మరోసారి మానవత్వం చాటుకున్న ఏపీ హోంమంత్రి అనిత!
విశాఖపట్నం:ఏపీ హోం మంత్రి అనిత మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. విశాఖలో ఎయిర్ పోర్టుకు వెళుతుం డగా... తాడిచెట్లపాలెం జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదంలో గాయపడి అచేతనంగా పడిపోయిన ఒక యువకుడిని గమనించారు.
వెంటనే తన కాన్వాయ్ ని ఆపించి, ఆమె స్వయంగా సహాయక చర్యలు చేపట్టారు. మెరుగైన వైద్యం కోసం వెంటనే సమీప ఆసుపత్రికి తరలించాలని పోలీసులను ఆదేశించారు. ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డ ఓ వృద్ధురాలికి ధైర్యం చెప్పారు.
ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది.
Post A Comment:
0 comments: