*ఎన్‌హెచ్‌ఏఐ టోల్‌ప్లాజాల వద్ద టోల్‌ రుసుములు జూన్‌ 3 ఆదివారం అర్ధరాత్రి నుంచి పెరగనున్నాయి*.


ఎన్‌హెచ్‌ఏఐ టోల్‌ప్లాజాల వద్ద టోల్‌ రుసుములు జూన్‌ 3 (ఆదివారం అర్ధరాత్రి) నుంచి పెరగనున్నాయి.

ఏటా ఏప్రిల్‌ 1న టోల్‌ రుసుముల ధరలు పెంచుతుండగా.. ఈసారి లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశించింది. చివరి విడత పోలింగ్‌ జూన్‌ 1న ముగియడంతో టోల్‌ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ ఎన్‌హెచ్‌ఏఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రుసుముల పెంపు సగటున 5 శాతం వరకు ఉంటుంది. పెంచిన ధరలు 2025 మార్చి 31 వరకు అమలులో ఉంటాయి. 

హైదరాబాద్‌-విజయవాడ (65) జాతీయ రహదారిపై  జీఎంఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణలోని చౌటుప్పల్‌ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒక వైపు ప్రయాణానికి రూ.5, ఇరువైపులా కలిపి రూ.10, తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒక వైపు ప్రయాణానికి రూ.10, ఇరువైపులా కలిపి రూ.20, బస్సులు, ట్రక్కులకు ఒక వైపు ప్రయాణానికి రూ.25, ఇరువైపులా కలిపి రూ.35, భారీ రవాణా వాహనాలకు ఒక వైపు ప్రయాణానికి రూ.35, ఇరువైపులా కలిపి రూ.50 వరకు పెంచారు. స్థానికుల నెలవారీ పాస్‌ రూ.330 నుంచి రూ. 340కి పెంచారు. 
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: