సర్కార్ బడుల్లో ఉపాధ్యాయుల తాత్కాలిక సర్దుబాటు! 

హైదరాబాద్:మే 31 ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో మిగులు టీచర్లను అవసరమైన స్కూళ్లకు సర్దుబాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్లో విద్యార్థుల నమోదు సబ్జెక్టుల వారిగా అవసరాలను విశ్లేషించి ఉపాధ్యాయులను జిల్లా పరిధిలోనే సర్దుబాటు చేయడానికి జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఇస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, ఉత్తర్వులు జారీచేశారు. 


సర్దుబాట్లు పూర్తిగా తాత్కా లికమైనవేనని, బదిలీలుగా పరిగణించబోరని పేర్కొ న్నారు. టీచర్ల జీతాలు వారి పాత స్టేషన్ నుండే చెల్లిస్తారని స్పష్టంచేశారు. సర్దుబాటు చేసిన టీచర్లు జూన్ 13లోగా కొత్త పాఠశాలలో రిపోర్టు చేసి విధులను ప్రారంభించాలని సూచించారు. 


జిల్లా కలెక్టర్లు సర్దుబాటు చేసిన టీచర్ల వివరాలను జూన్ 30లోగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు సమర్పించాలని తెలిపారు. మిగులు టీచర్లను గుర్తించే టప్పుడు సీనియారిటీని గుర్తించాలని సూచించారు. గిరిజన ప్రాంత టీచర్లను సాధారణ ప్రాంతాలకు సర్దుబాటు చేయొద్దని సూచించారు.


ప్రభుత్వ స్కూళ్లలో ఉపా ధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1:17గా ఉన్నప్పటికీ, పాఠశాలల వారీగా చూస్తే అసమానతలు ఉన్నాయని గుర్తిం చారు. ఈ సమస్య ను పరిష్కరించడానికి ఈ ప్రమాణాలను అనుసరిం చాలని ఆదేశించారు. 


1)ప్రాథమిక లేదా అప్పర్ ప్రైమరీ విభాగాల్లో 1 నుంచి 10 మంది విద్యార్థులకు ఒక టీచర్, 11 నుంచి 60 మంది విద్యార్థులకు ఇద్దరు, 61 నుంచి 90 మంది విద్యార్థులకు ముగ్గురు, 91 నుంచి120 మంది విద్యార్థులకు నలుగురు, 121 నుంచి 150 మంది విద్యార్థులకు ఐదుగురు, 151 నుంచి 200 మంది విద్యార్థులకు ఆరుగురు, 200 మంది విద్యార్థుల తర్వాత ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలని సూచించారు. 


అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో (6వ, 7వ, 8వ తరగతులు) 1 నుంచి 20 మంది విద్యార్థులకు ఇద్దరు సబ్జెక్టు టీచర్లు అందులో ఒకరు లాంగ్వేజ్, మరొకరు నాన్ లాంగ్వేజ్ టీచర్లు ఉండాలి. 21 కంటే ఎక్కువ మంది విద్యార్థులకు నలుగురు సబ్జెక్టు టీచర్లు ఉండాలని తెలిపారు.

.

Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: