⭕ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

⭕పూర్తి అవగాహన కచ్చితత్వంతో త్వరితగతిన ఈవీఎంల ఫలితాల వెల్లడికి చర్యలు

⭕ఓట్ల లెక్కింపు పరిశీలకులు: కైలాస్ బుoడేల  వెల్లడి

ఈవీఎంలలో ఓట్లను లెక్కింపుకు సంబంధించి ఈవీఎంల పనితీరుపై కౌంటింగ్ సూపరింటెండెంట్ సహాయ కులకు పూర్తి అవగాహన ఉండాలని కౌంటింగ్ పరిశీలకులు కైలాస బుo డేల సూచించారు. సోమవారం మండపేట అసెంబ్లీ నియోజకవర్గ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించిన మైక్రో అబ్జర్వర్లు కౌంటింగ్ సూప ర్వైజర్లు కౌంటింగ్ సహాయకులకు స్థానిక కలెక్టరేట్ గోదావరి భవన్ నందు ఈవీఎంల పనితీరు సాంకే తిక సమస్యలను అధిగమించే విధానం  గూర్చి క్షుణ్ణంగా వివరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పూర్తిచే సేందుకు అన్ని ఏర్పాట్లతో సర్వ సన్నద్ధం చేశారన్నారు.  ఈవీఎం కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ కౌంటిం గ్కు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారని తెలిపారు. కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, సూక్ష్మ పరిశీలకులు ఈసీఐ మార్గదర్శకాలు ప్రకారం నడుచుకోవాలని సూచిం చారు. ఉదయం 6 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. తోలుత ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ మరియు సర్వీస్ ఓట్ల లెక్కింపును ప్రారంభిం చి తదుపరి ఉదయం 8.30 గంట లకు పార్లమెంటు, అసెంబ్లీ ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభమవు తుందని పేర్కొన్నారు. కచ్చితమైన ప్రణాళికతో మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఫారం -21సీ డిక్లరేషన్ వంటి వాటితో సహా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపా రు. మండపేట రిటర్నింగ్ అధికారి డివిఎస్ ఎల్లారావు మాట్లాడుతూ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ఎంట్రీ పాయింట్ ఉంటుందన్నారు. కౌంటింగ్ స్టాఫ్, కౌంటింగ్ ఏజెంట్లు తదితరుల మొబైళ్ల కు అనుమతి లేనందున వారి ఫోన్లను భద్రపరిచేం దుకు ప్రత్యేకం కలెక్షన్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు  వైద్య శిబిరo సిబ్బందికి ఏజెంట్లకు కనీస వసతులు తదితర ఏర్పాట్లు చేసిన ట్లు తెలిపారు ఓట్ల లెక్కింపును వేగంతో కచ్చితత్వంతో నిర్వహించి. రౌండ్ల వారీగా ఫలి తాలు వెల్లడించనున్నారన్నారు. ఈవీఎం ల్లో నమోదైన ఓట్ల లెక్కింపు సందర్భంగా సమస్యలు వస్తే తక్షణం సరి దిద్దేందుకు బెల్ ఇంజినీర్స్ అందుబా టులో ఉంటారన్నారు. ఎక్కడా ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా సూచిక బోర్డుల ఏర్పాట్లు, గుర్తింపు కార్డుల జారీ, అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జూన్ 4న చేపట్టనున్న ఓట్ల లెక్కింపునకు ఈసీఐ మార్గ దర్శకాలకు అనుగుణంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా, జవాబు దారీతనం తో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ను నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్ అధికారులు మైక్రో అబ్జర్వర్లు కౌంటింగ్ సూపరింటెండెంట్ సహాయకులు పాల్గొన్నారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: