టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం : కూటమి ఘనవిజయంపై ప్రజలకు చంద్రబాబు కృతజ్ఞతలు - మీడియా సహా రాష్ట్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు - శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు - నా సుధీర్ఘ రాజకీయ యాత్రలో గడిచిన ఐదేళ్ల లాంటి పాలన ఎప్పుడూ చూడలేదు - వ్యవస్థలను ఎలా నిర్వీర్యం చేశారో చూశాం - రాజకీయాల్లో ఒడిదొడుకులు సహజం - ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలన్నదే నా ధ్యేయం - మరింత బాధ్యతతో మనమంతా కలిసి పనిచేయాలి - భావితరాల భవిష్యత్ కోసం ముందుకెళ్లాం - రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు - దేశం ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు శాశ్వతం - సక్రమంగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆశీర్వదిస్తారు - ఇంత చరిత్రాత్మక ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు - అమెరికాలో ఉన్నవారు కూడా తపనతో వచ్చి ఓటు వేశారు - పక్క రాష్ట్రాలకు కూలి పనుల కోసం వెళ్లిన వాళ్లు కూడా రాష్ట్రం బాగుపడాలని వచ్చి ఓటు వేశారు - ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు 200 సీట్లు వచ్చాయి - మళ్లీ ఇప్పుడు ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయి - పార్టీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది - కూటమికి 55.38 శాతం ఓట్లు వచ్చాయి - టీడీపీకి 45.6 శాతం, 39.37 శాతం వైసీపీకి వైసీపీకి ఓట్లు వచ్చాయి - అవినీతి, అరాచకాలతో పనిచేస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయి - ఐదేళ్లు మా కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు - ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ అందరికీ ఉండాలి - మా కార్యకర్తల కంట్లో నిద్ర లేని పరిస్థితి తెచ్చారు - ప్రాణాలతో ఉండాలంటే జై జగన్ అనాలని హింసించారు - రాష్ట్రంలో పార్టీ కోసం ప్రాణాలు వదిలే పరిస్థితి చూశాం - కార్యకర్తల త్యాగాల ఫలితమే ప్రజాస్వామ్య విజయం - మీడియాను కూడా ఐదేళ్లు ఇబ్బంది పెట్టారు - ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి తెచ్చారు - అధికారం ఉంటే ఎవరినైనా ఏదైనా చేయవచ్చనే దాడులు చేశారు - విశాఖకు వెళ్తే పవన్ ను వెనక్కి పంపివేశారు - కేసులు ఎందుకు పెట్టారని ఎవరైనా అడిగితే అరెస్టులు చేశారు - సహజ సంపదను విచ్చలవిడిగా దోచుకున్నారు - అడ్డొచ్చిన వారిపై దాడులు చేసి బెదిరించారు - నేను మిగులు విద్యుత్ తీసుకొస్తే వైసీపీ నాశనం చేసింది - తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచి భారం మోపారు - మేం పాలకులం కాదు.. సేవకులం అని నిరూపిస్తాం - మా ఎన్నికల మేనిఫెస్టో ప్రజల్లోకి బలంగా వెళ్లింది - ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దని పవన్ పట్టుబట్టారు - రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందనే పవన్ కృషి చేశారు - అందుకే కూటమిలో బీజేపీ భాగస్వామ్యమైంది - పొరపాట్లు లేకుండా ముగ్గరం కలిసి పనిచేశాం - సమష్టి కృషితో విజయం సాధించగలిగాం - నాకు, నా కుటుంబానికి జరిగిన అవమానాన్ని భరించలేకపోయా - నాపై బాంబుతో దాడి చేసినప్పుడు కూడా బాధపడలేదు - మళ్లీ సీఎంగానే వస్తానని ఆనాడు అసెంబ్లీలో ప్రతిజ్ఞ చేశా - నా ప్రతిజ్ఞను నిజం చేయడానికి ప్రజలు కూడా తోడ్పడ్డారు : టీడీపీ అధినేత చంద్రబాబు*
Post A Comment:
0 comments: