kapunews



TRENDING NOW


హైదరాబాద్‌లో ₹35,000 లంచం తీసుకుంటూ GHMC ఎగ్జామినర్‌ను ACB అరెస్ట్

సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో పనిచేస్తున్న GHMC అకౌంట్స్ సెక్షన్ ఎగ్జామినర్‌ను లంచం తీసుకుంటూ ACB అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్‌ను GHMC హెడ్ ఆఫీస్‌కు పంపించేందుకు ₹40,000 డిమాండ్ చేసి ₹35,000 స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.

లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది....


మాచర్ల లో జరిగిన జనతా వారధి కార్యక్రమం లో ఒక ఫిర్యాదు స్వీకరించడం జరిగింది

మార్చి నెలలోనే ఎండలు తీవ్రత పెరిగిన నేపథ్యంలో మాచర్ల పట్టణం ప్రధాన రహదారిపై పలుచోట్ల మున్సిపల్ అధికారులు చలివేంద్రం కేంద్రాలు ఏర్పాటు చేయాలని కొత్తపల్లి గ్రామానికి చెందిన బి వెంకట్రావు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఆధ్వర్యంలో రెండు మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్న నేపథ్యంలో ఈ చలివేంద్రాల్లో ఆ వాటర్ వాడాలని ఆయన కోరారు.బిజెపి మాచర్ల పట్టణ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు ఓర్సు క్రాంతి కుమార్ అధ్యక్షతన జనతా వారధి కార్యక్రమం గురువారం జరిగింది. ప్రోగ్రాం కన్వీనర్ బొగ్గవరపు మస్తాన్రావు, కో కన్వీనర్లు ఏచూరి సురేష్, శివ కోటయ్య నాయక్ లు కార్యక్రమం నిర్వహించి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ ఫిర్యాదును మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని ఫిర్యాదురుడికి బిజెపి శ్రేణులు వివరించారు.


దాచేపల్లి మండలంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది

దాచేపల్లి మండలంలో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జనతా వారిది కార్యక్రమం నిర్వహించాము. జనతా వారధి కార్యక్రమంలో భాగంగా విద్యా సంవత్సరం 2026 - 27 కు సంబంధించి RTE ద్వారా 1వ తరగతి ప్రవేశానికి అప్లై చేస్తుండగా వెబ్ ఆప్షన్స్ లో పలు టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యల సంబంధించి దాచేపల్లి మండల విద్యాశాఖ వారి కార్యాలయ అధికారులకు వివరించి వారి ద్వారా జిల్లా విద్యాశాఖ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఈ RTE పాలసీకి కి సంబంధించిన సమస్యను అవకాశం ఉన్నంత  త్వరగా పరిష్కరించాలని కోరుతున్నాము. ఈనెల 10వ తారీకు తో ఆన్లైన్ అప్లికేషన్ గడువు కూడా ముగుస్తుంది.  అప్లికేషన్ పెట్టుకోవడంలో సమస్యలు పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. టోల్ ఫ్రీ నెంబర్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది అవకాశం ఉండి కలిసిన సత్వరం పరిష్కరించుకుండ సంబంధిత వారికి ఇన్ఫామ్ చేస్తాము అంటున్నారు. సత్వర సమస్యలను పరిష్కరిస్తూ ఈ అవకాశం అందరూ వినియోగించుకునేలా చేయాలని కోరడమైనది.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ దాచేపల్లి మండల అధ్యక్షులు కొప్పల నాగేశ్వరరావు గారు, మాజీ అసెంబ్లీ కన్వీనర్ ఆర్య వెంకటేశ్వర్లు గారు పలువురు విద్యార్థి, విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.

నకరికల్లు మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

భారత ప్రధాన మంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన జనతా వారిది కార్యక్రమాన్ని  భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ గారి ఆదేశానుసారం భారతీయ జనతా పార్టీ పలనాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి ఆదేశానుసారం ఈరోజు నకిరేకల్లు మండలంలో జరిగిన జనతా వారధి కార్యక్రమంలో మండల ఇన్చార్జిగా పాల్గొని నకిరేకల్లు మండల చల్లగుల్ల గ్రామం నుంచి వచ్చిన వినతులు స్వీకరించి సంబంధిత అధికారులు పంపించటం జరిగింది. ఈ కార్యక్రమంలో నకిరేకల్లు మండల అధ్యక్షులు మున్వర్ బాజీ గారు, సీనియర్ నాయకులు మరియు ట్రెజర్ ఇర్లా నాగరాజు గారు, తదితర పార్టీ కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


శావల్యాపురం మండలంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది

అందరికీ నమస్కారం కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశా నిర్దేశం మేరకు రాష్ట్ర అధ్యక్షులు  పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు మండల సీనియర్ నాయకులు అడుసుమల్లి వీరేంద్ర గారు ఈపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని గుంటుపాలెం గ్రామంలో స్థానిక బిజెపి నేత అన్నవరపు శ్రీనివాసరావు గారి నిర్వహణలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు ఐదు అర్జీలు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో పూర్తిచేసిన ఇంటింటికి త్రాగునీరు పథకం జేజేఎం స్కీం ప్రారంభించిన పది రోజులకే మరుగున పడిపోయిందని మరల పథకాన్ని పునరుద్ధరించాలని అలాగే గ్రామం లోని పొలాలకు వెళ్లేటువంటి రహదారులు ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద రహదారులు గ్రావెల్ రోడ్లు వేయించాలని అలాగే గ్రామంలో శుభకార్యాలకు వివిధ కార్యక్రమాలకు ఎటువంటి మండపాలు గాని ఫంక్షన్ హాల్ లేనందున బీసీ కమ్యూనిటీ హాల్ మంజూరు చేయించాలని అలాగే పిట్టంబండ మేజర్ పైన కల్వర్టు మంజూరు చేయాలని కోరారు గ్రామస్తుులు పాల్గొన్నారు ు

పిడుగురాళ్ళ పట్టణంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

 ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన జనతా వారిది ప్రోగ్రాం పిడుగురాళ్ల పట్టణ కార్యాలయంలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశి కుమార్ గారి ఆదేశాల తోజరిగినది ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ అధ్యక్షుడు కేతావత్తు శ్రీనివాస నాయక్ పట్టణ ఉపాధ్యక్షురాలు సూర్య పల్లి అంజమ్మ పట్టణ కోశాధికారి వృధా ప్రసాద్ రావు అర్జీలు స్వీకరించడం జరిగింది అర్జీలు వివరాలు పిడుగురాళ్ల పట్నంలో గల సీతారాంపురం తండ నివాసులైన పడితే దుర్గమ్మ పడితే తిరుపతమ్మ గిరిజన మహిళలు ఇంటి స్థలం కొరకు అర్జీలు ఇవ్వడం జరిగినది



యువతకు ఉపాధి, సాంస్కృతిక, చారిత్రక, వారసత్వ పారంపర్య కొనసాగింపే పర్యాటక రంగాభివృద్ధి ప్రధాన లక్ష్యం : ప్రత్తిపాటి

• ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక టూరిజం పాలసీ పర్యాటకాభివృద్ధికి దోహదపడుతుంది
• ప్రభుత్వం ఆకర్షించిన పెట్టుబడుల్లో 28వేల కోట్లు పర్యాటకరంగం పరిధిలోనివే
• ఈ పెట్టుబడులతో 1,22,000లకు పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి
• ప్రభుత్వం పర్యాటక రంగానికి నిధులు పెంచి, కొండవీడు వంటి ప్రదేశాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
• కొండవీడు కోటకున్న చారిత్రక, సాంస్కృతిక ప్రాశస్త్యం, పర్యాటక అనుకూలతలు మరే ప్రదేశానికి లేవు
• కొండవీడును ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న ముఖ్యమంత్రి హామీ నెరవేర్చాల్సిన సమయం వచ్చింది
•  కళలకు పుట్టిల్లు అయిన చిలకలూరిపేటలో గతంలో నిర్మించాలనుకున్న ఆడిటోరియం నిర్మాణాన్ని ప్రభుత్వం వెంటనే పూర్తిచేయాలి.

రాష్ట్ర పర్యాటక రంగాన్ని 2027 నాటికి దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలపాలన్న గొప్ప ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని,  దానిలో భాగంగానే కూటమిప్రభుత్వం పర్యాటక రంగాభివృద్ధికి ప్రత్యేక టూరిజం పాలసీ ప్రకటించిందని మాజీమంత్రి, శాసనసభ్యు లు ప్ర్తతిపాటి పుల్లారావు పేర్కొన్నారు. 
బుధవారం శాసనసభలో బడ్జెట్లో పర్యాటక రంగానికి కేటాయించిన నిధులు -  భవిష్యత్ లక్ష్యాలు అన్న అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ప్రత్తిపాటి మాట్లాడారు. 
 
*రాష్ట్ర పర్యాటక రంగాభివృద్ధికి సమగ్ర టూరిజం పాలసీ* 
రాష్ట్రాభివృద్ధిలో పర్యాటకానిది కీలక పాత్ర అని, పర్యాటకం అంటే కేవలం టూరిస్టులను ఆకర్షించడమే కాదని, స్థానిక యువతకు ఉపాధి, సాంస్కృతిక, చారిత్రక, వారసత్వ వైభవ పారంపర్య కొనసాగింపనే ప్రధాన ఆశయం ఇందులో ఇమిడి ఉందని ప్రత్తిపాటి పేర్కొన్నారు. రాష్ట్ర సాంస్కృతిక, చారిత్రక విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేయాలన్న గొప్ప లక్ష్యంకూడా  ఇందులో ఉందన్నారు.  అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర పర్యాటక బ్రాండ్ బలోపేతంలో గానీ, సమగ్ర నూతన టూరిజం పాలసీ ప్రకటన,  యువతకు విస్తృత ఉపాధి అవకాశాల సృష్టిలో గానీ ప్రభుత్వం ఇప్పటికే తొలి అడుగు వేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేని కూటమి ప్రభుత్వం పర్యాటకాభృద్ధికి సమగ్ర టూరిజం పాలసీ తీసుకొచ్చిందని ప్రత్తిపాటి చెప్పారు. ప్రభుత్వం ఆకర్షించిన పెట్టుబడుల్లో 28వేలకోట్లు టూరిజం  శాఖ పరిధిలోనివేనని, వాటివల్ల 1,22,000లకు పైగా ఉద్యోగావకాశాలు రాష్ట్రయువతకు లభిస్తాయని ఆయన తెలిపారు.

*పర్యాటక రంగానికి ప్రభుత్వం నిధులు పెంచాలి ..* 
 పర్యాటక రంగానికి ప్రభుత్వం నిధుల కేటాయింపు పెంచాలని, రూ.439 కోట్ల కేటాయింపులు సరిపోవని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. అలానే ప్రభుత్వ నిర్వహణలోని వివిధ ఉత్సవాలకు 186.27 కోట్లు కేటాయించాలని, ఈ నిధులుకూడా పెంచాలన్నారు. 
కూటమిప్రభుత్వం వచ్చాకే రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ట్రేడ్ ఫెయిర్లు, వివిధ రకాల ఉత్సవాలు, ప్రభుత్వ పండుగలు, తిరునాళ్ల నిర్వహణ గతంలో ఎన్నడూ లేనివిధంగా వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో వీటి నిర్వహణకు నిధులు కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.  

*కొండవీడు వంటి చారిత్రక ప్రదేశం మరోటి లేదు* *కొండవీడు అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరించని పక్షంలో రాష్ట్రప్రభుత్వమే ప్రత్యేక నిధులు కేటాయించాలి*  
2019 ఫిబ్రవరిలో అప్పటి, ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలిసారి కొండవీడు ఉత్సవాలు ప్రారంభించారని, అప్పుడు కొండవీడు కోట ఘాట్ రోడ్డుకు అనుసంధానిస్తూ, చౌడవరం నుంచి టన్నెల్ నిర్మించి 5 కి.మీ రోడ్డువేస్తామని చెప్పారని ప్రత్తిపాటి పేర్కొన్నారు.  అదే సమయంలో కొండవీడును ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించారన్నారు. సీఆర్డీఏ పరిధిలో కొండవీడును మించిన గొప్ప పర్యాటక, చారిత్రక ప్రదేశం మరోటి లేదన్న ప్రత్తిపాటి. ఆ ప్రాంత అభివృద్ధికి తాజా బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కొండవీడు అభివృద్ధికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.110కోట్ల డీపీ ఆర్ ను కేంద్రానికి పంపినట్టు పర్యాటక శాఖ మంత్రి తెలియచేశారన్నారు. కేంద్రం పూర్తిగా సహకరిస్తే ఇబ్బందిలేదని, లేని పక్షంలో రాష్ట్ర  ప్రభుత్వం కొండవీడు అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని ప్రత్తిపాటి కోరారు. చిలకలూరిపేటలో గతంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,  మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆడిటోరియం నిర్మాణాన్ని ప్రారంభించారని, అది నేటికీ పూర్తికాలేదని ప్రత్తిపాటి చెప్పారు. కళలకు పుట్టిల్లు అయిన చిలకలూరిపేటలో నిర్మించాలనుకున్న  ఆడిటోరియాన్ని ప్రభుత్వం టూరిజం శాఖ పరిధిలోకి చేర్చి తక్షణమే పూర్తయ్యేలా చూడాలని ప్రత్తిపాటి విజ్ఞప్తిచేశారు. కూటమిప్రభుత్వ సంక్షేమపథకాలతో పాటు, ప్రధానంగా స్త్రీశక్తి పథకం వల్ల ప్రభుత్వం నిర్వహించే ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, తిరునాళ్లకు మహిళల తాకిడి బాగా పెరిగిందని ప్రత్తిపాటి చెప్పారు. ఈ నేపథ్యంలో పర్యాటక ప్రదేశాల్లో మహిళలకు ప్రత్యేక వసతులు, భద్రతాంశాలపై ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు.


చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి 

చిత్తూరు జిల్లా గంగవరం మండలం దండపల్లి క్రాస్ వద్ద బెంగళూరు–చెన్నై జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ముందువెళ్తున్న లారీని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులను మోహన్దాస్ (71), నాగరాజారావు (61), కుసుమ (61), జయంతి (59), పూజ (33)గా గుర్తించారు.

బెంగళూరులోని రాజాజీనగర్ నుంచి తిరుమల దైవ దర్శనానికి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. గంగవరం సీఐ రామభూపాల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రహదారి భద్రత, జాగ్రత్తలు ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేసే ఘటన ఇది.


భారతీయ జనతా పార్టీ మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం రెంటచింతల మండలంలో నిర్వహించడం జరిగింది

*భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణా మహా అభియాన్ కార్యక్రమము సమావేశం నేడు రెంటచింతల మండలంలో నిర్వహించడం జరిగింది ఈనెల 7వ తేదీన జరగభోవు పశువుల కార్యక్రమం ఏర్పాటు గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరావు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా త్రీ మెన్ కమిటీ సభ్యులు వరికుటి నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శిలు సూరపునేని పుల్లారెడ్డి గారు గంజర్ల ఆదిలక్ష్మి  మాజీ అసెంబ్లీ కన్వినర్ నాసరయ్య గుమ్మడి ప్రశిక్షణ కమిటీ సభ్యులు పోలిశెట్టి శ్రీనివాసరావు ఉల్లెందుల వరప్రసాద్ పేరం రంగారెడ్డి సీనియర్ నాయకులు పాశం మట్టా రెడ్డి గారు గంగిశెట్టి చిన్ననాసరయ్య వెంకటరావు రాణి తదితరులు పాల్గొన్నారు*


భారతీయ జనతా పార్టీ మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం దుర్గి మండలంలో నిర్వహించడం జరిగింది


భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రతిక్షణా మహా అభియాన్ కార్యక్రమము సమావేశం నేడు దుర్గి మండలంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరావు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా త్రీ మెన్ కమిటీ సభ్యులు వరి కుటి నాగేశ్వరరావు   మాజీ అసెంబ్లీ కన్వినర్ నాసరయ్య గుమ్మడి ప్రశిక్షణ కమిటీ సభ్యులు దుర్గి మండలం మాజీ అధ్యక్షుడు వెలిడండి శ్రీనివాస్ రావు దుర్గి మండలం ఉపాధ్యక్షులు పుల్లయ్య నాయకతదితరులు పాల్గొన్నారు



భారతీయ జనతా పార్టీ మండల ప్రతిక్షణ తరగతుల సన్నాహక సమావేశం కారంపూడి మండలంలో నిర్వహించడం జరిగింది

*భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాబియాన్ కార్యక్రమంలో భాగంగా కారంపూడి మండలం లో ప్రశిక్షణా సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది మండల అధ్యక్షులు గిరిధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలనాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు కిసాన్ మోర్చా త్రిసభ్య కమిటీ సభ్యులు వరికకుటి నాగేశ్వరావు గారు జిల్లా కోశాధికారి కద్యమ ఆంజనేయులు గారు మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి హనుమంతరావు మాజీ అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య సీనియర్ నాయకులు పువ్వాడ శ్రీనివాసరావు  ఈద వెంకట కోటిరెడ్డి మండల ప్రధాన కార్యదర్శిలు వెంకటరెడ్డి   కృష్ణ తేజ బొంకూరి రఘు  తదితరులు పాల్గొన్నారు*



మాచర్లలో బీజేపీ  మండల మహా ప్రశిక్షణ అభియాన్ సన్నాహక సమావేశం

  *భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ మండల lమహా ప్రశిక్షణ అభియాన్” కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మాచర్లలో మంగళవారం సన్నాహక సమీక్ష సమావేశం జరిగింది*

*ఈ సమావేశానికి బీజేపీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమ నిర్వహణపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. అలాగే జిల్లా కిసాన్ మోర్చా త్రీ మెన్ కమిటీ సభ్యులు వరికుటి నాగేశ్వరావు పాల్గొన్నారు*
*పట్టణ అధ్యక్షుడు ఓర్సు క్రాంతి కుమార్, ప్రధాన కార్యదర్శి ఏచూరి సురేష్ కార్యక్రమ ఏర్పాట్లు, పాల్గొనబోయే కార్యకర్తలు, శిక్షణ విధానాలపై వివరాలు అందించారు. ఈ సందర్భంగా మల్లెల శివ నాగేశ్వరరావు పలు కీలక సూచనలు చేస్తూ, శిక్షణ కార్యక్రమం పార్టీ బలోపేతానికి దోహదపడేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.*
*మహా ప్రశిక్షణ అభియాన్ ద్వారా పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, ప్రజా సేవా కార్యక్రమాలపై కార్యకర్తలకు అవగాహన పెంపొందించి, బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని  తెలిపారు*



పల్నాడు జిల్లా అధ్యక్షులు వేలూరు శశి కుమార్ గారి అనుమతి తో పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేసిన పల్నాడు జిల్లా జనతా వారధి కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరావు


*బిగ్ బాస్ ని అరెస్ట్ చేయండి* 

ఆంధ్రప్రదేశ్‌లో 2019-2024 వైసీపీ పాలనలో జరిగిన లిక్కర్ స్కామ్ విషయంలో భారతీయ జనతా పార్టీ అధికారుల రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయం కోరుకుంటోంది. 

విషయం: 2019-2024 లిక్కర్ పాలసీలో భారీ ఆర్థిక కుంభకోణం - 'బిగ్ బాస్' (గత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి)ని అరెస్టు చేసి పూర్తి దర్యాప్తు చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్

భారతీయ జనతా పార్టీ ' *జనతా వారధి* ' కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, వార్డుల్లో పర్యటించినప్పుడు ప్రజలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ కాలంలో లిక్కర్ పాలసీలో జరిగిన భారీ అవకతవకల గురించి వెల్లడి చేశారు. మద్యం విక్రయాలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకుని, అనుకూల కంపెనీలకు మాత్రమే అనుమతులు ఇచ్చి, నాణ్యత లేని కల్తీ మద్యాన్ని ప్రోత్సహించారు. దీనివల్ల వేలాది కుటుంబాలు నాశనం అయ్యాయి, యువత భవిష్యత్తు చీకటిలో మునిగింది, లివర్ సంబంధిత మరణాలు పెరిగాయి.

ఎక్సైజ్ ఆదాయం 2019-20లో ₹17,000 కోట్లకు పైగా ఉండగా, 2022-23కి ₹23,000 కోట్లు, 2024-25లో ₹28,000 కోట్లకు చేరింది. ఈ వ్యత్యాసం మొత్తం ఎక్కడికి వెళ్ళింది.

అంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) ద్వారా మొత్తం కొనుగోళ్లు, సరఫరా, విక్రయాలు కేంద్రీకరించి, ఔట్‌సోర్సింగ్ పేరుతో అనుకూలులను నియమించి అవినీతి చేశారు. నగదు అమ్మకాలు, డిజిటల్ లావాదేవీలు నివారించి బ్లాక్ మనీ మల్లించారు. అధికారం ఉపయోగించి డిస్టిల్లరీలు స్వాదీనం చేసుకుని NDP రా మెటీరియల్ కొనుగోలు చేసి సొంత బ్రాండ్లు తయారు చేసి అమ్మారు.

స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) దాఖలు చేసిన 305 పేజీల ఛార్జ్ షీట్‌లో ₹3,200-3,500 కోట్ల కుంభకోణంలో 'బిగ్ బాస్' (జగన్ రెడ్డి) పాత్ర కీలకమని, 90% బిగ్ బాస్ కి చేరాయని అంటే సుమారు ₹2970 కోట్లు బిగ్ బాస్ కు అందాయని, ప్రతి నెల ₹50-60 కోట్ల ముడుపులు వారికి చేరాయని స్పష్టం. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల పాత్రలు కాల్ డేటా, గూగుల్ టేక్‌ అవుట్‌ల ద్వారా రుజువైంది. విజయవాడ ACB కోర్టు ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఆమోదం తెలిపింది.  (GO 111, 126 మేరకు) 48 మంది పై కేసులు, 16 అరెస్టులు జరిగాయి, ₹62.86 కోట్ల ఆస్తులు సీజ్ చేశారు. ఇది అతిపెద్ద లిక్కర్ *ఆర్ధిక కుంభకోణం*  వేల కోట్ల రూపాయల అవినీతి చేసి నేరుగా వారి జేబుల్లోకి డబ్బు చేరింది. అతి తక్కువ ఆస్తులు సీజ్ చేయడం వలన నిందితులకు వచ్చిన నష్టం ఏమి లేదు.

పై అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని, 

నిందితులు చెప్పిన *బిగ్ బాస్* ని అరెస్ట్ చేసి 2019-2024 లిక్కర్ పాలసీ పై మరింత విచారణ ఆదేశించాలి. చేసిన అవినీతికి తగిన ఆస్తులు గుర్తించి సీజ్ చేయాలి. పూర్తి వైట్ పేపర్ విడుదల చేయాలి - అమ్మకాలు, టర్నోవర్, టాక్స్,డిస్టిల్లరీ ఒప్పందాల వివరాలు ప్రజలకు తెలియాలి.

ముందుగా అసలు సూత్రాధికారి 'బిగ్ బాస్'ని అరెస్టు చేసి విచారించాలి.

ప్రజల డబ్బుకు జవాబుదారీతనం ఉండాలి. నిజం బయటకు రావాలి. మీరు తక్షణ చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నది.


మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం చిలకలూరిపేట నియోజకవర్గం కార్యాలయం లో నిర్వహించడం జరిగింది

 *నాదెండ్ల మండలం అధ్యక్షులు నల్లమోతు మాధవరావు ఆధ్వర్యంలో నాదెండ్ల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం చిలకలూరిపేట నియోజకవర్గం కార్యాలయం లొ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వర రావు గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కాటా అంజనారెడ్డి గారు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా మాజీ అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ గారు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి వరికుటి నాగేశ్వరరావు గారు పాల్గొని మార్చి 14 వ తేదీ జరగనున్న మండల ప్రశిక్షణా తరగతుల ఏర్పాటు గురించి ఎలా నిర్వహించాలని విధానం పై పాల్గొన్న వక్తలు మాట్లాడటం జరిగింది*

 *ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు గారు  పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కాటా అంజనా రెడ్డి గారు కిసాన్ మౌర్చ మాజీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ గారు కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వరికూటి నాగేశ్వరావు నాదెండ్ల మండలం అధ్యక్షుడు నల్లమోతు మాధవరం బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు*


చిలకలూరిపేట రూరల్ మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం చిలకలూరిపేట నియోజకవర్గం కార్యాలయం లో నిర్వహించడం జరిగింది

 *చిలకలూరిపేట రూరల్ మండలం అధ్యక్షులు పఠాన్ యాసిన్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట రూరల్ ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం చిలకలూరిపేట నియోజకవర్గం కార్యాలయం లొ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వర రావు గారు  పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా మాజీ అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ గారు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి వరికుటి నాగేశ్వరరావు గారు యూవ మోర్చా రాష్ట్ర మీడియా ఇంచార్జి వంకాయలపాటి వంశిధర్ పాల్గొని మార్చి 28 వ తేదీ జరగనున్న మండల ప్రశిక్షణా తరగతుల ఏర్పాటు గురించి ఎలా నిర్వహించాలని విధానం పై పాల్గొన్న వక్తలు మాట్లాడటం జరిగింది*

 *ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా  కిసాన్ మౌర్చ మాజీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ గారు కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వరికూటి నాగేశ్వరావు యూవ మౌర్చ రాష్ట్ర మీడియా ఇంచార్జి వంకాయలపాటి వంశిధర్ చిలకలూరిపేట రూరల్ మండలం అధ్యక్షుడు పఠాన్ యాసిన్ చిలకలూరిపేట మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని చిలకలూరిపేట పట్టణ ఉపాధ్యక్షులు కోట చంద్ర నాయుడు బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు*