గౌరవ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి ఘనంగా స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్, ఎస్పీలు
గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి జిల్లా కలెక్టర్ శ్రీ వినోద్ కుమార్ వి IAS గారు, జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు శనివారం ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక జెఎన్టీయులో ఈరోజు జరుగుతున్న స్నాతకోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు గవర్నర్ గారు శనివారం అనంతపురం చేరుకున్నారు. రైలు మార్గంలో విచ్చేసిన గవర్నర్ గారికి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు స్థానిక రైల్వేస్టేషన్లో స్వాగతం పలుకుతూ పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం జిల్లా పోలీసు సాయుధ బలగాల బృందం గవర్నర్ గారికి స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో గౌరవ వందనం చేశారు.
Post A Comment:
0 comments: