kapunews



TRENDING NOW



మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం చిలకలూరిపేట నియోజకవర్గం కార్యాలయం లో నిర్వహించడం జరిగింది

 *నాదెండ్ల మండలం అధ్యక్షులు నల్లమోతు మాధవరావు ఆధ్వర్యంలో నాదెండ్ల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం చిలకలూరిపేట నియోజకవర్గం కార్యాలయం లొ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వర రావు గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కాటా అంజనారెడ్డి గారు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా మాజీ అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ గారు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి వరికుటి నాగేశ్వరరావు గారు పాల్గొని మార్చి 14 వ తేదీ జరగనున్న మండల ప్రశిక్షణా తరగతుల ఏర్పాటు గురించి ఎలా నిర్వహించాలని విధానం పై పాల్గొన్న వక్తలు మాట్లాడటం జరిగింది*

 *ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు గారు  పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కాటా అంజనా రెడ్డి గారు కిసాన్ మౌర్చ మాజీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ గారు కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వరికూటి నాగేశ్వరావు నాదెండ్ల మండలం అధ్యక్షుడు నల్లమోతు మాధవరం బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు*


చిలకలూరిపేట రూరల్ మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం చిలకలూరిపేట నియోజకవర్గం కార్యాలయం లో నిర్వహించడం జరిగింది

 *చిలకలూరిపేట రూరల్ మండలం అధ్యక్షులు పఠాన్ యాసిన్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట రూరల్ ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం చిలకలూరిపేట నియోజకవర్గం కార్యాలయం లొ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వర రావు గారు  పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా మాజీ అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ గారు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి వరికుటి నాగేశ్వరరావు గారు యూవ మోర్చా రాష్ట్ర మీడియా ఇంచార్జి వంకాయలపాటి వంశిధర్ పాల్గొని మార్చి 28 వ తేదీ జరగనున్న మండల ప్రశిక్షణా తరగతుల ఏర్పాటు గురించి ఎలా నిర్వహించాలని విధానం పై పాల్గొన్న వక్తలు మాట్లాడటం జరిగింది*

 *ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా  కిసాన్ మౌర్చ మాజీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ గారు కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వరికూటి నాగేశ్వరావు యూవ మౌర్చ రాష్ట్ర మీడియా ఇంచార్జి వంకాయలపాటి వంశిధర్ చిలకలూరిపేట రూరల్ మండలం అధ్యక్షుడు పఠాన్ యాసిన్ చిలకలూరిపేట మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని చిలకలూరిపేట పట్టణ ఉపాధ్యక్షులు కోట చంద్ర నాయుడు బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు*



దుబాయ్‌లో మంచు విష్ణు ఫ్యామిలీ.. ఆకాశంలో దూసుకొస్తున్న ఇరాన్ మిస్సైల్స్

*ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి ఇరాన్‌పై చేస్తున్న దాడులు.. తిరిగి ఇరాన్ చేస్తున్న ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది*.

*ఇరాన్ దెబ్బకు గల్ఫ్ దేశాల రాజధానులైన దుబాయ్, రియాద్, అబుదాబీ, దోహా, మనామా నగరాలు వణికిపోతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్‌లోని దుబాయ్‌పై ఇరాన్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరో మంచు విష్ణు సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో షేర్ చేశారు*.

*మంచు విష్ణు ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ లో ఉన్నారు. ఇరాన్ ప్రయోగించిన క్షిపణి దెబ్బకు తాను నివసిస్తున్న ఇల్లు షేక్ అయిందని ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఆకాశంలో ఇరాన్‌ మిస్సైల్స్ దృశ్యాలను పంచుకున్నారు. ఆ క్షిపణుల భారీ శబ్దాలు తన కుమార్తె ఐరాను భయపెట్టాయని చెప్పారు. ఎవరూ ఇలాంటి యుద్ధ వాతావరణంలో పెరగకూడదని అన్నారు. శాంతి కోసం ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు*.

"*ఈ రాత్రి దుబాయ్‌లో కుటుంబ సభ్యులతో ఉన్నాను. ఆకాశంలో కనిపిస్తున్న క్షిపణుల వల్ల మేము ఉన్న ఇల్లు కంపించింది. ఆ శబ్దాలకు ఐరా చాలా భయపడింది. శాంతి కోసం ప్రార్థిస్తున్నాము. ఏ బిడ్డ కూడా యుద్ధ శబ్దం విని పెరగకూడదు. పౌరులను సురక్షితంగా ఉంచినందుకు యుఎఇ రక్షణ దళాలకు కృతజ్ఞతలు. ఇలాంటి క్షణాలు జీవితం నిజంగా ఎంత దుర్బలమైనదో మనకు గుర్తు చేస్తాయి. బలం కోసం, శాంతి కోసం ప్రార్థిస్తున్నాము. హర్ హర్ మహాదేవ్" అని మంచు విష్ణు పేర్కొన్నారు*.



జనతా వారధి ఫిర్యాదుకు తక్షణ స్పందన

మాచర్లలో దోమల నివారణకు ఫాగింగ్ ప్రారంభం

మాచర్ల పట్టణంలో ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం ఫలితాన్నిచ్చింది. కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుపై మున్సిపల్ కమిషనర్ వేణుబాబు తక్షణమే స్పందించి దోమల నివారణ చర్యలను ప్రారంభించారు.
ప్రతి గురువారం బీజేపీ పట్టణ కార్యాలయంలో నిర్వహించే జనతా వారధి కార్యక్రమంలో ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఈ సందర్భంగా మాచర్ల పట్టణ రెండో వార్డుకు చెందిన శేషగిరి పానయ్య పట్టణంలో దోమల తీవ్రత పెరిగిందని, ఫాగింగ్ నిర్వహించాలని కోరుతూ ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదును బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఓర్సు క్రాంతి కుమార్ మున్సిపల్ కమిషనర్ వేణుబాబు దృష్టికి తీసుకెళ్లి అధికారికంగా అందజేశారు. వెంటనే స్పందించిన కమిషనర్ శనివారం స్వయంగా పర్యవేక్షణలో మున్సిపల్ సిబ్బందితో ఫాగింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రోజుకు కొన్ని వార్డుల చొప్పున మొత్తం మాచర్ల పట్టణం అంతటా ఫాగింగ్ నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు. ప్రజా సమస్యపై వెంటనే స్పందించిన కమిషనర్ వేణుబాబుకు బీజేపీ నాయకులు మరియు శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు.


మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం చిలకలూరిపేట టౌన్ లో నిర్వహించడం జరిగింది

 *చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణ ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వర రావు గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కాటా అంజనారెడ్డి గారు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా మాజీ అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ గారు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి వరికుటి నాగేశ్వరరావు గారు పాల్గొని మార్చి 7వ తేదీ జరగనున్న మండల ప్రతిక్షణా తరగతుల ఏర్పాటు గురించి ఎలా నిర్వహించాలని విధానం పై పాల్గొన్న వక్తలు మాట్లాడటం జరిగింది*

 *ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు గారు యూవ మోర్చా రాష్ట్ర మీడియా ఇంచార్జ్ వంకాయలపాటి వంశీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కాటా అంజనా రెడ్డి గారు కిసాన్ మౌర్చ మాజీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ గారు కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వరికూటి నాగేశ్వరరావు గారు  పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు యువ మోర్చా తెల్లబాటి మనోహర్ పట్టణ ప్రధాన కార్యదర్శి పోలయ్య పట్టణ మాజీ అధ్యక్షులు దడబడ పుల్లయ్య పల్నాడు జిల్లా జనతా వారధి మీడియా ఇంచార్జ్ కోమటి వాసు పట్టణ కార్యదర్శి మాచర్ల శ్రీనివాసరావు పట్టణ కార్యదర్శి డోలాపురం రాయుడు మహిళా మౌర్చ నాయకురాలు ఎలిజబెత్ రాణి మరియు బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు*

 *చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణ ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వర రావు గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కాటా అంజనారెడ్డి గారు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా మాజీ అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ గారు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి వరికుటి నాగేశ్వరరావు గారు పాల్గొని మార్చి 7వ తేదీ జరగనున్న మండల ప్రతిక్షణా తరగతుల ఏర్పాటు గురించి ఎలా నిర్వహించాలని విధానం పై పాల్గొన్న వక్తలు మాట్లాడటం జరిగింది*

 *ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు గారు యూవ మోర్చా రాష్ట్ర మీడియా ఇంచార్జ్ వంకాయలపాటి వంశీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కాటా అంజనా రెడ్డి గారు కిసాన్ మౌర్చ మాజీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ గారు కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వరికూటి నాగేశ్వరరావు గారు  పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు యువ మోర్చా తెల్లబాటి మనోహర్ పట్టణ ప్రధాన కార్యదర్శి పోలయ్య పట్టణ మాజీ అధ్యక్షులు దడబడ పుల్లయ్య పల్నాడు జిల్లా జనతా వారధి మీడియా ఇంచార్జ్ కోమటి వాసు పట్టణ కార్యదర్శి మాచర్ల శ్రీనివాసరావు పట్టణ కార్యదర్శి డోలాపురం రాయుడు మహిళా మౌర్చ నాయకురాలు ఎలిజబెత్ రాణి మరియు బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు*


శ్యావల్యాపురం  మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

,కేంద్ర రాష్ట్ర బిజెపి దిశానిర్దేశం మేరకు రాష్ట్ర అధ్యక్షులు pvn మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు, శావల్యాపురం మండల సీనియర్ నాయకులు అడుసుమల్లి వీరేంద్ర గారు ,ఈపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోరంట్ల సత్యనారాయణ గారు, వినుకొండ నియోజకవర్గం మాజీ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు, మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమాన్ని మండలంలోని ఇర్లపాడు గ్రామంలో స్థానిక బిజెపి నేత వెనిగండ్ల ఆంజనేయులు గారి నిర్వహణలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గ్రామస్తులు ఆరు అర్జీలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా గ్రామీణ రక్షిత మంచినీటి గత 15 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉందని దీనికి జల్ జీవన్ మిషన్ (jjm)పథకం మంజూరు చేయాలని, అలాగే గ్రామంలో పూర్తిస్థాయిలో  సైడ్ డ్రైనేజీలు నిర్మించాలని, అలాగే పాత కరెంటు స్తంభాల వల్ల ప్రమాదం పొంచి ఉందని వాటి స్థానంలో కొత్త కరెంటు స్తంభాలు నిర్మించాలని, శుభ కార్యాలు వివిధ రకాల ఫంక్షన్లో నిర్వహించినందుకు ఏ విధమైన మండపాలు లేనందున  కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని, అలాగే nregs కింద పొలాలకు వెళ్లి రహదారులు నిర్మించాలని, ఈర్ల రాజా అనే వ్యక్తి నాకు కనీసం నివసించడానికి అడుగు జాగా కూడా లేదని నాకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని నివసించేందుకు గ్రామంలో ప్రభుత్వ భూమిని మంజూరు చేయాలని దరఖాస్తు ద్వారా ప్రభుత్వాన్ని కోరారు, కార్యక్రమంలో టిడిపి నాయకులు కంచేటి రామయ్య గారు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.

దాచేపల్లి మండలం లో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

  దాచేపల్లి మండలంలో నిర్వహించిన జనతా వారధి కార్యక్రమంలో భాగంగా దాచేపల్లి మండలం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో పలువురికి సమస్యల్ని దాచేపల్లి మునిసిపల్ కమిషనర్ గారి దృష్టికి మరియు దాచేపల్లి మండల ఎమ్మార్వో గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాచేపల్లి మండల అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు మరియు బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది.



పిడుగురాళ్ల పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది

 ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన జనతా వారధి ప్రోగ్రాం పిడుగురాళ్ల పట్నం కార్యాలయంలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశి కుమార్ ఆదేశానుసారం జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగినది
 ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ ఇద్దరు దగ్గర అర్జీలు స్వీకరించడం జరిగింది అర్జీ వివరాలు ఒకటి ఇంటి నివేశ స్థలం కొరకు రెండవది రేషన్ కార్డు కొరకు అర్జీలు సేకరించి పిడుగురాళ్ల పట్టణ ఎమ్మార్వో గారికి సమర్పించడం జరిగినది ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది.




మాచర్ల పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది


మాచర్ల పట్టణంలో దోమలు విపరీతంగా ఉన్నాయని వాటి నివారణకు ఫాగింగ్ నిర్వహించాలని కోరుతూ ఒక ఫిర్యాదు అందింది. గురువారం మాచర్ల బిజెపి పట్టణ ఆఫీస్ లో నిర్వహించిన జనతా వారధి ప్రోగ్రాం లో రెండో వార్డుకు చెందిన శేషగిరి పానయ్య ఈ ఫిర్యాదు ఇచ్చారు. పట్టణ అధ్యక్షుడు ఓర్సు క్రాంతి కుమార్ అధ్యక్షతన జనతా వారధి కో కన్వీనర్లు ఏచూరి సురేష్, శివ కోటయ్య నాయక్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరిగింది. వచ్చిన ఫిర్యాదును మున్సిపల్ కమిషనర్ వేణుబాబు దృష్టికి తీసుకెళ్లి సమస్య వివరిస్తామని ఫిర్యాదు దారుడికి సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు ఎస్సీ మోర్చా ఇంచార్జ్ సజ్జన్ పాల్గొన్నారు.



జిల్లా కోర్టుల అంశంపై శాసన మండలిలో ప్రసంగించిన గౌరవ శాసనమండలి సభ్యులు  మర్రి రాజశేఖర్ 

*మర్రి రాజశేఖర్ గారు శాసన మండలిలో జిల్లా కోర్టుల వ్యవస్థపై ప్రాముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు.*

*ప్రస్తుతం రాష్ట్రంలో 28 జిల్లాలు ఏర్పాటు చేయబడినప్పటికీ, కొన్ని జిల్లాల్లో ప్రిన్సిపల్ జిల్లా కోర్టులు ఇంకా పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనే కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఉదాహరణకు, పల్నాడు జిల్లా పరిధిలోని నరసరావుపేట లో జిల్లా కోర్టు పనిచేస్తున్నప్పటికీ, ప్రిన్సిపల్ కోర్టు మాత్రం ఉమ్మడి జిల్లా కేంద్రమైన గుంటూరు లో కొనసాగుతోందని వివరించారు.*

*ఈ కారణంగా పల్నాడు జిల్లాకు చెందిన న్యాయవాదులు మరియు ప్రజలు మొదట గుంటూరుకు వెళ్లి కేసులు ఫైల్ చేసి, అక్కడి నుంచి ఫైళ్లను నరసరావుపేటకు ట్రాన్స్‌ఫర్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. దీని వల్ల సమయం, ఖర్చు మరియు శ్రమ పరంగా వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.*

*కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు, ఆయా జిల్లాల్లో పనిచేస్తున్న జిల్లా కోర్టులను ప్రిన్సిపల్ జిల్లా కోర్టులుగా ప్రకటించేందుకు హైకోర్టుకు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ గారిని కోరారు.*



పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల గారికి పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి తరపున పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు వినతి పత్రం సమర్పించడం జరిగింది


గౌరవనీయులైన పల్నాడు జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్న ఫిర్యాదు 


హిందు సంస్కృతి మూలాలు ధ్వంసం చేయడమే జగన్ లక్ష్యం, హిందు సమాజాన్ని అవమానిస్తూ ఆనందం పొందుతున్నారు

జగన్మోహన్ రెడ్డి పాలనలో హిందూ సమాజం పై దాడి జరిగింది. తిరుమల డిక్లరేషన్ పై సంతకం చేయకుండా దర్శనానికి వెళ్లి హిందు విశ్వాశాలపై నమ్మకం లేదని తెలిపాడు. ఈ చర్య ద్వారా హిందూ దేవతలు ఆరాధనలపై విశ్వాసం లేదని అర్ధం అయ్యింది. కెమికల్ నెయ్యితో శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ చేసి తీవ్ర  అపచారం చేయడమే కాకుండా శాసనమండలి సాక్షిగా చెప్పులు ధరించి కలియుగ దైవం వెంకటేశ్వర స్వాము చిత్ర పఠంతో నినాదాలు చేసి తధనంతరం ఆ ఫోటోలను అక్కడే విసిరేసి వెళ్ళిపోయారు. ఈ సంఘటన చాలా బాధాకరం.

వైఎస్సార్సీపి ప్రభుత్వంలో హిందూ సంస్కృతి మూలాల్లో కొట్టాలనే కుట్ర జరిగింది.

వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో హిందూ ఆలయాల ధ్వంసం హిందూ దేవత మూర్తుల విగ్రహాల ధ్వంసం ఆలయ రథాల దగ్ధం మరియు ధ్వంసం జరిగినది

ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 2024 మధ్య కాలంలో  హిందూ సంస్కృతి మూలాలను నాశనం చేయాలనే ప్రయత్నంలో జరిగిన దాడులపై సమగ్ర విచారణ చేయాలి అని ప్రజలు కోరుచున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి 2024 వరకు YSRCP ప్రభుత్వ కాలంలో హిందూ ఆలయాలు, విగ్రహాలు, రథాలపై జరిగిన అనేక దాడులు ధ్వంసాలు గమనార్హం. ఈ ఘటనల్లో అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్లక్ష్య చర్యలు సమాజంలో భయాన్ని పెంచాయి. అంతే కాకుండా ఫిర్యాదు చేసినవారిపైనే తిరిగి కేసులు పెట్టి అమాయక హిందువులను వేధించారు. ఒక మత ఛాందశవాది ఇతర మత విశ్వాసాలపై గౌరవం లేనివాడు ముఖ్యమంత్రి అయితే ఎంత ప్రమాదమో ప్రజలకి అర్ధం అయ్యింది. 

భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న "జనతా వారధి" కార్యక్రమంలో భాగంగా మేము ప్రజల వద్దకు వెళ్తున్నప్పుడు వారి నుంచి వస్తున్న విన్నపం "మా హిందూ ఆలయాల ధ్వంసం విగ్రహాల ధ్వంసం దగ్ధం పై చర్యలు తీసుకోవాలని ఇది కచ్చితంగా కుట్రపూరితంగా అప్పటి పాలకుల ప్రోత్సాహంతో చేశారని వారందరిపై చర్యలు తీసుకొని నేరస్తులు ఎవరో తెలియచేసి ప్రజాస్వామ్యానికి నమ్మకం కలిగించాలి" అని కోరుచున్నారు. ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల కుట్రలు దాడులు జరిగాయి. 2020 నెల్లూరులో కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి రధం ధ్వంసం చేశారు. 2020 సెప్టెంబర్ లో తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ రథాన్ని దగ్ధం చేశారు. 2024 సెప్టెంబర్ లో అనంతపురం రామాలయం రధాన్ని దగ్ధం చేశారు. 2019 మార్చిలో కాకినాడ రూరల్ లో ఒక చర్చి పాస్టర్ రెండు హిందూ ఆలయాలు ధ్వంసం చేసి అందులో విగ్రహాలను తీసుకువెళ్లిపోయారు. 2020 జనవరిలో పిఠాపురం లో పేరుగాంచిన ఆలయాల్లో దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేశారు. 2020 సెప్టెంబర్ లో చిత్తూరులో నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 2021 లో రాజమండ్రిలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం చేతులు నరికారు. 2021 లో విజయనగరం జిల్లా నెల్లిమర్లలో రామతీర్థం పుణ్యక్షేత్రం శ్రీరాముని విగ్రహ శిరస్సు ధ్వంసం చేశారు ఇంకా ఎన్నో దారుణాలు చేశారు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రోజు హిందూ మూలాలను నాశనం చేసే రచన జరిగింది. ఇప్పటికి కూడా అదే ఆలోచనలతో వున్నారు అని అర్ధం అవుతుంది. ప్రజల ముందు జగన్మోహన్ రెడ్డి ముసుగు తొలగింది. ఇది భరించలేని జగన్మోహన్ రెడ్డి తన దుర్మార్గపు అనుచరులతో కలసి సమాజన్ని కించపరుస్తున్నారు.

క్షమించరాని తప్పులు చేసి కూడా భగవంతుణ్ణి అవమానపరుస్తూ శాసనమండలిలో నిరసన పేరుతో ప్రవర్తించిన తీరుని చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం 2019 నుంచి 2024 వరకు హిందూ ఆలయాల ధ్వంసం, దేవత మూర్తుల విగ్రహాలు ధ్వంసం, రధాలు దగ్ధం రధాలు ధ్వంసం అన్ని సంఘటనలపై నిజమైన నేరస్తులను ప్రజల ముందు ఉంచి, లడ్డు ప్రసాదంలో కెమికల్ నెయ్యి నిందుతులు సహకరించిన  వ్యక్తులను శిక్షించాలి. శాసనమండలిలో కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అవమానించిన సభ్యుల పై చర్యలు తీసుకోవాలని కోరుచున్నారు.
ఈ కార్యక్రమం లొ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు పల్నాడు జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా జనతా వారధి మీడియా ఇంచార్జి కోమటి వాసు చిలకలూరిపేట పట్టణ ఉపాధ్యక్షులు కోట చంద్ర చిలకలూరిపేట మైనార్టీ పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ సుభాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


బిజెపి నూతన నాదెండ్ల మండల అధ్యక్షులుగా  
నల్లమోతు మాధవరావు ఎన్నిక 


పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు ఈరోజు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ చేతుల మీదగా బిజెపి నూతన నాదెండ్ల మండల అధ్యక్షులు గా నల్లమోతు మాధవరావు ఎన్నిక నూతన నాదెండ్ల మండల అధ్యక్షులు నల్లమోతు మాధవరావు మాట్లాడుతూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోది అభిమానిని నేను ఆయన సేవా భావాలు సేవా దృక్పథంతో భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్న ఆశా కిరణం మన మోడీజీ అని తెలిపారు అదే సంకల్పంతో నాదెండ్ల మండల ప్రజలకు అండదండలుగా ఉండి పార్టీని ముందుకు నడిపించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు శివ నాగేశ్వరరావు, జిల్లా కిసాన్ మోర్చా మాజీ అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్, జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటీ నాగేశ్వరరావు, రాష్ట్ర సోషల్ మీడియా ఇన్చార్జి వంశీ, పల్నాడు జిల్లా యువమోర్చా అధ్యక్షులు పులిగుజ్జు మహేష్, పట్టణ అధ్యక్షులు కోటా పవన్ కుమార్ గాంధీ, పట్టణ ఉపాధ్యక్షులు కోటా చంద్ర, పట్టణ మీడియా ఇన్ఛార్జ్ రావికింది రామకృష్ణ, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సుభాని, మాజీ పట్టణ అధ్యక్షులు దడబడ పుల్లయ్య, ఎడ్లపాడు మండల యువమోర్చా అధ్యక్షుడు కోటి, పట్టణ సెక్రెటరీ గుమ్మా బాలకృష్ణ, జనతా వారది మీడియా ఇంచార్జి కోమటి వాసు, బిజెపి సీనియర్ నాయకురాలు ఎలిజిబెత్ రాణి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు


పల్నాడు జిల్లా ఓబీసీ మరియు రజక సంఘం ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా 150 వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు

చిలకలూరిపేట పట్టణ రజక జనసేవ సంఘం కార్యాలయంలో  భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పల్లపు శివయ్య ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా గారి 150వ జయంతి నీ పట్టణ రజక జన సేవా సంఘం అధ్యక్షులు కురిచేటి వీర బ్రహ్మంగారి  
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా బిజెపి పార్టీ ఇన్చార్జి శ్రీనివాసరావు గారు చిలకలూరిపేట నియోజకవర్గ లో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు జిల్లా మాజీ అధ్యక్షులు పూర్ణ  చంద్రా రావు జిల్లా మాజీ అధ్యక్షులు రం మోర్చా  గారు  జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ చారి జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు  గరికపాటి లక్ష్మీ గారు జిల్లా మ ఓబీసీ మోర్చా కార్యదర్శి కట్టు సాయిరాం  బీజేపీ పట్టణ రజక జన సేవా సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని సంత్ గాడ్గే బాబా గారి గొప్పతనం ఆయన చేసినటువంటి సేవలు సంస్కరణలు ఆయన నెలకొల్పినటువంటి విద్యాసంస్థలు ఆయన పాటించినటువంటి స్వచ్ఛభారత్ మొదలగు తదితర విషయాలను ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ సంతు గాడ్గే బాబా గారి చిత్రపటానికి పూలమాలవేసి ఆ మహనీయుని గుర్తు చేసుకున్నారు.

ఏపీలో భూకంపం 3.5 తీవ్రతతో కంపనం

AP:ఏపీలోని పల్నాడు జిల్లాలో రిక్టర్ స్కేల్ పై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. వినుకొండ, దర్శి పరిసర ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు నమోదయ్యాయి. ఇళ్లలోని వస్తువులు కదలడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

ప్రజా సమస్యల కంటే.. జగన్ ఎజెండానే వైసీపీ సభ్యులకు ముఖ్యమైపోయింది : ప్రత్తిపాటి

• వైసీపీ ఎమ్మెల్సీల ధోరణిపై సొంతపార్టీ శ్రేణులే తలలు పట్టుకుంటున్నారు : ప్రత్తిపాటి
• జగన్  కుంభకోణాలు, దోపిడీలపై ప్రజల్లో చర్చ జరగకూడదన్నదే వైసీపీ సభ్యుల అంతిమ లక్ష్యం : ప్రత్తిపాటి.
• టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం లేదని హెరిటేజ్ స్పష్టంగా చెప్పినా.. వైసీపీ సభ్యులు కుక్కతోక పట్టుకొని గోదారి ఈదే ప్రయత్నం చేస్తున్నారు. :ప్రత్తిపాటి
• తన కొలంబో పర్యటనపై వైసీపీ అవినీతి మీడియా దుష్ప్రచారానికి లోకేశ్ సమాధానం కుక్కకాటుకు చెప్పుదెబ్బలా ఉంది. : ప్రత్తిపాటి

“ మంత్రి నారా లోకేశ్ కొలంబో పర్యటనపై పనిగట్టుకొని మరీ దుష్ప్రచారం చేయడం సాక్షి మీడియా బరి తెగింపునకు పరాకాష్ట. సొంత ఖర్చులతో క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లడాన్ని తప్పుపడుతూ.. అవినీతి మీడియా తన అవాస్తవాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేసింది. జగన్ సంతోషం కోసం... జనం మనసుల్లో విషబీజాలు నాటే దినచర్యలో వైసీపీ నేతలు.. సాక్షి మీడియా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బలా ... సాక్షి దుష్ప్రచారాన్ని లోకేశ్ తనదైన శైలిలో తిప్పికొట్టారు. అవినీతి మీడియా విషపురాతల సృష్టికర్తలకు.. లోకేశ్ సమాధానం కుక్కకాటుకు చెప్పుదెబ్బలా గట్టిగా తగిలిందనే చెప్పాలి. గతంలో లోకేశ్ పై హద్దులు మీరి చేసిన దుష్ప్రచారానికి,  కోర్టుల్లో క్షమాపణలు చెప్పుకునే దుస్థితి కల్పించినా.. సాక్షి రాతల్లో మార్పురాలేదు. 

*రచ్చ చేయడానికే సభకు వస్తున్నారు..*
వైసీపీ ఎమ్మెల్సీలు మండలికి వస్తున్నది ప్రజాసమస్యలపై చర్చకు.. రాష్ట్రానికి మేలు చేసే అంశాలపై ప్రభుత్వానికి సలహాలు..సూచనలు ఇవ్వడానికి కాదని వారి వైఖరిని బట్టే అర్థమవుతోంది. కేవలం ఒక ఎజెండా ప్రకారం..సభను అడ్డుకోవాలి.. రచ్చ చేయాలి అన్నదే వారి లక్ష్యంగా కనిపిస్తోంది. టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం లేదని హెరిటేజ్ సంస్థ స్పష్టంగా ఆధారాలు బహిర్గతం చేసినా కూడా.. వైసీపీనేతలు ఆ సంస్థను బదనాం చేయడం కుక్కతోక పట్టుకొని గోదారి ఈదడమే అవుతుంది.  జగన్ సాగించిన కుంభకోణాలు. దోపిడీలపై కూటమిప్రభుత్వం చేపట్టిన విచారణ.. రోజురోజుకీ బయటకొస్తున్న నాటి వైసీపీ ప్రభుత్వ అవినీతి వ్యవహారాలపై ప్రజల్లో  చర్చ జరగకూడదు.. వారి మనసుల్లో ఎక్కడా జగన్ దుర్మార్గాలు ఎస్టాబ్లిష్ అవకూడదన్న ఏకైక లక్ష్యంతోనే వైసీపీ సభ్యులు అడుగడుగునా సభా నిర్వహణకు అడ్డు తగులుతున్నారు. కల్తీ నెయ్యి స్కామ్ లో జగన్ సహా నాటి టీటీడీ పెద్దల పాత్ర ప్రజలకు తెలియకూడదన్న దురుద్దేశంతోనే, వైసీపీ సభ్యులు  హెరిటేజ్ డెయిరీపై బురదజల్లుతున్నారు 

*వైసీపీ సభ్యుల తీరుపై సొంతపార్టీ శ్రేణులే తలలు పట్టుకుంటున్నారు*
పెద్దలసభను వైసీపీ సభ్యులు కావాలనే పెడదారి పట్టిస్తున్నారు.
ఎవరికి వారే యమునా తీరే అంటున్న వైసీపీసభ్యుల ప్రవర్తనపై సొంత కార్యకర్తలే తలలు పట్టుకుంటున్నారు. ఆధిపత్య  భావజాలంతో తమలే తాము కలహించుకంటూ.. పెద్దల సభ గౌరవప్రతిష్టల్ని బజారుకీడుస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే అంశాల కంటే.. తమ నాయకుడి  ఆదేశాలే తమకు మిన్న అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. మండలి మర్యాదను మంటగలపాలన్న ఆరాటం తప్ప... ప్రభుత్వ విధానాలపై చర్చించాలన్న ఆలోచన వైసీపీసభ్యులకు లేకపోవడం విచారకరం.” అని మాజీమంత్రి ప్రత్తిపాటి బుధవారం ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు.