*యువ సమాజ్ నిర్మాణ్ స్వచ్ఛంద సేవా సంస్థ చే కిడ్నీ సమస్య బాధితునికి ఆర్థికసాయం*
(16-06-2024) మల్లెల తెలుగుతేజం న్యూస్ : ఏర్పేడు మండలం పాత వీరారాపురం గ్రామం హరిజనవాడకు చెందిన అద్దూరు లక్ష్మమ్మ అల్లుడు కె సుబ్రమణ్యం డయాలసిస్(కిడ్నీ సంబంధిత వ్యాధితో గత కొద్ది రోజులుగా బాధపడుతున్నారు వారి కుటుంబ సభ్యులు యువ సమాజ్ నిర్మాణ్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులను ఆర్థిక సహాయం కోరగా సంస్థ ప్రతినిధులైన వ్యవస్థాపకులు మరియు NJP ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి డాక్టర్ గానుగ పంట రమేష్ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు తాళిక్కాల్ వెంకటేశ్వర్లు మానవతా హృదయంతో స్పందించి అతని ఆరోగ్య ఖర్చుల నిమిత్తం 2000 వేల రూపాయల చెక్కును సంస్థ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులైన వారికి అందించడం జరిగింది
ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన దాతలు వెంకట కన్నయ్య మరియు కన్నలి మోహన్ రెడ్డి మరియు సేవా సంస్థ సభ్యులకు మరియు అందరికీ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు డాక్టర్ గానుగపెంట రమేష్ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు తాళిక్కాల్ వెంకటేశ్వర్లు మరియు సభ్యులు చిరంజీవి,లోక నాదం,శివ,రుద్ర గారు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: