🚲వాకర్స్ క్లబ్ఆధ్వర్యంలో వరల్డ్ సైకిల్ డే 🚲వరల్డ్ సైకిల్ డే సందర్భంగా వాకర్స్ క్లబ్ సభ్యులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్తంభం వద్ద నుండి నల్ల వంతెన, ఎర్ర వంతెన, శ్రీ వేంకటేశ్వర స్వామి గుడి మార్గం ద్వారా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు.చివరగామహాత్మా గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని, నిత్యం సైకిల్ ఉపయోగించుట కూడా మన ఆరోగ్య పరిరక్షణలో ఒక భాగమని, విశ్రాంత బ్యాంకు అధికారి పేరి నరసింహం మాట్లాడుతూ... తక్కువ దూరం వెళ్ళే వారు సైకిల్ ఉపయోగించుట మంచిదని తెలిపారు.ఈ కార్యక్రమం లో వాకర్లు పి ఎల్ నరసింహం,ఆర్. విశ్వనాధం,వై. ఎస్ ఎన్ మూర్తి,వి వి ఆర్ నాయుడు,పి వి రమణ, మాడా రాము, కె. త్రినాధ్, పి వి ఆర్ నాయుడు,, పి కె. కామే శ్వరావు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: