హైదరాబాద్ మెట్రో రైలు టిక్కెట్ ధరలు భారీగా పెంపు!


హైదరాబాద్ మెట్రో సంస్థ రైల్ టికెట్ ధరలను పెంచుతూ ఎల్‌అండ్‌టీ మెట్రో నిర్ణయం తీసకుంది. పెరిగిన ధరలు ఈరోజు నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. 


ప్రస్తుతం కనిష్ఠ ఛార్జీ రూ. 10 ఉండగా.. దాన్ని రూ. 12కు పెంచారు. ఇక గరిష్ఠ ఛార్జీ రూ. 60 ఉండగా.. దాన్ని రూ. 75కు పెంచారు. పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల కారణంగా మెట్రో ఛార్జీలు పెంచినట్లు తెలు స్తోంది. కొవిడ్ మహమ్మారి కారణంగా ప్రయాణికుల సంఖ్య తగ్గడం వల్ల మెట్రో నష్టాల్లో కూరుకుపోయిం దని గతంలోనే మెట్రో అధికారులు వెల్లడించారు.


దానికి తోడుగా..రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా మెట్రో రైలు ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఛార్జీలు పెంపు ఒక్కటే మార్గంగా మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 


ఈ ఛార్జీల పెంపు వల్ల మెట్రో రైలు సంస్థకు అదనంగా రూ.150 - రూ.200 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఛార్జీల పెంపు మెట్రో సేవలను కొనసాగిం చడానికి, మౌలిక సదు పాయాలను మెరుగు పరచడానికి సహాయప డుతుందని అధికారులు భావిస్తున్నారు. 


అయితే ఈ నిర్ణయం సామాన్య ప్రయాణికులపై ఆర్థిక భారం మోపనుంది. ఇప్పటికే నిత్యవసర ధరలు ఆకాశన్నంటుతుండగా.. మెట్రో ఛార్జీల పెంపు వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టనుంది.


కాగా, మెట్రో రైల్వేస్ చట్టం 2002లోని సెక్షన్ 34 ప్రకారం, చార్జీల సవరణ స్వరూపాన్ని సిఫార్సు చేసేందుకు హైకోర్టు మాజీ జడ్జి సారథ్యంలో ఫేర్ ఫిక్సేషన్ కమిటీ (FFC) ఏర్పాటైందని మెట్రో అధికారులు ప్రకటన విడుదల చేశారు.

Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: