*
*జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జీలాని సమూన్*
పొరపాట్లకు తావివ్వకుండా కేటాయించిన విధులు నిర్వహించాలని, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సక్రమంగా చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జీలాని సమూన్ ఎన్నికల అధికారులు, సిబ్బందికి సూచించారు.
గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆర్ఓలు, ఎఆర్ఓలు, సూపర్వేజర్లుకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియపై ఆచరణాత్మకంగా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జీలాని సమూన్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికల 2024 సంబంధించి జిల్లాలో ఎలాంటి సంఘంటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికల నిర్వహించిన అందరికి ధన్యవాదాలని తెలిపారు, ఎన్నికల నిర్వహణ స్ఫూర్తితో ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా విజయవంతంగా నిర్వహించాలన్నారు.
జూన్ 4న ఉదయం 6 గంటలకు శివాని ఇంజనీరింగ్ కళాశాల కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని అనంతరం 8 నియోజకవర్గాల కౌంటింగ్ హాళ్లలో ఈవీఎంల ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుందన్నారు.
పార్లమెంటు నియోజకవర్గం కౌంటింగ్ హాలు వద్ద ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, ఇందుకోసం పార్లమెంట్ కి 30టేబుళ్ళు, అసెంబ్లీకి 3 లేక 4 టేబుళ్ళు ఏర్పాటు చేయనున్నట్లు, ఒక్కో టేబుల్ కు 500 చొప్పున పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి టేబుల్ కు పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఆయన వివరిస్తూ ఇందులో రెండు కవర్లు ఉంటాయని, బయటి కవర్ ని ఫారం 13-సి గా పిలుస్తారని, దానిని తెరిచిన తర్వాత రెండు డాక్యుమెంట్లు ఉంటాయని, అందులో ఒకటి డిక్లరేషన్ 13-ఏ, ఇంకొకటి 13-బి కవరులో వాస్తవ పోస్టల్ బ్యాలెట్ ఉంటుందన్నారు.
డిక్లరేషన్ 13-ఏ లో తప్పనిసరిగా ఓటరు సంతకం చేసి ఉండాలని, దానితోపాటు గెజిటెడ్ అధికారి ధృవీకరించి సంతకం చేసి స్టాంపు వేయడం లేదా హోదాని రాసి ఉండాలని, అలా ఉంటేనే అది చెల్లుబాటు బ్యాలెట్ ఓటుగా పరిగణించాలన్నారు. చెల్లుబాటుకాని ఓట్లు ఏవైనా ఉంటే 13-సి కవర్లో ఉంచి తిరస్కరిస్తూ వేరుగా పెట్టెలో ఉంచడం జరుగుతుందన్నారు. ఓట్లు లెక్కింపు కేంద్రంలో కి సెల్ ఫోన్స్ కు అనుమతిలేదన్నారు. లెక్కింపు ప్రక్రియలో సమస్యలు ఉత్పన్నమైతే పరిష్కారానికి సానుకూలంగా స్పందించాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో పాటించాల్సిన ఆయా విషయాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు.
ఓట్లు లెక్కింపు కేంద్రంలోకి ఆర్ ఓ లు, ఎన్నికల పరిశీలకులు మాత్రమే సెల్ ఫోన్స్ తీసుకెళ్ల వచ్చుని, మిగిలిన అధికారులు, సిబ్బంది ఎవ్వరు కూడా కౌంటింగ్ కేంద్రం లోని సెల్ ఫోన్స తీసుకెళ్లారాదని, అక్కడ సెల్ ఫోన్స్ కోసం ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
శిక్షణా తరగతులలో జాయింట్ కలెక్టర్, ఆముదాలవలస రిటర్నింగ్ అధికారి ఎం.నవీన్ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియకు అందరు సహనంతో, సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఎన్నికల నిబంధనలు విధిగా పాటించాలన్నారు. ఎటువంటి సొంత ఆలోచనలకు తావులేదన్నారు.
ఈ శిక్షణా తరగతులలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు, ఇచ్ఛాపురం, పలాస, పాతపట్నం, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, నరసన్నపేట, నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు సుదర్శన్ దొర, డాక్టర్ భరత్ నాయక్, అప్పారావు, సి.హెచ్. రంగయ్య, లక్ష్మణమూర్తి, రామ్మోహనరావు, నోడల్ అధికారులు జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు, నోడల్ అధికారి ఎన్.బాలాజీ, మాస్టర్ ట్రైనర్లు శేషగిరి, మెప్మా పిడి కిరణ్ కుమార్, ఓట్లు లెక్కింపు సహాయ రిటర్నింగ్ అధికారులు, సూపర్వైజర్లు తదితరులు హాజరైయారు.
Post A Comment:
0 comments: