పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ చదలవాడ నాగారాణిని ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా, తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ నాయకులు
కలెక్టర్ కు బుద్ధుడి ప్రతిమ, పూల బొకే అందజేసిన జర్నలిస్టు నాయకులు
జిల్లాలో ఉన్న జర్నలిస్టుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన జర్నలిస్టు నాయకులు
జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన ఇళ్ల స్థలాల ఏర్పాటు అందులో ఇంటి నిర్మాణం, అక్రిడిటేషన్ లలో చేర్పులు, మార్పులు అలాగే జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో 50శాతం ఫీజు రాయితీ కల్పన తదితర అంశాలతో కూడిన వినతిపత్రం అందజేత
జర్నలిస్టు నాయకులు వినతిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ నాగరాణి తగు చర్యలు తీసుకుంటానని హామీ
కలెక్టర్ ను కలిసిన వారిలో ఏపీయూడబ్ల్యూజే ఎలక్ట్రానికి మీడియా జిల్లా అధ్యక్షుడు జక్కంశెట్టి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు గారపాటి ప్రసాద్, తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తమ్మిశెట్టి రంగ సురేష్, ఉపాధ్యక్షుడు చింతకాయల దొరబాబు, భీమవరం ప్రెస్ క్లబ్ కార్యదర్శి కమ్మిల హనుమంతరావు, సహాయకార్యదర్శి నిమ్మల ఆది, తాడేపల్లిగూడెం, భీమవరం ప్రెస్ క్లబ్ సభ్యులు వానపల్లి పుండరీకాక్షుడు, జీ.వెంకటేష్, చింతపల్లి ఆదిత్య, కేత సత్యనారయణ తదితరులు
Post A Comment:
0 comments: