టీ పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ సుభాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


బిజెపి నూతన నాదెండ్ల మండల అధ్యక్షులుగా  
నల్లమోతు మాధవరావు ఎన్నిక 


పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు ఈరోజు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ చేతుల మీదగా బిజెపి నూతన నాదెండ్ల మండల అధ్యక్షులు గా నల్లమోతు మాధవరావు ఎన్నిక నూతన నాదెండ్ల మండల అధ్యక్షులు నల్లమోతు మాధవరావు మాట్లాడుతూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోది అభిమానిని నేను ఆయన సేవా భావాలు సేవా దృక్పథంతో భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్న ఆశా కిరణం మన మోడీజీ అని తెలిపారు అదే సంకల్పంతో నాదెండ్ల మండల ప్రజలకు అండదండలుగా ఉండి పార్టీని ముందుకు నడిపించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు శివ నాగేశ్వరరావు, జిల్లా కిసాన్ మోర్చా మాజీ అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్, జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటీ నాగేశ్వరరావు, రాష్ట్ర సోషల్ మీడియా ఇన్చార్జి వంశీ, పల్నాడు జిల్లా యువమోర్చా అధ్యక్షులు పులిగుజ్జు మహేష్, పట్టణ అధ్యక్షులు కోటా పవన్ కుమార్ గాంధీ, పట్టణ ఉపాధ్యక్షులు కోటా చంద్ర, పట్టణ మీడియా ఇన్ఛార్జ్ రావికింది రామకృష్ణ, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సుభాని, మాజీ పట్టణ అధ్యక్షులు దడబడ పుల్లయ్య, ఎడ్లపాడు మండల యువమోర్చా అధ్యక్షుడు కోటి, పట్టణ సెక్రెటరీ గుమ్మా బాలకృష్ణ, జనతా వారది మీడియా ఇంచార్జి కోమటి వాసు, బిజెపి సీనియర్ నాయకురాలు ఎలిజిబెత్ రాణి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు


పల్నాడు జిల్లా ఓబీసీ మరియు రజక సంఘం ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా 150 వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు

చిలకలూరిపేట పట్టణ రజక జనసేవ సంఘం కార్యాలయంలో  భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పల్లపు శివయ్య ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా గారి 150వ జయంతి నీ పట్టణ రజక జన సేవా సంఘం అధ్యక్షులు కురిచేటి వీర బ్రహ్మంగారి  
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా బిజెపి పార్టీ ఇన్చార్జి శ్రీనివాసరావు గారు చిలకలూరిపేట నియోజకవర్గ లో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు జిల్లా మాజీ అధ్యక్షులు పూర్ణ  చంద్రా రావు జిల్లా మాజీ అధ్యక్షులు రం మోర్చా  గారు  జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ చారి జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు  గరికపాటి లక్ష్మీ గారు జిల్లా మ ఓబీసీ మోర్చా కార్యదర్శి కట్టు సాయిరాం  బీజేపీ పట్టణ రజక జన సేవా సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని సంత్ గాడ్గే బాబా గారి గొప్పతనం ఆయన చేసినటువంటి సేవలు సంస్కరణలు ఆయన నెలకొల్పినటువంటి విద్యాసంస్థలు ఆయన పాటించినటువంటి స్వచ్ఛభారత్ మొదలగు తదితర విషయాలను ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ సంతు గాడ్గే బాబా గారి చిత్రపటానికి పూలమాలవేసి ఆ మహనీయుని గుర్తు చేసుకున్నారు.

ఏపీలో భూకంపం 3.5 తీవ్రతతో కంపనం

AP:ఏపీలోని పల్నాడు జిల్లాలో రిక్టర్ స్కేల్ పై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. వినుకొండ, దర్శి పరిసర ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు నమోదయ్యాయి. ఇళ్లలోని వస్తువులు కదలడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

ప్రజా సమస్యల కంటే.. జగన్ ఎజెండానే వైసీపీ సభ్యులకు ముఖ్యమైపోయింది : ప్రత్తిపాటి

• వైసీపీ ఎమ్మెల్సీల ధోరణిపై సొంతపార్టీ శ్రేణులే తలలు పట్టుకుంటున్నారు : ప్రత్తిపాటి
• జగన్  కుంభకోణాలు, దోపిడీలపై ప్రజల్లో చర్చ జరగకూడదన్నదే వైసీపీ సభ్యుల అంతిమ లక్ష్యం : ప్రత్తిపాటి.
• టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం లేదని హెరిటేజ్ స్పష్టంగా చెప్పినా.. వైసీపీ సభ్యులు కుక్కతోక పట్టుకొని గోదారి ఈదే ప్రయత్నం చేస్తున్నారు. :ప్రత్తిపాటి
• తన కొలంబో పర్యటనపై వైసీపీ అవినీతి మీడియా దుష్ప్రచారానికి లోకేశ్ సమాధానం కుక్కకాటుకు చెప్పుదెబ్బలా ఉంది. : ప్రత్తిపాటి

“ మంత్రి నారా లోకేశ్ కొలంబో పర్యటనపై పనిగట్టుకొని మరీ దుష్ప్రచారం చేయడం సాక్షి మీడియా బరి తెగింపునకు పరాకాష్ట. సొంత ఖర్చులతో క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లడాన్ని తప్పుపడుతూ.. అవినీతి మీడియా తన అవాస్తవాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేసింది. జగన్ సంతోషం కోసం... జనం మనసుల్లో విషబీజాలు నాటే దినచర్యలో వైసీపీ నేతలు.. సాక్షి మీడియా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బలా ... సాక్షి దుష్ప్రచారాన్ని లోకేశ్ తనదైన శైలిలో తిప్పికొట్టారు. అవినీతి మీడియా విషపురాతల సృష్టికర్తలకు.. లోకేశ్ సమాధానం కుక్కకాటుకు చెప్పుదెబ్బలా గట్టిగా తగిలిందనే చెప్పాలి. గతంలో లోకేశ్ పై హద్దులు మీరి చేసిన దుష్ప్రచారానికి,  కోర్టుల్లో క్షమాపణలు చెప్పుకునే దుస్థితి కల్పించినా.. సాక్షి రాతల్లో మార్పురాలేదు. 

*రచ్చ చేయడానికే సభకు వస్తున్నారు..*
వైసీపీ ఎమ్మెల్సీలు మండలికి వస్తున్నది ప్రజాసమస్యలపై చర్చకు.. రాష్ట్రానికి మేలు చేసే అంశాలపై ప్రభుత్వానికి సలహాలు..సూచనలు ఇవ్వడానికి కాదని వారి వైఖరిని బట్టే అర్థమవుతోంది. కేవలం ఒక ఎజెండా ప్రకారం..సభను అడ్డుకోవాలి.. రచ్చ చేయాలి అన్నదే వారి లక్ష్యంగా కనిపిస్తోంది. టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం లేదని హెరిటేజ్ సంస్థ స్పష్టంగా ఆధారాలు బహిర్గతం చేసినా కూడా.. వైసీపీనేతలు ఆ సంస్థను బదనాం చేయడం కుక్కతోక పట్టుకొని గోదారి ఈదడమే అవుతుంది.  జగన్ సాగించిన కుంభకోణాలు. దోపిడీలపై కూటమిప్రభుత్వం చేపట్టిన విచారణ.. రోజురోజుకీ బయటకొస్తున్న నాటి వైసీపీ ప్రభుత్వ అవినీతి వ్యవహారాలపై ప్రజల్లో  చర్చ జరగకూడదు.. వారి మనసుల్లో ఎక్కడా జగన్ దుర్మార్గాలు ఎస్టాబ్లిష్ అవకూడదన్న ఏకైక లక్ష్యంతోనే వైసీపీ సభ్యులు అడుగడుగునా సభా నిర్వహణకు అడ్డు తగులుతున్నారు. కల్తీ నెయ్యి స్కామ్ లో జగన్ సహా నాటి టీటీడీ పెద్దల పాత్ర ప్రజలకు తెలియకూడదన్న దురుద్దేశంతోనే, వైసీపీ సభ్యులు  హెరిటేజ్ డెయిరీపై బురదజల్లుతున్నారు 

*వైసీపీ సభ్యుల తీరుపై సొంతపార్టీ శ్రేణులే తలలు పట్టుకుంటున్నారు*
పెద్దలసభను వైసీపీ సభ్యులు కావాలనే పెడదారి పట్టిస్తున్నారు.
ఎవరికి వారే యమునా తీరే అంటున్న వైసీపీసభ్యుల ప్రవర్తనపై సొంత కార్యకర్తలే తలలు పట్టుకుంటున్నారు. ఆధిపత్య  భావజాలంతో తమలే తాము కలహించుకంటూ.. పెద్దల సభ గౌరవప్రతిష్టల్ని బజారుకీడుస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే అంశాల కంటే.. తమ నాయకుడి  ఆదేశాలే తమకు మిన్న అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. మండలి మర్యాదను మంటగలపాలన్న ఆరాటం తప్ప... ప్రభుత్వ విధానాలపై చర్చించాలన్న ఆలోచన వైసీపీసభ్యులకు లేకపోవడం విచారకరం.” అని మాజీమంత్రి ప్రత్తిపాటి బుధవారం ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు.

రైస్ మిల్లుకు వెళ్తున్న రేషన్ బియ్యం లారీ పట్టివేత

*రూ.10.8 లక్షల విలువైన 30 టన్నుల బియ్యం*

 రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న సమాచారం రావడంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ వద్ద ఎస్సై జి నరేష్ పట్టుకున్నారు. 30 టన్నుల బియ్యాన్ని లారీలో తరలిస్తున్నారు. వాటిని పట్టుకుని ఆరా తీయగా రేషన్ బియ్యంగా వెల్లడయింది.విజయవాడ సమీపం నుంచి ఈ బియ్యాన్ని తీసుకొస్తున్నారు.ఈ బియ్యం విలువ సుమారు రూ. 10.8 లక్షలు ఉంటుంది. దీనిపై ఎస్ఐ నరేష్ బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ ఆకుల శివకృష్ణ మణికంఠ ను అరెస్టు చేశారు.కాకినాడకు చెందిన కె.చంద్రశేఖర్‌కు చెందిన లారీ గా గుర్తించారు. అయితే ఈ బియ్యం కాకినాడ వెళుతున్నట్లు వారు చెబుతున్నారు. కాని కోస్తా జిల్లాలోనే రేషన్ బియ్యం కొనుగోలు కేంద్రంగా ఉన్న ఆలమూరు మండలం మోదుకూరు రైస్ మిల్లులకు ఈ బియ్యం వస్తున్నట్లు సమాచారం.ఈ బియ్యాన్ని మండపేట మండలం వేములపల్లి గౌడౌన్ లో దిగుమతి చేసి లారీని ఆలమూరు పోలీసు స్టేషన్ కు తరలిస్తామబి మండల సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు.
 


ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి

శివాజీ మహారాజ్ మహానుభావుడు, ఆయన ఈ దేశానికి రెండు గొప్ప సేవలు అందించారు.
ఒకటి ఆర్ష ధర్మాన్ని నిలబెట్టడానికి గోవులను రక్షించారు. 
గోవధ యధేఛ్ఛగా జరుగుతున్న రోజుల్లో, గోవులను రక్షించడాన్ని జీవన కర్తవ్యంగా పెట్టుకుని గోవులను కాపాడిన వారు శివాజీ. అలాగే రెండవది స్త్రీలను రక్షించి, వారికి నమస్కరించటం. 
ఆయన శత్రువులు వివాహం అయిపోయినటువంటి స్త్రీలను కూడా తీసుకెళ్ళి మానభంగం చేస్తుంటే, ఆ స్త్రీలను రక్షించి, కనపడిన ప్రతీ స్త్రీనీ అమ్మవారిగా చూసి పసుపు, కుంకుమ, గాజులు ఇచ్చి, నమస్కరించినటువంటి ఘనత శివాజి మహరాజ్ దే...

యుధ్ధములో తన శత్రువులు అయినటువంటి పరమతానికి చెందినటువంటి స్త్రీలు తనకి దొరికితే, ఖైదీలుగా బంధించకుండా, వాళ్ళు పెట్టుకొకపోయినా వాళ్ళకీ ఐదోతనపు చిహ్నాలుగా వారికి చీరా, పసుపు, కుంకుమ ఇచ్చి, వారిని తన తల్లిగా భావించి, నమస్కరించి, పల్లకీలో తెరలు వేసి వెనక్కి పంపించినటువంటివాడు శివాజీ మహారాజ్,
మహానుభావుడు, సమర్థ రామదాసు గారు ఆయన గురువు.
శివాజీ సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి కోటలు నిర్మించి, హైందవ సామ్రాజ్య ఏర్పాటుకి ఆయనకు కార్యసిధ్ధి కొరకు శక్తి యొక్క అండ, అంటే అమ్మవారి అండ కావలసివచ్చింది. 
శివాజీ మహారాజ్ యొక్క చరిత్ర చదివితే తెలుస్తుంది - అటువంటి రోజులలో శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి ఆ రోజులలో శివాజీ అమ్మవారి అనుగ్రహానికై ధ్యానమగ్నులయ్యారు.

మంత్రులు, సేనాధిపతులు "ఇదేమిటి, శివాజీ మహారాజ్ ఇంత ప్రౌఢమైన వయస్సులో, ఇంత యుధ్ధ సమయములో అకస్మాత్తుగా వెళ్లి ధ్యానం లో కూర్చుంటున్నారు, అసలు బయటికి రావట్లేద"ని హడిలిపోయారు. 
భ్రమరాంబికా అమ్మవారిని ధ్యానం చేస్తూ శివాజీ మహారాజ్ కూర్చుంటే, అమ్మవారు ప్రత్యక్షమై, "నీకు నేను ఒక ఖడ్గాన్ని బహుకరిస్తున్నాను. 
ఇది నువ్వు పట్టుకున్నంత కాలం ఇక యుధ్ధంలో నీకు ఎదురు లేదు, ఈ ఖడ్గాన్ని పట్టుకుని హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించ"మని కటాక్షించింది.
ఆ భవానీ ఖడ్గాన్ని చేత పట్టుకునే శివాజీ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించారు. 
ఇప్పటికీ శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు, ఎడమ పక్కగా వెడుతూ దర్శనానికి కుడి పక్కకి తిరగవలసిన చోట తిరగకుండా మెట్లుఎక్కితే వీర శైవ మఠం కనబడుతుంది. 
ఆ మఠం మెట్ల మీద నిలబడి చూస్తే ఎన్నో చమత్కార‌‌ములు కనబడతాయి. 
అక్కడే కిందకి దిగి కుడి పక్కకి తిరిగితే, శివాజీ మహారాజ్ మోకాలు మీద కూర్చుంటే భ్రమరాంబ అమ్మవారు ఆయనికి ఖడ్గాన్ని బహుకరిస్తున్న సన్నివేశం చెక్కబడిన శిల్పము కనిపిస్తుంది.




తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మున్నూరు కాపు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు

మున్నూరు కాపు మేయర్స్

1. కరీంనగర్ - కొలగాని శ్రీనివాస్ 
2. మంచిర్యాల - ధర్ని మధుకర్


మున్నూరుకాపు చైర్మన్స్

1. గజ్వెల్ - గంగిశెట్టి చందన రవీందర్ 
2. బెల్లంపల్లి - దావ స్వాతి రమేష్ 
3. జగిత్యాల - సమిండ్ల వాణి శ్రీనివాస్
4. భైంసా -తుమ్మెల్ల దత్తాత్రి 
5. నిర్మల్-అప్పాల కావ్య గణేష్
6. మెదక్- కానుగ రాధిక
7. నాగర్ కర్నూల్- తీగల సునీంద్ర
8. చెన్నూరు- పెద్ధింటి పద్మా శ్రీనివాస్
9. బాన్సువాడ- కాసుల విజయ బాలరాజు
10. ములుగు- చింతనిప్పుల చంద్రకళ
11. వేములవాడ- పుల్కాం రాజు.
12. పెద్దపల్లి -నుగిళ్ళ మల్లన్న
13. ఆదిలాబాద్- బండారి అనూష సతీష్

పటేళ్లు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు



ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు

 *మొన్న తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో తెలంగాణ మున్సిపల్ చైర్మన్గా 13 మంది అలాగే రెండు కార్పొరేషన్ చైర్మన్ గా మున్నూరు కాపులు ఎన్నిక కావడం పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు రాష్ట్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు తెలంగాణలో ఎన్నికైన మున్నూరు కాపు మున్సిపల్ చైర్మన్ లకు కార్పొరేషన్ చైర్మన్ లకు వివిధ వార్డుల్లో ఎన్నికైన మున్నూరు కాపు కౌన్సిలర్లకు కార్పొరేటర్లకు పేరుపేరునా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున శుభాభినందనలు తెలియజేయడం జరిగింది*

 *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పొరేట్ జాతి అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వర రావు మాట్లాడుతూ  త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో జరగబోవు మున్సిపల్ ఎన్నికలలో అలాగే కార్పొరేషన్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి తరుపున జనాభా దామేషా ప్రకారం కాపులకు ఎక్కువ సీట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున డిమాండ్ చేస్తున్నాం*
 
*గత సార్వత్రిక ఎన్నికలలో  ఎన్డీఏ కూటమి విజయోత్సవానికి ఎంతో కృషిచేసిన కాపు సామాజిక వర్గం వారిని గుర్తించి రేపు జరగబోవు మున్సిపల్ ఎన్నికలలో తప్పనిసరిగా కాపులకు ఎక్కువ సీట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపురాడు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాము*

 *ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు రాధా రంగా మిత్రమండలి చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ అచ్చుకోల మురళి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తోట సత్యం కాపునాడు ఉపాధ్యక్షులు ఏనుగుల వెంకటేశ్వర్లు సనాతన కమిటీ కన్వీనర్ తోట సతీష్ తదితర కాపు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు*




నెల్లూరు పట్టణ మహిళా అధ్యక్షురాలు నియమితులైన నున్న రాధిక 

కాపుల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి నెల్లూరు ప్రముఖ  కాపు నాయకురలైన   నెల్లూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు  నున్న రాధికా తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న నున్న రాధికా ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన నెల్లూరు నియోజకవర్గ కాపు నాయకులకు రాష్ట్ర కమిటీ వారికీ జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు కాపునాడు నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని కాపునాడు సేవా సమితి చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి వారి హక్కుల సాధన కోసం కమిటీ వారు తీసుకునే అన్ని నిర్ణయాలను తూచా తప్పకుండా  నెల్లూరు జిల్లా లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు

పల్నాడు జిల్లా జనతా వారిది టీం ఆధ్వర్యంలో  మంగళవారం జరిగిన జనతా వారధి కార్యక్రమం లొ భాగంగా పల్నాడు జిల్లా కార్యాలయం లొ పిర్యాదు ఇవ్వడం జరిగింది

*రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి నేతృత్వంలో 17-02-2026 వ తేది మంగళవారం రోజున నరసరావుపేట కలెక్టర్ కార్యాలయం లొ dpro గారికి పల్నాడు జిల్లా లొ గత వైఎస్ఆర్సిపి  ప్రభుత్వం హయాంలో పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ల స్థలాలలో జరిగిన అవినీతిపై ఫిర్యాదు ఇవ్వడం జరిగింది . వెంటనే స్పందించిన ప్రభుత్వ అధికారులు ఈ సమస్యపై నివేదికను ప్రభుత్వం వారికి మరియు ముఖ్య మంత్రినారా చంద్రబాబు నాయుడు గారికి సమస్యపై నివేదిక పంపిస్తామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో  జనతా వారధి   జనతా వారధి కన్వినర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు  మరియు చిలకలూరిపేట పట్టణ ఉపాధ్యక్షులు కోట చంద్ర చిలకలూరిపేట మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది*

*పల్నాడు జనతా వారధి టీమ్*

మెట్‌పల్లిలో ‘జనసేన’ జోష్.. గ్లాస్ గుర్తుకు ఓటేయాలంటూ గబ్బర్ సింగ్ బృందం సందడి!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో రాజకీయ వేడి రాజుకుంది. శనివారం జనసేన పార్టీ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ‘గబ్బర్ సింగ్’ బృందం పట్టణంలో విస్తృత ప్రచారం నిర్వహించింది. పురపాలక పరిధిలోని పలు వార్డుల్లో పర్యటించిన ఈ బృందం సభ్యులు సాయి బాబా, రమేష్, రిమ్సన్ రాజేష్ మరియు మహేష్‌లు.. మార్పు కోసం ఒక్కసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
గ్లాస్ గుర్తుకే తమ ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా పట్టణ ప్రధాన వీధుల గుండా భారీ బైక్ ర్యాలీ నిర్వహించడంతో జనసైనికుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన పనిచేస్తుందని, ప్రజలంతా గ్లాస్ గుర్తును ఆదరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




రష్యా చమురు కొనుగోళ్ల గురించి ట్రంప్ చేసిన ప్రకటనపై స్పందించిన భారత్.. ఏమందంటే..

రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందని' అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించింది.

భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, "దేశ ఇంధన సరఫరా విషయానికొస్తే, 140 కోట్ల భారతీయుల ఇంధన భద్రతకే తొలి ప్రాధాన్యమని ప్రభుత్వం అనేక సందర్భాల్లో బహిరంగంగా ప్రకటించింది. అందుకోసం మార్కెట్ పరిస్థితులు, మారుతున్న అంతర్జాతీయ వాతావరణానికి అనుగుణంగా మా ఇంధన వనరుల్లో వైవిధ్యం తీసుకురావడం మా వ్యూహంలో ప్రధానం. దీనిని దృష్టిలో ఉంచుకునే భారత్ అన్ని చర్యలూ చేపట్టింది. అలానే కొనసాగిస్తుంది" అని అన్నారు.

దీనికి ముందు, రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మారియా జఖారోవా బుధవారం మాట్లాడుతూ రష్యాతో ఇంధన సహకారంపై భారత్ తన వైఖరిని పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

ఈ వాణిజ్యం రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో స్థిరత్వాన్ని కొనసాగించడానికి దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు


ఆస్ట్రేలియా బాటలో భారత్.. పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం?

చిన్నారులను డిజిటల్ వ్యసనం నుంచి రక్షించేందుకు కేంద్రo
 వారికి ప్రభుత్వం కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి వయో పరిమితులు విధించే అంశంపై ప్రస్తుతం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలోని సూచనలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర ఐటీ కార్యదర్శి ఎస్. కృష్ణన్ వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ఐసీఏఎన్ఎన్ సదస్సులో ఆయన ఈ కీలక విషయాలను పంచుకున్నారు.

ముఖ్యంగా ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇప్పటికే పిల్లల కోసం ప్రత్యేక వయో నిబంధనలు అమలు చేస్తున్నాయి. అదే తరహాలో భారత్‌లోనూ వయసు ధ్రువీకరణను తప్పనిసరి చేసే బాధ్యతను సోషల్ మీడియా సంస్థలకే అప్పగించే అవకాశం ఉంది. ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం, హానికరమైన కంటెంట్ వల్ల చిన్నారుల మానసిక స్థితి దెబ్బతింటోందని, ఇటీవలి ఘజియాబాద్ ఘటనలే ఇందుకు ఉదాహరణని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆన్‌లైన్ టీచింగ్‌ను తగ్గించి, పిల్లలకు సులువైన విద్యా పరికరాలను అందించాలని ఆర్థిక సర్వే సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్, గోవా వంటి రాష్ట్రాలు కూడా సొంతంగా వయసు నిబంధనలు తెచ్చే ఆలోచనలో ఉండటం విశేషం. చీఫ్ ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ కూడా డిజిటల్ ప్రపంచంలో పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.