ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గ కాపు నాయకులైన సుంకర రమేష్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియామకం చేయడమైనది
: కాపుల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రముఖ కాపు నాయకులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర రమేష్ తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న సుంకర రమేష్ తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన విజయవాడ తూర్పు నియోజకవర్గ కాపు నాయకులకు రాష్ట్ర కమిటీ వారికీ జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు కాపునాడు నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని కాపునాడు సేవా సమితి చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి వారి హక్కుల సాధన కోసం కమిటీ వారు తీసుకునే అన్ని నిర్ణయాలను తూచా తప్పకుండా ఎన్టీఆర్ జిల్లా లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు
Post A Comment:
0 comments: