•బస్సు ప్రమాద బాధితులకు ఆదుకోవాలి
•25 వేల మంది పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి
•ఫారం 7 పై సిట్ విచారణ చేపట్టి కఠినంగా శిక్షించాలి
•వరదముంపును తొలగించేలా చర్యలు తీసుకోవాలి
•పర్చూరు ప్రగతి బాటకు తోడ్పడాలని వినతి
•పలు సమస్యలను సీఎంకి విన్నవించిన ఎమ్మెల్యే ఏలూరి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు భేటీ అయ్యారు. శుక్రవారం సచివాలయంలోని సీఎం చాంబర్ లో ఎమ్మెల్యే ఏలూరి కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఎమ్మెల్యే ఏలూరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా చిలకలూరిపేట పసుమర్రు బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందించి ఆయా కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు.పర్చూరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే గుంటూరు ఛానల్ పొడిగింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే నియోజకవర్గంలో 25వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు అందించాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసేలా గత వైసిపి ప్రభుత్వం లో వైసీపీ నేతలు, అధికారులు ఓటు హక్కును హరించేందుకు పెట్టిన ఫారం 7 దరఖాస్తులపై విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని, అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. వరద సమయంలో పంట ముంపుకు గురి కాకుండా కాలవల మరమ్మత్తులు చేపట్టి డ్రైన్ లను పటిష్టం చేయాలన్నారు. బస్సు ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.ఇళ్ల స్థలాలు, గుంటూరు ఛానల్ పొడిగింపు ,కాలువల మరమ్మత్తులు తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పర్చూరు నియోజకవర్గ ప్రగతికి తన సహకారం అందిస్తానని సీఎం పేర్కొన్నారు. జిల్లాలో పాలనాపరమైన అంశాలను సీఎంకు విన్నవించారు.బాపట్ల జిల్లాను ప్రగతిపథంలో అగ్రభాగంలో నిలిపేందుకు ప్రత్యేక దృష్టి సాధించాలని కోరారు.
ప్రమాద బాధితులకు ఎక్స్గ్రేషియా...
చిలకలూరిపేట మండలం పసుమర్రు వద్ద మే నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని సీఎం చంద్రబాబు ను ఎమ్మెల్యే ఏలూరి కోరారు. బస్సు ప్రమాదం ఘటన తీవ్ర వేదనకు గురి చేసిందని ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారు పర్చూరు నియోజకవర్గం చిన్నగంజాం మండలానికి చెందిన వారిని తెలిపారు.ఆయా కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు. సీఎం కు వివరించిన ప్రధాన సమస్యలు ఇలా...
గుంటూరు ఛానల్ తో సస్యశ్యామలం....
గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు పొడిగించేందుకు యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రిని కోరారు. గుంటూరు ఛానల్ పొడిగింపుతో తాగు, సాగునీరు సమస్య పరిష్కారం అవుతుందన్నారు. 2019లో మన ప్రభుత్వంలో రూ .275 కోట్ల నిధులు మంజూరు చేశామని గుర్తు చేశారు. కానీ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనులను రద్దు చేసిందని పేర్కొన్నారు. ఛానల్ పొడిగింపుతో 50 గ్రామాలకు త్రాగునీరు,50 వేలు ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. గుంటూరు ఛానల్ పూర్తయితే 48 గ్రామాల రూప రేఖలు మారుతాయన్నారు. తక్షణమే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఫారం 7 పై సిట్ ఏర్పాటు...
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వైసిపి నేతలు ఓట్లు తొలగించేందుకు కుట్రలు చేశారని దీనిపై విచారణ చేపట్టేందుకు సిట్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఏలూరి కోరారు. అడ్డదారిలో అధికారం కోసం వైఎస్ఆర్సిపి నేతలు పర్చూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, ప్రతిపక్ష పార్టీకి చెందిన 24 వేల ఓట్లను తొలగించేందుకు ఫామ్ 7 దరఖాస్తులు చేశారని వివరించారు.ఈ కుట్రలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు దాదాపు 600 మంది పనిచేశారని వివరించారు. అన్ని వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఓట్లను తొలగించేందుకు అక్రమ మార్గంలో ప్రయత్నించిన వైఎస్ఆర్సిపి నేతలపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలన్నారు. కుట్రలకు పాల్పడిన వారిపై ఎలాంటి విచారణ జరపకుండా 52 మందిపై తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి కేసును నీరుగార్చారన్నారు. సిట్ ఏర్పాటు చేసి కేసును త్వరగా గతిన చేదించి చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు.
అర్హులందరికీ రెండు సెంట్ల స్థలం....
పర్చూరు నియోజకవర్గంలో 25 వేల మందికి నివాస స్థలాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఏలూరి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. పూర్తి వ్యవసాయ ఆధారిత నియోజకవర్గమైన పర్చూరులో వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. అనేక ఏళ్ళ క్రితం నిర్మించిన ఇళ్లలో రెండు మూడు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, పిల్లలు పెద్ద కావటంతో ఒకే ఇంట్లో జీవనం సాగించడం కష్టతరంగా మారిందని పేర్కొన్నారు. గతంలో నియోజకవర్గ పర్యటనలో ఇళ్ల స్థలాలు ఇస్తానని ఆమె ఇచ్చారని సీఎం చంద్రబాబుకు సందర్భంగా గుర్తు చేశారు. ప్రజా అవసరాల దృష్ట్యా యుద్ధ ప్రాతిపదికన స్థలాలు కేటాయించాలని కోరారు.
వరద ముప్పును అడ్డుకునేలా...
నియోజకవర్గంలో కృష్ణా డెల్టా డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించిన కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాగులు కట్టలు తెగిపోయి, వరద నీరు ప్రవహించేలా లేకపోవడం వల్ల ప్రతి సంవత్సరం 70000 ఎకరాల ఆయకట్టు నీట మునుగుతుంది. పంటలను కాపాడేందుకు తక్షణమే పునరుద్ధరణ చేపట్టాల్సి ఉందన్నారు. ఈ కాలువలన్నీ రొంపేరు డ్రైనేజీ బేసిన్,గుంటూరులోని నల్లమడ డ్రైనేజీ బేసిన్ వ్యవస్థల క్రింద ఉన్నాయని తెలిపారు. డ్రైన్ నీరు ప్రవహించేలా కొన్ని కాలువలు మరమ్మత్తులు చేపట్టాల్సి ఉందని అధికారులు అంచనా వేశారని పేర్కొన్నారు. తక్షణమే పనులు చేపట్టేలా నిధులు మంజూరు చేయాలని కోరారు.
Post A Comment:
0 comments: