⭕కౌంటింగ్ నేపథ్యంలో3నుండి 5వరకు డ్రై డే⭕ ఈనెల నాలుగో తేదీన సాధారణ ఎన్నికలు 20 24 కు సంబంధించి పార్లమెంట్ 3నుండి 5వరకు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేపథ్యంలో శాంతి  భద్రతల దృష్ట్యా కోనసీమ జిల్లాలో ఈ నెల మూడో తేదీ నుండి 5 వ తేదీ వరకు డ్రై డే గా  ప్రకటించి మద్యం విక్రయాలు నిర్వహించడం లేదని జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టం 1968 లోని సెక్షన్ 20 (1) అధికారాల ప్రకారం  ఏపీ రాష్ట్ర  బ్రూవరీస్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు జిల్లాలోని మద్యం దుకాణాలు రిటైల్ అవుట్ లెట్లు, బార్లు మూసివేయాలని ఆదేశించడం జరిగిందన్నారు ఆ ప్రకారం కల్లు దుకాణాలు, రిటైల్డ్ అవుట్లెట్లు, రెట్టి ఫైడ్ స్పిరిట్, మిథనాలు వంటి అమ్మకాలను ఈనెల 3 నుండి 5 వరకు నిర్వహించ రాదని ఆయన  స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో చట్ట విరుద్ధంగా శాంతిభద్రతలకు విఘాతo కలిగించే  హింసాత్మక సంఘటనలకు ఆస్కారం లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజా సంరక్షణ దృష్ట్యా మద్యం విక్ర యాలపై నిషేధం విధించినట్లు ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేశారు
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: