*విజయవాడలో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మరియు జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు*

 *ప్రజల పక్షాన బీజేపీ - "జనతా వారధి" విజయపథం*
  
​ *విజయవాడలోని బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో, గౌరవనీయులు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారు అధ్యక్షతన నిర్వహించిన "జనతా వారధి" రివ్యూ సమావేశానికి పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు హాజరుకావడం జరిగింది*

 *సమీక్షా సమావేశంలో పలనాడు జిల్లాలో ఇప్పటివరకు జరిగిన జనతా వారిది కార్యక్రమాల గురించి పూర్తి వివరాలు రాష్ట్ర జట్టుకు అందించడం జరిగింది . వాటిని పరిశీలించిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు ను సభాముఖంగా అభినందించడం జరిగింది*

   ​*ఈ సందర్భంగా మాధవ్ గారు "జనతా వారధి" కార్యక్రమ పురోగతిని సమీక్షించి, ప్రజల సమస్యలను మరింత వేగంగా మరియు సమర్థవంతంగా పరిష్కరించడానికి మాకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ ఎలా పని చేయాలో ఆయన విలువైన మార్గదర్శకాలను అందించారు.
4000+ అర్జీల స్వీకరణ వేలాది మంది ప్రజలు మాపై నమ్మకంతో సమస్యలను విన్నవించారు*

​70% పరిష్కార దిశగా అందిన అర్జీలలో అత్యధిక శాతాన్ని సానుకూల పరిష్కారానికి తీసుకెళ్లగలిగాం.
​ప్రతి శుక్రవారం బీజేపీ పార్టీ జిల్లా కార్యాలయాల్లో ప్రజల కోసం మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.
​ప్రజల కన్నీళ్లు తుడిచే వరకు, వారి గొంతుకగా నిలిచే వరకు భారతీయ జనతా పార్టీ  కృషి చేస్తుంది. మీ సమస్యే మా బాధ్యత!
Next
This is the most recent post.
Previous
పాత పోస్ట్
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: