*22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ..నోటిఫికేషన్ జారీ*
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానున్నాయి.
గవర్నర్ ప్రసంగంతో ఉభయసభల సమావేశాలు మొదలవనున్నాయి.
ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు.
అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఉన్నతాధికారులుతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమావేశమయ్యారు.
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించారు.
ఈ నెల 22వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఐదురోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
మొదటిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండనుంది.
అనంతరం ప్రశ్నోత్తరాలు, శ్వేత పత్రాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు.
Post A Comment:
0 comments: