పాడేరు తెదేపా కార్యాలయం.కూటమి నాయకులు జనసేనపార్టీ ఇన్చార్జ్ డా..వంపూరు గంగులయ్య,తెదేపా ఇన్చార్జ్ శ్రీమతి గిడ్డి ఈశ్వరి,తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిల్లో రమేష్ నాయుడు మరియు తదితర నాయకులు పాత్రికేయులతో మాట్లాడుతూ
వైసీపీ విముక్తాఆంధ్రప్రదేశ్ లో భాగంగా రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ గౌరవ నారాచంద్రబాబు నాయుడు గారు నిన్న కొన్ని ముఖ్యమైన పైల్స్ పై సంతకం చేశారు అందులో భాగంగా యువతకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ మెగా డిఎస్సి పై సంతకం చేయడం కూటమి ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనంగా చెప్పవచ్చని డా..గంగులయ్య గారన్నారు. కూటమి ఆలోచన విధానానికి పవన్ కళ్యాణ్ గారి వ్యూహాత్మక రాజకీయ  విధానంతో ఇవ్వాళ రాష్ట్ర ప్రజలందరూ ఆమోదించారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబుగారు ఏదైతే ఎన్నికలలో హామీ ఇచ్చారో మొదటి సంతకం తోనే తమ నిజాయితీని సాటుకున్నారు.ఈ మెగా డిఎస్సి పై ఈ రోజు పనిలేని వైసీపీ నాయకులు అనేక దుష్ప్రచారాలు చేస్తూ నిరుద్యోగ యువతకు లేని పోనీ గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నది.అది సహజంగానే వారికి వుండే పచ్చకామెర్ల బుద్ది.అనేక అవినీతి,దోపిడీ,భూ కబ్జాలు,వారి సహజ నైజాంలో భాగంగా ఈరోజు నిరుద్యోగ యువతకు కూడా తప్పుదోవ పట్టిస్తున్నది ప్రజలందరూ తిరస్కరించినప్పటికి కూడా వారికుండే సహజ లక్షణంతో ఇటువంటి అసంబంధ వాక్యాలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు.రాష్ట్రమంతా నిరుద్యోగ యువత ఆనందపడతావుంటే దీనిని జీర్ణించుకోలేని వైసీపీ శ్రేణులు జీవో నెం3 పై స్పష్టత ఏది అంటూ రకరకాల సందేహాలు లేవనెత్తుతున్నారు అసలు గిరిజన నిరుద్యోగుల కడుపు కొట్టింది వైసీపీ పార్టీనే కదా ఆ విషయం గిరిజన యువత గుర్తుంచుకోలేదులే అనుకున్నారో ఏమో  గడిచిన కాలంలో జీవో నెం 3పై ఏదైనా స్పష్టమైన వైఖరిని ప్రకటించిన పాపాన పోలేదు  వైసీపీ పార్టీ హయాంలో కాబట్టి గిరిజన యువత ఒకటే గుర్తుంచుకోవాలి.ప్రస్తుత మన   ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అరకు లో జరిగిన సభలో స్పష్టంగా జీవోనెం3 పై హామీ ఇచ్చారు ఈ జీవో నెం3 తెదేపా ప్రభుత్వమే తీసుకొచ్చింది కచ్చితంగా మేమే అధికారంలోకి వస్తే జీవోనెం3 పునరుద్ధరణ చేసే దిశగా లేదంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు కాబట్టి గిరిజన నిరుద్యోగులు ఎటువంటి గందరగోళానికీ గురికావద్దు వదంతులు నమ్మవద్దు మెగా డిఎస్సి నోటిఫికేషన్ పూర్తి స్థాయి మార్గదర్శకాలు వెలువడిన తర్వాత పరీశీలన చేసి మా వంతు బాధ్యతగా ప్రభుత్వానికి తప్పకుండా తెలియజేస్తాము అప్పటివరకు కాలాన్ని సద్వినియోగపరుచుకుని గిరిజన యువత మెగా డిఎస్సి పై దృష్టి కేంద్రీకరించాలన్నారు.ఈ పాత్రికేయ సమావేశంలో పలువురు జనసేనపార్టీ నాయకులు నందోలి మురళి కృష్ణ,సుర్ల సుమన్,ముదిలి సుబ్బారావు,కించే ప్రసాద్,అశోక్ సాలేబు పలువురు తెదేపా నాయకులు పాల్గొన్నారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: