kapunews



TRENDING NOW

 



ఏపి క్యాబినెట్ సమావేశ ముఖ్యాంశాలు


సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం.

వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపులు, రాయతీల కల్పనకు క్యాబినెట్ ఆమోదం.

రక్షితనీటి సరఫరాకు శ్రీకాకుళంలో రూ.5.75 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్ కు ఆమోదం.

కుప్పంలో రూ.8.22 కోట్లు వయబిలిటి గ్యాప్ ఫండ్ విడుదలకు ఆమోదం.

సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకే కేబినెట్ ఆమోదం. 1 ఫిబ్రవరి 2025 నాటికి అర్హులైన 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు.

248 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు ఆమోదం.

వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మారుస్తూ తెచ్చిన జీవోకు కేబినెట్ ఆమోదం.

పోలీసు అకాడమీకి అదనంగా 94.45 ఎకరాలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం.

మహిళలు రాత్రిపూట కూడా పనిచేసే చట్టసవరణకు ఆమోదం. రాత్రిపూట పనిచేసే మహిళలకు భద్రత, రవాణా సౌకర్యం కల్పించాలి

 


రీల్స్ చేస్తుండగా విషాదం.. ఆరుగురు అమ్మాయిలు మృతి 


ఒకప్పుడు టిక్‌టాక్ రీల్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉండేది. టిక్‌టాక్‌లో ఫేమస్ కావాలన్న ఉద్దేశ్యంతో చాలా మంది పిచ్చి పిచ్చి పనులు చేసేవారు. ఈ నేపథ్యంలోనే ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ప్రతీ నిత్యం ఏదో ఒక న్యూస్ టిక్‌టాక్ విషాదాల గురించి వచ్చేది. టిక్‌టాక్ దేశంలో బ్యాన్ అయిన తర్వాత.. ఆ స్థానాన్ని ఇన్‌స్టాగ్రామ్ తీసుకుంది. ఇన్‌స్టాలో ఫేమస్ అవ్వాలని చిన్న పిల్లల దగ్గరినుంచి ముసలి వాళ్ల దగ్గరి వరకు ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా, ఓ ఆరుగురు అమ్మాయిలు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వీడియో చేస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. నదిలో మునిగి చనిపోయారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో మంగళవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, ఆగ్రా సమీపంలోని నగ్లా స్వామి గ్రామానికి చెందిన ఆరుగురు అమ్మాయిలు రీల్స్ వీడియో తీయడానికి యమునా నది దగ్గరకు వెళ్లారు. నది వారి ఇళ్లకు 800 మీటర్ల దూరంలోనే ఉంది.

ఆ ఆరుగురు అమ్మాయిలు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నదిలోకి దిగారు. వీడియో తీసుకుంటూ ఉన్నారు. అనుకోని విధంగా ఓ అమ్మాయి లోతుగా ఉన్న ప్రదేశంలోకి వెళ్లింది. నీటిలో మునిగిపోతూ ఉంది. ఇది గమనించిన మిగిలిన వాళ్లు ఆమెను రక్షించడానికి ప్రయత్నించారు. వారు కూడా నీటిలో మునిగిపోయారు. అక్కడే ఉన్న ఓ ఇద్దరు అబ్బాయిలు వారిని రక్షిద్దామని అనుకున్నారు. వారి వల్ల కాలేదు. దీంతో ఆరుగురు అమ్మాయిలు నీటిలో కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు, పోలీసులు నది దగ్గరకు చేరుకున్నారు.


నీటిలో కొట్టుకుపోయిన వారి కోసం గాలించారు. సంఘటన జరిగిన ప్రదేశం నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఆరుగురు దొరికారు. వారిలో నలుగురు అప్పటికే చనిపోయి ఉన్నారు. మిగిలిన ఇద్దర్నీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు సీపీఆర్ చేయటంతో బతికారు. అయితే, కొన్ని గంటల తర్వాత వారు కూడా చనిపోయారు. చనిపోయిన వారిలో ముస్కాన్ అనే అమ్మాయికి కొన్ని రోజుల క్రితమే నిశ్చితార్థం అయింది. నవంబర్ నెలలో పెళ్లి ఉంది. ఇంతలోనే ఇలా జరిగింది. ఈ ఆరుగురు అమ్మాయిలు ఒకే కుటుంబానికి చెందిన వారు. అక్కాచెల్లెళ్లు అవుతారు. వీరి మృతితో కుటుంబంతో పాటు గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.

 



తెలంగాణ కేడర్‌కు చెందిన 2024 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్‌లు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన ముఖ్యమంత్రి గారు, బాధ్యతల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.

ముఖ్యమంత్రి గారిని కలిసిన సౌరభ్ శర్మ (Saurabh Sharma), సలోని ఛబ్రా (Saloni Chhabra), హర్ష చౌధరి (Harsha Choudhary), కరోలిన్ చింగ్తియన్మావి (Carolyn Chingthianmawi), కొయ్యడ ప్రణయ్ కుమార్ (Koyyada Pranay Kumar) గార్లు ప్రస్తుతం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు.

జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి గారి నివాసంలో జరిగిన ఈ భేటీలో సీఎం సలహాదారు వేం. నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు గారు, Dr. MCRHRD వైస్-ఛైర్‌పర్సన్ శాంతి కుమారి గారు, కోర్సు డైరెక్టర్ ఉషారాణి గారు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు

 


కూటమి చారిత్రక విజయానికి ఏడాది పూర్తి- ప్రజాతీర్పును గౌరవించుకున్న రోజు ఇది..

- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి


అమరావతి:ప్రజా తీర్పునకు, ప్రజా చైతన్యానికి ఏడాది పూర్తయింది. ప్రజాస్వామ్య పరిరక్షణకు, ఎన్డీఏ కూటమి చారిత్రక విజయానికి ఏడాది పూర్తయిందని..జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ విజయానికి ఏడాదైందని ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. జూన్ నెల నాల్గో తేదీ 2024 అనేది భారతదేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయే రోజన్నారు. ఐదేళ్ళ ఏళ్ల అరాచక పాలనను తరిమికొట్టి, నిరంకుశ ఫ్యూడలిస్టిక్ కోటలను ప్రజలు తమ ఓటు హక్కుతో బద్దలుకొట్టి, ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది పలికిన రోజుగా అంటూ సోషల్ మీడియా 'ఎక్స్' లో జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోస్టు చేశారు. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న నవ భారత్ నిర్మాత నరేంద్ర మోదీ దృఢమైన నాయకత్వంలో, నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం, ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని ప్రజాక్షేత్రంలో దృఢంగా నిలచిన ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు నుండి, దశాబ్ద కాలంగా ఎన్నో పోరాటాలు చేసి, మరెన్నో దాష్టికాలను తట్టుకుని అడ్డుగోడగా నిలచిన జనసైనికులు, వీరమహిళల పోరాట స్ఫూర్తి, వ్యవస్థలో మార్పు తీసుకురావాలంటే జనసేన పార్టీ సంకల్పానికి ప్రజలకు అండగా నిలిచి చరిత్రాత్మక విజయాన్ని అందించిన రోజుగా వివరించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును బాధ్యతగా తీసుకున్నామని, గత తప్పిదాలను సరిచేస్తూ, భావితరాలకు బంగారు భవిష్యత్తు అందించాలనే దిశగా అడుగులేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్ర 2047 దిశగా నడిపించడానికి, వికసిత్ భారత్ 2047 లో కీలక భాగస్వామిగా అయ్యేందుకు ఉమ్మడి ప్రణాళికతో, రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రజల ఆకాంక్షలే లక్ష్యంగా "జనసేన పార్టీ - తెలుగుదేశం - బీజేపీ" పార్టీల ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజా పరిపాలనను అందిస్తుందన్నారు. "రానున్న రోజుల్లో మరింత సమర్థవంతమైన పరిపాలన అందజేస్తుంది, సంక్షేమం సాధించేలా మరింత బాధ్యతతో కృషి చేయాలనుకుంటున్నాను. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన జనసైనికులకు, వీరమహిళలకు, టీడీపీ, బీజేపీ కార్యకర్తలకు, మూడు పార్టీల నాయకులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా.." అంటూ పవన్ కళ్యాణ్ వివరించారు.


ఆనందాల కలయిక:

సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ఏడాది సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని బుధవారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపి ఆనందాన్ని పంచుకున్నారు

 



థియేటర్‌లో మళ్లీ సందడి చేయనున్న ‘అందాల రాక్షసి’

నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ప్రేమకథా చిత్రం ‘అందాల రాక్షసి’ మళ్లీ థియేటర్లలోకి రానుంది. 2012లో విడుదలై యూత్‌ను ఆకట్టుకున్న ఈ మూవీ జూన్ 13న రీరిలీజ్ కాబోతోంది. అప్పట్లో ఈ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ పెద్ద తెరపై చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలోని సంగీతం, కథనం, భావోద్వేగాలు ప్రేక్షకులను హత్తుకున్నాయి.

 


కుల గణనపై కేంద్రం కీలక నిర్ణయం- వచ్చే ఏడాది నుంచి ప్రక్రియ ప్రారంభం

కుల గణన, జనాభా లెక్కలపై కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది. ప్రస్తుతం ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ కులగణన ప్రక్రియను వచ్చే ఏడాది నుంచి ప్రారంభించబోతోంది. 

1 అక్టోబర్‌ 2026 నుంచి తొలి దశ కులగణన స్టార్ట్ చేయనున్నట్టు పేర్కొంది. దీన్ని రెండు దశల్లో పూర్తి చేయాలని చూస్తోంది. రెండో దశను మార్చి 1, 2027 నుంచి స్టార్ట్ చేయనున్నారు. 


అదే సమయంలో, లడఖ్, జమ్మూ-కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి పర్వత రాష్ట్రాల్లో అక్టోబర్ 1, 2026 నుంచి జనాభా లెక్కలు ప్రారంభమవుతాయి. కుల గణనతోపాటు, జనాభా లెక్కలు 2 దశల్లో ప్రారంభిస్తారు.





వైసీపీ “వెన్నుపోటు దినం” పై సీఎం చంద్రబాబు సెటైర్లు


కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన నేటికి ఏడాది అయిన సందర్భంగా… ఎన్నికల ముందు హామీలు ఇచ్చి… గెలిచిన తరువాత ప్రజలను వెన్నుపోటు పొడిచారంటూ… “వెన్నుపోటు దినం” పేరుతో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపుమేరకు… రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ “వెన్నుపోటు దినం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో వైసీపీ చేపట్టిన “వెన్నుపోటు దినం” పై సీఎం చంద్రబాబు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు … ప్రజా విప్లవానికి ‘నియంత’ కొట్టుకుపోయిన రోజు ఇది అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేసారు.


ఈ మేరకు తన అఫీషియన్ సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్‌’లో ఆయన పోస్టు చేశారు. ‘‘అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు. సైకో పాలనకు అంతం పలికి… ప్రతి పౌరుడూ స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజు. ఉద్యమంలా ఓట్లేసి తిరిగి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన రోజు. ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజు. పసుపు సైనికుల పోరాటాలు, జనసైనికుల ఉద్యమాలు, కమలనాథుల మద్దతుతో రాష్ట్రం గెలిచిన రోజు.


ఏడాది క్రితం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా భావించి ప్రతి రోజూ పనిచేస్తున్నాం. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు పాలనను గాడిన పెట్టాం. సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధిని పట్టాలెక్కించాం. రాష్ట్ర దశ, దిశను మార్చేందుకు ఇచ్చిన ఏకపక్ష తీర్పునకు ఏడాది పూర్తయిన సందర్భంగా నాటి విజయాన్ని గుర్తుచేసుకుంటూ ప్రజలకు శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. వచ్చే 4 ఏళ్లలో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని మాట ఇస్తున్నాం. విధ్వంస పాలకులపై రాజీలేని పోరాటంతో కూటమి విజయానికి నాంది పలికిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కార్యకర్తలు, నాయకులకు అభినందనలు.. ధన్యవాదాలు. జై ఆంధ్రప్రదేశ్.. జై జై ఆంధ్రప్రదేశ్!’’ అని చంద్రబాబు పేర్కొన్నారు

 





కూటమి అఖండ విజయానికి ఏడాది పూర్తి

చీరాల ఎమ్మెల్యే కార్యాలయంలో శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారి ఆదేశానుసారం ప్రజా విజయోత్సవ సంబరాలు జరిగాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం ఏర్పడి ఏడాది...


సుపరిపాలనతో ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం...


పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పాలన...

ఏడాదిలో కూటమి ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించింది - ఇవ్వని హామీలూ అమలు చేస్తున్న సంక్షేమ ప్రభుత్వం మాది - దెబ్బతిన్న ఏపీ బ్రాండ్‍ను ఏడాదిలోనే తిరిగి నిలబెట్టగలిగాం - సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం - సైకో పాలనతో వెనక్కి వెళ్లిన పరిశ్రమలను తిరిగి రప్పిస్తున్నాం - ఇప్పటికే ఆరు లక్షల ఉద్యోగ అవకాశాలను కూటమి ప్రభుత్వం కల్పించింది - అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తున్నాం.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాసిక వీరభద్రయ్య గారు ఏం సి చైర్మన్ కౌతరపు జనార్ధన్ గారు చీరాల మండల పార్టీ అధ్యక్షులు గంజి పురుషోత్తం గారు జనసేన పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి గూడూరు శివరాం ప్రసాద్ గారు, జనసేన వీర మహిళ కారంపూడి పద్మిని గారు,  గ్రామ్ పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు అభిమానులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు 




 





చీనాబ్‌ వంతెనను ఈ నెల 6వ తేదీన ప్రారంభించనున్న మోదీ


ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనగా చీనాబ్‌ బ్రిడ్జి


ఈ వంతెన ఎత్తు 359 మీటర్లు, ఇది పారిస్ ఈఫిల్ టవర్ ఎత్తు (330మీటర్లు) కంటే ఎక్కువ


ఉదంపూర్- శ్రీనగర్- బారాముల్లా మధ్య రైల్వే లైన్‌


కాశ్మీర్ లోయను దేశంలో మిగతా ప్రాంతాలతో ఈ వంతెన కలుపుతుంది.

 





మచిలీపట్నంలో ఏసీబీ అధికారులు దాడులు..పట్టుపడ్డ అవినీతి తిమింగలం..


 మచిలీపట్నం  కృష్ణాజిల్లా  ఫారెస్ట్ ఆఫీస్ మచిలీపట్నం కార్యాలయంలో డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విధులు నిర్వహిస్తున్న జయప్రకాష్ మంగళవారం 18 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు..

పట్టుబడ్డ ఉద్యోగులపై ఏసీబీ అధికారులు కేసు నమోదు  చేశారు..

ఏసీబీ డీఎస్పీ పివి సుబ్బారావు ఆధ్వర్యంలో మచిలీపట్నం అటవీశాఖ కార్యాలయంలో డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పై ఏసీబీ రైడ్ నిర్వహించారు. 

ఎంవిఎస్ నాగరాజు ఇతర ఉన్నతాధికారులు ఈ రైడ్ లో పాల్గొన్నారు..



 

ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థులపై నిషేధం!


హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థులపై ట్రంప్ సర్కార్ నిషేధాజ్ఞలు


జాతీయ భద్రతే ప్రధాన కారణమన్న వైట్‌హౌస్


ప్రస్తుత అంతర్జాతీయ విద్యార్థుల వీసాల రద్దుకు కూడా ఆదేశాలు


ఈ నిషేధంపై ఇంకా అధికారికంగా స్పందించ‌ని హార్వర్డ్ 


ట్రంప్ చర్యపై విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన


అమెరికా ఉన్నత విద్యా విధానంలో భారీ మార్పుగా విశ్లేషణ


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు విదేశీ విద్యార్థులు అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తూ బుధవారం ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై ఆయన సంతకం చేశారు. ఈ చర్య ట్రంప్ ప్రభుత్వానికి, హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. 


అంతేకాకుండా ఇప్పటికే హార్వర్డ్‌తో సంబంధం ఉన్న అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించే అధికారాన్ని ఈ ఉత్తర్వు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు కట్టబెట్టింది. ఇది అమెరికా ఉన్నత విద్యా విధానంలో, అంతర్జాతీయ విద్యార్థుల రాకపోకల విషయంలో ఒక కీలక మార్పుగా పరిగణిస్తున్నారు.


క్యాంపస్‌లో యూదు వ్యతిరేకత (యాంటీసెమిటిజం), పౌర హక్కుల ఉల్లంఘనల ఆరోపణల నేపథ్యంలో, విదేశీ విద్యార్థులను చేర్చుకునే హార్వర్డ్ హక్కును రద్దు చేయడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ చేసిన ప్రయత్నాలను ఒక ఫెడరల్ న్యాయమూర్తి కొద్ది వారాల క్రితమే ఇంజంక్షన్‌ ద్వారా నిరోధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కొత్త ఉత్తర్వు వెలువడింది.


ఈ కార్యనిర్వాహక ఉత్తర్వుకు మద్దతుగా వైట్ హౌస్ విడుదల చేసిన ప్ర‌క‌ట‌న‌లో పలు అంశాలను ప్రస్తావించారు. క్యాంపస్‌లో నెలకొన్న యూదు వ్యతిరేకత, విశ్వవిద్యాలయం వైవిధ్యం, సమానత్వం, చేరిక (Diversity, Equity, and Inclusion - డీఈఐ) కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం, పెరుగుతున్న క్యాంపస్ క్రైమ్ రేట్లు, ఫెడరల్ రికార్డుల అభ్యర్థనలకు హార్వర్డ్ అనుగుణంగా వ్యవహరించకపోవడం వంటి కారణాలను అందులో పేర్కొన్నారు. ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలోని 12 దేశాల నుంచి ప్రవేశాన్ని నిషేధించడానికి, అలాగే మరో ఏడు దేశాల నుంచి ప్రవేశాన్ని పరిమితం చేయడానికి ట్రంప్ ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రయత్నాలకు కొనసాగింపుగా ఈ తాజా ఉత్తర్వు కనిపిస్తోంది.


ఈ నిషేధంపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. విద్యా నైపుణ్యం మరియు ప్రపంచ స్థాయి ప్రతిష్ట కోసం తన విభిన్న అంతర్జాతీయ విద్యార్థుల సమూహంపై ఎక్కువగా ఆధారపడే ఈ సంస్థ, గతంలో కూడా విదేశాల నుంచి విద్యార్థులను చేర్చుకునే తమ సామర్థ్యాన్ని దెబ్బతీసే ఫెడరల్ ప్రయత్నాలను సవాలు చేస్తూ న్యాయపోరాటం చేసింది.


ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది. ఈ ఉత్తర్వు విద్యా స్వేచ్ఛకు ప్రమాదకరమైన సంకేతమని, ఉన్నత విద్య మరియు పరిశోధనలలో ప్రపంచ నాయకుడిగా అమెరికాకున్న ఖ్యాతిని ఇది దెబ్బతీస్తుందని విమర్శకులు వాదిస్తున్నారు. ఈ నిర్ణయంపై న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నందున... హార్వర్డ్‌లో, ఇతర అమెరికా విశ్వవిద్యాలయాలలో అంతర్జాతీయ విద్యార్థుల నమోదుపై దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది


 




ఎల్లుండి కేంద్ర మంత్రివర్గ సమావేశం


ఆపరేషన్‌ సింధూర్‌ తరువాత తొలి మంత్రివర్గ సమావేశం


బిహార్‌ ఎన్నికల షెడ్యూల్‌పై చర్చించే అవకాశం


రెండు లేదా మూడు దశల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు


దీపావళి కంటే ముందే బిహార్‌ ఎన్నికలు ఉండే అవకాశం


నవంబర్‌ 22తోముగియనున్న బిహార్‌ అసెంబ్లీ గడువు


త్వరలోనే బిహార్‌లో పర్యటించనున్న ఎన్నికల కమిషన్‌


 




వెస్ట్ బెంగాల్ లో లా స్టూడెంట్ శర్మిష్ట పనోలీ అరెస్ట్..


శర్మిష్టకు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు


ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెట్టిన డిలీట్ చేసిన శర్మిష్ట


సోషల్ మీడియాలో క్షమాపణలు కోరిన శర్మిష్ట


శర్మిష్ట అరెస్టుపై స్పందించిన డచ్ ఎంపీ గీర్డ్ వైల్డర్స్


సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై అరెస్టు చేయడం ఏంటని ప్రశ్న


భారత్ లో వాక్ స్వేచ్ఛకు భంగం కలిగించేలా బెంగాల్ పోలీసుల చర్య ఉందంటూ మండిపాటు







 జైలు నుంచి 200 మంది ఖైదీలు పరార్


పాకిస్థాన్కు భారీ షాక్ తగిలింది. కరాచీ జైలు నుంచి 200 మంది ఖైదీలు తప్పించుకున్నారు. సోమవారం అర్ధరాత్రి జైలు అధికారులపై దాడి చేసి మెయిన్ గేటు బద్దలు కొట్టుకుని పరార్ అయ్యారు. పలువురు పోలీస్ ఆఫీసర్లకు తీవ్ర గాయాలైయ్యాయి. తప్పించుకున్న ఖైదీల కోసం పోలీసులు వెతుకుతున్నారు. దీంతో కరాచీ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా పారిపోయిన ఖైదీలంతా కరుడుగట్టిన క్రిమినల్స్ అని తెలుస్తోంది







 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంగవీటి మోహన రంగా విగ్రహాల ధ్వంసం కార్యక్రమం లో పాల్గొన్న దుష్ట మూకలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు 

 పిఠాపురం నియోజకవర్గంలో  యు కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహానికి సంబంధించిన చేతులు తీసివేయటం జరిగింది. చేతులు తీసివేసిన దుష్ట మూకలను వారు ఎంతటి పలుకుబడి ఉన్న వారైనా సరే వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటువంటి అప్రజ స్వామిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతి అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు. ఈ మధ్యకాలంలో సఖినేపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వంగవీటి మోహన రంగా విగ్రహ స్థాపనకు పర్మిషన్ లేదంటూ హడావుడి చేసి విగ్రహాన్ని పెట్టకుండా ఇబ్బందులు పాలు చేసిన చర్యలను కూడా ఈ సందర్భంగా ఖండిస్తూ ఉన్నాం.