kapunews



TRENDING NOW





పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసిన పల్నాడు జిల్లా జనతా వారిది టీం

 *భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు పలనాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి అనుమతితో పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసి కలుషితమైన నీటి సమస్యపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది*

 *గత ప్రభుత్వంలో వివక్షతకు గురైన కలుషిత నీటి సమస్యపై పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందించిన పల్నాడు జిల్లా జనతా వారధి కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరావు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నబాట్ల ఆదిత్య పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నార్స శ్రీనివాసరెడ్డి రాష్ట్ర యువ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ వంకాయలపాటి వంశీధర్ పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి వారికూటి రాజేశ్వరరావు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు ఇత్తడి కిరణ్ చిలకలూరిపేట ఉపాధ్యక్షులు కోట చంద్ర చిలకలూరిపేట మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది*

 *సదరు ఈ విషయంపై స్పందించిన జిల్లా కలెక్టర్ గారు వెంటనే బిజెపి ఆధ్వర్యంలో ఇచ్చిన ఫిర్యాదును పలనాడు జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీలకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి ఆర్ డబ్ల్యు ఎస్ డిపార్ట్మెంట్ వారికి పంపించడం జరిగింది*

విషయం : *కలుషిత తాగునీటి వల్ల వ్యాధుల వ్యాప్తి, రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర నీటి శుద్ధి కార్యక్రమం చేపట్టాలి* 
.....భారతీయ జనతా పార్టీ డిమాండ్ 

రాష్ట్రంలో *కలుషిత తాగునీటి కారణంగా వ్యాధుల వ్యాప్తి* పెరుగుతున్న నేపథ్యంలో తక్షణ చర్యలు తీసుకోవాలని బిజెపి వినతి.

 *భారతీయ జనతా పార్టీ* ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం *జనతా వారధి* ద్వారా గ్రామాలు నగరాల్లో పర్యటనలు చేయగా త్రాగు నీరు ద్వారా వ్యాధుల వ్యాప్తి పై ప్రజల నుంచి ఆందోళన కనిపిస్తుంది. ప్రజలు పెద్దఎత్తున మాకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది.

గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాగునీటి కలుషితం కారణంగా డయేరియా, కలరా, సీజనల్ జ్వరాలు వంటి నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు పలుచోట్ల నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల శ్రీకాకుళం  జిల్లాలో జరిగిన ఘటన రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేసింది. కలుషిత తాగునీటి కారణంగా పలువురు అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చేరడం మరియు మరణాలు కూడా చోటు చేసుకోవడం తీవ్రంగా ఆందోళన కలిగించే విషయం.

అధికారిక నివేదికలు మరియు ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం 2019 నుంచు 2024 వరకు కలుషితం త్రాగు నీరు ద్వారా వచ్చే వ్యాధుల పెరగడమే కాకుండా కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. 2024 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా నీటి ద్వారా వ్యాధి వ్యాప్తి ఘటనలు సుమారు 59 వరకు నమోదయ్యాయి. 2025 సంవత్సరంలో ఇటువంటి ఘటనలు 21 నమోదు అయ్యాయి, వీటిలో వందలాది మంది అనారోగ్యం పాలయ్యారు మరియు కొన్ని మరణాలు కూడా నమోదయ్యాయి. 2026 సంవత్సరంలో కూడా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఇటువంటి ఘటనలు నమోదవుతున్నాయి, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల పెద్దఎత్తున డయేరియా వ్యాప్తి జరిగింది. ఈ ఘటనలో 70 నుంచి 100 మందికి పైగా ఆసుపత్రిలో చేరారు. ఒక మరణం నమోదైంది. సుమారు 20 జిల్లాల్లో త్రాగునీరు ద్వారా వ్యాధులు గుర్తించబడ్డాయి. అంతే కాదు అధికారిక ఘనాంకాలలో 10% మాత్రమే నమోదవుతున్నాయి. త్రాగునీటి ద్వారా వచ్చే వ్యాధిని ఎదుర్కున్న వ్యక్తిగత ఘటనలు నమోదు అవ్వడం లేదు 

ఇలాంటి ఘటనలు ప్రధానంగా ఈ క్రింది కారణాల వల్ల జరుగుతున్నట్లు కనిపిస్తోంది అని మా బిజెపి నాయకుల " *జనతా వారధి"* పర్యటనలలో గమనించాము.

• పాత మున్సిపల్ తాగునీటి పైపులైన్లు లీక్ అవడం
• డ్రైనేజ్ నీరు తాగునీటి పైపుల్లో కలవడం
• పట్టణాలు మరియు గ్రామాల్లో శుభ్రం చేయని ఓవర్ హెడ్ ట్యాంకులు
• సరైన నియంత్రణ లేకుండా నడుస్తున్న ప్రైవేట్ RO ప్లాంట్లు
• గ్రామీణ ప్రాంతాల్లో శుద్ధి చేయని బోర్‌వెల్ నీటి వినియోగం
• గృహాల్లో శుభ్రం చేయని వాటర్ ట్యాంక్ లు మరియు అవగాహన లోపం.

ఈ సమస్యల కారణంగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ప్రజలు ఆరోగ్యపరమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో నమోదవుతున్న వివిధ వ్యాధులకు కల్తీ ఆహారం ఒక సమస్య అయితే రెండవ అతిపెద్ద సమస్య శుద్ధిలేని త్రాగునీరు 

తాగునీటి భద్రత అనేది ప్రజల ప్రాథమిక హక్కు అని భావించిన కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులిస్తుంది. ప్రతి గ్రామీణ ఇంటికి Functional Household Tap Connection (FHTC) ద్వారా శుద్ధమైన తాగునీరు అందించడం లక్ష్యంగా *జల్ జీవన్ మిషన్*, పట్టణ ప్రాంతాల్లో శుద్ధమైన తాగునీటి సరఫరా మరియు డ్రైనేజ్ వ్యవస్థలు మెరుగుపరచడం కోసం *అమృత్ 2.o*  , పరిశుభ్రత, డ్రైనేజ్ వ్యవస్థల అభివృద్ధి ద్వారా నీటి కలుషితాన్ని తగ్గించడం ధ్యేయంగా *స్వచ్ఛ భరత్ మిషన్* , భూగర్భ జలాల నిర్వహణ మరియు నీటి వనరుల సంరక్షణ కోసం *అటల్ భూ జల్ యోజన*,  తదితర పధకాలతో నేరుగా ఆర్థిక సహాయం, నీటి సరఫరా, ప్రాజెక్టులకు నిధులు , నీటి నాణ్యత పరీక్ష ల్యాబ్‌లు, నీటి శుద్ధి ప్లాంట్లు నిర్మాణం, టెక్నికల్ మార్గదర్శకాలను కేంద్రంలో *నరేంద్ర మోడీ* గారి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్నది. 

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఇటువంటి గొప్ప కార్యక్రమాలు అమలు చేస్తు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటనలు జరుగుతున్నాయి. కలుషిత త్రాగునీరు వ్యాధులు వ్యాపించడం లో పై స్థాయి అధికారుల జవాబుదారీతనం లేకపోవడం మరియు క్రింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం, నిర్లిప్తత కనిపిస్తున్నది.

కాబట్టి ఈ సమస్యను అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని తక్షణ చర్యలు చేపట్టడం అవసరం.

అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ క్రింది చర్యలు తక్షణమే చేపట్టాలని వినమ్రంగా కోరుతున్నాము

• రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తాగునీటి నాణ్యతపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి.
• పాత మరియు లీకేజీ ఉన్న పైపులైన్లను తక్షణమే మరమ్మతు చేయాలి లేదా మార్చాలి.
• అన్ని పట్టణాలు మరియు గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకుల శుభ్రతను నియమితంగా నిర్వహించే విధానం అమలు చేయాలి.
• రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ RO ప్లాంట్లపై కఠిన తనిఖీలు చేసి నాణ్యత ప్రమాణాలు అమలు చేయాలి.
• గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీటి సరఫరా కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలి.
• ప్రతి జిల్లాలో నీటి శుద్ధి మరియు అవగాహన కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన నిర్వహించాలి.
• ప్రజలకు తాగునీటి భద్రతపై ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని నీటి శుద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. నీరు తగ్గిపోవడంతో మలినాలు ఎక్కువగా చేరే అవకాశం ఉంటుంది. తర్వాత వర్షాల సమయానికి త్రాగు నీరు వలన వచ్చే వ్యాధులు మరింత పెరుగుతాయి 

రాష్ట్ర ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఈ సమస్యను అత్యవసరంగా పరిగణించి *రాష్ట్రవ్యాప్తంగా నీటి శుద్ధి కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన అమలు చేయాలి* అని వినమ్రంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది.



తాడేపల్లి

నేడు రక్షణ గోడకు శంఖుస్థాపన

మహానాడు ప్రాంత వాసులకు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా పడనున్న అడుగులు

*మహానాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కల రక్షణ గోడ నిర్మాణానికి  ఎలక్షన్ ప్రచారంలో రచ్చబండ కార్యక్రమం లో హామీ ఇచ్చిన నారా లోకేష్*

*ఇచ్చిన హామీ ని నిలబెట్టుకునే విధంగా... రిటైనింగ్ వాల్ నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేయనున్న లోకేష్*

*సోమవారం ఉదయం 9 గంటలకు సీతానగరం మహానాడు వద్ద రిటైనింగ్ వాల్ కు శంకుస్థాపన రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్*

*రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.294.20 కోట్లతో కృష్ణా నది కుడివైపు చేపట్టనున్న రిటైనింగ్ వాల్(రక్షణ గోడ)  నిర్మాణ పనులు*



మహిళా రిటైర్ ఎస్‌.ఐ. మల్లేశ్వరి సేవలు అభినందనీయం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మల్లేశ్వరి ఇంటికి వెళ్లి అభినందించిన హోం మంత్రి

*పోలీస్ శాఖకు మల్లేశ్వరి ఆదర్శo*

*ఇలాంటి సేవాభావం గల వ్యక్తులు పోలీస్ శాఖకు ఎంతో అవసరం*..*హోం మంత్రి అనిత*

విజయవాడ సిటీ మహిళా ఎస్‌.ఐ.గా విధులు నిర్వహిస్తూ ఇటీవల రిటైర్ అయిన మల్లేశ్వరి సేవలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర హోం మంత్రి అనిత ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత స్వయంగా ఆమె నివాసానికి వెళ్లి మల్లేశ్వరిని అభినందించారు. మల్లేశ్వరి భర్త కూడా పోలీస్ శాఖలోనే సేవలందిస్తూ 2024 ఎన్నికల సమయంలో విధులు నిర్వహించే క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరమని మంత్రి అనిత పేర్కొన్నారు. ఆ వ్యక్తిగత విషాదాన్ని అధిగమించి మల్లేశ్వరి మరింత సంకల్పంతో ప్రజలకు సేవ చేయడం అభినందనీయమని అన్నారు. తన ఆసక్తితో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అందే కాంపెన్సేషన్ విభాగంలో చేరి, అనేక కుటుంబాలకు త్వరితగతిన పరిహారం అందేలా మల్లేశ్వరి అపారమైన కృషి చేసినట్లు మంత్రి తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు న్యాయం జరిగేలా వెంటనే కాంపెన్సేషన్ అందేలా ఆమె నిరంతరం సేవలు అందించారని కొనియాడారు. మల్లేశ్వరి కృషి వల్లే ఆంధ్రప్రదేశ్ పోలీస్ కాంపెన్సేషన్ విభాగం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా, ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి అనిత వెల్లడించారు. రిటైర్ అయిన తర్వాత కూడా అదే సేవాభావంతో ప్రజలకు సహాయం చేస్తూ ఉండటం నిజంగా గొప్ప విషయమని ఆమె అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మల్లేశ్వరి కుటుంబ సభ్యులను స్వయంగా కలవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని మంత్రి అనిత తెలిపారు. పోలీస్ శాఖకు మల్లేశ్వరి ఒక ఆదర్శమని, ఇలాంటి సేవాభావం గల వ్యక్తులు పోలీస్ శాఖకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మల్లేశ్వరి అందించిన సేవలకు హోం మంత్రి అనిత మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.


ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉంగుటూరు శాసనసభ్యుల వారి క్యాంపు కార్యాలయం ఆవరణలో ఉంగుటూరు ఎమ్మెల్యే శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

*స్టాల్స్‌ను సందర్శించి మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గారు ..*

మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను వినియోగించి వారు ఏర్పాటు చేసుకున్న వివిధ వ్యాపార స్టాల్స్‌ను ఎమ్మెల్యే గారు సందర్శించారు.  మహిళలు స్వయంగా ప్రారంభించిన చిన్న వ్యాపారాలు, తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించి వారి కృషిని అభినందించారు. 

*ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ధర్మరాజు గారు....*

అనంతరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో విచ్చేసిన మహిళలతో సమావేశం నిర్వహించి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు ప్రారంభించారు.

*మహిళల కుటుంబ, సమాజంలో మహిళల పాత్ర, గొప్పతనం గురించి వివరించిన ఎమ్మెల్యే ధర్మరాజు గారు...*

ఈ సందర్భంగా మహిళల గొప్పతనం గురించి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థను బలంగా నిలబెట్టేది మహిళలేనని పేర్కొన్నారు. ఇంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో, సమాజానికి మంచి విలువలను అందించడంలో మహిళల పాత్ర అపారమన్నారు. విద్య, ఉపాధి, వ్యాపార రంగాల్లో ముందుకు సాగుతూ మహిళలు సమాజ అభివృద్ధికి ప్రధాన శక్తిగా నిలుస్తున్నారని, మహిళలు ముందుకు వస్తే కుటుంబం, సమాజం, దేశం కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని అన్నారు.

*మహిళల సాధికారతకు కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించిన ఎమ్మెల్యే గారు ...*

మహిళల సాధికారత, భద్రత కోసం కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఎమ్మెల్యే గారు తెలిపారు. ఇందులో భాగంగా స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పథకం, దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నట్లు తెలిపారు. మహిళల రక్షణ కు శక్తి యాప్ రూపోంధించి శాంతి భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అలాగే మహాశక్తి కార్యక్రమం ద్వారా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది ఆర్థిక స్వావలంబనకు ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా స్వయం సహాయక సంఘాల ద్వారా డ్వాక్రా మహిళలకు నాటు కోళ్లు పంపిణీ, చిన్న వ్యాపారాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు రుణాలు అందిస్తూ NDA ప్రభుత్వం మహిళల సామాజిక, ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడుతోందన్నారు. త్వరలో NTR విద్యాలక్ష్మి, NTR కళ్యాణ లక్ష్మీ పథకాలను అమలులోకి తీసుకురాబోతున్నట్టు తెలిపారు.

*మహిళా ఎంటర్ప్రిన్యూర్ లకు సర్టిఫికెట్స్ అందజేసిన ఎమ్మెల్యే ధర్మరాజు గారు....*

ఉంగుటూరు నియోజకవర్గంలో NDA కూటమి ప్రభుత్వం అందించిన రుణాల ద్వారా వ్యాపారాలు స్థాపించిన మహిళ ఎంటర్ ప్రిన్యూర్ లకు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సర్టిఫికెట్స్ ను అందజేశారు. అదేవిధంగా  స్వయం సహాయక సంఘాల మహిళలకు వివిధ పథకాల నిమిత్తం నాలుగు మండలాల ఉన్న లబ్దిదారులకు ఇచ్చిన అమౌంట్ చెక్కును అందజేశారు.

*ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించిన ఎమ్మెల్యే*....

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని మహిళలతో కలిసి సమావేశ ప్రాంగణంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గారు ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు.

ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ శ్రీమతి శరణాల మాలతీ రాణి గారు, ఉంగుటూరు నియోజకవర్గ విజన్-2047 స్పెషల్ ఆఫీసర్ హార్టికల్చర్ DD కె. షాజ నాయక్ గారు, మహిళా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, జనసేన, టీడీపీ, బీజేపీ మహిళా నాయకులు, వీర మహిళలు, తెలుగు మహిళలు, APMలు, వివిధ శాఖల మహిళా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

భారత క్రికెట్ జట్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో అద్భుత విజయం సాధించి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

అహ్మదాబాద్‌లో భారత్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా అద్భుతమైన ఆటతీరుతో విజయం సాధించింది. ఈ విజయం దేశ ప్రజలందరికీ గర్వకారణమని ముఖ్యమంత్రి గారు అన్నారు.

మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు భారత జట్టు సమన్వయంతో, ధైర్యసాహసాలతో ఆడుతూ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించిందని ప్రశంసించారు.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలోనూ టీమ్ ఇండియా ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రతిభను ప్రదర్శించి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని అభినందించారు.

టీమ్ ఇండియా సాధించిన విజయం దేశ క్రీడా రంగానికి మరింత గౌరవం తెచ్చిందని అన్నారు. టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్‌తో పాటు టీమ్ సభ్యులందరికీ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.



తెలంగాణ శాసన మండలి భవనం ప్రారంభం

హైదరాబాద్ :చారిత్రక శాసనసభ ప్రాంగణంలో పునరుద్ధరించిన శాసనమండలి భవనాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి  శాసనమండలి భవనాన్ని ప్రారంభించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, మహమ్మద్ అజహరుద్దీన్ తో పాటు ప్రభుత్వ సలహాదారులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మండలిలో ముఖ్యమంత్రి కార్యాలయంలో రేవంత్ రెడ్డి పూజ నిర్వహించారు.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముహూర్తం ఫిక్స్ అయ్యింది.

*తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముహూర్తం ఫిక్స్ అయ్యింది.* 2026, మార్చి 16 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి ఆదివారం (మార్చి 8) నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
 *మార్చి 16 ఉదయం 11 గంటల 45 నిమిషాలకు అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం* కానున్నట్లు నోటిషికేషన్‎లో పేర్కొన్నారు. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.
ఆ మరుసటి రోజు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఇక, *2026--27 వార్షిక బడ్జెట్‎ను మార్చి 20న ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం.* కాగా, 2026, ఫిబ్రవరి 23న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో *మార్చి 16 నుంచి 30 వరకు బడ్జెట్ సమావేశాలు* జరపాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.


జనసేనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి
 
- నెల్లూరు సిటీ 3 వ డివిజన్ లో ఉద్యమి కార్యక్రమం భాగంగా స్థానిక హిజ్రాలు పార్టీలో చేరిక
- జనసేన నగర అధ్యక్షుడు సుజయ్‌బాబు
- 3 వ డివిజన్ ఇంచార్జ్ బత్తల శ్రీకాంత్ ఆధ్వర్యం లో సాదరంగా ఆహ్వానించిన దుగ్గిశెట్టి

నెల్లూరు :

జనసేన పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్‌బాబు కోరారు. ఆదివారం 3వ డివిజన్‌లో జనసేన డివిజన్‌ ఇన్‌చార్జి బత్తల శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ రాజీవ్‌ గాంధీ కాలనీలో నివసిిస్తున్న 30 మంది హిజ్రాలు జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇదే విషయాన్ని డివిజన్‌ ఇన్‌చార్జి శ్రీకాంత్‌ ... దీంతో సుజయ్‌బాబు 3వ డివిజన్‌ రాజీవ్‌ గాంధీ కాలనీలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారిచేత ఉద్యమి సభ్యత్వ నమోదు స్వీకరించారు. హిజ్రా నాయకురాలు సునంద ఆధ్వర్యంలో వారు పార్టీలో చేరిన అనంతరం మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ పరిపాలనా విధానాలు నచ్చి పార్టీలో చేరామన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి పార్టీలో చేరడానికి ముందుకు వచ్చామన్నారు

హైదరాబాద్‌లో ₹35,000 లంచం తీసుకుంటూ GHMC ఎగ్జామినర్‌ను ACB అరెస్ట్

సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో పనిచేస్తున్న GHMC అకౌంట్స్ సెక్షన్ ఎగ్జామినర్‌ను లంచం తీసుకుంటూ ACB అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్‌ను GHMC హెడ్ ఆఫీస్‌కు పంపించేందుకు ₹40,000 డిమాండ్ చేసి ₹35,000 స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.

లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది....


మాచర్ల లో జరిగిన జనతా వారధి కార్యక్రమం లో ఒక ఫిర్యాదు స్వీకరించడం జరిగింది

మార్చి నెలలోనే ఎండలు తీవ్రత పెరిగిన నేపథ్యంలో మాచర్ల పట్టణం ప్రధాన రహదారిపై పలుచోట్ల మున్సిపల్ అధికారులు చలివేంద్రం కేంద్రాలు ఏర్పాటు చేయాలని కొత్తపల్లి గ్రామానికి చెందిన బి వెంకట్రావు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఆధ్వర్యంలో రెండు మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్న నేపథ్యంలో ఈ చలివేంద్రాల్లో ఆ వాటర్ వాడాలని ఆయన కోరారు.బిజెపి మాచర్ల పట్టణ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు ఓర్సు క్రాంతి కుమార్ అధ్యక్షతన జనతా వారధి కార్యక్రమం గురువారం జరిగింది. ప్రోగ్రాం కన్వీనర్ బొగ్గవరపు మస్తాన్రావు, కో కన్వీనర్లు ఏచూరి సురేష్, శివ కోటయ్య నాయక్ లు కార్యక్రమం నిర్వహించి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ ఫిర్యాదును మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని ఫిర్యాదురుడికి బిజెపి శ్రేణులు వివరించారు.


దాచేపల్లి మండలంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది

దాచేపల్లి మండలంలో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జనతా వారిది కార్యక్రమం నిర్వహించాము. జనతా వారధి కార్యక్రమంలో భాగంగా విద్యా సంవత్సరం 2026 - 27 కు సంబంధించి RTE ద్వారా 1వ తరగతి ప్రవేశానికి అప్లై చేస్తుండగా వెబ్ ఆప్షన్స్ లో పలు టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యల సంబంధించి దాచేపల్లి మండల విద్యాశాఖ వారి కార్యాలయ అధికారులకు వివరించి వారి ద్వారా జిల్లా విద్యాశాఖ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఈ RTE పాలసీకి కి సంబంధించిన సమస్యను అవకాశం ఉన్నంత  త్వరగా పరిష్కరించాలని కోరుతున్నాము. ఈనెల 10వ తారీకు తో ఆన్లైన్ అప్లికేషన్ గడువు కూడా ముగుస్తుంది.  అప్లికేషన్ పెట్టుకోవడంలో సమస్యలు పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. టోల్ ఫ్రీ నెంబర్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది అవకాశం ఉండి కలిసిన సత్వరం పరిష్కరించుకుండ సంబంధిత వారికి ఇన్ఫామ్ చేస్తాము అంటున్నారు. సత్వర సమస్యలను పరిష్కరిస్తూ ఈ అవకాశం అందరూ వినియోగించుకునేలా చేయాలని కోరడమైనది.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ దాచేపల్లి మండల అధ్యక్షులు కొప్పల నాగేశ్వరరావు గారు, మాజీ అసెంబ్లీ కన్వీనర్ ఆర్య వెంకటేశ్వర్లు గారు పలువురు విద్యార్థి, విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.

నకరికల్లు మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

భారత ప్రధాన మంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన జనతా వారిది కార్యక్రమాన్ని  భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ గారి ఆదేశానుసారం భారతీయ జనతా పార్టీ పలనాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి ఆదేశానుసారం ఈరోజు నకిరేకల్లు మండలంలో జరిగిన జనతా వారధి కార్యక్రమంలో మండల ఇన్చార్జిగా పాల్గొని నకిరేకల్లు మండల చల్లగుల్ల గ్రామం నుంచి వచ్చిన వినతులు స్వీకరించి సంబంధిత అధికారులు పంపించటం జరిగింది. ఈ కార్యక్రమంలో నకిరేకల్లు మండల అధ్యక్షులు మున్వర్ బాజీ గారు, సీనియర్ నాయకులు మరియు ట్రెజర్ ఇర్లా నాగరాజు గారు, తదితర పార్టీ కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


శావల్యాపురం మండలంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది

అందరికీ నమస్కారం కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశా నిర్దేశం మేరకు రాష్ట్ర అధ్యక్షులు  పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు మండల సీనియర్ నాయకులు అడుసుమల్లి వీరేంద్ర గారు ఈపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని గుంటుపాలెం గ్రామంలో స్థానిక బిజెపి నేత అన్నవరపు శ్రీనివాసరావు గారి నిర్వహణలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు ఐదు అర్జీలు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో పూర్తిచేసిన ఇంటింటికి త్రాగునీరు పథకం జేజేఎం స్కీం ప్రారంభించిన పది రోజులకే మరుగున పడిపోయిందని మరల పథకాన్ని పునరుద్ధరించాలని అలాగే గ్రామం లోని పొలాలకు వెళ్లేటువంటి రహదారులు ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద రహదారులు గ్రావెల్ రోడ్లు వేయించాలని అలాగే గ్రామంలో శుభకార్యాలకు వివిధ కార్యక్రమాలకు ఎటువంటి మండపాలు గాని ఫంక్షన్ హాల్ లేనందున బీసీ కమ్యూనిటీ హాల్ మంజూరు చేయించాలని అలాగే పిట్టంబండ మేజర్ పైన కల్వర్టు మంజూరు చేయాలని కోరారు గ్రామస్తుులు పాల్గొన్నారు ు

పిడుగురాళ్ళ పట్టణంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

 ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన జనతా వారిది ప్రోగ్రాం పిడుగురాళ్ల పట్టణ కార్యాలయంలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశి కుమార్ గారి ఆదేశాల తోజరిగినది ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ అధ్యక్షుడు కేతావత్తు శ్రీనివాస నాయక్ పట్టణ ఉపాధ్యక్షురాలు సూర్య పల్లి అంజమ్మ పట్టణ కోశాధికారి వృధా ప్రసాద్ రావు అర్జీలు స్వీకరించడం జరిగింది అర్జీలు వివరాలు పిడుగురాళ్ల పట్నంలో గల సీతారాంపురం తండ నివాసులైన పడితే దుర్గమ్మ పడితే తిరుపతమ్మ గిరిజన మహిళలు ఇంటి స్థలం కొరకు అర్జీలు ఇవ్వడం జరిగినది



యువతకు ఉపాధి, సాంస్కృతిక, చారిత్రక, వారసత్వ పారంపర్య కొనసాగింపే పర్యాటక రంగాభివృద్ధి ప్రధాన లక్ష్యం : ప్రత్తిపాటి

• ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక టూరిజం పాలసీ పర్యాటకాభివృద్ధికి దోహదపడుతుంది
• ప్రభుత్వం ఆకర్షించిన పెట్టుబడుల్లో 28వేల కోట్లు పర్యాటకరంగం పరిధిలోనివే
• ఈ పెట్టుబడులతో 1,22,000లకు పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి
• ప్రభుత్వం పర్యాటక రంగానికి నిధులు పెంచి, కొండవీడు వంటి ప్రదేశాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
• కొండవీడు కోటకున్న చారిత్రక, సాంస్కృతిక ప్రాశస్త్యం, పర్యాటక అనుకూలతలు మరే ప్రదేశానికి లేవు
• కొండవీడును ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న ముఖ్యమంత్రి హామీ నెరవేర్చాల్సిన సమయం వచ్చింది
•  కళలకు పుట్టిల్లు అయిన చిలకలూరిపేటలో గతంలో నిర్మించాలనుకున్న ఆడిటోరియం నిర్మాణాన్ని ప్రభుత్వం వెంటనే పూర్తిచేయాలి.

రాష్ట్ర పర్యాటక రంగాన్ని 2027 నాటికి దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలపాలన్న గొప్ప ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని,  దానిలో భాగంగానే కూటమిప్రభుత్వం పర్యాటక రంగాభివృద్ధికి ప్రత్యేక టూరిజం పాలసీ ప్రకటించిందని మాజీమంత్రి, శాసనసభ్యు లు ప్ర్తతిపాటి పుల్లారావు పేర్కొన్నారు. 
బుధవారం శాసనసభలో బడ్జెట్లో పర్యాటక రంగానికి కేటాయించిన నిధులు -  భవిష్యత్ లక్ష్యాలు అన్న అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ప్రత్తిపాటి మాట్లాడారు. 
 
*రాష్ట్ర పర్యాటక రంగాభివృద్ధికి సమగ్ర టూరిజం పాలసీ* 
రాష్ట్రాభివృద్ధిలో పర్యాటకానిది కీలక పాత్ర అని, పర్యాటకం అంటే కేవలం టూరిస్టులను ఆకర్షించడమే కాదని, స్థానిక యువతకు ఉపాధి, సాంస్కృతిక, చారిత్రక, వారసత్వ వైభవ పారంపర్య కొనసాగింపనే ప్రధాన ఆశయం ఇందులో ఇమిడి ఉందని ప్రత్తిపాటి పేర్కొన్నారు. రాష్ట్ర సాంస్కృతిక, చారిత్రక విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేయాలన్న గొప్ప లక్ష్యంకూడా  ఇందులో ఉందన్నారు.  అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర పర్యాటక బ్రాండ్ బలోపేతంలో గానీ, సమగ్ర నూతన టూరిజం పాలసీ ప్రకటన,  యువతకు విస్తృత ఉపాధి అవకాశాల సృష్టిలో గానీ ప్రభుత్వం ఇప్పటికే తొలి అడుగు వేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేని కూటమి ప్రభుత్వం పర్యాటకాభృద్ధికి సమగ్ర టూరిజం పాలసీ తీసుకొచ్చిందని ప్రత్తిపాటి చెప్పారు. ప్రభుత్వం ఆకర్షించిన పెట్టుబడుల్లో 28వేలకోట్లు టూరిజం  శాఖ పరిధిలోనివేనని, వాటివల్ల 1,22,000లకు పైగా ఉద్యోగావకాశాలు రాష్ట్రయువతకు లభిస్తాయని ఆయన తెలిపారు.

*పర్యాటక రంగానికి ప్రభుత్వం నిధులు పెంచాలి ..* 
 పర్యాటక రంగానికి ప్రభుత్వం నిధుల కేటాయింపు పెంచాలని, రూ.439 కోట్ల కేటాయింపులు సరిపోవని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. అలానే ప్రభుత్వ నిర్వహణలోని వివిధ ఉత్సవాలకు 186.27 కోట్లు కేటాయించాలని, ఈ నిధులుకూడా పెంచాలన్నారు. 
కూటమిప్రభుత్వం వచ్చాకే రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ట్రేడ్ ఫెయిర్లు, వివిధ రకాల ఉత్సవాలు, ప్రభుత్వ పండుగలు, తిరునాళ్ల నిర్వహణ గతంలో ఎన్నడూ లేనివిధంగా వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో వీటి నిర్వహణకు నిధులు కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.  

*కొండవీడు వంటి చారిత్రక ప్రదేశం మరోటి లేదు* *కొండవీడు అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరించని పక్షంలో రాష్ట్రప్రభుత్వమే ప్రత్యేక నిధులు కేటాయించాలి*  
2019 ఫిబ్రవరిలో అప్పటి, ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలిసారి కొండవీడు ఉత్సవాలు ప్రారంభించారని, అప్పుడు కొండవీడు కోట ఘాట్ రోడ్డుకు అనుసంధానిస్తూ, చౌడవరం నుంచి టన్నెల్ నిర్మించి 5 కి.మీ రోడ్డువేస్తామని చెప్పారని ప్రత్తిపాటి పేర్కొన్నారు.  అదే సమయంలో కొండవీడును ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించారన్నారు. సీఆర్డీఏ పరిధిలో కొండవీడును మించిన గొప్ప పర్యాటక, చారిత్రక ప్రదేశం మరోటి లేదన్న ప్రత్తిపాటి. ఆ ప్రాంత అభివృద్ధికి తాజా బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కొండవీడు అభివృద్ధికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.110కోట్ల డీపీ ఆర్ ను కేంద్రానికి పంపినట్టు పర్యాటక శాఖ మంత్రి తెలియచేశారన్నారు. కేంద్రం పూర్తిగా సహకరిస్తే ఇబ్బందిలేదని, లేని పక్షంలో రాష్ట్ర  ప్రభుత్వం కొండవీడు అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని ప్రత్తిపాటి కోరారు. చిలకలూరిపేటలో గతంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,  మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆడిటోరియం నిర్మాణాన్ని ప్రారంభించారని, అది నేటికీ పూర్తికాలేదని ప్రత్తిపాటి చెప్పారు. కళలకు పుట్టిల్లు అయిన చిలకలూరిపేటలో నిర్మించాలనుకున్న  ఆడిటోరియాన్ని ప్రభుత్వం టూరిజం శాఖ పరిధిలోకి చేర్చి తక్షణమే పూర్తయ్యేలా చూడాలని ప్రత్తిపాటి విజ్ఞప్తిచేశారు. కూటమిప్రభుత్వ సంక్షేమపథకాలతో పాటు, ప్రధానంగా స్త్రీశక్తి పథకం వల్ల ప్రభుత్వం నిర్వహించే ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, తిరునాళ్లకు మహిళల తాకిడి బాగా పెరిగిందని ప్రత్తిపాటి చెప్పారు. ఈ నేపథ్యంలో పర్యాటక ప్రదేశాల్లో మహిళలకు ప్రత్యేక వసతులు, భద్రతాంశాలపై ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు.