_విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలల్లో 25శాతం పేద విద్యార్థులకు విద్యనందించాలి.రాష్టంలో ప్రైవేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా నిబంధనలకు విరుద్ధంగా యూనిఫాం,పాఠ్యపుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి "వేల రూపాయలను" తీసుకుంటున్నా..సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నా అధికారులు "చోద్యం" చూస్తున్నారు.విద్యాహక్కు చట్టం ప్రకారం 25శాతం పేద,మధ్య తరగతి విద్యార్థులకు సీట్లు కేటాయించాలని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని ఎక్కడా అమలుపర్చడం లేదు.అమలుపర్చని పాఠశాలలపై చర్యలు తీసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎం.ఈ.వో పోస్టులను వెంటనే భర్తీ చేయాలి._
*_మాజీ సైనికుడు_* *_దుగ్యాని:వెంకటేష్,పాలెం గ్రామం,నాగర్ కర్నూల్ జిల్లా
Post A Comment:
0 comments: