తిరుపతి మల్లెల తెలుగుతేజం 

వెంకటగిరి టౌన్ లో భూ కబ్జా...
* ఒక మహిళా దందా!

తమకు చెందిన భూమిని ఆక్రమించి, తమపై హత్యాయత్నం చేసేందుకు ఓ మహిళ ప్రయత్నిస్తోందని, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని వెంకటగిరికి చెందిన కలపాటి రామగోపాల్ విలేఖరులకు వేడుకున్నారు. శనివారం ఆయన మన తిరుపతి ప్రెస్ క్లబ్ లో తమ ఆవేదన వ్యక్తం చేశారు. తాను వెంకటగిరి మండలం, వెంకటగిరి టౌన్, పాత బస్టాండ్, గాజుల వీధి,డోర్.నో 13-51 లో కాపురం ఉంటున్నానని తెలిపారు.  మా తాత ముత్తాతల ద్వారా సంక్రమించిన ఆస్తి అనుభవిస్తూ జీవనం సాగిస్తున్నాను అన్నారు. మా ఆర్ధిక పరిస్థితుల వాళ్ళ సర్వే నంబర్  279 లో గల ఆస్తి కి సంబంధించిన పత్రాలను పెట్టి ఆంధ్ర బ్యాంకు లో 2016 సంవత్సరం ఆగెస్ట్ 6వ తేదిన 3 లక్షలు రుణం మంజూరు చేసుకోవడం జరిగింది. నేను ఆ డబ్బుతో ప్రింటింగ్ మెషిన్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నానని అన్నారు. ఐతే పరిమళ దెవి అనే మహిళ 2018 లొ నా స్థిరాస్తిని అక్రమించి గొడవలు చేయడం మొదలు పెట్టిందని అన్నారు. 2019 లో జూనియర్ సివిల్ కోర్టు, వెంకటగిరి, కేసు నంబర్ 176/2019 ఆశ్రయించాను. అది అలా ఉండగా 2021 సమయం లో ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి మమల్ని మరియు కుటుంబసభ్యులను కూడా భయబ్రాంతులకు గురిచేస్తోంది. మాకు సంబంధించిన డాకుమెంట్స్ ఉన్నాయి అని చెప్పినా కూడా కొంతమంది అధికారులతో కలిసి మరియు వి ఆర్.ఓ. శ్రీనివాసు రావు పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారు అని ఆధారంతో మా కుటుంబాన్ని చంపేస్తాను అంటూ బెదిరించడం తో నేను బయట తిరగడం లేదని తెలిపారు. ఆమె బెదిరిపులకు భయపడి మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పలుమార్లు నాపైన దొంగ కేసులు బనాయించి బెదిరించారని అన్నారు.  ఆమెకున్న డబ్బు బలం మరియు అధికారుల బలంతో నన్ను ఇబంధులు పెడుతున్నారని కన్నీటి పర్యంతం అయ్యారు.. పరిమళ దేవి ఆమె కుమారుడు ఓంకార్ రాజేష్ ల వాళ్ళ ప్రాణాహాని ఉందని, నాకు జిల్లా కలెక్టర్ , జిల్లా SP , సీఎం చంద్ర బాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ,వెంకటగిరి MLA కురుగుండ్ల రామ కృష్ణ  న్యాయం చేయవలసింది గా ప్రార్ధిస్తున్నానని అన్నారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: