మాచర్ల పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది


మాచర్ల పట్టణంలో దోమలు విపరీతంగా ఉన్నాయని వాటి నివారణకు ఫాగింగ్ నిర్వహించాలని కోరుతూ ఒక ఫిర్యాదు అందింది. గురువారం మాచర్ల బిజెపి పట్టణ ఆఫీస్ లో నిర్వహించిన జనతా వారధి ప్రోగ్రాం లో రెండో వార్డుకు చెందిన శేషగిరి పానయ్య ఈ ఫిర్యాదు ఇచ్చారు. పట్టణ అధ్యక్షుడు ఓర్సు క్రాంతి కుమార్ అధ్యక్షతన జనతా వారధి కో కన్వీనర్లు ఏచూరి సురేష్, శివ కోటయ్య నాయక్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరిగింది. వచ్చిన ఫిర్యాదును మున్సిపల్ కమిషనర్ వేణుబాబు దృష్టికి తీసుకెళ్లి సమస్య వివరిస్తామని ఫిర్యాదు దారుడికి సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు ఎస్సీ మోర్చా ఇంచార్జ్ సజ్జన్ పాల్గొన్నారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: