ఏపీలో 16,347 టీచర్ ఉద్యోగాల జాతర మొదలు
ఏపీలో 16,347 టీచర్ ఉద్యోగాలను మెగా డిఎస్సీ ద్వారా ప్రభుత్వం భర్తీ చేస్తోంది. ఇటీవల దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. 3.35 లక్షల మంది అభ్యర్థులు అన్ని పోస్టులకు కలిపి 5.77 లక్షల దరఖాస్తులు చేశారు. అత్యధికంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 73,605 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 20 నుంచి ప్రభుత్వం మోడల్ పరీక్షల నిర్వహించనుంది. ఈ నెల 30 నుంచి హాల్ టికెట్లు జారీ చేయనుండగా, జూన్ 6 నుంచి జులై 6 వరకు పరీక్షలు జరగనున్నాయి.
Post A Comment:
0 comments: