రాష్ట్ర బిజెపి పార్టీ దిశ నిర్దేశం, మేరకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి సూచనల మేరకు, ఈరోజు జనతా వారధి కార్యక్రమాన్ని చిలకలూరిపేట పట్టణ అధ్యక్షుడు కోట పవన్ కుమార్ గాంధీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణ శాఖ కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మరియు జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎడ్లపాడు చెందిన నేలటూరి ఏసురత్నం తన ఆధీనంలో ఉన్న స్థలాన్ని గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో వైఎస్ఆర్సిపి నాయకులు తనకు తెలియకుండానే రెవెన్యూ రికార్డులు మార్పు చేయడంపై ఫిర్యాదు ఇవ్వడం జరిగింది . ఈ ఫిర్యాదుని బిజెపికి సంబంధించిన వెబ్సైట్లో పొందుపరచడం కూడా జరిగింది.
సదరు ఈ విషయంపై ఆర్ ఓ ఆర్ యాక్ట్ ప్రకారము జనతా వారధి టీం ద్వారా ఆర్డిఓ గారికి ఫిర్యాదు చేయటం జరిగింది.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ మాజీ పట్టణ అధ్యక్షుడు దడబడ పుల్లయ్య పట్టణ కార్యదర్శి గుమ్మ బాలకృష్ణ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
Post A Comment:
0 comments: