మహానాడు కార్యక్రమంలో హైదరాబాద్, తెలంగాణపై చంద్రబాబు మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి


హైదరాబాద్ అభివృద్ధికి కారణం తానే అని చెప్పుకున్న చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి


చంద్రబాబు మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి.. అలానే మోస పూరితంగా కూడా ఉంటాయి 


పదే పదే హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేసానని చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నాడు


చంద్రబాబువి చెత్త మాటలు కొట్టి వేద్దాం అనుకుంటే, 100 సార్లు అవే చెప్తే ప్రజలు నిజమని నమ్ముతారు 


2004లో చంద్రబాబు దిగిపోయేనాటికి సమైక్యాంద్ర తలసరి ఆదాయం 25,900 కోట్లు


2014లో ఏపీని చంద్రబాబు 5 సంవత్సరాలు పారిపలిస్తే.. కేసీఆర్ గారు 2014 నుండి 2023 వరకు తెలంగాణను పరిపాలించారు 


అప్పుడు మొత్తం భారత దేశంలో ఏ రాష్ట్రంలో రాని అభివృద్ధి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది.. కాని మీరు 5 సంవత్సరాలు ఏపీలో పని చేస్తే అక్కడ తలసారి ఆదాయం మాలాగా పెరగలేదు 


సమైక్య ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయిన నాడు 1,12000 కోట్ల తలసరి ఆదాయం ఉంటే, ఇవాళ 3,60,000 కోట్లకు వచ్చింది.. కాని ఇవాళ్టికి కూడా ని ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2,50,000 కోట్లు మాత్రమే


నిజంగా మీ పరిపాలన గొప్పదే అయితే ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదాయం పెరగలేదు - మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి


Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: