కోనసీమఅంబాజీపేటలో 80 కిలోల పనస పండు
పనసకాయ బరువు విషయానికి వస్తే సాధారణంగా 20 నుంచి 25 కిలోలు ఉంటాయి. ఏకంగా నిలువెత్తు మనిషి బరువంత భారీ పనసను చుడండి.
అందరూ ఎంతో ఇష్ట పడి తినే వాటిల్లో పనస పండు కూడా ఒకటి. ఒకరి ఇంట 80 కిలోల పనస పండింది. అంతే, కాదు.. ఆ పండు ఇప్పుడు ప్రపంచ రికార్డు కొట్టేయబోతోంది..
అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో అబ్బుర పరుస్తోందీ భారీ పనస పండు. 80 కిలోల బరువు భారీ పొడవున ఉన్న పనస పండు అందరిని ఆకట్టుకుంటుంది. పి.గన్నవరం లంకలలో ఉండే చెట్ల నుంచి పనస పండు తెచ్చామని పళ్ళ వ్యాపారి చెబుతున్నారు. సాధారణంగా 25,30 కేజీలు బరువు మాత్రమే పనసపండు వుంటుంది. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న ఈ పనస ఏకంగా 80 నుండి 90 కేజీల బరువు ఉందని చెబుతున్నారు.
తాము 30 ఏళ్లుగా పళ్ళ వ్యాపారం చేస్తున్నామని కానీ ఇంత పెద్ద పనస పండు ఎప్పుడు చూడలేదు అంటున్నారు పళ్ళ వ్యాపారి. అయితే ఒక పనసపండును ఏకంగా ముగ్గురు మోసుకు రావడం అందరిని ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది. ఇంత పెద్ద పనస పండును పల్ల ప్రియులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ పనస పండులో సుమారు 800 నుండి 900 పనస తొనలు ఉంటాయని వ్యాపారి ప్రభు చెబుతున్నారు. విక్రయానికి పెట్టిన ఈ పనస పండు ధర ఎంత అని అడిగి తెలుసుకుని షాక్ గురై వెళ్తున్నారు స్థానికులు.
పనస పండుతో ఒక్కటేంటీ చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వేసవిలో తినే వాటిల్లో పనసపండు కూడా ఒకటి. ఇందులో కూడా వాటర్ కంటెంట్, ఫైబర్ శాతం అధికంగా ఉంటుంది. ఎలాంటి వారైనా పనస పండును తినొచ్చు. పనస పండులోని ప్రతి భాగంలో కూడా చాలా లాభాలు ఉన్నాయి.
Post A Comment:
0 comments: