⭕పొగాకు వల్ల కలిగేనష్టాలు పై ర్యాలీ ⭕కోనసీమ జిల్లా లోని అమలాపురం- కిమ్స్ దంత వైద్యకళాశాల లో ఓరల్ అండ్ మాక్సిల్లోఫేసియల్ సర్జరీ ఆధ్వర్యంలో "ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవము" నిర్వహించారు. ఈ సందర్భముగా ప్రజలలో పొగాకు గురించి, పొగాకు వల్ల కలిగే నష్టాలు గురించి అవగాహన తెలియచేస్తూ ర్యాలీ చేయటం జరిగింది. ఇందులో ఏపీ ఏ ఓ ఎమ్ ఎస్ ఐ మరియు ఐ డి ఏ కోనసీమ వారి సౌజన్యం తో దంత కళాశాల లో పొగాకు వ్యతిరేక దినోత్సవం మీద వివిధ రకమైన పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వటం జరిగినది. ఇందులో కిమ్స్ చైర్మన్ కే.వి.వి.సత్యనారాయణ రాజు,ఎమ్ డి కే.రవి వర్మ, దంత వైద్యశాల ఎం.డి,శేష పవిత్ర , ప్రినిసిపాల్ కే.శివ కుమార్, డిపార్టుమెంట్ హెడ్ కే.అర్జున్ గోపినాథ్, ,ఐ డి ఏ కోనసీమ బ్రాంచ్ దంత వైద్యులు తదితరులు పాల్గున్నారు.
Post A Comment:
0 comments: