kapunews



TRENDING NOW


సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ సలహాదారులు గా నియమితులైన గోవిందు శంకర్ శ్రీనివాసన్


 సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ సలహాదారులు గా నియమితులైన గోవిందు శంకర్ శ్రీనివాసన్ . జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా గోవిందు శంకర్ శ్రీనివాస్ తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన గోవిందు శంకర్ శ్రీనివాస్.

 సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన గోవిందు శంకర్ శ్రీనివాస్.

 అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన గోవిందు శంకర్ శ్రీనివాస్.

 సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన గోవిందు శంకర్ శ్రీనివాస్ .
 హిందువులకు ఆరాధ్య దైవం అయిన గోమాతను సంరక్షించుకునే బాధ్యతలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ సలహాదారులు గోవిందు శంకర్ శ్రీనివాస్ అన్నారు.

 
 
రవాణా శాఖ లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎన్ఫోర్స్మెంట్ పెంచి ఆదాయాన్ని పెంచాల

*ఆదాయం లో టార్గెట్ రీచ్ అయిన పలు జిల్లాల రవాణా శాఖ అధికారులకు అభినందనలు..*

 *పలువురు అధికారులు పని తీరు మెరుగుపర్చుకోవాలని హెచ్చరిక*

*సారథి 8 నెలల్లోనే దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది.*

*వాహన్ పోర్టల్ డేటా పూర్తిచేసుకొని టెక్నికల్ సమస్యలు లేకుండా చూసుకోవాలి*

*జూన్ 1 కి ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ ప్రారంభించుకునేలా పనులు వేగవంతం చేయాలి*

*AMVI లకు ఇచ్చిన శిక్షణ మాదిరి ఇతర రవాణా శాఖ అధికారులకు విడతల వారిగా శిక్షణ ఇవ్వాలి*

*రోడ్డు ప్రమాద మరణాలు తగ్గించడానికి రహవీర్ స్కీమ్, క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పై ప్రజలకు అవగాహన కల్పించాలి*

*17 జిల్లాలో రవాణా శాఖ కార్యాలయాలకు స్థలాలను గుర్తించాలి*

*అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి*

 *- రవాణా శాఖ రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్*

రవాణా శాఖ లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎన్ఫోర్స్మెంట్ బలోపేతం చేస్తూ ఆదాయాన్ని పెంచుకునేలా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో రవాణా శాఖ అధికారులతో రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. 2024-25 లో రవాణా శాఖ 6910.90 కోట్లు ఆదాయం వసూలు కాగా ,2025-26 లో 7097 .38 కోట్లు వసూలు చేయడం జరిగింది. ఈవీ పాలసీ ద్వారా రవాణా శాఖ ఆదాయం కొంతమేర తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. తగ్గిన ఆదాయాన్ని ఎన్ఫోర్స్మెంట్ బలోపేతం చేస్తూ ఆదాయ మార్గాలు పెంచుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో ఇచ్చిన టార్గెట్ రీచ్ అయి లైఫ్ టాక్స్ ,త్రైమాసిక టాక్స్ వసూలు లో మంచి పనితీరు కనబరచిన అధికారులను అభినందించారు.  పలువురు అధికారులకు పనితీరు మెరుగు పరచుకోవాలని హెచ్చరించారు. 

నిజామాబాద్ - మహారాష్ట్ర , ఆదిలాబాద్ - మహారాష్ట్ర,  మెదక్ - కర్ణాటక  తదితర సరిహద్దు జిల్లాల రవాణా శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్టీవో కార్యాలయాల్లో పెండింగ్ లైసెన్స్ ఇతర పౌర సేవలకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.  రవాణా శాఖ లో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నాయి రవాణా సేవలు పారదర్శకంగా సమర్థవంతంగా వాహనదారులకు అందేలా డీలర్ల వద్ద వాహనాల రిజిస్ట్రేషన్ జరుగుతుందనీ రిజిస్టేషన్ విషయంలో వాహనదారులకు ఇబ్బందులు లేకుండా రవాణా శాఖ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. వాహన్ పోర్టల్ ద్వారా సేవలు డేటా పూర్తిచేసుకొని టెక్నికల్ సమస్యలు లేకుండా చూసుకోవాలని తెలిపారు. సారథి అమలులోకి వచ్చిన తర్వాత 8 నెలల్లోనే దేశంలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. ఏఎంవీఐ లకు ఇచ్చిన శిక్షణ మాదిరి ఇతర రవాణా శాఖ అధికారులకు విడతల వారిగా శిక్షణ ఇవ్వాలనీ అధికారులకు సూచించారు.రవాణా శాఖ గౌరవాన్ని పెంపొందించేలా అధికారులు పని చేయాలని సూచించారు. రవాణా శాఖ లో తమ పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలు పూర్తి చేసి ఇతర సమస్యలు కమిషనర్ లేదా తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఈనెల 13 నుండి నిర్వహించే అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని పోలీస్ ,రవాణా శాఖ సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో అతి వేగం ,మద్యం సేవించి వాహనాలు నడపడం,ఆటో ల ఓవర్ లోడ్  ,సీటు బెల్టు పెట్టుకోకపోవడం , హెల్మెట్ లేకపోవడం లాంటి వల్ల మరణాలు సంభవిస్తున్నాయని వాటిపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈనెల 13-18 మధ్య అరైవ్ అలైవ్ కార్యక్రమంలో 15 నుండి 18 వ తేదీ మధ్యలో ఉమ్మడి జిల్లాల వారిగా రవాణా శాఖ మంత్రి గా తను ,ఆర్టీసీ ఎండీ , డీజీపీ,రవాణా శాఖ కమిషనర్ సంయుక్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో 37 ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ మంజూరు అయ్యాయని జూన్ 1 న తొలి టెస్టింగ్ స్టేషన్ ప్రారంభించుకునేలా పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సంవత్సరం రోడ్డు భద్రతా మాసోత్సవాలు బాగా జరిగాయని కేంద్ర ప్రభుత్వం కూడా అభినందించిందని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్ ల ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి రేడియం రిఫ్లెక్టివ్ ను కచ్చితత్వం చేయాలన్నారు. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ కోసం కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం దాదాపు ఈవీ పాలసీ తీసుకొచ్చిందని ఇప్పటి వరకు దాదాపు వెయ్యి కోట్లు టాక్స్ మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్క్రాపెజ్ పాలసీ తీసుకొచ్చిందని ఇప్పుడు రాష్ట్రంలో మూడు కేంద్రాలు ఉండగా జిల్లా కేంద్రానికి ఒక ఆర్వీఎస్ఎఫ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వెహికిల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ నిర్భయ ఫ్రేమ్ అందుబాటులోకి రానుందని తెలిపారు.


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రహవీర్ స్కీమ్ , క్యాష్ లెస్ ట్రీట్మెంట్ లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు అత్యవసరంగా హాస్పిటల్ కి తీసుకెళ్లిన వారికి రహవీర్ అవార్డు కింద 25 వేలు బహుమతి అందించనున్నారు. రహవీర్ అమలులోకి వచ్చిన తర్వాత తొలి రహవీర్ నల్గొండ జిల్లాకు చెందిన గణపతి వెంకన్న కి 25 వేల రూపాయల చెక్కు ఇచ్చి అభినందించారు. Pm rahath కింద రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు లక్షా 50 వేల రూపాయల వరకు ఉచిత చికిత్స అందించవచ్చని ప్రజలకు వీటిపై విసృత అవగాహన కల్పించాలని సూచించారు.ఇప్పటి వరకు 25 ప్రాంతాల్లో రవాణా శాఖకు స్థలాలు ఉన్నాయని 17 జిల్లాల్లో రవాణా శాఖ కార్యాలయాలకు స్థలాలు గుర్తించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకోవాలని ఆదేశించారు. రవాణా శాఖ కార్యాలయాల్లో డ్రైవింగ్ లైసెన్స్,ఆర్సీ పెండింగ్ కార్డులు ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక , మైనింగ్ , ఓవర్ లోడింగ్ వాహనాలపై ఎన్ఫోర్స్మెంట్ పెంచాలన్నారు. 

ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాల్లో ప్రోత్సాహకానికి ప్రభుత్వ విజ్ఞప్తి తో పలు కంపెనీలు ముందుకు వచ్చాయని ప్రభుత్వ ఉద్యోగులు ఈవి వాహనాలకు బ్రాండ్ అంబాసిడర్ లుగా ఈవి వాహనాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. 


సమీక్షా సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, జెటిసి లు చంద్రశేఖర్ గౌడ్, శివ లింగయ్య, రమేష్, డీటీసీ లు , డీటీవో లు, ఆర్టీవో లు, ఏంవీఐ లు , ఏఎంవీఐ లు పాల్గొన్నారు.


*కందుల కొనుగోలు గడువు మే 4 వరకు పొడిగింపు*

- మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

*అమరావతి, ఏప్రిల్ 7:* రాష్ట్రంలో కందుల కొనుగోలు గడువు మే 4 వరకు పొడిగించడం జ‌రిగింద‌ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్ల‌డించారు. ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి కందులు (రెడ్ గ్రామ్/తూర్) కొనుగోలు గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించడం రైతులకు ఎంతో ఊరటనిచ్చే నిర్ణయం అని అన్నారు. రాష్ట్రంలో ధర మద్దతు పథకం (PSS) కింద కొనుగోలు కొనసాగుతుందని మంత్రి తెలిపారు. కొనుగోలు గడువును పొడిగించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తిని ప‌రిశీలించిన‌ కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ, మే 4 వరకు పొడిగింపునకు ఆమోదం తెలిపిందన్నారు. రైతులు తమ పంటను నష్టపోకుండా విక్రయించుకునేలా చూడటం కూట‌మి ప్రభుత్వ బాధ్యత. రైతు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర అందేలా ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారు అని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తోంది. పంటల కొనుగోలు, గిట్టుబాటు ధర, మార్కెటింగ్ వంటి అన్ని అంశాల్లో రైతులకు న్యాయం జరిగేలా చర్యలు కొనసాగిస్తాము అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

 
 
ప్రేమ బంధం కన్నీటి సంద్రం.. భార్య ఎదుటే భర్త దుర్మరణం

*శ్రీకాళహస్తి: పదేళ్లు క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ప్రేమకు చిహ్నంగా ఇద్దరు మగపిల్లలు పుట్టడంతో సంతోషానికి అవధుల్లేవు.*

రోజంతా ఇద్దరూ కాయకష్టం చేసి పిల్లల్ని చదివించుకుంటున్నారు. వారి ఆనందాన్ని చూసి విధి కన్నుకుట్టింది. ఊహించని ప్రమాదంతో కళ్లముందే కట్టుకున్న భర్త కడతేరిపోవడంతో భార్యతో పాటు పిల్లలు కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. ఈ హృదయ విధారక ఘటన.. శ్రీకాళహస్తి పట్టణం శుకబ్రహ్మాశ్రమం సమీపం మంగళవారం చోటు చేసుకుంది. కేవీబీపురం మండలం ఆదరం గ్రామానికి చెందిన వినోద్ (32) పదేళ్ల క్రితం మనీషాను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కుటుంబ పోషణ నిమిత్తం ఇద్దరూ శ్రీకాళహస్తి పట్టణానికి సమీపంలోని రాజీవ్నగర్లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు. వినోద్ తాపీమేస్త్రీగా పనులకు వెళ్తుంటే, మనీషా అతని సహాయకురాలిగా కూలి పనులకు వెళ్తుంది.

*వస్తున్నానంటూ..తిరిగిరాని లోకాలకు....*

మంగళవారం ఐదో అంతస్తు వద్ద సిమెంటు పూత పని జరుగుతోంది. టిఫిన్ తినేందుకు మనీషా వినోదు పిలిచింది. కొంత మేర పని ఉందని చేసి వస్తున్నానని చెప్పిన వినోద్ అక్కడ అమర్చిన కర్రలు జారడంతో పట్టు తప్పి పైనుంచి కిందపడిపోయాడు. రక్తగాయాలతో పడిన ఉన్న వినోద్ను చూసి మనీషా తల్లడిల్లిపోయింది. భర్తకు ఏమీ కాదని, తనను వదలి వెళ్లడంటూ ఎంతో ఆర్తితో చివరి వరకు ప్రయత్నించింది. తీరా ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికి మృతి చెందాడని తెలిసి కన్నీరుమున్నీరై విలపించింది. హృదయ విధారక ఘటనతో రాజీవ్నగర్, ఆదరంలోనూ పలువురు కన్నీటి పర్యంతమయ్యారు.


 
 
శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుని, వాటికి తక్షణ పరిష్కారం చూపడమే ధ్యేయంగా  పట్టణంలోని పీఆర్ గెస్ట్ హౌస్  నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించడం జరిగింది.

*ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల వినతులను వ్యక్తిగతంగా పరిశీలించాను. సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు మరియు ఇతర వ్యక్తిగత సమస్యలపై అందిన దరఖాస్తులను సంబంధిత అధికారులతో మాట్లాడి, అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆదేశించాను.*

*నా దృష్టిలో పదవి అనేది కేవలం హోదా కాదు, ప్రజలకు సేవకుడిగా అండగా నిలవడానికి దక్కిన ఒక గొప్ప అవకాశం. మీ సమస్య ఏదైనా, మీకు తోడుగా ఉండటానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.*

*పల్నాడు జిల్లా : నరసరావుపేటలో క్రికెట్ బుకీలు అరెస్టు..!*

*ఐలా బజార్‌లో క్రికెట్ బెట్టింగ్ జరుగుతోందని పోలీసులకు సమాచారం.. క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఆరుగురు అరెస్టు..!*

*బెట్టింగ్ ముఠా సభ్యులు షేక్ ఖాసీం, షేక్ మస్తాన్ వలీ, షేక్ రఫీ జాన్, పసుపులేటి నాగరాజు, శిఖా చక్రవర్తి, పతేలా వెంకటేశ్వరరావు అరెస్టు.*

*నిందితుల నుంచి రూ.4.58 లక్షల నగదు, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లు స్వాధీనం.*

*బెట్టింగ్ ముఠాను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులకు బహుమతులు అందించిన డీఎస్పీ.*


డిసెంబర్‌లో ఆడబిడ్డల పుట్టింటి సారె.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! 

తెలంగాణ రాజకీయాల్లో 'సెంటిమెంట్' మరియు 'సంక్షేమం' ఎప్పుడూ కీలకమే. తాజాగా ఆదిలాబాద్ గడ్డపై నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా లోకానికి ఒక తీపి కబురు అందించారు.

గతంలో ఇందిరమ్మ పాలనలో చీరల పంపిణీ జరిగిన తీరును గుర్తు చేసుకుంటూ.. "నాడు మా అక్కలు పాలపిట్టల్లా మెరిసిపోయారు, ఇప్పుడు మళ్ళీ అదే ఉత్సాహాన్ని నింపుతాం" అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. ఈసారి డిసెంబర్ నెలలో రాష్ట్రంలోని మహిళలందరికీ 'చిలకపచ్చ రంగు' చీరలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు.

కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా, దీనికి అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను అక్కడికక్కడే కోరడం విశేషం. ప్రభుత్వం ఇచ్చే ఈ కానుకను ఒక 'పుట్టింటి సారె'గా భావించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ డిసెంబర్ నాటికి తెలంగాణ ఆడబిడ్డల ముఖాల్లో చిలకపచ్చ వెలుగులు చూడబోతున్నాం!



అమరావతి సాధనలో టీడీపీ కట్టుబాటు – ప్రజల పోరాటానికి న్యాయం జరిగింది: శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు..

*అమరావతిని రాజధానిగా చట్టబద్ధత కల్పించడం తెలుగుదేశం పార్టీ తీసుకున్న దృఢమైన నిర్ణయాలకు, ప్రజల పోరాటానికి వచ్చిన విజయమని శాసన మండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు పేర్కొన్నారు.అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించినందుకు రైతులు మహిళలు ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… అమరావతి కోసం 1631 రోజుల పాటు నిరంతరంగా పోరాడిన రైతులు - మహిళలు చేసిన త్యాగం, దీక్షలకు చివరికి న్యాయం జరిగిందన్నారు.*

*తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో అమరావతి పట్ల తన నిబద్ధతను స్పష్టంగా చూపిస్తూ వచ్చిందని, ప్రజల ఆశయాలను నెరవేర్చడంలో ఎలాంటి రాజీ పడలేదని అన్నారు. ముఖ్యంగా మహిళలు చేసిన త్యాగం, వారి ఆత్మస్థైర్యం ఈ ఉద్యమానికి బలంగా నిలిచిందని కొనియాడారు.*

*అమరావతి అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడానికి ప్రయత్నించిన వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పారని తీవ్రంగా విమర్శించారు. ప్రజా సంకల్పాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఈ పోరాటం నిరూపించిందన్నారు.*

*ఈ చారిత్రాత్మక నిర్ణయానికి తోడ్పడిన కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి,మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ నాయకత్వంలో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.*

*ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ని కట్ చేసి నాయకులు ఒకరికి ఒకరు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు.*

*ప్రజల విశ్వాసమే తమ బలం అని, అభివృద్ధే తమ లక్ష్యమని మర్రి రాజశేఖర్ గారు అన్నారు.*

.



నీటి భద్రత - సాగు నీటి సంఘాల భాద్యత అనే మహాద్బుతమైన కార్యక్రమంలో పాల్గొనడం అత్యంత సంతోషంగా ఉంది చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు 


రాష్ట్రంలో సాగునీటి వనరులను సంరక్షించుకోవడం ద్వారా మాత్రమే భవిష్యత్ తరాలకు అవసరమైన వనరులు కల్పించే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే నేడు సాగునీటి రంగం బలోపేతం కోసం ప్రభుత్వం కీలకమైన చర్యలు తీసుకుంటోంది.

ఈరోజు స్థానిక శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రైతులతో కలిసి ప్రభుత్వ ఆదేశాలతో జల వనరుల శాఖ ఆధ్వర్యంలో  చీరాల నియోజకవర్గం, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ చెరువు వద్ద  నిర్వహించిన " నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత " కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం ఉద్దేశించి  ఎమ్మెల్యే  గారు మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు నీటి భద్రత, రైతుల కొరకు చేపట్టిన ఈ బృహత్తర యజ్ఞంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా చెరువులు పునరుద్ధరణ పనులు, పూడీకతీత పనులుతో చెరువులను సంరక్షించడంతో పాటు రైతులను నేరుగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకొని క్షేత్ర  స్థాయిలో సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సమస్యలను పరిష్కరించవచ్చు అని, ప్రజలందరూ ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములై నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో గారు మున్సిపల్ కమిషనర్ AMC చైర్మన్ అధికారులు రైతులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు


పల్నాడు జిల్లాలో భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న జనతా వారిధి కార్యక్రమంలో భాగంగా, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు శ్రీ PVN మాధవ్ గారి పిలుపు మేరకు, పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్ గారి ఆదేశాలతో, పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా డి ఆర్ ఓ  గారికి  సీనియర్ సిటీజన్స్ సమస్యలు పై మరియు ప్రభుత్వ విధానాల పునఃపరిశీలనపై వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు జనతా వారిది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు , పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలు మరియు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


విషయం:
కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సీనియర్ సిటిజన్ కార్డులు మరియు “ఆయుష్మాన్ వయో వందన కార్డ్”లను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తప్పనిసరిగా అంగీకరించేలా తగు ఆదేశాలు జారీ చేయవలసినదిగా వృద్ధుల సంక్షేమం పై ఆలోచన చేయవలసిందిగా వినతి.

భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పౌరులను సర్వ స్పర్శి సర్వ వ్యాప్తి నినాదంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కలుస్తున్నారు. పెద్దఎత్తున వృద్ధులను కలిసిన సమయంలో వారి నుంచి వచ్చిన విన్నపములు చాలా ప్రధానమైన అంశములుగా మేము భావిస్తున్నాము 

భారతదేశంలో వృద్ధ పౌరుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి.

• 60 సంవత్సరాలు నిండిన వారికి సీనియర్ సిటిజన్ కార్డులు జారీ చేయడం
• 70 సంవత్సరాలు పైబడిన వారికి సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య భీమా కల్పించే “ఆయుష్మాన్ వయో వందన (PMJAY)” పథకం అమలు చేయడం

ఇవి వృద్ధులకు ఎంతో ఉపయోగకరమైన పథకాలు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో, ఈ కార్డులు ఉన్నప్పటికీ వృద్ధ పౌరులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీనియర్ సిటిజెన్ కార్డులు కొన్ని జిల్లాల్లో ఇచ్చారు. 

• బ్యాంకులు, దేవాలయాలు, హాస్పిటల్స్, కోర్టులు వంటి ప్రదేశాల్లో సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
• ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉన్నప్పటికీ అనేక చోట్ల వాటిని గుర్తించడం లేదు.
• “ఆయుష్మాన్ వయో వందన కార్డు” ఉన్నప్పటికీ ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్య సేవలను నిరాకరిస్తున్నాయి.
దీని వల్ల వృద్ధులు అత్యవసర వైద్య సేవలు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
• కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన PMJAY వయో వందన పథకం ప్రకారం 70 సంవత్సరాలు పైబడిన ప్రతి వ్యక్తికి రూ.5 లక్షల ఆరోగ్య భీమా సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ వర్తింపు, ఆధార్ ఆధారంగా నమోదు, ప్రభుత్వ మరియు గుర్తింపు పొందిన ప్రైవేట్ హాస్పిటల్స్‌లో క్యాష్‌లెస్ చికిత్స జరగడం లేదు.

అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని Go No.49/02.04.2025 ప్రకారం AB PM -JAY కుటుంబాలకు మరియు ఇతర కుటుంబాలకు అందించేలా నిర్ణయించింది. కానీ ఇది సరైన విధంగా అమలు జరగడం లేదు.

వృద్ధాప్య పెన్షన్ ను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎంతో భాద్యతయితంగా అందచేస్తుంది. ఈ పధకం కొంతవరకు వృద్దులకు ఆశరాగా ఉన్నప్పటికీ పెరుగుతున్న వృద్ధాశ్రమాలు చూస్తుంటే ఆందోళన కలుగుతుంది.

పై పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వృద్ధ పౌరుల సంక్షేమార్థం క్రింది చర్యలు తీసుకోవలసిందిగా మనవి.

• రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలకు (బ్యాంకులు, దేవాలయాలు, కోర్టులు, హాస్పిటల్స్)
సీనియర్ సిటిజన్ కార్డులను తప్పనిసరిగా అంగీకరించేలా ఆదేశాలు జారీ చేయాలి. సీనియర్ సిటిజెన్ కార్డులు అందచేయాలి.

• అన్ని హాస్పిటల్స్ (ప్రభుత్వ మరియు ప్రైవేట్)
“ఆయుష్మాన్ వయో వందన కార్డు”ను తప్పనిసరిగా అమలు చేయాలని కఠిన ఆదేశాలు ఇవ్వాలి.

• ఈ కార్డులను నిరాకరించే సంస్థలపై
తగిన చర్యలు (penalties) తీసుకునే విధంగా మార్గదర్శకాలు రూపొందించాలి.

• జిల్లా స్థాయిలో ప్రత్యేక నోడల్ అధికారులు నియమించి
వృద్ధులకు సకాలంలో సేవలు అందేలా పర్యవేక్షణ చేయాలి.

• ప్రజల్లో అవగాహన కల్పించేందుకు
ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి.

• పెరుగుతున్న వృద్ధాశ్రమాలపై నిఘా పెంచాలి. అవసరమైన కుటంబాలకు కౌన్సిలింగ్ నిర్వహించే వ్యవస్థ ఉండాలి.

వృద్ధ పౌరులు సమాజానికి మూలస్తంభాలు. వారి గౌరవం, ఆరోగ్యం, భద్రత ఏలినవారి బాధ్యత.

వృద్దులు ఒంటరివారు, అనాధలు కాకూడదు. వారి హక్కులు పరిరక్షించడంలో మరియు వారికీ అండగా నిలవడంలో భారతీయ జనతా పార్టీ వారి పక్షాన్న పని చేస్తుంది.

కాబట్టి పై వినతిని పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ మనవి.

ఇట్లు 
 *పల్నాడు జిల్లా జనతా వారధి రాష్ట్ర జట్టు*



 
 
*తెనాలి పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు కీర్తిశేషులు శ్రీ ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ వారు ఒంగోలు జాతి జాతీయ స్థాయి ఎడ్ల బల మరియు పశుపాల ప్రదర్శన, వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శన మాజీ మంత్రివర్యులు శాసనమండలి సభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి సారధ్యంలోగత నెల 29 నుండి అత్యంత వైభవంగా చేయుచున్నారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారి ఆహ్వానించి వారి చేతుల మీదగా పోటీల్లో పాల్గొన్న రైతులకు షీల్డులు అలాగే గెలుపొందిన ఎడ్ల జతల రైతులకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది.*

*ముందుగా సభా వేదిక మీద ఏర్పాటుచేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రుల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.ఆ తర్వాత కీర్తిశేషులు శ్రీ ఆలపాటి శివరామకృష్ణయ్య గారి విగ్రహానికి నివాళులర్పించి, జ్యోతి ప్రజ్వలన చేశారు*

*ఈ సందర్భంగా శాసన మండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు వేదికపై మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారధ్యంలో, మాజీ మంత్రివర్యులు, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారి సహాయ సహకారాలతో తెనాలి వేమూరు నియోజకవర్గాల రైతాంగం యొక్క ప్రోత్సాహంతోటి దిగ్విజయంగా 14 సంవత్సరాల క్రితం ప్రారంభించి ఈనాటికి ఆలపాటి శివ రామకృష్ణ గారి పేరు మీదుగా ఎడ్ల ప్రదర్శనని నిర్వహించడం జరుగుతోంది.*

 *తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమతోటి రాజేంద్రప్రసాద్ గారు ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా రైతాంగానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్ని తీసుకొని నిర్వహించడం జరుగుతుంది. వ్యవసాయదారుడు కాబట్టి వ్యవసాయం మీద ప్రేమ, అభిమానం రైతాంగం బాగుండాలి రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి రైతుకు సంబంధించిన కార్యక్రమాలు తీసుకొంటున్నారు. వారి తండ్రి శివరామకృష్ణయ్య గారు కూడా వ్యవసాయదారులు. ఆయన వ్యవసాయంలో విశేషమైనటువంటి అనుభవం గడించారు. పెద్దలు విద్యావంతులు అటువంటి తండ్రికి ప్రయోజకులు, సమర్థులైనటువంటి  కుమారులు ఉన్నారు. అందుకే ఈనాటికి శివరామకృష్ణయ్య గారి పేరు ఈనాటికి కూడా ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా వారు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూన్నారు అని అన్నారు.*

*శివరామకృష్ణయ్య గారి జన్మ సార్థకం చేసినటువంటి వారి తనయులని అందరం కూడా  అభినందించాలి. వారి కుమారులు ఆయన పేరు మీద ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం మనమందరం కూడా ఆదర్శంగా తీసుకోవలసిన అవసరం ఉన్నది.*

 *ఈరోజు వ్యవసాయం ట్రాక్టర్లతోటి టెక్నాలజీ తోటి నిర్వహించుకునే పరిస్థితి వచ్చింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఎడ్ల బల ప్రదర్శన ద్వారా రైతులను ప్రోత్సహిస్తూన్నారు. ఒంగోలు జాతి ఎడ్లను పోషించడానికి ఇలాంటి ప్రదర్శనలే కారణం. రాజేంద్ర ప్రసాద్ గారి లాంటివారు రాష్ట్రవ్యాప్తంగా  ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి పశు పోషకులకు కూడా ఒక నమ్మకం. మనం ఈ ఎడ్లను కనుక పోషిస్తే దాని ద్వారా ఈ జాతి అభివృద్ధి చెందుతుంది. దీనికి ఆదరాభిమానాలు ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు మన రాష్ట్రంలో చాలా నిర్వహిస్తున్నారు అని వారికి కూడా ఒక నమ్మకం కలిగి ఈనాటికి కూడా  రైతాంగం ఎడ్లు పోషించి ప్రదర్శనకు తీసుకు వస్తున్నారంటే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్లనే.*

 *మరి అటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే నక్కా ఆనంద్ బాబు గారు అలాగే వారికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వారి యొక్క మిత్రులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు.*


 
 
 
ఎన్నికల తర్వాతే కేబినెట్ విస్తరణ.. సీఎం రేవంత్ క్లారిటీ!

ఎన్నికల తర్వాతే కేబినెట్ విస్తరణ.. సీఎం రేవంత్ క్లారిటీ!
తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈసారి పూర్తిస్థాయి కేబినెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రెండు రోజుల పాటు కేరళం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్.. చివరిరోజున అక్కడి మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా కేరళం, పాండిచ్చెరి, అస్సాం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి.



శావల్యాపురం మండలంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది


కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశా నిర్దేశం మేరకు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, శావల్యాపురం మండల సీనియర్ నాయకులు అడుసుమల్లి వీరేంద్ర గారు, ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు, వినుకొండ నియోజకవర్గ బిజెపి మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ గారు, పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్ గారి సూచనల మేరకు, ఈ వారం "జనతా వారధి" కార్యక్రమాన్ని శావల్యాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మతుకుమల్లి గ్రామంలో స్థానిక బిజెపి నేత వజ్జా వెంకటేశ్వర్లు గారి నిర్వహణలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది, అందులో భాగంగ హైస్కూల్ ప్రహరీ గోడ నిర్మాణం కొరకు, పొలాలకు వెళ్లేటువంటి రహదారుల నిర్మాణం కొరకు, జలజీవన్ మిషన్ పూర్తిచేసి పంచాయతీకి అప్పగించడం కొరకు, పీఎం కిసాన్ రైతు భరోసా నిధుల మంజూరు కొరకు, వంటి అంశాలపై ఆరు దరఖాస్తులు రావడం జరిగింది వీటి పరిష్కారం కొరకు బిజెపి పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని అర్జిదారులకు తెలియజేయడం జరిగింది, కార్యక్రమంలో స్థానిక బిజెపి నేతలు గ్రామస్తులు పాల్గొన్నారు

 
 
 
Income Tax: నేటి నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం

*పలు నిబంధనల్లో మార్పులు*

 *ఆరు దశాబ్దాల నాటి పాత ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో నేటి నుంచి (ఏప్రిల్‌ 1) కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమల్లోకి వచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభమైన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం పన్ను నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ ఫైనాన్స్‌ చట్టం-2025ను నోటిఫై చేసింది. దేశ పన్నుల విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు కొత్త చట్టం సిద్ధమయ్యింది. ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్‌పై సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (ఎస్‌టీటీ) పెంపు, విదేశీ విహార ప్యాకేజీలు, విద్య-వైద్యం నిమిత్తం విదేశాలకు పంపే మొత్తంపై పన్ను తగ్గింపు.. ఇలా ఎన్నో కీలక నిబంధనలు బుధవారం నుంచి అమల్లోకి  వస్తున్నాయి.*

*సులభంగా.. సరళంగా*

*పన్ను విధానాన్ని మరింత సులభంగా అర్థమయ్యేలా మార్చడమే కొత్త చట్టం లక్ష్యం. దీనిలో అసెస్‌మెంట్‌ ఇయర్, ప్రీవియస్‌ ఇయర్‌ అనే వ్యత్యాసాలను తొలగించి, ఒకే ‘ట్యాక్స్‌ ఇయర్‌’ విధానాన్ని తీసుకొచ్చారు. గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్‌ (ఇన్‌కంట్యాక్స్‌ రిటర్నులు) దాఖలు చేసినప్పటికీ, ఎలాంటి జరిమానా లేకుండా, టీడీఎస్‌ (మూలం వద్దే పన్ను) రిఫండ్‌ను క్లెయిం చేసుకునే వెసులుబాటు కల్పించారు.*

 *2026 జులైలో (2025-26 ఆదాయానికి సంబంధించిన) దాఖలు చేసే ఐటీఆర్‌లు పాత చట్టం నిర్దేశించిన ఫారాల ప్రకారమే సమర్పించాల్సి ఉంటుంది.*

*2026 జూన్‌ నుంచి చెల్లించే ముందస్తు పన్ను (ట్యాక్స్‌ ఇయర్‌ 2026-27 కోసం) మాత్రం కొత్త చట్టం ప్రకారం చెల్లించాలి. ఈ మార్పుల నేపథ్యంలో పాత, కొత్త చట్టాలకు సంబంధించిన సేవలను ఐటీ శాఖ ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌ పారదర్శకంగా అందిస్తుందని ఆదాయపు పన్ను విభాగం స్పష్టం చేసింది.*

*7 ఐటీఆర్‌ ఫారాలు జారీ..*

*2026-27 మదింపు సంవత్సరానికి  ఆదాయపు పన్ను విభాగం మొత్తం 7 ఐటీఆర్‌ ఫారాలను నోటిఫై చేసింది. మార్చి 30న చిన్న, మధ్య తరహా పన్ను చెల్లింపుదారుల కోసం ఐటీఆర్‌ 1-4 ఫారాలను జారీ చేయగా, మంగళవారం ఐటీఆర్‌ 2, 3, 5, 6, 7తో పాటు ఐటీఆర్‌- యూ (అప్‌డేటెడ్‌ రిటర్న్స్‌) ఫారాలనూ నోటిఫై చేసింది. ఆడిట్‌ అవసరం లేని వారికి ఐటీఆర్‌ దాఖలు చేసేందుకు జులై 31 వరకు గడువు ఉంది.*

*ఐటీఆర్‌-1 (సహజ్‌), ఐటీఆర్‌-4(సుగమ్‌): వార్షికాదాయం రూ.50 లక్షల లోపు ఉండి, వేతనం, ఒక ఇంటిపై ఆదాయం పొందేవారు సహజ్‌ దాఖలు చేయాలి. వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందే వారు సుగమ్‌ సమర్పించాలి.*

*వ్యాపార లాభాలు లేకుండా మూలధన లాభాలు పొందేవారు ఐటీఆర్‌-2, సొంత వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందేవారు ఐటీఆర్‌-3, సంస్థలు, ఎల్‌ఎల్‌పీలు ఐటీఆర్‌-5, కంపెనీలు ఐటీఆర్‌-6, ట్రస్టులు ఐటీఆర్‌-7 ఫారాలను ఉపయోగించాలి.*

*ఎస్‌టీటీ పెంపు..*

*స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌ కారణంగా చిన్న మదుపర్లు తీవ్రంగా నష్టపోకుండా రక్షించేందుకు, ఈక్విటీ డెరివేటివ్స్‌ (ఎఫ్‌అండ్‌ఓ) విభాగంలో సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (ఎస్‌టీటీ)ను పెంచారు.*

*ఫ్యూచర్స్‌ కాంట్రాక్టులపై ఎస్‌టీటీ    0.02% నుంచి 0.05 శాతానికి చేరింది.*

*ఆప్షన్స్‌ ప్రీమియంపై 0.1% నుంచి 0.15 శాతానికి, ఆప్షన్స్‌ ఎక్సర్‌సైజ్‌పై  0.125% నుంచి 0.15 శాతానికి మారింది. సెబీ అధ్యయనం ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌అండ్‌ఓ విభాగంలో మదుపరులు ఏకంగా రూ.1.05 లక్షల కోట్ల నికర నష్టాలను చవిచూశారు. ఈ విభాగంలో మదుపరుల సంఖ్య 2024-25లో 1.06 కోట్లు ఉండగా, 2025-26 డిసెంబరుకు 75.43 లక్షలకు పడిపోయింది.*

*టీసీఎస్‌పై ఊరట*

*మధ్యతరగతి ప్రజలకు ఊరటనిస్తూ, విదేశీ టూర్‌ ప్యాకేజీలపై మూలం వద్ద పన్ను వసూలు (టీసీఎస్‌)ను 20% నుంచి 2 శాతానికి కుదించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ (లిబరలైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీం) కింద వైద్య, విద్యా అవసరాల కోసం విదేశాలకు పంపే నిధులపై టీసీఎస్‌ను ప్రస్తుత 5% నుంచి 2 శాతానికి తగ్గించారు.*

*బైబ్యాక్‌ షేర్లపై..*

*ఏప్రిల్‌ 1 నుంచి కంపెనీల బైబ్యాక్‌ ఆఫర్లలో షేర్లను విక్రయించడం ద్వారా ఆర్జించే మూలధన లాభాలపై వ్యక్తులు లేదా కార్పొరేట్‌ వాటాదారులకు 12% సర్‌ఛార్జీ విధించనున్నారు. గతంలో రూ.50 లక్షల వరకు సర్‌ఛార్జీ ఉండేది కాదు. రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి మధ్య ఆదాయం ఉంటే 10% సర్‌ఛార్జీ ఉండేది. ఈ కొత్త నిబంధనతో పన్ను చెల్లింపుదారులపై పన్ను భారం పెరగనుంది.*


 
 
యడ్లపాడు ఆంజనేయ స్వామి ఆలయ ఆభరణాల దొంగతనం..
 
*నిందితుడి అరెస్ట్, 230 గ్రాముల సొత్తు స్వాధీనం...*

యడ్లపాడు: భక్తితో నమ్మకంగా కొలిచే ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన వెండి,బంగారు ఆభరణాల దొంగతనంతో సంబంధం ఉన్న కేసులో ఎడ్లపాడు ఎస్సై శివరామకృష్ణ మరియు సిబ్బంది ఓ నిందితుడిని అరెస్ట్ చేసి 230 గ్రాముల వెండి‑బంగారు సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 

*నిందితుడి అరెస్ట్ వివరాలు..*

యడ్లపాడు గ్రామానికి చెందిన 43 ఏళ్ల మద్దుల రమణారావు (తండ్రి: మద్దుల హనుమంతరావు)ను తెనాలి టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న బజారు ప్రాంతంలో 2026, మార్చి 31వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు.అతనిపై యడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నెం. 17/2026 కింద U/S 303(2), 305(d), 306 BNS సెక్షన్లతో పాటుగా దర్యాప్తు కొనసాగించండంతో ఆయన అదుపులోకి తీసుకున్నారు.ఆభరణాల దాచిన స్థలం,స్వాధీనం అరెస్ట్ అనంతరం తన వాంగ్మూలంలో నిందితుడు దొంగిలించిన ఆస్తులను కనమర్లపూడిలోని శ్రీహరిరావు ఇంటి వద్ద దాచినట్లు తెలిపాడు. దీనిమేరకు దర్యాప్తు అధికారి మధ్యవర్తుల సమక్షంలో సంబంధిత ప్రదేశానికి చేరుకుని ఆభరణాలను సీజ్ చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న ఆభరణాలన్నీ యడ్లపాడు ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన చోరీ సొత్తే అని అధికారులు గుర్తించారు.

*స్వాధీనమైన ఆభరణాల వివరాలుసీజ్..*

వెండి వస్తువులు (మొత్తం 216 గ్రాములు)తమలపాకుల తోరణం – 142 గ్రాములునామాలు మరియు నేత్రాలు – 42 గ్రాములురెండు జతల ఉత్తర జంద్యాలు – 14 గ్రాములుమెట్టెలు మరియు పిల్లేళ్లు – 20 గ్రాములుబంగారు ఆభరణాలు (మొత్తం 14 గ్రాములు)మంగళసూత్రం – 4 గ్రాములురెండు జతల బంగారు నేత్రాలు – 10 గ్రాములుపై ఆస్తులను ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో గుర్తించి, తదుపరి దర్యాప్తు కోసం పోలీసులు సీజ్ చేశారు. నిందితుడు మద్దుల రమణారావును అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ కు తరలించి,కేసులో ఇతర అంశాలు, మధ్యవర్తి పాత్రలపై కూడా క్లుప్త దర్యాప్తు చేపడుతున్నామని ఎస్ఐ శివరామకృష్ణ తెలిపారు.