kapunews



TRENDING NOW



 
 
 
గడ్డిమందు శాపం... నటుడు రాహుల్ రామకృష్ణ సోదరుడు మృతి

టాలీవుడ్‌ ప్రముఖ సినీ నటుడు రాహుల్ రామకృష్ణ సోదరుడు మరణించారు. పారాక్వాట్ (Paraquat) అనే రసాయన గడ్డిమందు కారణంగా తన సోదరుడు ప్రాణాలు కోల్పోయాడని సోషల్ మీడియా ద్వారా అయన తెలిపారు.

అత్యంత విషపూరితమైన ఈ రసాయనం తెలంగాణలో చాలా సులభంగా అందుబాటులో ఉండటం తెలిసి తనను ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన అన్నారు. ఈ రసాయనం వల్ల సంభవిస్తున్న మరణాల సంఖ్యను చూసి డాక్టర్లు కూడా షాకవుతున్నారని రాహుల్ పేర్కొన్నారు.

ఆత్మహత్యల కోసం విచ్చలవిడిగా దుర్వినియోగం చేయబడుతోందని ఆవేదన చెందారు. ఇది ప్రతిచోటా ఎంత సులభంగా లభిస్తుందో చూసి దిగ్భ్రాంతి చెందానని ఆయన అన్నారు. దయచేసి వీలైనంత త్వరగా దీనిని నిషేధించండి - ప్రాణాలను కాపాడండి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి (CMO), భారత ప్రధానమంత్రి కార్యాలయానికి (PMO) ఆయన విజ్ఞప్తి చేశారు.

భారతదేశంలో పారాక్వాట్ వినియోగం ఇప్పటికీ కొనసాగుతుంది. దీని విషపూరితత కారణంగా కొన్ని రాష్ట్రాలు (ఉదా: తెలంగాణ) అమ్మకాలపై పరిమితులు విధించాయి. ప్రపంచంలోని చాలా దేశాలు దీన్ని పూర్తిగా నిషేధించాయి. వైద్య నిపుణులు చిన్న పరిమాణం కూడా ప్రాణాంతకమని హెచ్చరించడంతో తెలంగాణ ప్రభుత్వం (2026) పారాక్వాట్ అమ్మకాలపై పరిమితులు విధించింది. భారతదేశంలో చాలా రాష్ట్రాలు కొన్ని కఠిన మార్గదర్శకాలతో మాత్రమే అనుమతిస్తున్నాయి. పొలాల్లో పనిచేసే రైతులు ఎక్కువగా ఈ రసాయనం వల్ల ప్రభావితమవుతున్నారు.
*

రైతుల ఆర్థిక బలోపేతానికి.. పశుపోషణే కీలక ఆదాయ వనరు :  ప్రత్తిపాటి*

• గేదెలు అనారోగ్యానికి గురైతే పాల దిగుబడి తగ్గుతుంది
• పశుపోషణకు ప్రభుత్వం అందించే రాయితీలను రైతాంగం సద్వినియోగం చేసుకోవాలి
• మానుకొండవారిపాలెంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించిన ప్రత్తిపాటి.

ప్రభుత్వం అందించే ఉచిత పశువైద్యసేవలు, పశుపోషణ రాయితీలు, ప్రోత్సాహకాల్ని రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు.

చిలకలూరిపేట మానుకొండవారిపాలెంలో పశుసంవర్థక మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన  ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రత్తిపాటి ప్రారంభించి, రైతుల్ని, గ్రామస్తుల్ని ఉద్దేశించి మాట్లాడారు.
పశువులకు గాలికుంటు, గొంతువాపు వ్యాధి టీకాలు, గొర్రెలకు నాచు, నీలినాలుక వ్యాధి టీకాలను పశుసంవర్ధక శాఖ యంత్రాంగం ఉచితంగా వేస్తోందన్నారు. నట్టల నివారణ మందులతో పాటు, పశువులను పరీక్షించి అవసరమైన అన్నిరకాల మందుల్ని ఉచితంగా అందిస్తున్నారని చెప్పారు. గేదెలు, ఆవులు అనారోగ్యానికి గురైతే పాల దిగుబడి తగ్గుతుందన్నారు.
గత ప్రభుత్వం ఇష్టానుసారం, స్వార్థ ప్రయోజనాలకోసం మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలను మరలా పంచాయతీలుగా పరిగణించబోతున్నామని ప్రత్తిపాటి చెప్పారు. గ్రామస్తుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 
ఈ కార్యక్రమంలో టిడిపి సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, కల్లి వీర రెడ్డి, పశు వైద్యులు డాక్టర్ రాధాకృష్ణ, నాగేశ్వరరావు , దీప్తి, గ్రామ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.



అత్యవసర హెచ్చరిక జారీ చేయబడింది…

*ఏప్రిల్ 29 నుండి మే 12 వరకు,*
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎవరూ బయటకు (ప్రత్యేకంగా బహిరంగ ప్రదేశాలకు) వెళ్లకూడదు. ఎందుకంటే ఉష్ణోగ్రత 45°C నుండి 55°C వరకు పెరగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఎవరికైనా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా అకస్మాత్తుగా అస్వస్థత కలిగితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. గాలి సరిగా వచ్చేలా గదుల తలుపులు తెరిచి ఉంచండి. మొబైల్ వినియోగాన్ని తగ్గించండి, అధిక వేడి కారణంగా మొబైల్ పేలే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి మరియు ఈ సమాచారాన్ని ఇతరులకు తెలియజేయండి. 

పెరుగు, మజ్జిగ, బేల్ పండు రసం వంటి చల్లని పానీయాలను ఎక్కువగా తీసుకోండి.

*చాలా ముఖ్యమైన సమాచారం:*

*పౌర రక్షణ విభాగం ప్రజలు మరియు నివాసితులకు క్రింది సూచనలు చేస్తోంది.* 

రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 47°C నుండి 55°C వరకు పెరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగించే వేడి గాలులు ఉండే అవకాశం ఉంది. *కాబట్టి ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి:*

*కార్లలో ఉంచకూడని వస్తువులు:*

గ్యాస్ పదార్థాలు
లైటర్లు
కార్బోనేటెడ్ పానీయాలు
సుగంధ ద్రవ్యాలు మరియు బ్యాటరీలు
గాలి ప్రసరణ కోసం కారు కిటికీలు కొద్దిగా తెరిచి ఉంచండి
కారు ఇంధన ట్యాంక్‌ను పూర్తిగా నింపకండి
సాయంత్రం సమయంలోనే ఇంధనం నింపండి
ఉదయం కారులో ప్రయాణం చేయడం నివారించండి
ప్రయాణ సమయంలో టైర్లలో అధిక గాలి నింపకండి

*ఇతర జాగ్రత్తలు:*

తేళ్లు మరియు పాములు చల్లని ప్రదేశాల కోసం ఇళ్లలోకి రావచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి
ఎక్కువగా నీరు మరియు ద్రవాలు తాగండి
గ్యాస్ సిలిండర్‌ను ఎండలో ఉంచవద్దు
విద్యుత్ మీటర్లపై అధిక లోడ్ వేయవద్దు
అవసరమైన గదుల్లో మాత్రమే ఎయిర్ కండిషనర్ ఉపయోగించండి
ప్రతి 2–3 గంటలకు కనీసం 30 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి
బయట ఉష్ణోగ్రత 45–47°C ఉన్నప్పుడు, ఇంట్లో ACని 24–25°C వద్ద ఉంచండి
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నేరుగా సూర్యకాంతిని తప్పించండి






*
కోటి రూపాయల విలువైన హషీష్ ఆయిల్ స్వాధీనం – ఒకరి అరెస్ట్*

ఫ్యూచర్ సీటీ కమిషనరేట్ - సురక్ష ప్రతినిధి 
తేదీ: 30 మార్చి 2026.

రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం పోలీసులు మరియు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) బృందం సమిష్టిగా నిర్వహించిన తనిఖీలలో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుండి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న దాదాపు 9.402 కిలోల హషీష్ ఆయిల్ (గంజాయి ద్వారా తయారు చేసే నూనె)ను పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ. 1 కోటిగా అంచనా వేశారు.

 *నిందితుల వివరాలు:* 
A-1: కొరాబు చాంటి బాబు (35 సంవత్సరాలు) – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామరాజు జిల్లా నివాసి (అరెస్ట్)
A-2: రాజారావు (ఒరిస్సా) – పరారీలో ఉన్నారు
A-3: గుర్తుతెలియని వ్యక్తి – పరారీలో ఉన్నారు
పోలీసుల వివరాల ప్రకారం, A-1 చంటి బాబు, A-2 రాజారావు వద్ద నుండి ఈ డ్రగ్స్‌ను సేకరించి హైదరాబాద్‌లోని గుర్తుతెలియని వ్యక్తులకు సరఫరా చేయడానికి ప్రయత్నించాడు. మార్చి 29 సాయంత్రం మహేశ్వరం గేట్ బస్ స్టాప్ వద్ద నిలబడి ఉన్న సమయంలో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 10 పాలిథిన్ కవర్లలో ఉన్న హషీష్ ఆయిల్ మరియు 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు చంటి బాబుపై గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని కంచరపాలెం, అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాలలో 4 NDPS కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

 *ప్రజలకు విజ్ఞప్తి:*
యువత మరియు విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఫ్యూచర్ సిటీ పోలీసులు సూచించారు. తమ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని కోరారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే మహేశ్వరం జోనల్ కంట్రోల్: 8712662664 లేదా Dial 100కు సమాచారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన అధికారులను పోలీస్ కమిషనర్ శ్రీ జి. సుధీర్ బాబు, ఐపిఎస్ గారు మరియు ఇతర ఉన్నతాధికారులు అభినందించారు.



తెలంగాణ పర్యాటక శాఖలో బయటపడ్డ అక్రమాలు

ఏడాది కాలంలో బోటింగ్ రంగం ద్వారా రూ.1.48 కోట్లకు గండి

తెలంగాణలోని 27 పర్యాటక కేంద్రాల్లో దాదాపు 99 బోట్లను నడిపిస్తున్న పర్యాటక శాఖ 

2024లో బోటింగ్ ద్వారా రూ.14.60 కోట్ల ఆదాయం రాగా, 2025లో రూ.13.12 కోట్లకు పడిపోయిన ఆదాయం 

హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు, నాగార్జున సాగర్, లక్నవరం లాంటి ప్రాంతాల్లో పర్యాటకుల రద్దీ పెరుగుతున్నా ఒక్క ఏడాదిలో రూ.1.48 కోట్ల ఆదాయం పడిపోవడంతో పర్యాటక శాఖలో అవినీతి జరుగుతున్నట్లు గుర్తించిన ఉన్నతాధికారులు

బోటింగ్ కేంద్రాల్లో ఇన్‌చార్జ్‌లు, మేనేజర్లు, సిబ్బందితో కుమ్మక్కయి, టిక్కెట్లు లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే తక్కువ ధరలకు బోటింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తింపు

రూ.500 ఉన్న టికెట్‌ను, రూ.200కు టికెట్ లేకుండా బోట్లోకి అనుమతించడం, 10 ట్రిప్పులు తిరిగితే 8 ట్రిప్పులు తిరిగినట్లు చూపించి మిగతా 2 ట్రిప్పుల డబ్బులు తీసుకోవడం, ఒక్క ట్రిప్పుకు 3 లీటర్లు డీజిల్ అవసరం ఉండగా అదనంగా 2 లీటర్లు బిల్లులో రాయడం లాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని గుర్తించిన ఉన్నతాధికారులు

నాగార్జునసాగర్ బోటింగ్ కేంద్రంలో 
ఇన్‌ఛార్జి ఏకంగా నకిలీ టికెట్ బుక్కునే ప్రింట్ చేసి, ప్రభుత్వానికి రావలసిన లక్షల ఆదాయం కొల్లగొట్టాడని, అతన్ని విధుల నుండి తొలగించిన అధికారులు

ప్రతీ బోటింగ్ కేంద్రంలో ఇలాంటి అవినీతి జరుగుతుందని, మంత్రి జూపల్లి కృష్ణారావు ఇప్పటికైనా ఇలాంటి అక్రమార్కుల పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న స్థానికులు

*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి హిందూ దేవాలయాల భూముల ఆక్రమణ పై వినతి పత్రం సమర్పించడం జరిగింది*

*విషయం: హిందూ దేవాలయ భూముల రక్షణ, అక్రమణల నివారణ శిధిలావస్థ లో ఉన్న ఆలయాలు పునఃనిర్మాణం మరియు ప్రభుత్వ విధానాల పునఃపరిశీలనపై  వినతిపత్రం*

హిందూ దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయం, ఆధ్యాత్మికతకు ప్రతీకలు. ఈ ఆలయాలకు చెందిన లక్షల ఎకరాల భూములు దేవుని ఆస్తులు, కోట్లాది భక్తుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనాలు. అయితే ప్రస్తుతం ఈ భూముల విషయంలో జరుగుతున్న పరిణామాలు హిందూ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఈ మధ్య ఆకివీడు రామాలయ పునఃనిర్మాణం లో జరిగిన అల్లర్లు, నవమి రోజున జరిగిన దాడులు స్వయంగా స్పీకర్ నే హత్య చేయాలనుకునే ప్రయత్నం  పై యావత్ హిందు సమాజం ఆందోళనకు గురవుతుంది. సంవత్సరాలు గా ఆలయాల పునఃనిర్మాణాలు జరగకపోవడం వలన హిందు సమాజం నష్టపోతుంది. రాష్ట్రంలో శిధిలావస్థలో ఉన్న అన్ని ఆలయాలు పునఃనిర్మించాలి.

హిందు ఆలయాల మొత్తం భూమి సుమారు 4.7 లక్షల ఎకరాలు, 1.5 లక్షల ఎకరాలు అక్రమణకు గురయ్యాయి, అభివృద్ధి పేరు తో 8000 ఎకరాలు ప్రభుత్వం తీసేసుకుంది. లక్షల కోట్ల విలువ చేసే భూములు హిందు ఆలయాల నుంచి  మల్లించబడుతున్నాయి మరియు ఆక్రమించబడుతున్నాయి.

దేవాలయాలకు సంబంధించిన లక్షన్నర ఎకరాలకు పైగా భూములు “ప్రైవేట్ వ్యక్తుల సర్వే నంబర్లలో కలిసిపోయాయి” అనే పేరుతో సరైన ధర్యాప్తు చేయకుండా, ఆ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అత్యంత ఆందోళనకరమైన విషయం. ఇది హిందూ సమాజానికి, ఆలయ రక్షణకు తీవ్రమైన ప్రమాదకరం. ఈ చర్యలు ద్వారా ఆలయాలు తీవ్రంగా నష్టపోతాయి.

అలాగే, GO No. 139 ద్వారా 33 సంవత్సరాల దీర్ఘకాలిక లీజుల పేరుతో అర్బన్ ప్రాంతాల్లో ఉన్న దేవాలయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలనే విధానం కూడా పూర్తిగా వ్యతిరేకించదగినది. ఈ నిర్ణయం వల్లే హిందూ సమాజం కోర్టులను ఆశ్రయించి స్టే ఆదేశాలు తెచ్చుకోవలసిన పరిస్థితి వచ్చింది.

హిందూ ఆలయ భూములు అభివృద్ధి పేరుతో ఇతరుల చేతుల్లోకి వెళ్లడం అంగీకారయోగ్యం కాదు.
హిందూ ఆలయ భూములు ఆలయాలకే చెందాలి ఇదే భారతీయ జనతా పార్టీ స్పష్టమైన అభిప్రాయం. ఇంకా, ఆలయ భూములను ఆక్రమించుకున్న వారికి రెగ్యులరైజేషన్ పేరుతో చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం ఆలోచించడం కూడా అత్యంత ప్రమాదకరం. ఇది అక్రమాలను ప్రోత్సహించడమే అవుతుంది. 

ఆంధ్రప్రదేశ్ లో  కూటమి ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుంది. ఆలయ భూముల రక్షణలో కూడా ఆ పారదర్శకత ఉండాలి. 

ప్రస్తుతం పరిస్థితులు చూస్తే, గత ప్రభుత్వ ఆలోచనలు కొనసాగిస్తూ కొంతమంది అధికారులలో ఆలయ భూములను రక్షించాలనే దృక్కోణం కాకుండా, వాటిని దారి మళ్లించాలి, దోచిపెట్టాలి అనే ధోరణి కనిపించడం హిందూ సమాజాన్ని తీవ్రంగా బాధిస్తోంది. ఇటువంటి వ్యవహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించలేము.

దేవాలయాల ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ, అదే ఆలయాల అభివృద్ధి, పండుగల నిర్వహణకు ప్రభుత్వం సరైన మద్దతు ఇవ్వకపోవడం కూడా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. అలాగే ఆలయ అదాయాల నుంచి కామన్ గుడ్ ఫండ్, అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. 

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది...

• దేవాలయ భూములపై పూర్తి స్థాయి సర్వే నిర్వహించి, ప్రైవేట్ సర్వే నంబర్లలో కలిసిపోయిన భూములపై నిష్పక్షపాత ధర్యాప్తు చేయాలి.
• దేవాలయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేసే నిర్ణయాలను వెంటనే నిలిపివేయాలి.
• GO No. 139 ను పూర్తిగా రద్దు చేయాలి.

• 33 సంవత్సరాల దీర్ఘకాలిక లీజుల విధానాన్ని ఉపసంహరించాలి.

• ఆలయ భూముల ఆక్రమణలను రెగ్యులరైజ్ చేసే ఆలోచనను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి.

• అక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుని భూములను తిరిగి ఆలయాలకు అప్పగించాలి.

• దేవాలయాల ఆదాయం పూర్తిగా అదే ఆలయాల అభివృద్ధికి వినియోగించే విధంగా చట్టపరమైన హామీ ఇవ్వాలి.

• ఆలయాల పండుగల నిర్వహణకు ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయించాలి.

• CGF నిధులతో శిధిలావస్థ ఆలయాలు పునఃరిద్దరించాలి.

• అభివృద్ధి పేరుతో ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకున్న భూమికి తగిన భూమి లేదా నష్టపరిహారం ఆయా ఆలయాలకు ఇవ్వాలి.

ఇది కేవలం వినతిపత్రం కాదు హిందూ సమాజం యొక్క గళం. దేవాలయ భూముల విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఆలయ హక్కుల రక్షణ కోసం ఉద్యమం చేయడం తప్ప మాకు మరే మార్గం ఉండదు. హిందూ ఆలయ భూములు కాపాడాలి అవి ఆలయాలకే చెందాలి అని అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి కోరుచున్నది.



శావల్యాపురం మండలంలో జనతా పార్టీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది

కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశ నిర్దేశం మేరకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు శావల్యాపురం మండల సీనియర్ నాయకులు శ్రీ అడుసుమల్లి వీరేంద్ర గారు, ఈపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు ,వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారు,  పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్ గారి సూచన మేరకు ఈ వారం "జనతా వారధి" కార్యక్రమాన్ని శావల్యాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొత్తలూరు గ్రామంలో స్థానిక బిజెపి నేత శ్రీ దివ్యకోలు నాగేశ్వరావు గారి నిర్వహణలో చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు ఆరు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. గ్రామ రైతులకు ప్రజానీకానికి అత్యంత ముఖ్యమైన కొత్తలూరు గ్రామం నుండి అంగులూరు వెళ్లేటువంటి లింకు రోడ్డు, గుర్రంవారిపాలెం వెళ్లేటువంటి రహదారి, బోడిశంభునివారిపాలెం వెళ్లేటువంటి రహదారులు అత్యంత అధ్వానంగా ఉన్నాయని, ఈ యొక్క రహదారి మార్గాల్లో ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ రైతులకు సుమారు 2000 ఎకరాల వ్యవసాయ భూమి సాగు చేసుకుంటున్నారని, ఎరువులు పొలాలకు తీసుకువెళ్లాలన్న, పంటను ఇంటికి తీసుకొచ్చుకోవాలన్న మోకాలు లోతు గుంతలతోటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కూటమి ప్రభుత్వం మంజూరు చేయాలని దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. అలాగే శావల్యాపురం వెళ్ళేటువంటి రహదారి నిర్మాణం చేపట్టినప్పటికీ ఇంకా ఒక కిలోమీటర్లు నిర్మాణం చేపట్టనందున అది కూడా నిర్మాణం చేపట్టాలని, గ్రామంలో జలజీవన్ మిషన్ పథకం క్రింద మిగిలిన ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వాలని, గత ప్రభుత్వం తీసివేసిన వృద్ధాప్య పెన్షన్లను తిరిగి మంజూరు చేయాలని మొత్తం ఆరు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది, వీటి పరిష్కారానికి బిజెపి పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని అర్జీదారులకు తెలియజేయడం జరిగింది, కార్యక్రమంలో స్థానిక బిజెపి నేత తిరువీధుల శ్రీనివాసరావు గ్రామస్తులు పాల్గొన్నారు.

 
 
*శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు...*

*శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని 52 ఎకరాలు టిడ్కో గృహ సముదాయంలో సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి మరియు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు ముఖ్య అతిథిగా హాజరై, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.*

కమిటీ వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరైన *మర్రి రాజశేఖర్ గారికి కమిటీ సభ్యులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు, నెల్లూరి ఈశ్వర్ రంజిత్ గారు, వరికూటి నాగేశ్వరరావు గారు, దడబడ పుల్లయ్య గారు, సింగరేసు పోలయ్య గారు* *వంకాయలపాటి వంశిధర్ గారు* తదితరులు ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో వారివెంట *నిడమానూరు హనుమంతరావు గారు, నరేంద్ర రెడ్డి గారు, విజయ్ గారు* తదితరులున్నారు.



 
టీడ్కో హోసింగ్ సముదయం లొ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న  మాజీ మంత్రివర్యులు మరియు శాసనసభ్యులు సభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు  గారు...

*శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని 52 ఎకరాలు టిడ్కో గృహ సముదాయంలో సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి మరియు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు  గారు ముఖ్య అతిథిగా హాజరై, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.*

కమిటీ వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరైన *పత్తిపాటి పుల్లారావు గారికి కమిటీ సభ్యులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు, నెల్లూరి ఈశ్వర్ రంజిత్ గారు, వరికూటి నాగేశ్వరరావు గారు, దడబడ పుల్లయ్య గారు, సింగరేసు పోలయ్య గారు* *వంకాయలపాటి వంశిధర్ గారు* *ఇట్టే శివ నాగేశ్వరావు గారు* *బండారు నరేష్ గారు* *గ్రంధి సుబ్బారావు గారు* తదితరులు ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో వారివెంట *తెలుగుదేశం సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా గారు మాజీ మున్సిపల్ చైర్మన్ షైక్ రాఫాని గారు పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమల రవి మున్సిపల్ కౌన్సిలర్ జనసేన నాయకులు బిజెపి నాయకులు తెలుగుదేశం నాయకులు మునిసిపల్ కమీషనర్ శ్రీహరి గారు కాపు నాయకులు అంకిరెడ్డి రమేష్ నాయుడు మిత్రమాండాలి సభ్యులు పురుషోత్తమ్మపట్నం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్ఎస్ఎస్ కమిటీ సభ్యులు విశ్వహిందూ పరిషత్తు సభ్యులు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రమణ్యం గారు తదితరులున్నారు*




లోక్ సభ, అసెంబ్లీ స్థానాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

▪️లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంచాలని నిర్ణయం.
▪️543 నుంచి 816కి పెరగనున్న పార్లమెంట్ స్థానాలు.
▪️4,123 నుంచి 6,185కి పెరగనున్న అసెంబ్లీ స్థానాలు.
▪️తెలంగాణలో 179కి, ఏపీలో 263 కు చేరనున్న అసెంబ్లీ స్థానాలు.
▪️ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టనున్న కేంద్రం.


బిపిఎల్ (దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న) విద్యార్థులకు విద్యా రుణాల లభ్యతను మరింత పెంచాలి

*-ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకంను ఎక్కువగా విస్తరించాల్సి ఉంది*
*-నిబంధనలకు అనుగుణంగా విద్యా రుణాలు ఇవ్వని బ్యాంకర్లపై చర్యలు తీసుకోవాలి*
*-ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విద్యార్థులకు రుణ లభ్యత తక్కువగా ఉంది..  పల్నాడు వంటి వెనుకబడిన ప్రాంతాల్లో ఇది ఎక్కువ*
*ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు కేంద్రం అండగా నిలవాలి*
*-లోక్ సభలో కేంద్రాన్ని ప్రశ్నించిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు* 
*-పిఎం విద్యాలక్ష్మి పథకం డిమాండ్ ఆధారితమైనది.. నిర్దిష్ట కోటా ఏమీ లేదు : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్*
---------------

దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న (బిపిఎల్ ), ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు  ఉన్నత విద్యనభ్యసించటంలో వడ్డీ రాయితీ రుణాల లభ్యత ప్రస్తుతం తక్కువగా ఉందని, వీటిని మరింత విస్తరించాలని, పూచీకత్తు లేని రుణాలు పొందటంలో నిబంధనలు ఉన్నప్పటికీ, పూచీకత్తు కోరుతున్న బ్యాంకులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు ఈరోజు లోక్ సభలో డిమాండ్ చేశారు. రుణాల పంపిణీలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ, రేషన్ కార్డుల వినియోగంతో సహా అర్హత ప్రమాణాలను సరళీకరించాలని ఎంపీ కోరారు. 
భారతదేశంలో ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి (గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో) సుమారు 29.5%కి చేరుకున్నప్పటికీ, కేవలం 4% మంది విద్యార్థులు మాత్రమే రుణాలను పొందగలుగుతున్నారని,  పల్నాడు వంటి వెనుకబడిన ప్రాంతాలలో ఈ లభ్యత మరింత తక్కువగా ఉందని ఎంపీ కృష్ణ దేవరాయలు ఆందోళన వ్యక్తం చేశారు. 
ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం కింద దేశవ్యాప్తంగా వడ్డీ రాయితీ కింద ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్యను లక్షకు పరిమితం చేశారన్నారు. ఉన్నత విద్యలో దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు కేవలం 3,429 సీట్లను మాత్రమే కేటాయించారని, ఇది ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విద్యా అవకాశాలను గణనీయంగా పరిమితం చేస్తోందని, దీన్ని విస్తరించాలని కోరారు. దీనిపై విద్యాశాఖ సహాయ మంత్రి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. పిఎం విద్యాలక్ష్మి పథకం అనేది డిమాండ్ ఆధారితమైనదని,, దీనికి రాష్ట్రాలు, జిల్లాల వారీగా గానీ నిర్దిష్ట కోటా ఏమీ లేదని, ఇది విస్తృత శ్రేణి విద్యాసంస్థలలోని అర్హులైన విద్యార్థులందరికీ అందుబాటులో ఉంటుందని
పేర్కొన్నారు. ఈ పథకం మితమైన వడ్డీ రేట్లతో,  తిరిగి చెల్లింపు నిబంధనలతో హామీ అవసరం లేని రుణాలను అందిస్తుందని, దీనిపై విస్తృత అవగాహన కల్పించి, పథకాన్ని వినియోగించుకోవాలని మంత్రి పేర్కొన్నారు.
ప్రస్తుత నిబంధన లక్ష మంది లబ్ధిదారుకే  ఉన్నప్పటికీ, డిమాండ్‌ను బట్టి దీనిని సమీక్షించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ పథకం కింద ఎటువంటి పూచీకత్తు అవసరం లేదని కూడా మంత్రి పునరుద్ఘాటించారు.



కేంద్రీయ విద్యాలయ ప్రవేశాలు 2026–27:


*ముఖ్యమైన తేదీలు:*
• ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 20 మార్చి 2026 (ఉదయం 10 గంటలకు)
• చివరి తేదీ: 2 ఏప్రిల్ 2026
• 2వ తరగతి పైగా (ఖాళీలు ఉంటే – ఆఫ్‌లైన్): 2–4 ఏప్రిల్ 2026
• మెరిట్ జాబితా: మార్చి–ఏప్రిల్ 2026
• తరగతులు ప్రారంభం: జూన్ 2026

*అర్హత (1వ తరగతి):*
• వయస్సు: 31 మార్చి 2026 నాటికి 6 సంవత్సరాలు ఉండాలి
• ఎటువంటి పరీక్ష / ఇంటర్వ్యూ లేదు
• ఎంపిక లాటరీ విధానం (Draw of Lots) ద్వారా జరుగుతుంది

*ఎలా దరఖాస్తు చేయాలి:*
1. https://kvsangathan.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించండి
2. Admission 2026–27 పై క్లిక్ చేయండి
3. మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకోండి
4. దరఖాస్తు ఫారమ్ నింపండి
5. అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయండి
6. సమర్పించి ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి

*అవసరమైన పత్రాలు:*
• జనన సర్టిఫికేట్
• చిరునామా రుజువు
• కుల ధృవపత్రం (ఉంటే)
• ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (పై తరగతులకు)
• పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

*రిజర్వేషన్ (సీట్లు అందుబాటులో ఉన్నవారు):*
• SC / ST
• OBC
• EWS
• దివ్యాంగులు (PH)

*ఎంపిక విధానం:* 
• లాటరీ (Draw of Lots) ద్వారా ఎంపిక
• ఎంపిక జాబితా ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.



పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా గారికి వినతి పత్రం సమర్పించిన పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్

 పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్లా గారికి రాష్ట్రంలో ప్రధాన సమస్య అయిన సంచార జాతుల కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం క్రోసూరు మండలంలో ప్రధాన సమస్య అయినటువంటి మరుగుదొడ్లు మరియు పంట కాలవల మెయింటినెన్స్ గురించి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారు పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు క్రోసూరు మండల బీజేపీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

గౌరవనీయులైన శ్రీమతి కృతిక శుక్ల 
జిల్లా కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్,
పల్నాడు జిల్లా 

విషయం: రాష్ట్రంలోని సంచార, అర్ధ సంచార మరియు డీనోటిఫైడ్ తెగల (DNTs) వారికి కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి కల్పించవలెనని వినతి.

అమ్మ..

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయినప్పటికీ, రాష్ట్రంలోని సంచార, అర్ధ సంచార మరియు డీనోటిఫైడ్ తెగల (DNTs) వారిని ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా గుర్తించకపోవడం, కుల ధృవీకరణ పత్రాలు లేకపోవడం వల్ల కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు వీరికి అందకపోవడం దురదృష్టకరం.

కేంద్ర ప్రభుత్వం నియమించిన జాతీయ డీనోటిఫైడ్, నామాడిక్ & సెమీ-నామాడిక్ తెగల కమిషన్ సిఫార్సులు మరియు దేశవ్యాప్తంగా ఈ తెగలు ఎదుర్కొంటున్న సమస్యలు (ముఖ్యంగా కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయడంలో ఆలస్యం) దృష్టిలో ఉంచుకుని, ఈ విషయం తక్షణం పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని, ఈ తెగల వారిని గుర్తించి కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసి, ప్రభుత్వం నుండి వచ్చే అన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలను వర్తింపజేయవలసిందిగా మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవపూర్వకంగా కోరుతున్నాం.

                        ఇట్లు
           ఏలూరి శశి కుమార్ 
            పల్నాడు జిల్లా అధ్యక్షులు
      భారతీయ జనతా పార్టీ


బాపూజీ వృద్ధాశ్రమంలో అన్నదానం
యషిక క్షేత్ర పుట్టినరోజు వేడుకలు

చిలకలూరిపేట:

పట్టణానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గోవిందు శంకర శ్రీనివాసన్ తన మనవరాలు యషిక క్షేత్ర పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా స్థానిక చీరాల రోడ్డులో ఉన్న బాపూజీ వృద్ధాశ్రమంలో ఘనంగా అన్నదానం నిర్వహించారు.
ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆశ్రమంలోని వృద్ధులను గోవిందు శంకర శ్రీనివాసన్ స్వయంగా పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన మిత్రులతో కలిసి వృద్ధులకు స్వయంగా భోజనం వడ్డించి సేవాభావాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుమారుడు వెంకట సత్య సాయి కిరణ్ మరియు డాక్టర్ గోవిందు తేజస్విని దంపతుల కుమార్తె అయిన యషిక క్షేత్ర పుట్టినరోజును గౌరవ వృద్ధుల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.వృద్ధుల ఆశీస్సులు చిన్నారి భవిష్యత్తుకు మేలుకలిగిస్తాయని, అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. వృద్ధులందరూ యషిక క్షేత్రను ఆశీర్వదించాలని కోరారు.వృద్ధులను ఆదరించి అక్కున చేర్చుకుంటున్న బాపూజీ వృద్ధాశ్రమం నిర్వాహకులు మురికిపూడి ప్రసాద్, ఆరాధ్యుల రామకృష్ణలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ ఎల్ఐసి ఏజెంట్ అల్లిమియా, షబ్బీర్, తోట లక్ష్మీనారాయణ, వట్టెం శ్రీనివాసరావు, నిమ్మల మురళీకృష్ణ తదితరులు పాల్గొని యషిక క్షేత్రకు శుభాకాంక్షలు తెలియజేశారు.



అనుదీప్ హత్య పై విచారణ జరపాలి హంతకులను అరెస్ట్ చేయాలి - చందు జనార్దన్ 

కుట్ర దారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి -
లేని పక్షం లో చాట్రాయ్ లో నిరవధిక నిరసన చేస్తా—రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్

అంబటి అనుదీప్ హత్య పై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేసిన రాష్ట్ర కాపు జే ఏ సీ అధ్యక్షులు చందు జనార్ధన్.శనివారం విజయవాడ లో ఆయన కాపు జే ఏ సి కార్యాలయం లో  మాట్లాడుతు నూజివీడు నియోజక వర్గం లో చా ట్రాయ్ లో కాపు కుటుంబ సభ్యుడైన అంబటి అనుదీప్ మరణం హత్యేనని మండలం అంతా ఘోషిస్తువుంటే స్థానిక స్టేషన్ అధికారులు చోద్యం చూస్తున్నారని చందు జనార్దన్ ఆరోపించారు.ఈరోజు చట్రాయ్ లో అనుదీప్ యొక్క దశదినకర్మ ను కుటుంబం నిర్వహించిందని అంబటి అనుదీప్ కి సంతాపం తెలుపుతూ వారి కుటుంబానికి కాపు జే ఏ సి పక్షాన సానుభూతిని తెలియ చేశారు.
అనుదీప్ ది హత్యేనని చా ట్రాయ్ పోలీస్టేషన్ లో తండ్రి అంబటి గోపాలరావు ఫిర్యాదు చేశారు.కానీ స్టేషన్ అధికారులు చర్యలు తీసుకోలేదు 
అనుదీప్ హత్యపై మండల నాయకత్వం,మరియు జనసేన నాయకులు జగన్ రాష్ట్ర కాపు జే ఏ సి నాయకత్వం సంఘటన పై వివరించగా బుధవారం వెంటనే 3 గంటలకు అనుదీప్ నివాసానికి వెళ్లడం జరిగింది.కాపు కుటుంబ సభ్యులు మండల నాయకత్వం 300 మంది రావడం వారందరి ఆవేదన వినడం సమావేశం జరపడం జరిగింది 
అనుదీప్ తండ్రి మాట్లాడుతూ తన కుమారుడిని హతమార్చారని,పోలీస్ యంత్రాంగం పూర్తిగా నేరస్తులకు వంత పాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అదే బాటలో అక్కడ ఉన్న అందరూ స్పష్టం చేయడం జరిగింది.
అనుదీప్ హత్య పై సమగ్ర దర్యాప్తు చేయాలి దోషులను కఠినంగా శిక్షించాలి 
 నేరస్తులకు వంత పాడిన స్టేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలి కుట్రలో భాగస్తులను అరెస్ట్ చేయాలని రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్ధన్ నేడు డిమాండ్ చేశారు.
జిల్లా ఉన్నతాధికారులు ఈ అంశాలపై వెంటనే చర్యలు తీసుకొపోతే రాష్ట్ర కాపు జే ఏ సి  చా ట్రాయ్ లో నిరవధిక నిరసన కార్యక్రమం చేపడుతుందని ప్రకటించారు