నిమిషం ఆలస్యమైనా ఈఏపీసెట్కు అనుమతి నిరాకరణ
ఈ నెల 19 నుంచి 27 వరకు నిర్వహణ
ఏపీ ఈఏపీసెట్-2025 కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆ సెట్ చైర్మన్, జేఎన్టీయూకే వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్, కన్వీనర్ వీవీ సుబ్బారావు తెలిపారు. కాకినాడలో శుక్రవారం వారు విలేకర్లతో మాట్లాడారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు మే 19, 20 తేదీల్లో, ఇంజినీరింగ్ విభాగానికి 21 నుంచి 27 వరకు 14 సెషన్లలో పరీక్షలు ఉంటాయని పేర్కొ న్నారు. మొత్తంగా 3,62,429 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. పరీక్ష కేంద్రానికి నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 143, హైదరాబాద్, సికింద్రాబాద్లలో రెండు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్ల డించారు. ఉర్దూ మాధ్యమం ఎంచుకున్న వారికి కర్నూలులో కేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈఏపీసెట్ రోజే ఇతర జాతీయస్థాయి పరీక్ష ఉంటే, సంబంధిత ధ్రువపత్రాలతో తమను సంప్రదించాలని, పరీక్ష తేదీ మారుస్తామని తేలిపారు. http://cets.apsche.ap.gov.in helpdeskapeapcet@apsche.org 0884-2342499 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. 0884-2359599,
Post A Comment:
0 comments: