kapunews



TRENDING NOW


 
 
 
Income Tax: నేటి నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం

*పలు నిబంధనల్లో మార్పులు*

 *ఆరు దశాబ్దాల నాటి పాత ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో నేటి నుంచి (ఏప్రిల్‌ 1) కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమల్లోకి వచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభమైన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం పన్ను నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ ఫైనాన్స్‌ చట్టం-2025ను నోటిఫై చేసింది. దేశ పన్నుల విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు కొత్త చట్టం సిద్ధమయ్యింది. ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్‌పై సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (ఎస్‌టీటీ) పెంపు, విదేశీ విహార ప్యాకేజీలు, విద్య-వైద్యం నిమిత్తం విదేశాలకు పంపే మొత్తంపై పన్ను తగ్గింపు.. ఇలా ఎన్నో కీలక నిబంధనలు బుధవారం నుంచి అమల్లోకి  వస్తున్నాయి.*

*సులభంగా.. సరళంగా*

*పన్ను విధానాన్ని మరింత సులభంగా అర్థమయ్యేలా మార్చడమే కొత్త చట్టం లక్ష్యం. దీనిలో అసెస్‌మెంట్‌ ఇయర్, ప్రీవియస్‌ ఇయర్‌ అనే వ్యత్యాసాలను తొలగించి, ఒకే ‘ట్యాక్స్‌ ఇయర్‌’ విధానాన్ని తీసుకొచ్చారు. గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్‌ (ఇన్‌కంట్యాక్స్‌ రిటర్నులు) దాఖలు చేసినప్పటికీ, ఎలాంటి జరిమానా లేకుండా, టీడీఎస్‌ (మూలం వద్దే పన్ను) రిఫండ్‌ను క్లెయిం చేసుకునే వెసులుబాటు కల్పించారు.*

 *2026 జులైలో (2025-26 ఆదాయానికి సంబంధించిన) దాఖలు చేసే ఐటీఆర్‌లు పాత చట్టం నిర్దేశించిన ఫారాల ప్రకారమే సమర్పించాల్సి ఉంటుంది.*

*2026 జూన్‌ నుంచి చెల్లించే ముందస్తు పన్ను (ట్యాక్స్‌ ఇయర్‌ 2026-27 కోసం) మాత్రం కొత్త చట్టం ప్రకారం చెల్లించాలి. ఈ మార్పుల నేపథ్యంలో పాత, కొత్త చట్టాలకు సంబంధించిన సేవలను ఐటీ శాఖ ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌ పారదర్శకంగా అందిస్తుందని ఆదాయపు పన్ను విభాగం స్పష్టం చేసింది.*

*7 ఐటీఆర్‌ ఫారాలు జారీ..*

*2026-27 మదింపు సంవత్సరానికి  ఆదాయపు పన్ను విభాగం మొత్తం 7 ఐటీఆర్‌ ఫారాలను నోటిఫై చేసింది. మార్చి 30న చిన్న, మధ్య తరహా పన్ను చెల్లింపుదారుల కోసం ఐటీఆర్‌ 1-4 ఫారాలను జారీ చేయగా, మంగళవారం ఐటీఆర్‌ 2, 3, 5, 6, 7తో పాటు ఐటీఆర్‌- యూ (అప్‌డేటెడ్‌ రిటర్న్స్‌) ఫారాలనూ నోటిఫై చేసింది. ఆడిట్‌ అవసరం లేని వారికి ఐటీఆర్‌ దాఖలు చేసేందుకు జులై 31 వరకు గడువు ఉంది.*

*ఐటీఆర్‌-1 (సహజ్‌), ఐటీఆర్‌-4(సుగమ్‌): వార్షికాదాయం రూ.50 లక్షల లోపు ఉండి, వేతనం, ఒక ఇంటిపై ఆదాయం పొందేవారు సహజ్‌ దాఖలు చేయాలి. వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందే వారు సుగమ్‌ సమర్పించాలి.*

*వ్యాపార లాభాలు లేకుండా మూలధన లాభాలు పొందేవారు ఐటీఆర్‌-2, సొంత వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందేవారు ఐటీఆర్‌-3, సంస్థలు, ఎల్‌ఎల్‌పీలు ఐటీఆర్‌-5, కంపెనీలు ఐటీఆర్‌-6, ట్రస్టులు ఐటీఆర్‌-7 ఫారాలను ఉపయోగించాలి.*

*ఎస్‌టీటీ పెంపు..*

*స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌ కారణంగా చిన్న మదుపర్లు తీవ్రంగా నష్టపోకుండా రక్షించేందుకు, ఈక్విటీ డెరివేటివ్స్‌ (ఎఫ్‌అండ్‌ఓ) విభాగంలో సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (ఎస్‌టీటీ)ను పెంచారు.*

*ఫ్యూచర్స్‌ కాంట్రాక్టులపై ఎస్‌టీటీ    0.02% నుంచి 0.05 శాతానికి చేరింది.*

*ఆప్షన్స్‌ ప్రీమియంపై 0.1% నుంచి 0.15 శాతానికి, ఆప్షన్స్‌ ఎక్సర్‌సైజ్‌పై  0.125% నుంచి 0.15 శాతానికి మారింది. సెబీ అధ్యయనం ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌అండ్‌ఓ విభాగంలో మదుపరులు ఏకంగా రూ.1.05 లక్షల కోట్ల నికర నష్టాలను చవిచూశారు. ఈ విభాగంలో మదుపరుల సంఖ్య 2024-25లో 1.06 కోట్లు ఉండగా, 2025-26 డిసెంబరుకు 75.43 లక్షలకు పడిపోయింది.*

*టీసీఎస్‌పై ఊరట*

*మధ్యతరగతి ప్రజలకు ఊరటనిస్తూ, విదేశీ టూర్‌ ప్యాకేజీలపై మూలం వద్ద పన్ను వసూలు (టీసీఎస్‌)ను 20% నుంచి 2 శాతానికి కుదించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ (లిబరలైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీం) కింద వైద్య, విద్యా అవసరాల కోసం విదేశాలకు పంపే నిధులపై టీసీఎస్‌ను ప్రస్తుత 5% నుంచి 2 శాతానికి తగ్గించారు.*

*బైబ్యాక్‌ షేర్లపై..*

*ఏప్రిల్‌ 1 నుంచి కంపెనీల బైబ్యాక్‌ ఆఫర్లలో షేర్లను విక్రయించడం ద్వారా ఆర్జించే మూలధన లాభాలపై వ్యక్తులు లేదా కార్పొరేట్‌ వాటాదారులకు 12% సర్‌ఛార్జీ విధించనున్నారు. గతంలో రూ.50 లక్షల వరకు సర్‌ఛార్జీ ఉండేది కాదు. రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి మధ్య ఆదాయం ఉంటే 10% సర్‌ఛార్జీ ఉండేది. ఈ కొత్త నిబంధనతో పన్ను చెల్లింపుదారులపై పన్ను భారం పెరగనుంది.*


 
 
యడ్లపాడు ఆంజనేయ స్వామి ఆలయ ఆభరణాల దొంగతనం..
 
*నిందితుడి అరెస్ట్, 230 గ్రాముల సొత్తు స్వాధీనం...*

యడ్లపాడు: భక్తితో నమ్మకంగా కొలిచే ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన వెండి,బంగారు ఆభరణాల దొంగతనంతో సంబంధం ఉన్న కేసులో ఎడ్లపాడు ఎస్సై శివరామకృష్ణ మరియు సిబ్బంది ఓ నిందితుడిని అరెస్ట్ చేసి 230 గ్రాముల వెండి‑బంగారు సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 

*నిందితుడి అరెస్ట్ వివరాలు..*

యడ్లపాడు గ్రామానికి చెందిన 43 ఏళ్ల మద్దుల రమణారావు (తండ్రి: మద్దుల హనుమంతరావు)ను తెనాలి టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న బజారు ప్రాంతంలో 2026, మార్చి 31వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు.అతనిపై యడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నెం. 17/2026 కింద U/S 303(2), 305(d), 306 BNS సెక్షన్లతో పాటుగా దర్యాప్తు కొనసాగించండంతో ఆయన అదుపులోకి తీసుకున్నారు.ఆభరణాల దాచిన స్థలం,స్వాధీనం అరెస్ట్ అనంతరం తన వాంగ్మూలంలో నిందితుడు దొంగిలించిన ఆస్తులను కనమర్లపూడిలోని శ్రీహరిరావు ఇంటి వద్ద దాచినట్లు తెలిపాడు. దీనిమేరకు దర్యాప్తు అధికారి మధ్యవర్తుల సమక్షంలో సంబంధిత ప్రదేశానికి చేరుకుని ఆభరణాలను సీజ్ చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న ఆభరణాలన్నీ యడ్లపాడు ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన చోరీ సొత్తే అని అధికారులు గుర్తించారు.

*స్వాధీనమైన ఆభరణాల వివరాలుసీజ్..*

వెండి వస్తువులు (మొత్తం 216 గ్రాములు)తమలపాకుల తోరణం – 142 గ్రాములునామాలు మరియు నేత్రాలు – 42 గ్రాములురెండు జతల ఉత్తర జంద్యాలు – 14 గ్రాములుమెట్టెలు మరియు పిల్లేళ్లు – 20 గ్రాములుబంగారు ఆభరణాలు (మొత్తం 14 గ్రాములు)మంగళసూత్రం – 4 గ్రాములురెండు జతల బంగారు నేత్రాలు – 10 గ్రాములుపై ఆస్తులను ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో గుర్తించి, తదుపరి దర్యాప్తు కోసం పోలీసులు సీజ్ చేశారు. నిందితుడు మద్దుల రమణారావును అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ కు తరలించి,కేసులో ఇతర అంశాలు, మధ్యవర్తి పాత్రలపై కూడా క్లుప్త దర్యాప్తు చేపడుతున్నామని ఎస్ఐ శివరామకృష్ణ తెలిపారు.


 
 
రాబోయే రోజుల్లో అమరావతిని ఎవరూ టచ్‌ చేయలేరు

*సీఎం చంద్రబాబు*

ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుకు ఈరోజు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం సుమారు రెండు గంటలపాటు దీనిపై చర్చ జరిగింది. టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌, వైఎస్సార్సీపీ, సమాజ్‌వాదీ సహా పలు పార్టీల ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. అనంతరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్‌ స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్‌ ప్రకటించారు. ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది.

అమరావతికి చట్టబద్ధత బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడం ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. రాబోయే రోజుల్లో అమరావతిని ఎవరూ టచ్‌ చేయలేరన్నారు. అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని సీఎం పేర్కొన్నారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లా వింజమూరులో పర్యటించారు. లబ్ధిదారులకు ఆయన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు.

అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. స్వర్ణాంధ్రకు ఆరు సూత్రాలతో ముందుకు వెళ్తున్నామన్నారు. గత 5 ఏళ్లు అరాచక, విధ్వంస పాలన సాగిందని అన్నారు. "నా జీవితంలో ఇలాంటి వ్యక్తిని, పార్టీని చూడలేదు. వైఎస్సార్సీపీది మూడు ముక్కలాట, మూడు రాజధానులు నినాదం, ప్రత్యేక శాసనసభ ఏర్పాటు పెడితే కనీసం అసెంబ్లీకి కూడా రాలేదు. మాది వైఎస్సార్సీపీ అని చెప్పుకునేందుకు ఆ పార్టీ నేతలు సిగ్గు పడాలి" అని సీఎం చంద్రబాబు జగన్​పై మండిపడ్డారు.

రాజధాని మీద దుష్ప్రచారం చేశారన్నారు. ముంపు ప్రాంతం, శ్మశానం అంటూ హేళన చేశారని సీఎం అన్నారు. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా పింఛన్లు పెంచి ఇస్తున్నామని పేర్కొన్నారు. నెలకు రూ.2730 కోట్లు ఖర్చు పెడుతున్నామని వెల్లడించారు. ఇప్పటికే రూ.60 వేల కోట్లు పింఛను కింద అందించామని చెప్పారు. స్టూడెంట్స్ స్కూల్​కి వెళ్లేలోపు తల్లుల అకౌంట్​లో డబ్బులు వేస్తున్నామన్నారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. శ్రీశైలం, పోలవరం వాటర్ ఉదయగిరికి కూడా వస్తాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు P4ను తీసుకొచ్చామని, 25 వేల కుటుంబాలను దత్తత తీసుకునేందుకు అదానీ సిద్ధంగా ఉన్నారని సీఎం అన్నారు.

వింజమూరులో ఏర్పాటు చేసిన డీఆర్డీఓ రక్షణ ఉత్పత్తుల స్టాల్​ను సీఎం పరిశీలించారు. సూక్ష్మ సేద్యం ద్వారా పండించిన పామాయిల్, జొన్న, బొప్పాయి తదితర పంటలకు సంబంధించిన స్టాళ్లను సందర్శించారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి ఎన్ఎండీ ఫరూక్, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్​, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కంభం విజయరామిరెడ్డి, వంటేరు వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.


 
 
 
మగ్గాలకు ఉచిత విద్యుత్... కొత్త వెలుగుల దిశగా నేతన్నల భవిష్యత్ : ప్రత్తిపాటి

•పవర్ లూమ్స్ కు నెలకు 500 యూనిట్లు,  
హ్యండ్ లూమ్స్ కు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై నేతన్నల్లో హర్షాతిరేకాలు.
• చేనేత కార్మికుల సభలో మాజీమంత్రి ప్రత్తిపాటి.

నేతన్నల జీవితాల్లో కూటమి ప్రభుత్వం కొత్త వెలుగులు నింపిందని, హ్యాండ్ లూమ్స్ కు (చేతి మగ్గాలు) నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్  (మరమగ్గాలు) కు నెలకు 500 యూనిట్ల ఉచిత  విద్యుత్ అందిస్తామన్న యువగళం హామీని మంత్రి నారా లోకేశ్ నెరవేర్చాడని, ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 1.05 లక్షల చేనేత కుటుంబాలకు లబ్ధి కలగనుందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.  

చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ, స్థానిక నేతన్నలు బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో ప్రత్తిపాటి మాట్లాడారు.

*ఆర్థిక భారం తగ్గడంతో పాటు.. సాంప్రదాయ చేనేతకు ఊతం*
చంద్రబాబు నాయకత్వంలోని కూటమిప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంతో చేనేత కార్మికులకు ఆర్థిక భారం తగ్గుతుందని ప్రత్తిపాటి చెప్పారు. నెలకు 200 యూనిట్లు, 500 యూనిట్ల ఉచిత విద్యుత్ వ్యయం తగ్గినందున కార్మికులు పనితీరు మెరుగుపడుతుందన్నారు. ముఖ్యంగా సాంప్రదాయ చేనేత వర్గాలకు ఈ నిర్ణయం ఊతంగా నిలుస్తుందన్నారు. 

*నేతన్నల సంక్షేమమే కూటమిప్రభుత్వ లక్ష్యం..*
నియోజకవర్గంలో చేతి మగ్గాలు 93 వేలుంటే, పవర్ లూమ్స్ 11,458 వరకు ఉన్నాయని, చేతి మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను ప్రభుత్వం అందిస్తోందన్నారు.  నేతన్నల సంక్షేమమే లక్ష్యంగా కూటమిప్రభుత్వం వారికి రాయితీపై రుణాలు, యాంత్రీకరణ పరికరాలను కూడా సమకూరుస్తోందన్నారు. ఉచిత విద్యుత్ పొందడానికి అర్హత ఉన్న నేతన్నలు తమ వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ప్రయోజనాలు పొందవచ్చని ప్రత్తిపాటి సూచించారు. మగ్గాలకు ఉచిత విద్యుత్ అందించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై నేతకుటుంబాల్లో హార్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయన్నారు. 

కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్,పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర నాయకులు ఇనగంటి జగదీష్, క్లస్టర్ ఇంచార్జీలు మద్దిబోయిన శివ, గంజి శ్రీనివాసరావు, బేరింగ్ మౌలాలి,  మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, టీడీపీ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


   *11,800 ల కోట్ల రూపాయలు ఈ 18 నెలల చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గార్ల పాలనలో గ్రామ పంచాయితీలకు   నిధులు విడుదల చేయడం జరిగింది. ఇది చారిత్రాత్మకం.... Y. V. B.రాజేంద్రప్రసాద్* 



 
 
 
స్వర్ణ యుగం లో గ్రామ పంచాయతీ లు, గ్రామీణ ప్రజలు... రాజేంద్రప్రసాద్

 *అభివృద్ధితో గ్రామాలు కళకళ లాడుతున్నాయి.... రాజేంద్రప్రసాద్
శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం గ్రామపంచాయతీ సర్పంచ్ పిన్నింటి బానోజీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలలో  ఎమ్మెల్యే శ్రీ ఎన్ ఈశ్వరరావు గారి తో కలిసి ముఖ్యఅతిథిగా  పాల్గొని సిమెంటు రోడ్లను  ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై. వి.బి. రాజేంద్రప్రసాద్ ప్రారంభించినారు_ ..

       ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈశ్వర్ రావు గారి నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ  15వ ఆర్థిక సంఘం నిధులు 4600 కోట్ల రూపాయలు మరియు ఉపాధి హామీ నిధులు పల్లె పండుగ 1&2 క్రింద 7 200 కోట్ల రూపాయలు మొత్తం 11, 800 కోట్ల రూపాయలు గ్రామ పంచాయితీలకు ఈ 18 నెలల  పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ ప్రజల అవసరాల కోసం  గ్రామపంచాయతీలకు విడుదల చేశారని, ఈ నిధులతో సిమెంట్ రోడ్లు,డ్రైనేజీలు మొదలగు అభివృద్ధి కార్యక్రమాలు 13 200 గ్రామాలలో రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా చేస్తున్నారని రాజేంద్రప్రసాద్   పేర్కొన్నారు.

          ఈ విధంగా గతంలో ఎప్పుడు గ్రామీణ ప్రజలకు ఇన్ని వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం జరగలేదని, ఇది గ్రామపంచాయతీలకు స్వర్ణ యుగమని, ఇది న భూ తో న భవిష్యత్ అని,అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలోని గ్రామాలన్నీ కళకళలాడుతున్నాయని, గ్రామీణ ప్రజలు సంతోషంగా ఉన్నారని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.

         గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గ్రామ పంచాయతీల నిధులు దారి మళ్ళించి, నిధులను దొంగిలించి  గ్రామాలు అభివృద్ధి చేయకుండా గ్రామీణ ప్రజలను జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని, అందుకనే మా పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో సర్పంచులు పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు,ఆందోళనలు, పోరాటాలను చేయడం జరిగిందని ఆ పోరాటాల ఫలితంగా ఇప్పుడు గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.

            ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈశ్వర్ రావు గారు మాట్లాడుతూ తన ఎచ్చర్ల నియోజకవర్గం లోని 130 గ్రామపంచాయతీలలో పంచాయతీరాజ్ నిధులు  551 కోట్ల రూపాయలు తో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఆ నిధులు కార్యక్రమాల నిర్వహణ  ఆయా గ్రామాల సర్పంచులకే అప్పగించానని, గ్రామాల అభివృద్ధి కోసం రాజేంద్రప్రసాద్ గారు వారి నాయకులు చారిత్రకమైన ఉద్యమాలు చేశారని కొనియాడారు,, భవిష్యత్తులో ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గార్ల సహకారంతో ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని ఈశ్వరరావు  పేర్కొన్నారు.

               ఈ సందర్భంగా  ఎన్నో పోరాటాలు చేసి వేల కోట్ల రూపాయల నిధులు సాధించిన పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ గారికి  వారి రాష్ట్ర కమిటీ నాయకులకు ఎమ్మెల్యే ఈశ్వర్ గారు మరియు సర్పంచులు శాలువాలు  పూలదండలు తో ఘనంగా సత్కరించినారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఈశ్వరరావు గారిని కూడా సత్కరించినారు.

          ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వినోద్ రాజు,అనేపు రామకృష్ణ నాయుడు ,అనకాపల్లి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు చింతకాయల ముత్యాలు,సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యన్.రజిని ,రాష్ట్ర కార్యదర్శులు రౌతు శ్రీనివాస్,అప్పలనాయుడు విజయనగరం జిల్లా పంచాయితీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు గేదుల రాజా రావు,విజయనగరం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు సోము నాయుడు తదితరులు పాల్గొన్నారు



అమరావతి రాజధాని కాదు..భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పే ప్రజాస్వామ్య సౌథం : ప్రత్తిపాటి

• రాజకీయ విధ్వంసకుడు లిఖించిన నెత్తుటి చరిత్రకు ప్రతిరూపం అమరావతి : ప్రత్తిపాటి
• చంద్రబాబు నిర్మిస్తున్నది కేవలం రాజధాని కాదు... ప్రపంచం గర్వించే ప్రజాస్వామ్య సౌథం : ప్రత్తిపాటి
• అమరావతి చట్టబద్ధతకు ఆమోదం ప్రజల త్యాగాన్ని గౌరవించడమే : ప్రత్తిపాటి

“ అమరావతికి చట్టబద్ధత... తెలుగు ప్రజల భవిష్యత్ కు చెక్కుచెదరని భద్రత. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలపై ఉన్నతరిగిపోని నిబద్ధత.. ప్రజాస్వామ్య పరిరక్షణ పట్ల దేశ పాలకులకున్న నిజమైన కృతజ్ఞత. కూటమిప్రభుత్వ అభివృద్ధికి అవసరమైన స్థిరత్వానికి చట్టబద్ధత. రైతుల  హక్కులకు, మహిళల ఆశలకు, యువత లక్ష్యాలకు సమగ్ర ప్రతిఫలత.

 అమరావతి మా హక్కు.. మా భవిష్యత్. నా రాష్ట్ర ప్రజల హక్కుల ప్రతీక. భూములిచ్చిన రైతులతో పాటు.. రాష్ట్ర ప్రజల భవిష్యత్ ను కూటమి ప్రభుత్వం అమరావతిగా నిర్మిస్తోంది.  అమరావతి కేవలం రాజధాని కాదు...  5 కోట్ల ప్రజల ఆశలు, ఆవేశాలు, ఆకాంక్షలు, ఆత్మగౌరవాల కలబోత. గత 12 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్న మాటల్లో వర్ణించలేని హృదయవేదన. అమరావతి నగరం  రైతుల చెమట.. మహిళల కన్నీరు.. ప్రజల కలలతో నిర్మితమవుతోందనేది జగమెరిగిన సత్యం.. జగన్ఎప్పటికీ గుర్తించలేని కఠోర వాస్తవం. 
అలాంటి విశ్వ నగరానికి చట్టబద్ధతతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ధర్మం, న్యాయం, చట్టం ప్రజల వైపే ఉన్నాయని చాటి చెప్పాయి. అమరావతి చట్టబద్ధతకు ఆమోదం ప్రజల త్యాగాన్ని గౌరవించడమే. చంద్రబాబు అమరావతిని మాత్రమే నిర్మించడం లేదు.. ప్రపంచం గర్వించే, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడించే గొప్ప ప్రజాస్వామ్య సౌధాన్ని నిర్మిస్తున్నారు.

*రాజకీయ విధ్వంసకుడి రక్త చరిత్రకు మరో రూపం..*
అమరావతి విధ్వంసం  లక్ష్యంగా సాగిన జగన్ పాలన... 5 కోట్ల ప్రజలకు మిగిల్చిన నెత్తుటి గాయాలకు సజీవ సాక్ష్యం. మహిళల మానప్రాణాలపై రాక్షసమూకలు వేసిన అభాండాలు, అపనిందలకు, వాటిని ఎదుర్కొన్న వారి పోరాటపటిమకు ప్రతిరూపం.. త్యాగధనులైన భూమిపుత్రుల నెత్తుటి సిరాతో స్వార్థపరుడైన రాజకీయ విధ్వంసకుడు లిఖించిన రక్తచరిత్రకు మరో రూపం మా అమరావతి. 

*అమరావతిపై జగన్ వైఖరి.. ఏటి మల్లన్న, బోడిమల్లన్న తీరుగా ఉంది..*
అధికారంలో ఉన్నప్పుడు పలురకాలుగా.. ప్రజల చేతిలో భంగపడ్డాక మరో తీరుగా మాట్లాడటం పచ్చి అవకాశవాది, అస్యతవాది.. అవినీతిపరుడైన జగన్ కే చెల్లింది. అమరావతిపై జగన్ చెప్పే కట్టుకథల్ని ప్రజలు ఎప్పటికీ విశ్వసించరు. ప్రజా రాజధానిపై ఆయన వైఖరి ముమ్మాటికీ ఏటిమల్లన్న..బోడి మల్లన్న తీరుగానే ఉంది. కేంద్రం అమరావతికి చట్టబద్ధత కల్పించినందునే జగన్ రాజధానిపై గతంలో పాడిన రాగాన్నే కాస్త మార్చి పాడుతున్నాడు. 

*నాడు జగన్ కు ప్లాన్ లు.. ప్రతిపాదనలు గుర్తురాలేదా?*
అమరావతి నిర్మాణంపై ఇప్పుడు ప్లాన్ లు.. ప్రతిపాదనలు అంటున్న జగన్ ఐదేళ్లపాటు.. ప్రజల ఆకాంక్షల్ని ఎందుకు పట్టించుకోలేదు? రైతుల త్యాగాల్ని అపహాస్యం చేసి, వారిని చిత్రహింసలకు గురిచేసినప్పుడు జగన్ కు రాజధాని ప్రణాళికలు గుర్తురాలేదా? గతప్రభుత్వం రాజధాని రైతులకు  కేటాయించిన ప్లాట్లను ఇతరులకు కేటాయించడమేనా జగన్ దూరదృష్టి చర్య? రాజధాని ప్రాంత మహిళల్ని వేశ్యలతో పోల్చిన సంస్కార హీనులు.. నేడు అమరావతికి అనుకూలమంటూ సన్నాయి నొక్కులు నొక్కడం సిగ్గుచేటు. అవినీతి, అధికారం, దోపిడీ, ధన దాహాలపై తప్ప, మరే అంశంపైనా జగన్ కు స్పష్టత లేదనే నిజం ప్రజలు గ్రహించాలి.  అమరావతి నిర్మాణ ఖ్యాతిని తనదిగా చెప్పుకునేందుకే మాజీసీఎం ‘జగన్నా’టకాలు మొదలెట్టాడు.” అని మాజీమంత్రి ప్రత్తిపాటి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.


ఎన్నిక‌ల బ‌రిలో స్టార్ ద‌ర్శ‌కుడుః విజ‌య్ వ‌ద్ద‌నుకున్న చోట‌..

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల వేడి ప‌తాక స్థాయికి చేరుకుంటోంది. పోలింగ్ గ‌డువు స‌మీపిస్తోన్న కొద్దీ అక్క‌డి వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది. సీట్లు, నియోజ‌క‌వ‌ర్గాల పంప‌కాల్లో ఆయా పార్టీల అగ్ర‌నేత‌లు తీరిక లేకుండా గ‌డుపుతున్నారు. డీఎంకే, అన్నా డీఎంకే, టీవీకే.. ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నాయి. గెలిచి తీరాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ ప్ర‌తివ్యూహాల‌ను రూపొందించుకుంటోన్నాయి
ఏప్రిల్ 9వ తేదీన కేరళ, అదే నెల 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఒకేదశలో ఇవి ముగుస్తాయి. మే 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికలు ఎదుర్కొంటోన్న నాలుగు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది. ఈ రాష్ట్రంతో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరీ ఉన్నాయి
ఈ ప‌రిణామాల మ‌ధ్య ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుంద‌ర్ సీ రాజ‌కీయ అరంగేట్రం చేశారు. ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్నారు. మ‌ధురై సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుండి బ‌రిలో నిలిచారు. పుదియ నీథి క‌చ్చి (పీఎన్కే) అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. పీఎన్కే.. అన్నా డీఎంకే మిత్ర‌ప‌క్షం. 2001లో ఆర‌ణి చొక్క‌లింగం ష‌ణ్ముగం ఈ పార్టీని నెల‌కొల్పారు. ఈ ఎన్నిక‌ల్లో అన్నా డీఎంకేతో జ‌ట్టు క‌ట్టింది
సీట్ల పంప‌కాల్లో భాగంగా మ‌ధురై సెంట్ర‌ల్ నియోజ‌కవ‌ర్గాన్ని ద‌క్కించుకుంది. ఇక్క‌డి నుండి సుంద‌ర్ సీ పోటీ చేస్తార‌ని ష‌ణ్ముగం ప్ర‌క‌టించారు. ఇది ఆయనకు తొలి అసెంబ్లీ ఎన్నిక. పొత్తులో భాగంగా పీఎన్కే కు రెండు స్థానాలు దక్కాయి. ఇందులో మ‌ధురై సెంట్రల్ ఒక్క‌టి. రెండవ అభ్యర్థిని త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డించారు.

నటి ఖుష్బూ తర్వాత ఆమె భర్త సుందర్ సఈ కూడా ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. దర్శకుడు, నటుడు, గాయకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాతగా సుందర్ సీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడే. ఆయ‌న తీసిన హార్ర‌ర్ కామెడీ సినిమాల సిరీస్ ఆర‌ణ్మ‌నై.. తెలుగులో చంద్ర‌క‌ళ‌, క‌ళావ‌తి, అంతఃపురం, బాక్ పేర్ల‌తో డ‌బ్ అయ్యాయి.


 
 
నేటి నుంచి మూడు నెలల రేషన్ కోటా పంపిణీ

రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్‌ న్యూస్. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి రేషన్ షాపుల్లో మూడు నెలల రేషన్ కోటా పంపిణీ చేయనున్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి బియ్యం, ఇతర వస్తువులు పంపిణీ చేస్తారు. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి మొత్తం 18 కేజీల బియ్యం అందిస్తారు. అంత్యోదయ కార్డులు ఉన్నవారికి నెలకు 35 కేజీల చొప్పున 105 కిలోల రేషన్ అందుతుంది. గత వర్షాకాలంలోనూ ఒకేసారి మూడు నెలల రేషన్‌ పంపిణీ చేసిన విషయం తెలిసిందే.

వినియోగదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన సిలిండర్ ధర

దేశ వ్యాప్తంగా LPG కొరత ఉన్న నేపథ్యంలో సామాన్యులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెరిగిపోయింది.

ప్రతి నెల ఒకటో తేదీన ధరల మార్పు ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచాయి ఆయిల్ కంపెనీలు. 19 కేజీల సిలిండర్ పైన రూ.195.50 పెంచుతూ ఆయిల్ కంపెనీలు షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాయి.

గత నెలలో ఇదే సిలిండర్ పై రూ.115 పెంచిన సంగతి తెలిసిందే. ఇక ఈ నెల దాదాపు మరో వంద రూపాయలు పెరిగింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో భారత దేశ వ్యాప్తంగా ఎల్పీజీ కొరత ఏర్పడింది. ఈ క్రమంలోనే సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి. అయితే, డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు జరుగలేదు. దీంతో గృహవినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు.



మారనున్న Loan Rules: 

లోన్స్ తీసుకునేవారికి అలర్ట్... ఏప్రిల్ 1 నుంచి 5 కొత్త రూల్స్

ప్రతి వ్యక్తికి సులభమైన రుణం, వేగవంతమైన క్రెడిట్ స్కోరు అప్‌డేట్స్, అదనపు నామినీలు... ఇలా 2026 ఏప్రిల్ నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకువచ్చిన కొత్త రూల్స్ రుణాలు తీసుకునేవారిపై ప్రభావం చూపిస్తాయి. ఏప్రిల్ 1 నుండి 5 పెద్ద రుణ మార్పులు అమలులోకి వస్తాయి. రుణాల నియమాలు 2026లో వ్యక్తులకు తేలికైన, పారదర్శకమైన రుణ అనుభవం ఇవ్వడానికి కొన్ని కొత్త రూల్స్ ప్రకటించబడ్డాయి.

ఈ మార్పులు రుణాలు తీసుకునేవారు, ఆభరణ వ్యాపారులు, బ్యాంక్ ఖాతాదారులపై ప్రభావం చూపనున్నాయి. క్రెడిట్ స్కోరు వేగంగా అప్‌డేట్ అవ్వడం నుండి ప్రీ పేమెంట్ ఛార్జీలు లేని పరిస్థితులు వరకు, ఈ సంస్కరణలు వ్యక్తిగత ఆర్థిక వ్యవస్థను సులభం, ఫ్లెక్సిబుల్ చేస్తాయి. ముందుగా, ఖాతాదారులు ఇప్పుడు 4 నామినీల వరకు చేర్చుకోవచ్చు. ఇది బ్యాంక్ ఖాతాలు, బ్యాంక్ లాకర్లు రెండింటికీ వర్తిస్తుంది. ఈ మార్పు ఆర్థిక భద్రతను పెంచుతుంది. అనుకోని పరిస్థితుల్లో కుటుంబ ఆస్తులను సులభంగా నిర్వహించగలుగుతుంది. 

రెండవది, క్రెడిట్ స్కోరు అంటే CIBIL స్కోరు. ఇక ప్రతి 7 రోజులకు ఈ స్కోరు అప్‌డేట్ అవుతుంది. ఇప్పటివరకు నెలకు ఒక్కసారి మాత్రమే అప్‌డేట్ అవుతుండేది. ఇప్పుడు ప్రతి నెల 7, 14, 21, 28వ తేదీల్లో క్రెడిట్ స్కోరు అప్‌డేట్ అవుతుంది. దీని వల్ల రుణ చెల్లింపులు వేగంగా అప్‌డేట్ అవుతాయి. మిస్ అయిన చెల్లింపులు వెంటనే స్కోరులో చూపిస్తాయి. రుణాలు తీసుకున్నవారికి తక్కువ సమయంలో స్కోరు అప్‌డేట్ అవుతుంది. ఈ మార్పు క్రెడిట్ ప్రొఫైల్ మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 

మూడవది, 2026 జనవరి 1 నుండి ఫ్లోటింగ్ రేట్ రుణాలపై ఫోర్‌క్లోజర్ లేదా ప్రీ పేమెంట్ జరిమానాలు ఉండవు. ఇది హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, పర్సనల్ లోన్స్‌కు వర్తిస్తుంది. రుణగ్రహీతలు అదనపు ఖర్చు లేకుండా రుణం ముందస్తుగా ముగించుకోవచ్చు. దీని వల్ల రుణ చెల్లింపు మరింత ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఖర్చును తగ్గిస్తుంది. 

నాలుగవది, ఆభరణ వ్యాపారులకు గోల్డ్ మెటల్ లోన్స్ (GML) పేమెంట్ టెన్యూర్ 180 రోజుల నుండి 270 రోజులకు పొడిగించబడింది. ఈ పొడిగింపు లిక్విడిటీని పెంచుతుంది. ఆభరణ వ్యాపారులు క్యాష్‌ఫ్లో సులభంగా నిర్వహించగలుగుతారు. చివరగా, బలమైన క్రెడిట్ ప్రొఫైల్ ఉన్న వారికి రుణ షరతులను సులభంగా చర్చించుకునే అవకాశం కల్పిస్తుంది. తక్కువ వడ్డీ రేట్లు సాధ్యమవుతాయి. ఎక్కువ కాలం రుణం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. అధిక స్కోరు ఉన్నవారికి చవకైన రుణాలు, మెరుగైన ఆర్థిక డీల్స్ లభిస్తాయి.

ఈ కొత్త రూల్స్ ద్వారా రుణాలు తీసుకునేవారు, వ్యాపారులు, కుటుంబాలు మొత్తం ఆర్థిక వ్యవస్థను సులభంగా, వేగంగా, సురక్షితంగా నిర్వహించుకోవచ్చు. ఈ మార్పులు మన వ్యక్తిగత ఆర్థిక భవిష్యత్తును మరింత ఫ్లెక్సిబుల్‌గా, సౌకర్యవంతంగా చేస్తాయి.



పరిపాలన ఎలా చేయాలో తెలిసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం: గాదె

ఈరోజు లాడ్జి సెంటర్లో ఉన్న గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారు పత్రికా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి, ప్రస్తుతం దేశంలో ట్రెండింగ్ గా నిలిచింది అని అన్నారు. గతంలో 24 వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ను మొదటి స్థానానికి తీసుకొని వచ్చిన జనసేన అధ్యక్షులు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాత్యులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్రంలో పలు రకాల కంపెనీల నుండి పెట్టుబడులు తీసుకొని వచ్చి ఉద్యోగ కల్పనకు రాజధాని నిర్మాణంతోపాటు ప్రతి రంగంలో అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మరియు వారికి అండగా నిలబడుతున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేశారు. అలాగే ఐదు లక్షల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేశామని అన్నారు. అదేవిధంగా ఇటీవల రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలని, ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అని అన్నారు. కానీ  గతంలో వైసీపీ ప్రభుత్వంలో అమరావతి ని నాశనం చేసింది కాకుండా, కొంతమంది వైసీపీ నాయకులు ఇప్పుడు మరలా దానిమీద లేనిపోని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రభుత్వం అనేది ఎప్పుడైనా శాశ్వతమని, ప్రభుత్వాన్ని పరిపాలించే పార్టీలు మారినంత మాత్రాన, ప్రభుత్వ విధానాలు మార్చాల్సిన అవసరం లేదని అన్నారు. ఈరోజున దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో రాజధాని అమరావతి అని సవరణ చేసుకోవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందో రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించుకోవాలని అన్నారు. ఇది కేవలం గత వైసిపి ప్రభుత్వం చేసిన దాష్టికం వల్లనే ఈ విధమైన సవరణ చేసుకోవాల్సిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిందని అన్నారు. అలాంటి పార్టీ గురించి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అలాగే ఇటీవల అసెంబ్లీలో అమరావతి మీద తీర్మానం తర్వాత కూడా వైసీపీ నాయకులు కొంతమంది మీడియా ముందుకు వచ్చి వృధా ప్రేలాపనలు పేలుతున్నారని అన్నారు. గెలిచిన 11 మందిలో వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఒక్కరు కూడా బయటికి రాలేదని, ఆ విషయం గురించి గెలిచిన ఎమ్మెల్యేలు ఎలాంటి ప్రస్తావన తీసుకురాకుండా, ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టిన వ్యక్తులు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. కనీసం గెలిచిన ఎమ్మెల్యేలు వచ్చి మాట్లాడితే ఎంతో కొంత విలువ ఉంటుందని, కానీ ఎవరిని పడితే వాళ్లని తీసుకొచ్చి మీడియా ముందు మాట్లాడితే, అలాంటి వ్యక్తులను రాష్ట్ర ప్రజలు ఎవరూ పట్టించుకునే పరిస్థితిలో లేరని అన్నారు. వైసిపి నాయకులు మాట్లాడే మాటలు చూస్తుంటే నాన్న పులి కథ మాదిరిగా అనిపిస్తుంది అని అన్నారు. వైసిపి నాయకులు ఇప్పటికైనా తప్పు తెలుసుకుని అమరావతి గురించి అసెంబ్లీలో జరిగే తీర్మానానికి హాజరై, తమ మద్దతును తెలియజేస్తారని ఆశించామని, అలాంటి పరిస్థితి ఏమి లేకుండా మీడియా ముందుకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు మారి, విధానపరమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని సూచించారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా, ఉన్న ప్రతిపక్షం మీరే కాబట్టి, ఏదైనా తప్పు జరిగితే ప్రజల పక్షాన విధానపరంగా మాట్లాడాలని అన్నారు. అలా కాకుండా రోడ్లమీదకు వచ్చి కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలని చూస్తే అది తిరిగి మీ మీద పడుతుందని హెచ్చరించారు. అలాగే కొంతమంది నాయకులు డబ్బంతా తీసుకెళ్లి అమరావతిలోనే పెడుతున్నారు అని చెప్పడం చూస్తుంటే వారి అవగాహన రాహిత్యం ఏ పాటితో అర్థమవుతుందని అన్నారు. రాష్ట్రానికి రాజధాని అవసరమని, గత వైసిపి పరిపాలించిన ఐదు సంవత్సరాలలో రాజధానిని నిర్వీర్యం చేశారని అన్నారు. ఈరోజు రాజధానిని గాడిలో పెట్టామని, వ్యవస్థలు అన్నిటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఆ విషయం అవగాహన చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వారిలాగా ఇష్టానుసారంగా డబ్బులు పంచలేదని, రాబోయే రోజులలో రాష్ట్రానికి ఆదాయం వచ్చే విధంగా తీసుకువచ్చిన అప్పులను పెట్టుబడి పెడుతున్నామని అన్నారు. గత వైసిపి ప్రభుత్వం లో ఎటువంటి పారదర్శకత లేకుండా ఇష్టానుసారంగా కార్పొరేషన్ల పేరుతో అప్పులు తీసుకొచ్చారని, వాళ్ళు చేసిన అప్పులను వెలికి తీయడంలో ఇప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ఆ అప్పులు ఎంత, దేనికి ఎంత తీసుకున్నారో కూడా తేల్చ లేనంతగా బ్యూరో కాట్లు ఉన్నారని అన్నారు. ఇంకా వైసీపీ ప్రభుత్వం మీద ప్రేమ తగ్గలేక వైసిపి నాయకులతో వ్యక్తిగత మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకుంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అధికారులు ఎప్పుడూ కూడా ప్రజలకు ఏది మంచో అదే చేయాలని, ప్రభుత్వాలు మాత్రమే శాశ్వతమని, వాటిని నడిపే పార్టీలు మారతా ఉంటాయని, కానీ అధికారులు మాత్రం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. లేదంటే కటకటాల పాలు కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక అప్పుల విషయానికొస్తే వివిధ కార్పొరేషన్ల పేరుతో డైరెక్ట్ గా కాకుండా ఇన్ డైరెక్ట్ గా అప్పులు తీసుకొని వచ్చి రాష్ట్ర ఖజానా మీద ఎనలేని భారం మోపిన ఘనత వైసిపి ప్రభుత్వానిదని అన్నారు. ఎన్నడూ లేని విధంగా వివిధ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా అప్పులు తెచ్చారని, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సుమారు పాతికవేల కోట్లు, ఆంధ్రప్రదేశ్ బీవర్జస్ కార్పొరేషన్ ద్వారా పదివేల కోట్లు, ఏపీఐఐసీ భూములు తాకట్టుపెట్టి పదివేల కోట్లు, స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇలాంటి వివిధ కార్పొరేషన్ల ద్వారా సుమారు లక్ష కోట్లు పైచిలుకు అప్పులు తీసుకొని వచ్చారని అన్నారు. ఇవన్నీ కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రైమ్ లొకేషన్స్ లో ఉన్న సుమారు 213 ఎకరాలలో ఉన్న ప్రభుత్వ భవనాలన్నీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి బదిలీ చేసి, వాటిని తాకట్టు పెట్టి సుమారు 1600 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారని, ఇంకా దారుణమైన విషయం వాళ్లు కూర్చుని పరిపాలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్రటేరియట్ ను కూడా తాకట్టుపెట్టి సుమారు 370 కోట్లు అప్పు తెచ్చిన ఘనత వైసిపి ప్రభుత్వానిది అన్నారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా, బటన్ నొక్కాను అనే నెపంతో లక్షల కోట్ల రూపాయలు అప్పుచేసి, రాష్ట్ర ఖజానాను దివాలా దిశగా నడిపించారని ఎద్దేవ చేశారు. చివరికి టిడ్కో ఇళ్ళ మీద కూడా 1500 కోట్ల రూపాయల అప్పు తెచ్చారని అన్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అప్పులు తీర్చి నిన్నటి రోజున సుమారు 5 లక్షల మందికి ఇల్లు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది అని అన్నారు. గత ప్రభుత్వానికి పరిపాలన ఎలా చేయాలో తెలియదని, కానీ పరిపాలన ఎలా చేయాలో తెలిసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు రాజకీయ నాయకులుగా, వైసిపి పార్టీ రాజకీయ పార్టీగా మారాలని కోరారు.కావున రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలలో కూడా కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడి, కూటమి అభ్యర్థులను గెలిపించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి చట్టాల త్రినాథ్, గుంటూరు రూరల్ మండలం నాయకులు శ్రీరామ్ శెట్టి ప్రేమ్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.



నేడు పార్లమెంట్‌లో అమరావతికి చట్టబద్ధత బిల్లు

Apr 01, 2026 మల్లెల తెలుగుతేజం 

నేడు పార్లమెంట్‌లో అమరావతికి చట్టబద్ధత బిల్లు
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు బుధవారం మ.12 గంటలకు పార్లమెంట్ ముందుకు రానుంది. 2024 జూన్ 2 నుంచే రాజధానిగా గుర్తించేలా ఏపీ పునర్‌వ్యవస్థీకరణ(సవరణ) బిల్లు-2026ను లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెడతారు. చర్చ అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదిస్తారు. గురువారం రాజ్యసభలోనూ దీన్ని ఆమోదించి, శాశ్వత రాజధానికి చట్టబద్ధత కల్పిస్తారు.



నేటి నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్

నేటి నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్
ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలోని చేనేతలకు శుభవార్త. బుధవారం నుంచి ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి రానుంది. నెలకు చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్ష కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. దీని కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.150 కోట్లు వెచ్చించనుంది. ఈ పథకం ద్వారా ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.8,640, పవర్‌లూమ్‌పై నేసే కుటుంబానికి రూ.21,600 ఆర్థిక వెసులుబాటు కలగనుంది.


 
 
 
గడ్డిమందు శాపం... నటుడు రాహుల్ రామకృష్ణ సోదరుడు మృతి

టాలీవుడ్‌ ప్రముఖ సినీ నటుడు రాహుల్ రామకృష్ణ సోదరుడు మరణించారు. పారాక్వాట్ (Paraquat) అనే రసాయన గడ్డిమందు కారణంగా తన సోదరుడు ప్రాణాలు కోల్పోయాడని సోషల్ మీడియా ద్వారా అయన తెలిపారు.

అత్యంత విషపూరితమైన ఈ రసాయనం తెలంగాణలో చాలా సులభంగా అందుబాటులో ఉండటం తెలిసి తనను ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన అన్నారు. ఈ రసాయనం వల్ల సంభవిస్తున్న మరణాల సంఖ్యను చూసి డాక్టర్లు కూడా షాకవుతున్నారని రాహుల్ పేర్కొన్నారు.

ఆత్మహత్యల కోసం విచ్చలవిడిగా దుర్వినియోగం చేయబడుతోందని ఆవేదన చెందారు. ఇది ప్రతిచోటా ఎంత సులభంగా లభిస్తుందో చూసి దిగ్భ్రాంతి చెందానని ఆయన అన్నారు. దయచేసి వీలైనంత త్వరగా దీనిని నిషేధించండి - ప్రాణాలను కాపాడండి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి (CMO), భారత ప్రధానమంత్రి కార్యాలయానికి (PMO) ఆయన విజ్ఞప్తి చేశారు.

భారతదేశంలో పారాక్వాట్ వినియోగం ఇప్పటికీ కొనసాగుతుంది. దీని విషపూరితత కారణంగా కొన్ని రాష్ట్రాలు (ఉదా: తెలంగాణ) అమ్మకాలపై పరిమితులు విధించాయి. ప్రపంచంలోని చాలా దేశాలు దీన్ని పూర్తిగా నిషేధించాయి. వైద్య నిపుణులు చిన్న పరిమాణం కూడా ప్రాణాంతకమని హెచ్చరించడంతో తెలంగాణ ప్రభుత్వం (2026) పారాక్వాట్ అమ్మకాలపై పరిమితులు విధించింది. భారతదేశంలో చాలా రాష్ట్రాలు కొన్ని కఠిన మార్గదర్శకాలతో మాత్రమే అనుమతిస్తున్నాయి. పొలాల్లో పనిచేసే రైతులు ఎక్కువగా ఈ రసాయనం వల్ల ప్రభావితమవుతున్నారు.
*

రైతుల ఆర్థిక బలోపేతానికి.. పశుపోషణే కీలక ఆదాయ వనరు :  ప్రత్తిపాటి*

• గేదెలు అనారోగ్యానికి గురైతే పాల దిగుబడి తగ్గుతుంది
• పశుపోషణకు ప్రభుత్వం అందించే రాయితీలను రైతాంగం సద్వినియోగం చేసుకోవాలి
• మానుకొండవారిపాలెంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించిన ప్రత్తిపాటి.

ప్రభుత్వం అందించే ఉచిత పశువైద్యసేవలు, పశుపోషణ రాయితీలు, ప్రోత్సాహకాల్ని రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు.

చిలకలూరిపేట మానుకొండవారిపాలెంలో పశుసంవర్థక మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన  ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రత్తిపాటి ప్రారంభించి, రైతుల్ని, గ్రామస్తుల్ని ఉద్దేశించి మాట్లాడారు.
పశువులకు గాలికుంటు, గొంతువాపు వ్యాధి టీకాలు, గొర్రెలకు నాచు, నీలినాలుక వ్యాధి టీకాలను పశుసంవర్ధక శాఖ యంత్రాంగం ఉచితంగా వేస్తోందన్నారు. నట్టల నివారణ మందులతో పాటు, పశువులను పరీక్షించి అవసరమైన అన్నిరకాల మందుల్ని ఉచితంగా అందిస్తున్నారని చెప్పారు. గేదెలు, ఆవులు అనారోగ్యానికి గురైతే పాల దిగుబడి తగ్గుతుందన్నారు.
గత ప్రభుత్వం ఇష్టానుసారం, స్వార్థ ప్రయోజనాలకోసం మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలను మరలా పంచాయతీలుగా పరిగణించబోతున్నామని ప్రత్తిపాటి చెప్పారు. గ్రామస్తుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 
ఈ కార్యక్రమంలో టిడిపి సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, కల్లి వీర రెడ్డి, పశు వైద్యులు డాక్టర్ రాధాకృష్ణ, నాగేశ్వరరావు , దీప్తి, గ్రామ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.