శావల్యాపురం మండలంలో జనతా పార్టీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది
కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశ నిర్దేశం మేరకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు శావల్యాపురం మండల సీనియర్ నాయకులు శ్రీ అడుసుమల్లి వీరేంద్ర గారు, ఈపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు ,వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారు, పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్ గారి సూచన మేరకు ఈ వారం "జనతా వారధి" కార్యక్రమాన్ని శావల్యాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొత్తలూరు గ్రామంలో స్థానిక బిజెపి నేత శ్రీ దివ్యకోలు నాగేశ్వరావు గారి నిర్వహణలో చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు ఆరు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. గ్రామ రైతులకు ప్రజానీకానికి అత్యంత ముఖ్యమైన కొత్తలూరు గ్రామం నుండి అంగులూరు వెళ్లేటువంటి లింకు రోడ్డు, గుర్రంవారిపాలెం వెళ్లేటువంటి రహదారి, బోడిశంభునివారిపాలెం వెళ్లేటువంటి రహదారులు అత్యంత అధ్వానంగా ఉన్నాయని, ఈ యొక్క రహదారి మార్గాల్లో ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ రైతులకు సుమారు 2000 ఎకరాల వ్యవసాయ భూమి సాగు చేసుకుంటున్నారని, ఎరువులు పొలాలకు తీసుకువెళ్లాలన్న, పంటను ఇంటికి తీసుకొచ్చుకోవాలన్న మోకాలు లోతు గుంతలతోటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కూటమి ప్రభుత్వం మంజూరు చేయాలని దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. అలాగే శావల్యాపురం వెళ్ళేటువంటి రహదారి నిర్మాణం చేపట్టినప్పటికీ ఇంకా ఒక కిలోమీటర్లు నిర్మాణం చేపట్టనందున అది కూడా నిర్మాణం చేపట్టాలని, గ్రామంలో జలజీవన్ మిషన్ పథకం క్రింద మిగిలిన ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వాలని, గత ప్రభుత్వం తీసివేసిన వృద్ధాప్య పెన్షన్లను తిరిగి మంజూరు చేయాలని మొత్తం ఆరు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది, వీటి పరిష్కారానికి బిజెపి పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని అర్జీదారులకు తెలియజేయడం జరిగింది, కార్యక్రమంలో స్థానిక బిజెపి నేత తిరువీధుల శ్రీనివాసరావు గ్రామస్తులు పాల్గొన్నారు.