⭕ఓట్ల లెక్కింపు కేంద్రంలో.... హైస్పీడ్ ఇంటర్ నెట్ :కలెక్టర్ హిమాన్షు శు క్లా⭕జ్వాల జూన్ 4న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపుదృష్ట్యా లెక్కింపు కేంద్రం శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశా లో హై స్పీడ్ ఇంటర్నెట్ ఏర్పాటు చేస్తున్నట్లు  జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా తెలిపారు. శుక్రవారం ముమ్మిడివరం పరిధి కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలోని శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా స్థాయి అధికారులతో కలిసి తనిఖీ నిర్వహించారు.కౌంటింగ్ కేంద్రా ల్లోనికి ప్రవేశించే మార్గాలు, హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం 360 డిగ్రీల పరిధిలో సీసీ కెమెరాల అమరిక, పోటీలో ఉన్న అభ్యర్థులకు కౌంటింగ్ ఏజెంట్ల సౌకర్యార్థం  తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాట్లు ఇత్యాది అంశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛా యుత వాతావరణంలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా నిర్వహిం చేందుకు అన్ని చర్యలు పకడ్బందీగా చేపట్టినట్లు వెల్లడించారు. కౌంటింగ్ ప్రక్రియ కు సంబంధించి పూర్తి వసతులు సమకూరుస్తున్నట్లు తెలిపారు పోటీలో ఉన్న అభ్యర్థుల ఏజెంట్ల సౌకర్యార్థం 20  తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెం డెంట్ ఇంజనీర్ సురేష్ బాబు ను ఆదేశించారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని ట్రాన్స్కో ఈ ఈ రవికు మార్ ను ఆదేశించారు. హై స్పీడ్ ఇంటర్నెట్ ఏర్పాటు చేయాలని బి ఎస్ ఎన్ ఎల్ ఇంజనీర్లను ఆదేశించారు. ఈ కార్య క్రమంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎస్ శ్రీధర్ పంచాయతీరాజ్ సూపరిం టెండెంట్ ఇంజనీర్ కే చంటిబాబు ఆర్ అండ్ బి ఎస్ సి బి రాము తదితరులు ఫాల్గొన్నారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: