✅రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మత్స్యకారులు మృతి✅.

    కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం జొన్నాడ - మండపేట ఆర్ అండ్ బి రోడ్డుపై గుమ్మిలేరు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆలమూరుకు చెందిన ఇద్దరు మత్స్యకారులు సంఘటన స్థలంలోనే మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలైనట్లు ఆలమూరు ఎస్సై ఎల్ శ్రీను నాయక్ తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం ఆలమూరు గ్రామానికి చెందిన లంకె సూరిబాబు(49), వనమాడి సాయిబాబు(62) మరికొందరు మత్స్యకారులతో కలిసి బొలెరో వాహనంలో తుంగపాడు చెరువులో చేపల వేటకు వెళ్ళుచుండగా స్థానిక జయలక్ష్మి రైస్ మిల్ సమీపంలో పౌర సరఫరాల శాఖకు చెందిన ట్రాక్టర్ మండపేట నుండి ఆలమూరుకు వస్తుండగా బొలెరో, ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీ కొనడంతో బొలెరో తొట్టెలో ఉన్న సూరిబాబు, సాయిబాబు సంఘటన స్థలంలోనే మృతి చెందగా డ్రైవర్ పక్కన కూర్చున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలవ్వగా మరికొందరికి స్వల్ప గాయాలు అయినట్లు ఆయన తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించగా, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీను నాయక్ తెలిపారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: