తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన గౌరవ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గారు


 తెలంగాణ ప్రయోజనాల కోసం ఆనాడు కేంద్ర మంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా


తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గౌరవ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం  ఆనాడు కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి పోరాటానికి సిద్ధమయ్యారు. 2001 లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చొడో నినాదంతో 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత జూన్ 2 2014 న స్వరాష్ట్రం సాధించబడిందని అన్నారు. సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా 10 సంవత్సరాలు అభివృద్ధి సాగిందని కానీ ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: