చీరాల నియోజకవర్గం చీరాల మండలం దేవాంగపురి నందు దేవాంగ కళ్యాణ మండపం నందు హ్యాండ్లూమ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారిని ఆహ్వానించి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ వారు ఎదుర్కొంటున్న బాధలు వివరిస్తూ ఈపురుపాలెం నుండి పందిళ్లపల్లి వరకు మాస్టర్ వీవర్స్ వద్ద 50 కోట్ల రూపాయలు పైగానే చేనేత వస్త్రాలు నిల్వ ఉన్నాయని వాటిని ఆప్కో ద్వారా కొనుగోలు చేయించి చేనేత కార్మికులకు ఉపాధి చూపించాలని, నిల్వలు పేరుకుపోయి కార్మికులకు పని కల్పించలేకపోవటం వలన వారు ఇబ్బందులు పడుతున్నారని తక్షణం నిల్వ ఉన్న వస్త్రాలను కొనుగోలు చేసినచో చేనేత కార్మికులకు మేలు జరుగుతుందని మాస్టర్ వీవర్స్ వెల్లడించడం జరిగినది. అనంతరం మాస్టర్ వీవర్స్ యం.యల్.ఏ కొండయ్యగారిని ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ సందర్భంగా తనకు జరిగిన సన్మానానికి కృతజ్ఞతలు తెలుపుతూ చేనేత కార్మికులకు, వ్యాపారులకు ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటానని వారి ఉపాధికి వారి మనుగడకు వారి సంక్షేమానికి తగు శ్రద్ధ తీసుకుంటానని త్వరలో చేనేత జౌళి శాఖ మినిస్టర్ గారి దృష్టికి తెలియపరుస్తానని కార్మికుల కష్టాలు, వ్యాపారుల సమస్యలు వారి సంక్షేమానికి పలు చర్యలు చేపట్టవలసిన ఆవశ్యకత ఉన్నదని శ్రీ మద్దులూరు మాలకొండయ్య తెలిపారు.
Post A Comment:
0 comments: