*నగరం లో అనధికార జంతు వధ నిషేధం....*
*- కమీషనర్*

*మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ, ది.17.06.2024న బక్రీదు పండగ సందర్భముగా పట్టణములోని ఆవులు, లేగ దూడలు, పాలిచ్చే గేదెలు మరియు ఇతర నిషిద్ధ పశువులను వధించరాదని కభేళా యజమానుదారులకు తెలియజేయడమైనది. అందుకు భిన్నముగా వ్యవహరించిన వారిపై Prevention of cruelty to animal act, 1960 ప్రకారం తగు చర్యలు తీసుకొనబడునని తెలియజేయడమైనది.*

*రానున్న బక్రీద్ సందర్భంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అందరూ పాటించాలని నగర పాలక సంస్థ కమిషనర్ నిర్మల్ కుమార్ ఒక ప్రకటన లో తెలిపారు. జంతు హింస నివారణ చట్టాల ఉల్లంఘన జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.*

*ఈనెల 17న బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. దీనికి సంబంధించి హైకోర్టు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఇప్పటికే సచివాలయ సిబ్బంది ని బృందాలుగా   ఏర్పాటు చేసి నిఘా పెట్టామని పేర్కొన్నారు.*
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: