కోటి రూపాయల విలువైన హషీష్ ఆయిల్ స్వాధీనం – ఒకరి అరెస్ట్*
ఫ్యూచర్ సీటీ కమిషనరేట్ - సురక్ష ప్రతినిధి
తేదీ: 30 మార్చి 2026.
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం పోలీసులు మరియు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) బృందం సమిష్టిగా నిర్వహించిన తనిఖీలలో భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుండి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న దాదాపు 9.402 కిలోల హషీష్ ఆయిల్ (గంజాయి ద్వారా తయారు చేసే నూనె)ను పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ. 1 కోటిగా అంచనా వేశారు.
*నిందితుల వివరాలు:*
A-1: కొరాబు చాంటి బాబు (35 సంవత్సరాలు) – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామరాజు జిల్లా నివాసి (అరెస్ట్)
A-2: రాజారావు (ఒరిస్సా) – పరారీలో ఉన్నారు
A-3: గుర్తుతెలియని వ్యక్తి – పరారీలో ఉన్నారు
పోలీసుల వివరాల ప్రకారం, A-1 చంటి బాబు, A-2 రాజారావు వద్ద నుండి ఈ డ్రగ్స్ను సేకరించి హైదరాబాద్లోని గుర్తుతెలియని వ్యక్తులకు సరఫరా చేయడానికి ప్రయత్నించాడు. మార్చి 29 సాయంత్రం మహేశ్వరం గేట్ బస్ స్టాప్ వద్ద నిలబడి ఉన్న సమయంలో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 10 పాలిథిన్ కవర్లలో ఉన్న హషీష్ ఆయిల్ మరియు 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు చంటి బాబుపై గతంలో ఆంధ్రప్రదేశ్లోని కంచరపాలెం, అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాలలో 4 NDPS కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
*ప్రజలకు విజ్ఞప్తి:*
యువత మరియు విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఫ్యూచర్ సిటీ పోలీసులు సూచించారు. తమ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని కోరారు. డ్రగ్స్కు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే మహేశ్వరం జోనల్ కంట్రోల్: 8712662664 లేదా Dial 100కు సమాచారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ఆపరేషన్లో ప్రతిభ కనబరిచిన అధికారులను పోలీస్ కమిషనర్ శ్రీ జి. సుధీర్ బాబు, ఐపిఎస్ గారు మరియు ఇతర ఉన్నతాధికారులు అభినందించారు.
Post A Comment:
0 comments: