🛕2న వి హెచ్ పి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణ 🛕
కోనసీమ జిల్లా అమలాపురం లో
జూన్ 2వ తేదీన విశ్వ హిందూ పరిషత్ఆధ్వర్యంలో గండువీధి లో వున్నడా. మెట్ల సత్యనారాయణరావు కాపు కల్యాణ మండపంలో నిర్వహించనున్న సహస్ర గళ హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞజరగనుంది.కార్యాచరణ కొరకు నల్లావీధిలో వి. హెచ్. పి జిల్లా అధ్యక్షుడు అక్కిరెడ్డి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన సమావేశం జరిగింది. ఆధ్యాత్మిక వేత్త రేలంగి కుమార్ శంకర్ గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొని సామూహిక పారాయణ వలన భగవంతుని అనుగ్రహం మరింత ఎక్కువగా లభించి, లోక కల్యాణం గావించబడుతుందని అందరూ ఈ అవకాశమును వినియోగించుకోవాలని అన్నారు.మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఆశెట్టి ఆదిబాబు హనుమాన్ చాలీసా పారాయణ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శ్రీరామాలయ, సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు, మహిళలు ఫాల్గొన్నారని
రేలంగి కుమార్ శంకర్ గౌడ్
ఆధ్యాత్మిక వేత్త,
Post A Comment:
0 comments: