kapunews



TRENDING NOW



ఎన్నిక‌ల బ‌రిలో స్టార్ ద‌ర్శ‌కుడుః విజ‌య్ వ‌ద్ద‌నుకున్న చోట‌..

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల వేడి ప‌తాక స్థాయికి చేరుకుంటోంది. పోలింగ్ గ‌డువు స‌మీపిస్తోన్న కొద్దీ అక్క‌డి వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది. సీట్లు, నియోజ‌క‌వ‌ర్గాల పంప‌కాల్లో ఆయా పార్టీల అగ్ర‌నేత‌లు తీరిక లేకుండా గ‌డుపుతున్నారు. డీఎంకే, అన్నా డీఎంకే, టీవీకే.. ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నాయి. గెలిచి తీరాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ ప్ర‌తివ్యూహాల‌ను రూపొందించుకుంటోన్నాయి
ఏప్రిల్ 9వ తేదీన కేరళ, అదే నెల 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఒకేదశలో ఇవి ముగుస్తాయి. మే 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికలు ఎదుర్కొంటోన్న నాలుగు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది. ఈ రాష్ట్రంతో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరీ ఉన్నాయి
ఈ ప‌రిణామాల మ‌ధ్య ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుంద‌ర్ సీ రాజ‌కీయ అరంగేట్రం చేశారు. ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్నారు. మ‌ధురై సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుండి బ‌రిలో నిలిచారు. పుదియ నీథి క‌చ్చి (పీఎన్కే) అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. పీఎన్కే.. అన్నా డీఎంకే మిత్ర‌ప‌క్షం. 2001లో ఆర‌ణి చొక్క‌లింగం ష‌ణ్ముగం ఈ పార్టీని నెల‌కొల్పారు. ఈ ఎన్నిక‌ల్లో అన్నా డీఎంకేతో జ‌ట్టు క‌ట్టింది
సీట్ల పంప‌కాల్లో భాగంగా మ‌ధురై సెంట్ర‌ల్ నియోజ‌కవ‌ర్గాన్ని ద‌క్కించుకుంది. ఇక్క‌డి నుండి సుంద‌ర్ సీ పోటీ చేస్తార‌ని ష‌ణ్ముగం ప్ర‌క‌టించారు. ఇది ఆయనకు తొలి అసెంబ్లీ ఎన్నిక. పొత్తులో భాగంగా పీఎన్కే కు రెండు స్థానాలు దక్కాయి. ఇందులో మ‌ధురై సెంట్రల్ ఒక్క‌టి. రెండవ అభ్యర్థిని త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డించారు.

నటి ఖుష్బూ తర్వాత ఆమె భర్త సుందర్ సఈ కూడా ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. దర్శకుడు, నటుడు, గాయకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాతగా సుందర్ సీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడే. ఆయ‌న తీసిన హార్ర‌ర్ కామెడీ సినిమాల సిరీస్ ఆర‌ణ్మ‌నై.. తెలుగులో చంద్ర‌క‌ళ‌, క‌ళావ‌తి, అంతఃపురం, బాక్ పేర్ల‌తో డ‌బ్ అయ్యాయి.


నేటి నుంచి మూడు నెలల రేషన్ కోటా పంపిణీ

రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్‌ న్యూస్. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి రేషన్ షాపుల్లో మూడు నెలల రేషన్ కోటా పంపిణీ చేయనున్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి బియ్యం, ఇతర వస్తువులు పంపిణీ చేస్తారు. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి మొత్తం 18 కేజీల బియ్యం అందిస్తారు. అంత్యోదయ కార్డులు ఉన్నవారికి నెలకు 35 కేజీల చొప్పున 105 కిలోల రేషన్ అందుతుంది. గత వర్షాకాలంలోనూ ఒకేసారి మూడు నెలల రేషన్‌ పంపిణీ చేసిన విషయం తెలిసిందే.

వినియోగదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన సిలిండర్ ధర

దేశ వ్యాప్తంగా LPG కొరత ఉన్న నేపథ్యంలో సామాన్యులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెరిగిపోయింది.

ప్రతి నెల ఒకటో తేదీన ధరల మార్పు ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచాయి ఆయిల్ కంపెనీలు. 19 కేజీల సిలిండర్ పైన రూ.195.50 పెంచుతూ ఆయిల్ కంపెనీలు షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాయి.

గత నెలలో ఇదే సిలిండర్ పై రూ.115 పెంచిన సంగతి తెలిసిందే. ఇక ఈ నెల దాదాపు మరో వంద రూపాయలు పెరిగింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో భారత దేశ వ్యాప్తంగా ఎల్పీజీ కొరత ఏర్పడింది. ఈ క్రమంలోనే సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి. అయితే, డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు జరుగలేదు. దీంతో గృహవినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు.



మారనున్న Loan Rules: 

లోన్స్ తీసుకునేవారికి అలర్ట్... ఏప్రిల్ 1 నుంచి 5 కొత్త రూల్స్

ప్రతి వ్యక్తికి సులభమైన రుణం, వేగవంతమైన క్రెడిట్ స్కోరు అప్‌డేట్స్, అదనపు నామినీలు... ఇలా 2026 ఏప్రిల్ నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకువచ్చిన కొత్త రూల్స్ రుణాలు తీసుకునేవారిపై ప్రభావం చూపిస్తాయి. ఏప్రిల్ 1 నుండి 5 పెద్ద రుణ మార్పులు అమలులోకి వస్తాయి. రుణాల నియమాలు 2026లో వ్యక్తులకు తేలికైన, పారదర్శకమైన రుణ అనుభవం ఇవ్వడానికి కొన్ని కొత్త రూల్స్ ప్రకటించబడ్డాయి.

ఈ మార్పులు రుణాలు తీసుకునేవారు, ఆభరణ వ్యాపారులు, బ్యాంక్ ఖాతాదారులపై ప్రభావం చూపనున్నాయి. క్రెడిట్ స్కోరు వేగంగా అప్‌డేట్ అవ్వడం నుండి ప్రీ పేమెంట్ ఛార్జీలు లేని పరిస్థితులు వరకు, ఈ సంస్కరణలు వ్యక్తిగత ఆర్థిక వ్యవస్థను సులభం, ఫ్లెక్సిబుల్ చేస్తాయి. ముందుగా, ఖాతాదారులు ఇప్పుడు 4 నామినీల వరకు చేర్చుకోవచ్చు. ఇది బ్యాంక్ ఖాతాలు, బ్యాంక్ లాకర్లు రెండింటికీ వర్తిస్తుంది. ఈ మార్పు ఆర్థిక భద్రతను పెంచుతుంది. అనుకోని పరిస్థితుల్లో కుటుంబ ఆస్తులను సులభంగా నిర్వహించగలుగుతుంది. 

రెండవది, క్రెడిట్ స్కోరు అంటే CIBIL స్కోరు. ఇక ప్రతి 7 రోజులకు ఈ స్కోరు అప్‌డేట్ అవుతుంది. ఇప్పటివరకు నెలకు ఒక్కసారి మాత్రమే అప్‌డేట్ అవుతుండేది. ఇప్పుడు ప్రతి నెల 7, 14, 21, 28వ తేదీల్లో క్రెడిట్ స్కోరు అప్‌డేట్ అవుతుంది. దీని వల్ల రుణ చెల్లింపులు వేగంగా అప్‌డేట్ అవుతాయి. మిస్ అయిన చెల్లింపులు వెంటనే స్కోరులో చూపిస్తాయి. రుణాలు తీసుకున్నవారికి తక్కువ సమయంలో స్కోరు అప్‌డేట్ అవుతుంది. ఈ మార్పు క్రెడిట్ ప్రొఫైల్ మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 

మూడవది, 2026 జనవరి 1 నుండి ఫ్లోటింగ్ రేట్ రుణాలపై ఫోర్‌క్లోజర్ లేదా ప్రీ పేమెంట్ జరిమానాలు ఉండవు. ఇది హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, పర్సనల్ లోన్స్‌కు వర్తిస్తుంది. రుణగ్రహీతలు అదనపు ఖర్చు లేకుండా రుణం ముందస్తుగా ముగించుకోవచ్చు. దీని వల్ల రుణ చెల్లింపు మరింత ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఖర్చును తగ్గిస్తుంది. 

నాలుగవది, ఆభరణ వ్యాపారులకు గోల్డ్ మెటల్ లోన్స్ (GML) పేమెంట్ టెన్యూర్ 180 రోజుల నుండి 270 రోజులకు పొడిగించబడింది. ఈ పొడిగింపు లిక్విడిటీని పెంచుతుంది. ఆభరణ వ్యాపారులు క్యాష్‌ఫ్లో సులభంగా నిర్వహించగలుగుతారు. చివరగా, బలమైన క్రెడిట్ ప్రొఫైల్ ఉన్న వారికి రుణ షరతులను సులభంగా చర్చించుకునే అవకాశం కల్పిస్తుంది. తక్కువ వడ్డీ రేట్లు సాధ్యమవుతాయి. ఎక్కువ కాలం రుణం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. అధిక స్కోరు ఉన్నవారికి చవకైన రుణాలు, మెరుగైన ఆర్థిక డీల్స్ లభిస్తాయి.

ఈ కొత్త రూల్స్ ద్వారా రుణాలు తీసుకునేవారు, వ్యాపారులు, కుటుంబాలు మొత్తం ఆర్థిక వ్యవస్థను సులభంగా, వేగంగా, సురక్షితంగా నిర్వహించుకోవచ్చు. ఈ మార్పులు మన వ్యక్తిగత ఆర్థిక భవిష్యత్తును మరింత ఫ్లెక్సిబుల్‌గా, సౌకర్యవంతంగా చేస్తాయి.



పరిపాలన ఎలా చేయాలో తెలిసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం: గాదె

ఈరోజు లాడ్జి సెంటర్లో ఉన్న గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారు పత్రికా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి, ప్రస్తుతం దేశంలో ట్రెండింగ్ గా నిలిచింది అని అన్నారు. గతంలో 24 వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ను మొదటి స్థానానికి తీసుకొని వచ్చిన జనసేన అధ్యక్షులు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాత్యులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్రంలో పలు రకాల కంపెనీల నుండి పెట్టుబడులు తీసుకొని వచ్చి ఉద్యోగ కల్పనకు రాజధాని నిర్మాణంతోపాటు ప్రతి రంగంలో అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మరియు వారికి అండగా నిలబడుతున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేశారు. అలాగే ఐదు లక్షల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేశామని అన్నారు. అదేవిధంగా ఇటీవల రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలని, ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అని అన్నారు. కానీ  గతంలో వైసీపీ ప్రభుత్వంలో అమరావతి ని నాశనం చేసింది కాకుండా, కొంతమంది వైసీపీ నాయకులు ఇప్పుడు మరలా దానిమీద లేనిపోని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రభుత్వం అనేది ఎప్పుడైనా శాశ్వతమని, ప్రభుత్వాన్ని పరిపాలించే పార్టీలు మారినంత మాత్రాన, ప్రభుత్వ విధానాలు మార్చాల్సిన అవసరం లేదని అన్నారు. ఈరోజున దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో రాజధాని అమరావతి అని సవరణ చేసుకోవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందో రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించుకోవాలని అన్నారు. ఇది కేవలం గత వైసిపి ప్రభుత్వం చేసిన దాష్టికం వల్లనే ఈ విధమైన సవరణ చేసుకోవాల్సిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిందని అన్నారు. అలాంటి పార్టీ గురించి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అలాగే ఇటీవల అసెంబ్లీలో అమరావతి మీద తీర్మానం తర్వాత కూడా వైసీపీ నాయకులు కొంతమంది మీడియా ముందుకు వచ్చి వృధా ప్రేలాపనలు పేలుతున్నారని అన్నారు. గెలిచిన 11 మందిలో వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఒక్కరు కూడా బయటికి రాలేదని, ఆ విషయం గురించి గెలిచిన ఎమ్మెల్యేలు ఎలాంటి ప్రస్తావన తీసుకురాకుండా, ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టిన వ్యక్తులు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. కనీసం గెలిచిన ఎమ్మెల్యేలు వచ్చి మాట్లాడితే ఎంతో కొంత విలువ ఉంటుందని, కానీ ఎవరిని పడితే వాళ్లని తీసుకొచ్చి మీడియా ముందు మాట్లాడితే, అలాంటి వ్యక్తులను రాష్ట్ర ప్రజలు ఎవరూ పట్టించుకునే పరిస్థితిలో లేరని అన్నారు. వైసిపి నాయకులు మాట్లాడే మాటలు చూస్తుంటే నాన్న పులి కథ మాదిరిగా అనిపిస్తుంది అని అన్నారు. వైసిపి నాయకులు ఇప్పటికైనా తప్పు తెలుసుకుని అమరావతి గురించి అసెంబ్లీలో జరిగే తీర్మానానికి హాజరై, తమ మద్దతును తెలియజేస్తారని ఆశించామని, అలాంటి పరిస్థితి ఏమి లేకుండా మీడియా ముందుకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు మారి, విధానపరమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని సూచించారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా, ఉన్న ప్రతిపక్షం మీరే కాబట్టి, ఏదైనా తప్పు జరిగితే ప్రజల పక్షాన విధానపరంగా మాట్లాడాలని అన్నారు. అలా కాకుండా రోడ్లమీదకు వచ్చి కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలని చూస్తే అది తిరిగి మీ మీద పడుతుందని హెచ్చరించారు. అలాగే కొంతమంది నాయకులు డబ్బంతా తీసుకెళ్లి అమరావతిలోనే పెడుతున్నారు అని చెప్పడం చూస్తుంటే వారి అవగాహన రాహిత్యం ఏ పాటితో అర్థమవుతుందని అన్నారు. రాష్ట్రానికి రాజధాని అవసరమని, గత వైసిపి పరిపాలించిన ఐదు సంవత్సరాలలో రాజధానిని నిర్వీర్యం చేశారని అన్నారు. ఈరోజు రాజధానిని గాడిలో పెట్టామని, వ్యవస్థలు అన్నిటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఆ విషయం అవగాహన చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వారిలాగా ఇష్టానుసారంగా డబ్బులు పంచలేదని, రాబోయే రోజులలో రాష్ట్రానికి ఆదాయం వచ్చే విధంగా తీసుకువచ్చిన అప్పులను పెట్టుబడి పెడుతున్నామని అన్నారు. గత వైసిపి ప్రభుత్వం లో ఎటువంటి పారదర్శకత లేకుండా ఇష్టానుసారంగా కార్పొరేషన్ల పేరుతో అప్పులు తీసుకొచ్చారని, వాళ్ళు చేసిన అప్పులను వెలికి తీయడంలో ఇప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ఆ అప్పులు ఎంత, దేనికి ఎంత తీసుకున్నారో కూడా తేల్చ లేనంతగా బ్యూరో కాట్లు ఉన్నారని అన్నారు. ఇంకా వైసీపీ ప్రభుత్వం మీద ప్రేమ తగ్గలేక వైసిపి నాయకులతో వ్యక్తిగత మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకుంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అధికారులు ఎప్పుడూ కూడా ప్రజలకు ఏది మంచో అదే చేయాలని, ప్రభుత్వాలు మాత్రమే శాశ్వతమని, వాటిని నడిపే పార్టీలు మారతా ఉంటాయని, కానీ అధికారులు మాత్రం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. లేదంటే కటకటాల పాలు కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక అప్పుల విషయానికొస్తే వివిధ కార్పొరేషన్ల పేరుతో డైరెక్ట్ గా కాకుండా ఇన్ డైరెక్ట్ గా అప్పులు తీసుకొని వచ్చి రాష్ట్ర ఖజానా మీద ఎనలేని భారం మోపిన ఘనత వైసిపి ప్రభుత్వానిదని అన్నారు. ఎన్నడూ లేని విధంగా వివిధ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా అప్పులు తెచ్చారని, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సుమారు పాతికవేల కోట్లు, ఆంధ్రప్రదేశ్ బీవర్జస్ కార్పొరేషన్ ద్వారా పదివేల కోట్లు, ఏపీఐఐసీ భూములు తాకట్టుపెట్టి పదివేల కోట్లు, స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇలాంటి వివిధ కార్పొరేషన్ల ద్వారా సుమారు లక్ష కోట్లు పైచిలుకు అప్పులు తీసుకొని వచ్చారని అన్నారు. ఇవన్నీ కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రైమ్ లొకేషన్స్ లో ఉన్న సుమారు 213 ఎకరాలలో ఉన్న ప్రభుత్వ భవనాలన్నీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి బదిలీ చేసి, వాటిని తాకట్టు పెట్టి సుమారు 1600 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారని, ఇంకా దారుణమైన విషయం వాళ్లు కూర్చుని పరిపాలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్రటేరియట్ ను కూడా తాకట్టుపెట్టి సుమారు 370 కోట్లు అప్పు తెచ్చిన ఘనత వైసిపి ప్రభుత్వానిది అన్నారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా, బటన్ నొక్కాను అనే నెపంతో లక్షల కోట్ల రూపాయలు అప్పుచేసి, రాష్ట్ర ఖజానాను దివాలా దిశగా నడిపించారని ఎద్దేవ చేశారు. చివరికి టిడ్కో ఇళ్ళ మీద కూడా 1500 కోట్ల రూపాయల అప్పు తెచ్చారని అన్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అప్పులు తీర్చి నిన్నటి రోజున సుమారు 5 లక్షల మందికి ఇల్లు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది అని అన్నారు. గత ప్రభుత్వానికి పరిపాలన ఎలా చేయాలో తెలియదని, కానీ పరిపాలన ఎలా చేయాలో తెలిసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు రాజకీయ నాయకులుగా, వైసిపి పార్టీ రాజకీయ పార్టీగా మారాలని కోరారు.కావున రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలలో కూడా కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడి, కూటమి అభ్యర్థులను గెలిపించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి చట్టాల త్రినాథ్, గుంటూరు రూరల్ మండలం నాయకులు శ్రీరామ్ శెట్టి ప్రేమ్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.



నేడు పార్లమెంట్‌లో అమరావతికి చట్టబద్ధత బిల్లు

Apr 01, 2026 మల్లెల తెలుగుతేజం 

నేడు పార్లమెంట్‌లో అమరావతికి చట్టబద్ధత బిల్లు
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు బుధవారం మ.12 గంటలకు పార్లమెంట్ ముందుకు రానుంది. 2024 జూన్ 2 నుంచే రాజధానిగా గుర్తించేలా ఏపీ పునర్‌వ్యవస్థీకరణ(సవరణ) బిల్లు-2026ను లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెడతారు. చర్చ అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదిస్తారు. గురువారం రాజ్యసభలోనూ దీన్ని ఆమోదించి, శాశ్వత రాజధానికి చట్టబద్ధత కల్పిస్తారు.



నేటి నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్

నేటి నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్
ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలోని చేనేతలకు శుభవార్త. బుధవారం నుంచి ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి రానుంది. నెలకు చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్ష కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. దీని కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.150 కోట్లు వెచ్చించనుంది. ఈ పథకం ద్వారా ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.8,640, పవర్‌లూమ్‌పై నేసే కుటుంబానికి రూ.21,600 ఆర్థిక వెసులుబాటు కలగనుంది.


 
 
 
గడ్డిమందు శాపం... నటుడు రాహుల్ రామకృష్ణ సోదరుడు మృతి

టాలీవుడ్‌ ప్రముఖ సినీ నటుడు రాహుల్ రామకృష్ణ సోదరుడు మరణించారు. పారాక్వాట్ (Paraquat) అనే రసాయన గడ్డిమందు కారణంగా తన సోదరుడు ప్రాణాలు కోల్పోయాడని సోషల్ మీడియా ద్వారా అయన తెలిపారు.

అత్యంత విషపూరితమైన ఈ రసాయనం తెలంగాణలో చాలా సులభంగా అందుబాటులో ఉండటం తెలిసి తనను ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన అన్నారు. ఈ రసాయనం వల్ల సంభవిస్తున్న మరణాల సంఖ్యను చూసి డాక్టర్లు కూడా షాకవుతున్నారని రాహుల్ పేర్కొన్నారు.

ఆత్మహత్యల కోసం విచ్చలవిడిగా దుర్వినియోగం చేయబడుతోందని ఆవేదన చెందారు. ఇది ప్రతిచోటా ఎంత సులభంగా లభిస్తుందో చూసి దిగ్భ్రాంతి చెందానని ఆయన అన్నారు. దయచేసి వీలైనంత త్వరగా దీనిని నిషేధించండి - ప్రాణాలను కాపాడండి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి (CMO), భారత ప్రధానమంత్రి కార్యాలయానికి (PMO) ఆయన విజ్ఞప్తి చేశారు.

భారతదేశంలో పారాక్వాట్ వినియోగం ఇప్పటికీ కొనసాగుతుంది. దీని విషపూరితత కారణంగా కొన్ని రాష్ట్రాలు (ఉదా: తెలంగాణ) అమ్మకాలపై పరిమితులు విధించాయి. ప్రపంచంలోని చాలా దేశాలు దీన్ని పూర్తిగా నిషేధించాయి. వైద్య నిపుణులు చిన్న పరిమాణం కూడా ప్రాణాంతకమని హెచ్చరించడంతో తెలంగాణ ప్రభుత్వం (2026) పారాక్వాట్ అమ్మకాలపై పరిమితులు విధించింది. భారతదేశంలో చాలా రాష్ట్రాలు కొన్ని కఠిన మార్గదర్శకాలతో మాత్రమే అనుమతిస్తున్నాయి. పొలాల్లో పనిచేసే రైతులు ఎక్కువగా ఈ రసాయనం వల్ల ప్రభావితమవుతున్నారు.
*

రైతుల ఆర్థిక బలోపేతానికి.. పశుపోషణే కీలక ఆదాయ వనరు :  ప్రత్తిపాటి*

• గేదెలు అనారోగ్యానికి గురైతే పాల దిగుబడి తగ్గుతుంది
• పశుపోషణకు ప్రభుత్వం అందించే రాయితీలను రైతాంగం సద్వినియోగం చేసుకోవాలి
• మానుకొండవారిపాలెంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించిన ప్రత్తిపాటి.

ప్రభుత్వం అందించే ఉచిత పశువైద్యసేవలు, పశుపోషణ రాయితీలు, ప్రోత్సాహకాల్ని రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు.

చిలకలూరిపేట మానుకొండవారిపాలెంలో పశుసంవర్థక మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన  ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రత్తిపాటి ప్రారంభించి, రైతుల్ని, గ్రామస్తుల్ని ఉద్దేశించి మాట్లాడారు.
పశువులకు గాలికుంటు, గొంతువాపు వ్యాధి టీకాలు, గొర్రెలకు నాచు, నీలినాలుక వ్యాధి టీకాలను పశుసంవర్ధక శాఖ యంత్రాంగం ఉచితంగా వేస్తోందన్నారు. నట్టల నివారణ మందులతో పాటు, పశువులను పరీక్షించి అవసరమైన అన్నిరకాల మందుల్ని ఉచితంగా అందిస్తున్నారని చెప్పారు. గేదెలు, ఆవులు అనారోగ్యానికి గురైతే పాల దిగుబడి తగ్గుతుందన్నారు.
గత ప్రభుత్వం ఇష్టానుసారం, స్వార్థ ప్రయోజనాలకోసం మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలను మరలా పంచాయతీలుగా పరిగణించబోతున్నామని ప్రత్తిపాటి చెప్పారు. గ్రామస్తుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 
ఈ కార్యక్రమంలో టిడిపి సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, కల్లి వీర రెడ్డి, పశు వైద్యులు డాక్టర్ రాధాకృష్ణ, నాగేశ్వరరావు , దీప్తి, గ్రామ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.



అత్యవసర హెచ్చరిక జారీ చేయబడింది…

*ఏప్రిల్ 29 నుండి మే 12 వరకు,*
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎవరూ బయటకు (ప్రత్యేకంగా బహిరంగ ప్రదేశాలకు) వెళ్లకూడదు. ఎందుకంటే ఉష్ణోగ్రత 45°C నుండి 55°C వరకు పెరగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఎవరికైనా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా అకస్మాత్తుగా అస్వస్థత కలిగితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. గాలి సరిగా వచ్చేలా గదుల తలుపులు తెరిచి ఉంచండి. మొబైల్ వినియోగాన్ని తగ్గించండి, అధిక వేడి కారణంగా మొబైల్ పేలే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి మరియు ఈ సమాచారాన్ని ఇతరులకు తెలియజేయండి. 

పెరుగు, మజ్జిగ, బేల్ పండు రసం వంటి చల్లని పానీయాలను ఎక్కువగా తీసుకోండి.

*చాలా ముఖ్యమైన సమాచారం:*

*పౌర రక్షణ విభాగం ప్రజలు మరియు నివాసితులకు క్రింది సూచనలు చేస్తోంది.* 

రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 47°C నుండి 55°C వరకు పెరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగించే వేడి గాలులు ఉండే అవకాశం ఉంది. *కాబట్టి ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి:*

*కార్లలో ఉంచకూడని వస్తువులు:*

గ్యాస్ పదార్థాలు
లైటర్లు
కార్బోనేటెడ్ పానీయాలు
సుగంధ ద్రవ్యాలు మరియు బ్యాటరీలు
గాలి ప్రసరణ కోసం కారు కిటికీలు కొద్దిగా తెరిచి ఉంచండి
కారు ఇంధన ట్యాంక్‌ను పూర్తిగా నింపకండి
సాయంత్రం సమయంలోనే ఇంధనం నింపండి
ఉదయం కారులో ప్రయాణం చేయడం నివారించండి
ప్రయాణ సమయంలో టైర్లలో అధిక గాలి నింపకండి

*ఇతర జాగ్రత్తలు:*

తేళ్లు మరియు పాములు చల్లని ప్రదేశాల కోసం ఇళ్లలోకి రావచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి
ఎక్కువగా నీరు మరియు ద్రవాలు తాగండి
గ్యాస్ సిలిండర్‌ను ఎండలో ఉంచవద్దు
విద్యుత్ మీటర్లపై అధిక లోడ్ వేయవద్దు
అవసరమైన గదుల్లో మాత్రమే ఎయిర్ కండిషనర్ ఉపయోగించండి
ప్రతి 2–3 గంటలకు కనీసం 30 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి
బయట ఉష్ణోగ్రత 45–47°C ఉన్నప్పుడు, ఇంట్లో ACని 24–25°C వద్ద ఉంచండి
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నేరుగా సూర్యకాంతిని తప్పించండి






*
కోటి రూపాయల విలువైన హషీష్ ఆయిల్ స్వాధీనం – ఒకరి అరెస్ట్*

ఫ్యూచర్ సీటీ కమిషనరేట్ - సురక్ష ప్రతినిధి 
తేదీ: 30 మార్చి 2026.

రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం పోలీసులు మరియు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) బృందం సమిష్టిగా నిర్వహించిన తనిఖీలలో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుండి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న దాదాపు 9.402 కిలోల హషీష్ ఆయిల్ (గంజాయి ద్వారా తయారు చేసే నూనె)ను పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ. 1 కోటిగా అంచనా వేశారు.

 *నిందితుల వివరాలు:* 
A-1: కొరాబు చాంటి బాబు (35 సంవత్సరాలు) – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామరాజు జిల్లా నివాసి (అరెస్ట్)
A-2: రాజారావు (ఒరిస్సా) – పరారీలో ఉన్నారు
A-3: గుర్తుతెలియని వ్యక్తి – పరారీలో ఉన్నారు
పోలీసుల వివరాల ప్రకారం, A-1 చంటి బాబు, A-2 రాజారావు వద్ద నుండి ఈ డ్రగ్స్‌ను సేకరించి హైదరాబాద్‌లోని గుర్తుతెలియని వ్యక్తులకు సరఫరా చేయడానికి ప్రయత్నించాడు. మార్చి 29 సాయంత్రం మహేశ్వరం గేట్ బస్ స్టాప్ వద్ద నిలబడి ఉన్న సమయంలో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 10 పాలిథిన్ కవర్లలో ఉన్న హషీష్ ఆయిల్ మరియు 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు చంటి బాబుపై గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని కంచరపాలెం, అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాలలో 4 NDPS కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

 *ప్రజలకు విజ్ఞప్తి:*
యువత మరియు విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఫ్యూచర్ సిటీ పోలీసులు సూచించారు. తమ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని కోరారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే మహేశ్వరం జోనల్ కంట్రోల్: 8712662664 లేదా Dial 100కు సమాచారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన అధికారులను పోలీస్ కమిషనర్ శ్రీ జి. సుధీర్ బాబు, ఐపిఎస్ గారు మరియు ఇతర ఉన్నతాధికారులు అభినందించారు.



తెలంగాణ పర్యాటక శాఖలో బయటపడ్డ అక్రమాలు

ఏడాది కాలంలో బోటింగ్ రంగం ద్వారా రూ.1.48 కోట్లకు గండి

తెలంగాణలోని 27 పర్యాటక కేంద్రాల్లో దాదాపు 99 బోట్లను నడిపిస్తున్న పర్యాటక శాఖ 

2024లో బోటింగ్ ద్వారా రూ.14.60 కోట్ల ఆదాయం రాగా, 2025లో రూ.13.12 కోట్లకు పడిపోయిన ఆదాయం 

హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు, నాగార్జున సాగర్, లక్నవరం లాంటి ప్రాంతాల్లో పర్యాటకుల రద్దీ పెరుగుతున్నా ఒక్క ఏడాదిలో రూ.1.48 కోట్ల ఆదాయం పడిపోవడంతో పర్యాటక శాఖలో అవినీతి జరుగుతున్నట్లు గుర్తించిన ఉన్నతాధికారులు

బోటింగ్ కేంద్రాల్లో ఇన్‌చార్జ్‌లు, మేనేజర్లు, సిబ్బందితో కుమ్మక్కయి, టిక్కెట్లు లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే తక్కువ ధరలకు బోటింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తింపు

రూ.500 ఉన్న టికెట్‌ను, రూ.200కు టికెట్ లేకుండా బోట్లోకి అనుమతించడం, 10 ట్రిప్పులు తిరిగితే 8 ట్రిప్పులు తిరిగినట్లు చూపించి మిగతా 2 ట్రిప్పుల డబ్బులు తీసుకోవడం, ఒక్క ట్రిప్పుకు 3 లీటర్లు డీజిల్ అవసరం ఉండగా అదనంగా 2 లీటర్లు బిల్లులో రాయడం లాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని గుర్తించిన ఉన్నతాధికారులు

నాగార్జునసాగర్ బోటింగ్ కేంద్రంలో 
ఇన్‌ఛార్జి ఏకంగా నకిలీ టికెట్ బుక్కునే ప్రింట్ చేసి, ప్రభుత్వానికి రావలసిన లక్షల ఆదాయం కొల్లగొట్టాడని, అతన్ని విధుల నుండి తొలగించిన అధికారులు

ప్రతీ బోటింగ్ కేంద్రంలో ఇలాంటి అవినీతి జరుగుతుందని, మంత్రి జూపల్లి కృష్ణారావు ఇప్పటికైనా ఇలాంటి అక్రమార్కుల పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న స్థానికులు

*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి హిందూ దేవాలయాల భూముల ఆక్రమణ పై వినతి పత్రం సమర్పించడం జరిగింది*

*విషయం: హిందూ దేవాలయ భూముల రక్షణ, అక్రమణల నివారణ శిధిలావస్థ లో ఉన్న ఆలయాలు పునఃనిర్మాణం మరియు ప్రభుత్వ విధానాల పునఃపరిశీలనపై  వినతిపత్రం*

హిందూ దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయం, ఆధ్యాత్మికతకు ప్రతీకలు. ఈ ఆలయాలకు చెందిన లక్షల ఎకరాల భూములు దేవుని ఆస్తులు, కోట్లాది భక్తుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనాలు. అయితే ప్రస్తుతం ఈ భూముల విషయంలో జరుగుతున్న పరిణామాలు హిందూ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఈ మధ్య ఆకివీడు రామాలయ పునఃనిర్మాణం లో జరిగిన అల్లర్లు, నవమి రోజున జరిగిన దాడులు స్వయంగా స్పీకర్ నే హత్య చేయాలనుకునే ప్రయత్నం  పై యావత్ హిందు సమాజం ఆందోళనకు గురవుతుంది. సంవత్సరాలు గా ఆలయాల పునఃనిర్మాణాలు జరగకపోవడం వలన హిందు సమాజం నష్టపోతుంది. రాష్ట్రంలో శిధిలావస్థలో ఉన్న అన్ని ఆలయాలు పునఃనిర్మించాలి.

హిందు ఆలయాల మొత్తం భూమి సుమారు 4.7 లక్షల ఎకరాలు, 1.5 లక్షల ఎకరాలు అక్రమణకు గురయ్యాయి, అభివృద్ధి పేరు తో 8000 ఎకరాలు ప్రభుత్వం తీసేసుకుంది. లక్షల కోట్ల విలువ చేసే భూములు హిందు ఆలయాల నుంచి  మల్లించబడుతున్నాయి మరియు ఆక్రమించబడుతున్నాయి.

దేవాలయాలకు సంబంధించిన లక్షన్నర ఎకరాలకు పైగా భూములు “ప్రైవేట్ వ్యక్తుల సర్వే నంబర్లలో కలిసిపోయాయి” అనే పేరుతో సరైన ధర్యాప్తు చేయకుండా, ఆ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అత్యంత ఆందోళనకరమైన విషయం. ఇది హిందూ సమాజానికి, ఆలయ రక్షణకు తీవ్రమైన ప్రమాదకరం. ఈ చర్యలు ద్వారా ఆలయాలు తీవ్రంగా నష్టపోతాయి.

అలాగే, GO No. 139 ద్వారా 33 సంవత్సరాల దీర్ఘకాలిక లీజుల పేరుతో అర్బన్ ప్రాంతాల్లో ఉన్న దేవాలయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలనే విధానం కూడా పూర్తిగా వ్యతిరేకించదగినది. ఈ నిర్ణయం వల్లే హిందూ సమాజం కోర్టులను ఆశ్రయించి స్టే ఆదేశాలు తెచ్చుకోవలసిన పరిస్థితి వచ్చింది.

హిందూ ఆలయ భూములు అభివృద్ధి పేరుతో ఇతరుల చేతుల్లోకి వెళ్లడం అంగీకారయోగ్యం కాదు.
హిందూ ఆలయ భూములు ఆలయాలకే చెందాలి ఇదే భారతీయ జనతా పార్టీ స్పష్టమైన అభిప్రాయం. ఇంకా, ఆలయ భూములను ఆక్రమించుకున్న వారికి రెగ్యులరైజేషన్ పేరుతో చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం ఆలోచించడం కూడా అత్యంత ప్రమాదకరం. ఇది అక్రమాలను ప్రోత్సహించడమే అవుతుంది. 

ఆంధ్రప్రదేశ్ లో  కూటమి ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుంది. ఆలయ భూముల రక్షణలో కూడా ఆ పారదర్శకత ఉండాలి. 

ప్రస్తుతం పరిస్థితులు చూస్తే, గత ప్రభుత్వ ఆలోచనలు కొనసాగిస్తూ కొంతమంది అధికారులలో ఆలయ భూములను రక్షించాలనే దృక్కోణం కాకుండా, వాటిని దారి మళ్లించాలి, దోచిపెట్టాలి అనే ధోరణి కనిపించడం హిందూ సమాజాన్ని తీవ్రంగా బాధిస్తోంది. ఇటువంటి వ్యవహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించలేము.

దేవాలయాల ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ, అదే ఆలయాల అభివృద్ధి, పండుగల నిర్వహణకు ప్రభుత్వం సరైన మద్దతు ఇవ్వకపోవడం కూడా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. అలాగే ఆలయ అదాయాల నుంచి కామన్ గుడ్ ఫండ్, అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. 

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది...

• దేవాలయ భూములపై పూర్తి స్థాయి సర్వే నిర్వహించి, ప్రైవేట్ సర్వే నంబర్లలో కలిసిపోయిన భూములపై నిష్పక్షపాత ధర్యాప్తు చేయాలి.
• దేవాలయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేసే నిర్ణయాలను వెంటనే నిలిపివేయాలి.
• GO No. 139 ను పూర్తిగా రద్దు చేయాలి.

• 33 సంవత్సరాల దీర్ఘకాలిక లీజుల విధానాన్ని ఉపసంహరించాలి.

• ఆలయ భూముల ఆక్రమణలను రెగ్యులరైజ్ చేసే ఆలోచనను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి.

• అక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుని భూములను తిరిగి ఆలయాలకు అప్పగించాలి.

• దేవాలయాల ఆదాయం పూర్తిగా అదే ఆలయాల అభివృద్ధికి వినియోగించే విధంగా చట్టపరమైన హామీ ఇవ్వాలి.

• ఆలయాల పండుగల నిర్వహణకు ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయించాలి.

• CGF నిధులతో శిధిలావస్థ ఆలయాలు పునఃరిద్దరించాలి.

• అభివృద్ధి పేరుతో ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకున్న భూమికి తగిన భూమి లేదా నష్టపరిహారం ఆయా ఆలయాలకు ఇవ్వాలి.

ఇది కేవలం వినతిపత్రం కాదు హిందూ సమాజం యొక్క గళం. దేవాలయ భూముల విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఆలయ హక్కుల రక్షణ కోసం ఉద్యమం చేయడం తప్ప మాకు మరే మార్గం ఉండదు. హిందూ ఆలయ భూములు కాపాడాలి అవి ఆలయాలకే చెందాలి అని అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి కోరుచున్నది.



శావల్యాపురం మండలంలో జనతా పార్టీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది

కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశ నిర్దేశం మేరకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు శావల్యాపురం మండల సీనియర్ నాయకులు శ్రీ అడుసుమల్లి వీరేంద్ర గారు, ఈపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు ,వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారు,  పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్ గారి సూచన మేరకు ఈ వారం "జనతా వారధి" కార్యక్రమాన్ని శావల్యాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొత్తలూరు గ్రామంలో స్థానిక బిజెపి నేత శ్రీ దివ్యకోలు నాగేశ్వరావు గారి నిర్వహణలో చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు ఆరు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. గ్రామ రైతులకు ప్రజానీకానికి అత్యంత ముఖ్యమైన కొత్తలూరు గ్రామం నుండి అంగులూరు వెళ్లేటువంటి లింకు రోడ్డు, గుర్రంవారిపాలెం వెళ్లేటువంటి రహదారి, బోడిశంభునివారిపాలెం వెళ్లేటువంటి రహదారులు అత్యంత అధ్వానంగా ఉన్నాయని, ఈ యొక్క రహదారి మార్గాల్లో ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ రైతులకు సుమారు 2000 ఎకరాల వ్యవసాయ భూమి సాగు చేసుకుంటున్నారని, ఎరువులు పొలాలకు తీసుకువెళ్లాలన్న, పంటను ఇంటికి తీసుకొచ్చుకోవాలన్న మోకాలు లోతు గుంతలతోటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కూటమి ప్రభుత్వం మంజూరు చేయాలని దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. అలాగే శావల్యాపురం వెళ్ళేటువంటి రహదారి నిర్మాణం చేపట్టినప్పటికీ ఇంకా ఒక కిలోమీటర్లు నిర్మాణం చేపట్టనందున అది కూడా నిర్మాణం చేపట్టాలని, గ్రామంలో జలజీవన్ మిషన్ పథకం క్రింద మిగిలిన ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వాలని, గత ప్రభుత్వం తీసివేసిన వృద్ధాప్య పెన్షన్లను తిరిగి మంజూరు చేయాలని మొత్తం ఆరు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది, వీటి పరిష్కారానికి బిజెపి పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని అర్జీదారులకు తెలియజేయడం జరిగింది, కార్యక్రమంలో స్థానిక బిజెపి నేత తిరువీధుల శ్రీనివాసరావు గ్రామస్తులు పాల్గొన్నారు.

 
 
*శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు...*

*శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని 52 ఎకరాలు టిడ్కో గృహ సముదాయంలో సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి మరియు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు ముఖ్య అతిథిగా హాజరై, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.*

కమిటీ వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరైన *మర్రి రాజశేఖర్ గారికి కమిటీ సభ్యులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు, నెల్లూరి ఈశ్వర్ రంజిత్ గారు, వరికూటి నాగేశ్వరరావు గారు, దడబడ పుల్లయ్య గారు, సింగరేసు పోలయ్య గారు* *వంకాయలపాటి వంశిధర్ గారు* తదితరులు ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో వారివెంట *నిడమానూరు హనుమంతరావు గారు, నరేంద్ర రెడ్డి గారు, విజయ్ గారు* తదితరులున్నారు.