kapunews



TRENDING NOW





మైదవోలు యువకుడికి అంతర్జాతీయ గుర్తింపు


పల్నాడు జిల్లా, ఎడ్లపాడు మండలం, మైదవోలు గ్రామానికి చెందిన నక్కా శ్రీనివాసరావు (తాత: నక్కా నాగేశ్వరరావు, తండ్రి: నక్కా గోవిందరాజు, తల్లి: నక్కా లక్ష్మి) గారు, చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన యువకుడు, అంతర్జాతీయ స్థాయి వాలీబాల్ కోచింగ్ కోర్సుకు ఎంపిక కావడం గర్వకారణంగా నిలిచింది.
ఏషియన్ వాలీబాల్ కాంటినెంటల్ (AVC) పరిధిలో, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాలీబాల్ (FIVB) డెవలప్మెంట్ ఆధ్వర్యంలో చైనాలో జూలై 17 నుండి 24 వరకు నిర్వహించనున్న FIVB లెవల్-3 కోచెస్ కోర్సుకు భారతదేశం నుండి ఎంపిక కావడం విశేషం.
ఈ సందర్భంగా NDA కూటమి మాజీ మంత్రి శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు మాట్లాడుతూ, ఈ లెవల్-3 స్థాయికి ఎదగడం అనేది భారతదేశంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో (ప్రస్తుత పల్నాడు జిల్లా) నక్కా శ్రీనివాసరావు ఒక రికార్డు సృష్టించినట్లే అని అభినందనలు తెలిపారు.
అలాగే పల్నాడు జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు, ఎడ్లపాడు సర్పంచ్ పోపూరి రాఘవయ్య గారు, ఈనాడు విలేకర్ పోపూరి రత్తయ్య గారు, చిలకలూరిపేట విజయ్ కుమార్ గారు (కరణం) అభినందనలు తెలియజేశారు.
భారతదేశం తరఫున, ముఖ్యంగా చిలకలూరిపేట నియోజకవర్గం నుండి ఈ స్థాయి ఎంపిక సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ, దేశానికి మంచి పేరు తీసుకురావడంతో పాటు, ఎంతో మంది క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని ఆశీర్వదించారు.


*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి తిరుపతి జిల్లా కన్వీనర్ గా నియమితులైన కమ్మర విష్ణువర్ధన్ రావు*


 సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన తిరుపతి జిల్లా కన్వీనర్ గా నియమితులైన కమ్మర విషువర్ధన్ రావు . జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా కమ్మర విష్ణువర్ధన్ రావు తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన కమ్మర విష్ణువర్ధన్ రావు.

 సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన కమ్మర విషువర్ధన్ రావు .

 అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన కమ్మర విషు వర్ధన్ రావు .

 సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన కమ్మర విష్ణువర్ధన్ రావు .

 హిందువులకు ఆరాధ్య దైవం అయిన గోమాతను సంరక్షించుకునే బాధ్యతలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కన్వీనర్ కమ్మర విషువర్ధన్ రావు అన్నారు.



 
 
రాయచోటి ACB సోదాల నేపధ్యంలో ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తించిన అధికారులు. 

అక్రమాస్తుల కేసులో ACBకి చిక్కిన సహాయ బీసీ సంక్షేమ అధికారి నివాసాల్లో సోదాలు నిర్వహించి భారిగా ఆస్తులను గుర్తించారు అధికారులు. 

శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి డివిజన్, కదిరికి చెందిన సహాయ బీసీ సంక్షేమ అధికారి పురం బాలాజీపై ఫిబ్రవరి 5న ACB వల పన్ని పట్టుకున్న (trap case) ఘటన అనంతరం, ఆయన తన చట్టబద్ధమైన ఆదాయ వనరులకు మించి ఆస్తులను కూడగట్టారన్న ఆరోపణలపై అనంతపురం ACB అధికారులు మరొక కేసును నమోదు చేశారు. అవినీతి నిరోధక చట్టం లోని సెక్షన్ 13(1)(b)తో కలిపి సెక్షన్ 13(2) కింద ఈ కేసును Cr. No. 05/RCA-ATP/2026గా నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా నిందితుడు పురం బాలాజీకి చెందిన రాయచోటి, కదిరి పట్టణాలలోని నివాసాలతో సహా మొత్తం నాలుగు  ప్రదేశాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల సమయంలో, ఆస్తి పత్రాలతో సహా నేరారోపణకు దారితీసే పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వెలుగుచూసిన ఆస్తులలో 11 ఇంటి స్థలాలు, 2 ఇళ్లు, రూ.21,80,140 నగదు, రూ. 26.5లక్షల విలువైన ఆభరణాలు, ఒక కియా సెల్టోస్ కారు, ఒక మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కారు, రెండు మోటార్ సైకిళ్లు, బ్యాంకు ఖాతాల్లో రూ.37.50 లక్షల నిల్వలు, రూ. 13 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు, రూ.3.60కోట్లు విలువైన గృహోపకరణాలు ఎసీబీ అధికారులు గుర్తించారు.. ఈ ఆస్తులు నిందితుడు, అతని భార్య, ఇద్దరు కుమార్తెలు తండ్రి పేర్ల మీద ఉన్నట్లు గుర్తించారు. వీటిలో అత్యధిక ఆస్తులు పూర్వపు YSR కడప జిల్లా పరిధిలోనే గుర్తించారు. దర్యాప్తులో భాగంగా మరిన్ని సోదాలు కొనసాగుతున్నాయి. నిందితుడిని చట్టపరమైన విధానాల ప్రకారం అరెస్టు చేసి, కర్నూలులోని ACB కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన  ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరు పరుచనున్నారు. 

నిందితుడైన పురం బాలాజీ, 1987వ సంవత్సరంలో హాస్టల్ సంక్షేమ అధికారి (Grade-II)గా నియమితులై, కడప జిల్లాలోని వివిధ ప్రాంతాలలో పనిచేశారు. తర్వాత రాయచోటిలో పనిచేస్తున్న సమయంలో 2011లో ఆయన హాస్టల్ సంక్షేమ అధికారి (Grade-I) పదవికి పదోన్నతి పొందారు; అక్కడ కొంతకాలం కొనసాగిన తర్వాత, మట్లి లలో పనిచేశారు. ఆ తర్వాత 2016వ సంవత్సరంలో ఆయన సహాయ బి.సి. సంక్షేమ అధికారిగా పదోన్నతి పొంది తిరుపతి అర్బన్ డివిజన్‌కు బదిలీ అయ్యారు. 2023 జూన్ 1 నుండి కదిరి డివిజన్‌లో పనిచేస్తున్నారు.
*
 
 
పల్నాడు జిల్లా కార్యాలయం లో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది*

 *పల్నాడు జిల్లా జిల్లా కార్యాలయంలో ఈరోజు శుక్రవారం ఉదయం 10 గంటలకు జనతా వారది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా జాతీయ కౌన్సిల్ సభ్యులు వల్లపు కృపారావు గారు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభ ఉపన్యాసం చేసిన వల్లెపు కృపారావు గారు జనతా వారద కార్యక్రమం ప్రతి శుక్రవారం పల్నాడు జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని ప్రజలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని తమ సమస్యలపై వినతులు సమర్పించిన పిదప వాటి పరిష్కార కోసం భారతీయ జనతా పార్టీ తరఫున ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. అలాగే ప్రతి సోమవారం భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు మరియు జనత వారది కన్వీనర్లు కో కన్వీనర్లు ప్రతి రెవెన్యూ కార్యాలయం వద్ద కూడా ప్రతి సోమవారం జనతా వారది కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఈ సదవకాశాన్ని కూడా ప్రజలు వినియోగించుకోవాలని తెలియజేశారు* 

 *అలాగే ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించడం కూడా జరిగింది. తదుపరి సంబంధిత ప్రభుత్వ అధికారులకు వాటిపై వివరణ అడిగి సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారికి తెలియజేయడం జరిగింది*

 *ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ కౌన్సిల్ మెంబర్ వల్లెపు కృపారావు గారు పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నభట్ల ఆదిత్య కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి ఆవుల ఆదినారాయణ బీజేపీ దేవిశెట్టి శ్రీనివాస్ గుప్తా బీజేవైఎం నాయకులు ఇమ్మడిశెట్టి అమరేంద్ర తదితరులు పాల్గొన్నారు*



 
 
రసరావుపేట భారతీయ జనతాపార్టీ జిల్లా కార్యాలయంలో NDA కూటమి మహిళా నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది 

 స్థానిక ప్రకాష్ నగర్ లోని బిజెపి జిల్లా కార్యాలయంలో "ఎన్డీఏ కూటమి మహిళా నాయకుల విలేకరుల సమావేశం" జరిగింది. 
ఈ విలేకరుల సమావేశంలో మూడు పార్టీలకు చెందిన మహిళా మోర్చా, తెలుగు మహిళ, వీర మహిళలు పాల్గొని వారి గళాన్ని వినిపించారు.
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మహిళల పట్ల అత్యంత సానుకూల ధోరణితో 33% రిజర్వేషన్లు అమలు చేసే విధంగా పార్లమెంటులో బిల్లు తీసుకు వస్తే, దుష్ట కాంగ్రెస్ పార్టీ మరియు ఇండికూటమి మహిళల స్వాభిమానాన్ని కాలరాస్తూ మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం అత్యంత హేయమైన చర్య అని అభివర్ణించారు. బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఊరా సుజాత గారు మాట్లాడుతూ దేశంలోని మహిళలందరికీ మోడీ గారు వరాలు ప్రకటిస్తే, కాంగ్రెస్ పార్టీ ఇండికూటమి ఆ వరాలను అందుకోనీకుండా చేస్తున్నారని మండిపడ్డారు, తెలుగుదేశం పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు కథం నాగజ్యోతి గారు మాట్లాడుతూ ఒకపక్క దేశంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళుతుంటే కాంగ్రెస్ పార్టీ ఇండీ కూటమి మహిళాభ్యుదయాన్ని తుంగలో తొక్కే విధంగా ప్రవర్తిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి కనుమూరి రాజ్యలక్ష్మి గారు మాట్లాడుతూ సునీత విలియమ్స్ కల్పనా చావ్లా లాంటి ఎంతోమంది మహిళాశక్తి అభివృద్ధిపథాన దేశాన్ని ఎంతో ముందుకు తీసుకువెళుతూ ఉంటే దుష్ట కాంగ్రెస్ పార్టీ ఇండీ కూటమి మహిళలను ఎదగనివ్వకుండా మోకాలు అంటుతున్నారని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జనసేన వీర మహిళ ఉపాధ్యక్షురాలు జక్కం నిర్మల గారు మాట్లాడుతూ భారతదేశంలో అద్భుత రీతిన NDA ఆధ్వర్యంలో మహిళా శక్తికి 33% రిజర్వేషన్ తో పట్టంకట్టి వారిని చట్టసభలలో కూర్చోబెట్టాలని ఆలోచనకు తూట్లు పొడిచి దేశంలోని మహిళలందరికి తీరని ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మరియు ఇండికూటమి అని మండిపడ్డారు.

     కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు వల్లెపు కృపారావుగారు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నాభట్ల ఆదిత్య గారు, జిల్లా ఉపాధ్యక్షులు కాటా అంజనారెడ్డి గారు, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి నేరెళ్ల విజయలక్ష్మి గారు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ మహిళా ప్రధాన కార్యదర్శి ఆర్ నాగలక్ష్మి గారు, జనసేన పార్టీ వీర మహిళ దండూరి లక్ష్మి గారు, తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళ పాలడుగు కుమారి గారు, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు చలువారి సరస్వతి గారు, యువ మోర్చా ఉపాధ్యక్షురాలు దేవిశెట్టి సుధారాణి గారు, సంయుక్త కార్యదర్శి చిలకల పద్మప్రియ గారు, చిలకల ప్రియాంక గారు,  రెండవ పట్టణ అధ్యక్షులు అడపా ఫణిభూషణ్ గారు, రూరల్ మండల అధ్యక్షులు పొందుగల వెంకటేశ్వరరావు గారు, సీనియర్ నాయకులు నాగసరపు ఆంజనేయులు గారు, రెండవ పట్టణ ప్రధాన కార్యదర్శి దయిండే కిషోర్ గారు, జిల్లా యువమోర్చా ప్రధాన కార్యదర్శి ధారా గుప్తా గారు, జిల్లా కార్యాలయ సహాయకులు మిట్ట చిరంజీవి గారు పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు.

''మాచర్ల కేంద్రీయ విద్యాలయంలో ఈ ఏడాది నుండే తరగతులు ప్రారంభం''

మాచర్ల కేంద్రీయ విద్యాలయంలో ఈ విద్యా సంవత్సరం 2026-27 నుండే తరగతులు ప్రారంభించేందుకు అనుమతులను సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. ఈ ఏడాది నుండే  మాచర్లలోని గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు.. ఒక్కో సెక్షన్ కు 40మందితో క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ  కేంద్రీయ విద్యాలయం శాశ్వత భవనం నిర్మాణానికి జాతీయ రహదారి ప్రక్కనే అనువైన 4.56 ఎకరాలను భూమిని కేటాయిస్తూ..ప్రభుత్వం నుండి కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ విధంగా ఈ కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకి అన్ని మార్గాలు క్లియర్ అయ్యాయి. ఈ కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు ద్వారా మాచర్ల ప్రాంత బిడ్డలకు నాణ్యమైన విద్య చేరువవుతుందని తెలియజేయుటకు సంతోషిస్తున్నాను. ఏదైతే ఎన్నికల సమయంలో ఈ కేంద్రీయ విద్యాలయాన్ని అందుబాటులో తీసుకొచ్చి విద్యార్థులకు తరగతులను ప్రారంభింప చేస్తామని హామీ ఇచ్చామో, అందుకు అనుగుణంగా కృషి చేసి ఈరోజు ఆ ప్రమాణాన్ని నేను, మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు నిలబెట్టుకున్నాము.

 
*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి అంబేద్కర్ కోనసీమ జిల్లా కన్వీనర్ గా నియమితులైన జి ఎన్ రావు*


 సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన అంబేద్కర్ కోనసీమ జిల్లా కన్వీనర్ గా నియమితులైన జి ఎన్ రావు. జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా జి ఎన్ రావు తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన జి ఎన్ రావు.

 సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన జి ఎన్ రావు.

 అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన జి ఎన్ రావు.

 సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన జి ఎన్ రావు.

 హిందువులకు ఆరాధ్య దైవం అయిన గోమాతను సంరక్షించుకునే బాధ్యతలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కన్వీనర్ జి యన్ రావు అన్నారు.


 
 
వినుకొండ పట్టణం లొ బీజేపీ ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది 

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ P V N మాధవ్ గారు మరియు జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్ గారి సూచనల ప్రకారం మన వినుకొండ పట్టణంలో  జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
 జనతా వారధి అనగా ప్రజల నుంచి సమస్యలు సేకరించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి దాన్ని పరిష్కరించే కార్యక్రమమే ఈ జనతా వారధి .
దీనిలో భాగంగా   జరిగిన జనతా వారధి కార్యక్రమం లో భాగంగా గృహ సంపర్కం చేసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసు కోవడం జరిగినది.
అది వారం ఉదయం బోసు బొమ్మ దగ్గర ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లో పూజా కార్యక్రమం పూర్తిచేసుకుని అక్కడి నుండి బొమ్మ మీదగా పప్పు బజార్ వరకు గృహ సంపర్కం చేయడం జరిగింది కార్యక్రమంలో పెన్షన్లు కావాలని, నీళ్లు సమయానికి రావడం లేదని, విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ కొత్తది కావాలని ప్రజలు మన కార్యకర్తల దృష్టికి తీసుకురావడం జరిగింది .
కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి గొడవర్తి సుజాత,  పట్టణ మాజీ అధ్యక్షులు ఆడిటర్ రాఘవులు, బండి వెంకటేశ్వర్లు , పట్టణ ఉపాధ్యక్షులు దేసు వెంకట లక్ష్మీనారాయణ,  పువ్వాడ అరవింద తదితరులు పాల్గొన్నారు.



 
 
*పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం లొ జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది*

 *పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు పల్నాడు జిల్లా జనతా వారది కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా జనతా వారది కో కన్వినర్ గారు పల్నాడు జిల్లా సీనియర్ నాయకులు గుమ్మడి నాసారయ్య గారు దేవిశెట్టి శ్రీనివాస్ గుప్తా నెల్లటూరి ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు*


**గౌరవనీయులైన శ్రీమతి కృతిక శుక్ల , ఐ.ఏ.ఎస్.,**  
**జిల్లా కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్,** 
*పల్నాడు జిల్లా*

**విషయం:**పల్నాడు జిల్లాలోని గ్రామాల్లో చెత్త నిర్వహణ (SLWM) మరియు కంపోస్ట్ యూనిట్ల నిర్వీర్యం పై తక్షణ చర్యలు తీసుకోవాలని వినతి.

*అమ్మ ,*

భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న **జనతా వారధి** కార్యక్రమం ద్వారా జిల్లా గ్రామాల్లో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నాము. ఈ పర్యటనల సందర్భంగా పారిశుధ్యం విషయంలో అనేక ఫిర్యాదులు అందుతున్నాయి.

జిల్లాలోని అనేక గ్రామాల్లో **Solid & Liquid Waste Management (SLWM)** కింద నిర్మించిన కంపోస్ట్ పిట్స్, సెగ్రిగేషన్ షెడ్లు నిర్వీర్యంగా ఉన్నాయి. కొన్ని చోట్ల నామమాత్రంగా మాత్రమే నిర్వహణ జరుగుతోంది. 

**స్వచ్ఛ భారత్ మిషన్** కింద కేంద్ర ప్రభుత్వం నుంచి వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసి నిర్మించిన ఈ యూనిట్లు ప్రస్తుతం చెత్త నిల్వ కేంద్రాలుగా మారుతున్నాయి. తడి చెత్త – పొడి చెత్త వేరు చేయడం, కంపోస్ట్ తయారీ, రీసైక్లింగ్ వ్యవస్థ సరిగా అమలు కావడం లేదు. పారిశుధ్య కార్మికుల కొరత మరియు పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.

దీని వల్ల **“చెత్త నుంచి సంపద”** లక్ష్యం సాధ్యం కావడం లేదు. గ్రామాల్లో అస్వచ్ఛత పెరిగి ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలుగుతోంది. ప్రభుత్వ నిధులు వృథా అవుతున్నాయి.

**రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు** ప్రతిష్టాత్మకంగా **స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర** కార్యక్రమాన్ని ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో భాగస్వామ్యం కావాలని భారతీయ జనతా పార్టీ మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తోంది.

**కావున మనవి:**

1. జిల్లా వ్యాప్తంగా అన్ని SLWM యూనిట్లపై **ప్రత్యేక సమగ్ర ఆడిట్** నిర్వహించాలి.
2. పనిచేయని కంపోస్ట్ పిట్స్ / షెడ్లను **తక్షణం పునరుద్ధరించాలి**.
3. తడి చెత్త – పొడి చెత్త వేరు చేయడం **కఠినంగా అమలు** చేయాలి.
4. ప్రతి గ్రామానికి తగినంత **పారిశుధ్య కార్మికులను** నియమించాలి.
5. గ్రామ/వార్డు స్థాయిలో **పర్యవేక్షణ కమిటీలు** ఏర్పాటు చేసి బాధ్యతలు స్పష్టంగా నిర్ణయించాలి.
6. కంపోస్ట్ ఉత్పత్తికి **సరైన మార్కెట్ లింకేజీ** కల్పించాలి.
7. ప్రజలకు **అవగాహన కార్యక్రమాలు** విస్తృతంగా నిర్వహించాలి.


గ్రామాల్లో పారిశుధ్యం కేవలం నిర్మాణాలతో కాకుండా, **సమర్థవంతమైన నిర్వహణ** ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. పై అంశాలపై **తక్షణ చర్యలు** తీసుకొని “చెత్త నుంచి సంపద” లక్ష్యాన్ని వాస్తవ రూపంలో అమలు చేయవలసిందిగా మనవి చేస్తున్నాము.

**జనతా వారధి – పల్నాడు జిల్లా టీమ్**  

             * *ఇట్లు**     
  *ఏలూరి శశి కుమార్*
    *జిల్లా అధ్యక్షులు*  
    *భారతీయ జనతా పార్టీ*
   *పల్నాడు జిల్లా*


 
 
తెలంగాణలో ప్లాస్టిక్ పూల నిషేధం?

తెలంగాణ ప్రభుత్వం సంచ లన నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ పూలపై నిషేధం అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ ఉత్త ర్వులు జారీ చేసింది. ఇక నుంచి రాష్ట్రంలోని ప్రభు త్వ మార్కెట్లలో ప్లాస్టిక్ పూలను విక్రయించకూడ దని, ఎవరైనా అమ్మితే చర్యలు తీసుకుంటామం టూ హెచ్చరించింది. 

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ రైతు బజార్లు, ప్రభుత్వ మార్కెట్లలో ఈ నిషేధం అమల్లోకి తెచ్చింది. ఒకవేళ ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటా మని, లైసెన్స్ కూడా రద్దు చేస్తామంటూ ప్రకటించింది. సహజ పూలను, వాటి ఉత్ప త్తులను మాత్రమే రైతు బజార్లు, మార్కెట్లలో విక్రయించేలా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.

ప్రభుత్వ రైతు బజార్లు, మార్కెట్లలో ప్లాస్టిక్ పూలను ఎక్కువగా అమ్ముతున్నట్లు ఫిర్యాదు వచ్చాయి. సహజ పూలను కాకుండా ప్లాస్టిక్ పూల అమ్మకాలు ఎక్కు వగా జరుగుతున్నాయి. అయితే ప్లాస్టిక్ పూల వల్ల సహజ పూల విక్రయాలు జరగడం లేదు. దీని వల్ల తమకు నష్టం జరుగుతోం  దని పూల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఈ విషయాన్ని ఇటీవ ల వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. 

ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా రైతు మేళాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారులు ఆయనను కలిసి తమ బాధను వెల్లబోసుకున్నారు. రైతు బజార్లలో ప్లాస్టిక్ పూల వల్ల తమకు ఆదాయం రావడం లేదని, నష్టం జరుగుతుందని పూల వ్యాపారులు వాపోయారు. దీంతో తుమ్మల నాగేశ్వరరావు స్పందించి ఈ మేరకు చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రైతు బజార్లు, మార్కెట్లలో ఈ ఆదేశాలు వర్తించనున్నాయి..

 
 
తెలంగాణలో త్వరలో జడ్పిటిసి,ఎంపీటీసీ,ఎన్నికలు

తెలంగాణలో జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాల,జడ్పీటీసీ,ఎంపీటీసీ,ఎన్నికలకు రంగం సిద్ధమైంది,ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది,దీంతో మరోసారి తెలం గాణలో ఎన్నికల నగరా మోగనుంది...

గత డిసెంబర్ నెలలో సర్పంచ్,వార్డు సభ్యుల ఎన్నికలు పూర్తి కాగా..ఆ తర్వాత మున్సిపల్ ఎన్నిక లు కూడా నిర్వహించారు.తాజాగా.. ప్రత్యేకాధికారు ల పాలనలో ఉన్న మండ ల, జిల్లా ప్రజాపరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించేందు కు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఓటర్ల జాబితా తయారీకి శుక్రవారం సాయంత్రం కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. 

పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలోనే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి మినహా మిగిలిన అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణపై దిశానిర్దేశం చేసింది.కేంద్ర ఎన్నికల సంఘం 2025 జూలై 10 నుండి 2026 ఫిబ్రవరి 5 వరకు సమీకరించిన ఓటర్ల జాబితా ఆధారంగా ఈ ప్రక్రియ కొనసాగనుంది. 

నియోజకవర్గాల్లోని అద నపు ఓటర్లను గుర్తించి, వారిని సంబంధిత పంచాయతీలు, పోలింగ్ కేంద్రాల వారీగా వర్గీకరిం చాలని అధికారులు ఆదేశించారు. ఈ డేటాను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ యూజర్ మాన్యువల్ ప్రకారం పోలింగ్ కేంద్రాలకు అనుసంధానించాల్సి ఉంటుంది. డేటాలో ఏవైనా లోపాలు ఉంటే ఈ నెల 23 వ తేదీలోపు నివేదించాల ని,ఆ తర్వాత ముసాయి దా జాబితాలను విడుదల చేసి, అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది జాబితాను ప్రకటిస్తామని ఎస్‌ఈసీ తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.




 
 
నటుడు ప్రకాష్ రాజ్ మీద పరువు నష్టం దావా

రామాయణంపై హిందువుల మనోభావాలు కించపరిచేలా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేశారని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం

ఈ క్రమంలోనే ఆయన మీద పరువు నష్టం దావా వేసి.. హిందువులకు ప్రకాష్ రాజ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని భాను ప్రకాష్ డిమాండ్

రాముడు, లక్ష్మణుడు ఉత్తరం నుంచి వచ్చి.. దక్షిణాదిలో గిరిజనుడైన రావణుడి పొలంలోకి వెళ్లి వాళ్లు పండ్లు తినడంతో వివాదం చెలరేగిందని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు


మాట నిలబెట్టుకున్న లోకేష్‌
పునర్వికకు రూ. 16 కోట్ల ఇంజెక్షన్‌.. 
చిట్టి తల్లికి నిండు నూరేళ్లు

మంత్రి నారా లోకేశ్‌ మాట ఇచ్చారంటే పని జరిగిపోయినట్లే. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్విక బాధ్యత తీసుకున్న లోకేశ్‌.. విజయవంతంగా చికిత్స పూర్తి చేశారు. 
చిట్టి తల్లి పునర్విక మృత్యుంజయురాలిగా నిలిచింది. 16 కోట్ల రూపాయల విలువైన ఇంజక్షన్‌ చేయడంతో చిన్నారి పాప ప్రాణాపాయం నుంచి బయటపడింది. పెరుగుదలను అడ్డుకొంటూ అనుక్షణం కుంగదీసే.. స్పైనల్‌ మస్క్యులర్‌ ఎట్రోపీ.. వెన్నెముక కండరాల క్షీణత వ్యాధి నుంచి విముక్తి లభించింది. మంత్రి లోకేశ్‌ చొరవ తీసుకొని.. దగ్గరుండి పాపకు చికిత్స చేయించారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న పునర్విక కోలుకోవాలంటే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్‌ కావాల్సిన సమయంలో.. ప్రజలు పెద్ద మనసుతో క్రౌడ్‌ ఫండింగ్‌ చేసి 10 కోట్లు ఇచ్చారు. మిగిలిన ఆరు కోట్లు ఎలా సమకూర్చుకోవాలా అని ఆందోళనలో ఉన్న పేరెంట్స్‌కి మంత్రి నారా లోకేశ్‌ భరోసా ఇచ్చారు. నేనున్నానంటూ అండగా నిలిచారు. 

చిన్నారి పునర్విక చికిత్స కోసం అవసరమైన 6 కోట్లు నేను చూసుకొంటానని హామీ ఇచ్చారు. మాట ఇవ్వడంతో ఆగిపోలేదు.. వ్యక్తిగతంగా విదేశాల నుంచి సాధ్యమైనంత త్వరగా ఇంజెక్షన్‌ తెప్పించి.. ట్రీట్‌మెంట్‌ చేయించారు. పాపకు ఇంజక్షన్‌ చేయడం పూర్తయిందనే వార్తను సోషల్‌ మీడియాలో పంచుకున్న లోకేశ్‌.. చిట్టి తల్లి నిండు నూరేళ్లు జీవించాలని ఆశీర్వదించారు. ఈ చర్యతో మానవత్వానికి, మంచితనానికి నిలువెత్తు రూపంలా నిలిచారు. 

రాజకీయాలంటే.. అధికార దాహం, అక్రమ సంపాదన కాదు.. ప్రజా సేవ, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం అని.. చేతల్లో చేసి చూపిస్తున్న నాయకుడు నారా లోకేశ్‌. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా.. అన్నా అని పిలిస్తే.. వెంటనే పలికే ఆపద్భాందవుడిగా పేరు తెచ్చుకొంటన్నారు. కష్టం వచ్చిందని ఆన్‌లైన్‌లో ట్యాగ్‌ చేస్తే.. లోకేశ్‌ టీమ్‌ రంగంలోకి దిగిపోతుంది. గల్ఫ్‌ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న తెలుగువారిని ఆదుకున్నా.. ప్రత్యర్ధి పార్టీ కార్యకర్త ఆపదలో ఉన్నానంటే.. ఆపన్న హస్తం అందించినా.. సొంత పార్టీ కార్యకర్తలకు భీమా సౌకర్యం కల్పించి.. వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నా.. అది రాజకీయం కాదు.. సాటి మనుషులకు తనవంతు సాయం చేసే మంచి మనసు. అవసరంలో ఉన్న వారికి కాదనకుండా చేయూత అందిస్తూ అందరి హృదయాలను గెలుచుకొంటున్నారు లోకేశ్‌. ఒక చిన్నారికి నిండు నూరేళ్ల ఆయుష్షు పోసేందుకు కృషి చేసిన లోకేశ్‌కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయడమే మన వంతుగా చేయగలిగిన సాయం. లోకేశ్‌తో పాటు క్రౌండ్‌ ఫండింగ్‌ కోసం తలో చేయి వేసిన వారందరికీ.. ఆ చిన్నారి తరఫున, ఆమె తల్లిదండ్రుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు.



వైశాఖమాస ప్రారంభం

వైశాఖమాసం తెలుగు నెలల్లో రెండోది. వసంతశోభ వెల్లివిరిసే సమయమిది. ఇదే తరుణంలో ఎండలు ముదురుతుంటాయి. అందుకే వైశాఖం పచ్చిందంటే మనవారు కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుంటారు. మండువేసవిలో మంచినీళ్లు దానం చేయడం. కంటే గొప్పది లేదంటారు. దాహంతో ఉన్నవారికి మంచినీళ్లివ్వడం, ఆకలిగొన్నవాడికి అన్నం పెట్టడమే అన్నింటికంటే గొప్ప ధర్మాలు. అవే మనం సంపాదించుకోదగిన అసలైన పుణ్యాలు. ఆ బాటలో నడవాలి. మనం చేసుకునే పుణ్యకార్యక్రమాలకు లక్ష్మీదేవి స్వయంగా అక్షయ ఫలాలను అనుగ్రహించే మహత్తర పర్వదినం అక్షయ తృతీయ. ఆరోజు మహాలక్ష్మీపూజ నిర్వహిస్తారు. పొదుపుకి, మదుపుకి అనుకూలంగా ఆనాడు కొద్దిగానైనా బంగారాన్ని కొనుక్కోమని పెద్దలు చెబుతుంటారు. 

ఆరోజునే సింహాచలం లక్ష్మీనరసింహ స్వామికి చందనోత్సవం నిర్వహిస్తారు. ఏడాది పొడవునా చందనపు పూతలోనే దర్శనమిచ్చే ఆ స్వామి నిజరూపాన్ని చూడగలిగే ఒకే ఒక్కరోజు అక్షయ తృతీయ. 

బదరీ నారాయణుడు, కేదారనాథుడు తమ దర్శనాలను అనుగ్రహించే శుభతరుణం కూడా ఇదే. పరశురాముడు, ఆదిశంకరుడు మొదలు ఎందరెందరో విశ్వగురువులు తెలుగు నెలల ప్రకారం వైశాఖంలోనూ. ఇంగ్లీషు నెలల ప్రకారం మే మాసంలోనే పుట్టడం యాదృచ్ఛికం. గౌతమబుద్ధుడు, రామానుజులు, వీరబ్రహ్మేంద్రస్వామి, బసవేశ్వరుడు వంటి గురువులు ఈమాసంలోనే పుట్టారు. దైవాలు సైతం ఈమాసంలోనే పుట్టారు. శుక్లపక్షం చివరిలో నృసింహ జయంతి నాడు, బహుళపక్షంలో హనుమజ్జయంతి నాడు వస్తాయి. నృసింహజయంతి సందర్భంగా ఆలయాలన్నింటిలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. 

వైశాఖానికి మాధవమాసమని పేరున్న కారణంగా అనేక వైష్ణవాలయాల్లో కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణం కూడా ఈ మాసంలోనే జరగనుంది. అదే కాకుండా తెలుగునాట అనేక జాతరలు కూడా జరగబోతున్నాయి. ఆ దేవీ దేవతలందరూ మనందరినీ చల్లగా చూడాలని, అందరికీ క్షేమం కలగాలని కోరుకుందాం.



శావల్యాపురం మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది 

 కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశ నిర్దేశం మేరకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ ,శావల్యాపురం మండల సీనియర్ నాయకులు శ్రీ అడుసుమల్లి వీరేంద్ర గారు, ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు, వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు,  జనతా వారధి కార్యక్రమాన్ని శావల్యాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండలంలోని కనుమర్లపూడి గ్రామంలో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గ్రామంలోని   సమస్యలపై నాలుగు అర్జీలు ఇవ్వడం జరిగింది ,లంబాడీ డొంక కాల్వపై బ్రిడ్జి నిర్మాణం మంజూరుకై, ఆంజనేయస్వామి గుడి వెనక బజారులో అసంపూర్ణంగా ఉన్నటువంటి సైడ్ డ్రైనేజీ నిర్మాణాన్ని చేపట్టాలని, బొడ్డు రాయి వెనుక  వీధిలో సైడ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని, సంవత్సరం కాలంగా గ్రామంలో ఆగిపోయినటువంటి గ్రామీణ రక్షిత మంచినీటి పథకానికి మరమ్మత్తులు నిర్వహించి త్రాగునీటిని అందించాలని అర్జీలు ఇవ్వడం జరిగింది,వీటి పరిష్కారం కొరకు బిజెపి పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని తెలిపాము కార్యక్రమంలో మణిబాబు పాల్గొన్నారు