నిజాయతీ పరులపై నిందలేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని నిరాధార ఆరోపణలతో వార్తలు రాయడం మానుకొని చీరాల లో వున్న సమస్యలపై కథనాలు రాయాలని చీరాల జనసేన,బీజేపీ నాయకులు అన్నారు..
సోమవారం చీరాల రోటరీ క్లబ్ లో సాక్షి పేపర్ లో వచ్చిన చీరాలలో కొండంత అవినీతి కథనాన్ని ఖండిస్తూ విలేఖరుల సమావేశం నిర్వహించారు...
ఈ కార్యక్రమంలో బిజెపి జనసేన నాయకులు మాట్లాడుతూ చీరాల శాసన సభ్యులుగా మద్దులురి మాలకొండయ్య గెలిచి కనీసం నెల కూడా కాకముందే వైసీపీ నాయకులు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని సముద్రంలో పడి చనిపోతున్న యువకుల కుటుంబాల ఆక్రందన ఈ నాయకులకు కనిపించడంలేదా అని ప్రశ్నించారు ...
పనిచేసే నాయకుడు వున్నప్పుడు ప్రజా సమస్యలపై కథనాలు ప్రచురిస్తే సమస్యలు పరిష్కరిస్తారని ఇలాంటి తప్పుడు కథనాలు రాసి జర్నలిస్టుల గౌరవం కొల్పోవద్దని అన్నారు...
రిసార్ట్స్ కు వచ్చిన యువత సముద్రంలో దిగి చనిపోతుంటే ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా తీసుకున్న చర్యలలో భాగంగా చీరాలలో కూడా కాస్త కఠినంగా వ్యవహరించారని నాయకుడికి ప్రజా శ్రేయస్సు ముఖ్యమని అన్నారు..
ప్రజలకు మంచి చేస్తుంటే హర్శించాల్సింది పోయి బురద చల్లడం సరికాదని చీరాల అభివృద్ధికి సూచనలు చెయ్యాలని వైసీపీ నాయకులనుద్దేశించి హెచ్చరించారు ..
బీసీ నాయకుడి గెలుపును ఓర్చుకోలేక తప్పుడు కథనాలు తమ మీడియాలో ప్రచురిస్తే అభసుపలౌతారని ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు...
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజా సమస్యలపై కథనాలు ప్రచురించాలని,తప్పుడు రాతలు మానుకోవాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు మువ్వల వెంకటరమణారావు, అరవపల్లి కుమార్, బిజెపి పట్టణ అధ్యక్షుడు నాగేశ్వరరావు, యువమోర్చా నాయకుడు మణి, జనసేన నాయకులు: చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు జనసేన సీనియర్ నాయకులు మామిడాల శ్రీనివాసరావు, ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గూడూరు శివరాం ప్రసాద్,ప్రోగ్రాం కమిటీ మెంబర్ పాలవల శ్రీనివాస్, వీర మహిళ కారంపూడి పద్మిని, మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment:
0 comments: