పత్రిక ప్రకటన 16.06.2024
ఫర్నిచర్ దొంగ జగన్
చేయని తప్పుకు నాడు కోడెల శివప్రసాదరావును బలితీసుకున్నారు
అనగాని సత్య ప్రసాద్
ప్రతిపక్ష నేత జగన్ ఇంట్లో ఉన్న ప్రభుత్వ ఫర్నీచర్ సరెండర్ చేయకుండా వాడుకుంటుూ వైసీపీ నేతలు నీతులు చెప్పడం సిగ్గుచేటు.గతంలో ఫర్నీచర్ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్, స్వర్గీయ శ్రీ కోడెల శివప్రసాద్ గారిపై అసత్య ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెపుతారు? కోడెల శివప్రసాద్ గారు తప్పు చేసి చనిపోలేదు .వైసీపీ నేతల వేధింపులకు గురై చనిపోయారు. కోడెలది ఆత్మహత్య కాదు వైసీపీ నేతలు చేసిన హత్య నాడు కోడెల శివప్రసాద్ రావుపై లేని పోని నిందలు వేసి మంచి మనిషిని పొట్టన పెట్టుకోవడమే కాక కోడెల కుటుంబాన్ని మొత్తం మానసిక క్షోభ కు గురి చేసారు. K-టాక్స్ అని, ఫర్నిచర్ అని 40 ఏళ్ళు రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం పై లేని మరకలు మోపారు. తన ఇంటి నుండి ఫర్నిచర్ తీసుకెళ్లాలని అప్పటి స్పీకర్ కు రెండు సార్లు కోడెల శివప్రసాద్ లేఖలు రాసినా పట్టించు కోకుండా తప్పుడు కేసులు పెట్టడం మీ కక్ష సాధింపు చర్యలకు నిదర్సనం కాదా ? తాడేపల్లి, లోటస్ పాండ్ ఇళ్లకు రూ.50 కోట్లు సీఎంవో ఖాతాలోవి తీసుకువచ్చి ఫర్నిచర్, ఇతర వసతుల ను తన నివాసంలో అమర్చుకున్నారు . ఆ ఫర్నిచర్ ను తిరిగి అప్పగిస్తానని ప్రతిపక్ష నేత జగన్ ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఒక్క లేఖ కూడా రాయలేదు. ఈరోజు ఆ భగవంతుడు కోడెల కుటుంబాన్ని కడిగిన ఆణిముత్యం లాగా జనాల్లో నిలిపారు. వారి పై నిందలు మోపిన వారి దొంగ బుద్ధిని రాష్ట్ర ప్రజలు మొత్తం తెలుసుకునే విధంగా చేసాడు. కర్మ సిద్ధాంతం ప్రతి ఒక్కరు నమ్మాల్సిందే. జగన్ రెడ్డి కోడెలకి చేసిందే ఈరోజు తనకు తిరిగి వచ్చింది. అది కూడా ఒక్క ముఖ్యమంత్రి గా చేసిన తర్వాత. ప్రజలు జగన్ దొంగ బుద్ధి చూసి నేడు ఛీ కొడుతున్నారు.ప్రజల్లో ఈ అరాచకాలపై చర్చ జరగాలి. జగన్ కి ఏ మాత్రం నైతిక విలువలు న్నా ప్రభుత్వ సొమ్ముతో తన ఇంట్లోకి కొనుగోలు చేసిన ఫర్నిచర్ని ప్రభుత్వానికి అప్పగించాలి.
Sd/
అనగాని సత్య ప్రసాద్
రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి వర్యులు
Post A Comment:
0 comments: