ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుంది. 

ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. 

ఉదయం 8.30 కి EVM ల కౌంటింగ్ ప్రారంభిస్తారు. 

కాగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలో ఉన్న 2387 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 

25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న 454 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

 అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ స్థానంలో పోటీలో ఉన్న 46 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 

అత్యల్పంగా చోడవరంలో ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ చేశారు. 

అత్యధికంగా విశాఖ పార్లమెంటు బరిలో 33 మంది అభ్యర్థులు… 

రాజమండ్రి పార్లమెంటు పరిధిలో అత్యల్పంగా  12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 

తొలి ఫలితం  నరసాపురం, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 రౌండ్లతో వెల్లడవ్వనుంది. 

 రంపచోడవరం, చంద్రగిరి నియోజకవర్గాల్లో 29 రౌండ్లతో చివరిగా ఫలితం వెలువడనుంది. 

భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రౌండ్లు కౌంటింగ్ జరుగుతుంది. 

రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు వెలువడే విధంగా చర్యలు చేపట్టారు అధికారులు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: