చెప్పుతో కొట్టిన అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి 

సమాజం సిగ్గు పడే విధంగా వ్యవహరించిన ఎక్సైజ్ సిఐపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సాకే హరి డిమాండ్ చేశారు.శనివారం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగ మద్దయ్యను కలిసి ఎక్సైజ్ సిఐ హసీనా భానుపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.సాకే హరి మాట్లాడుతూ.. కళ్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ హసీనాబాను అవినీతి అక్రమ వసూళ్ల కోసమే ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని బయట ప్రపంచానికి తెలిసిందని తనను కాపాడుకోవడానికి ఆఫీస్ బాయ్ పై చెప్పుతో కొట్టడం సరైనది కాదన్నారు. పొరపాటు జరిగి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఫిర్యాదు చేయాలి కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకొని బరితెగించి భౌతిక దాడులకు దిగడం ఏమిటని ప్రశ్నించారు.ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి అందరి ముందు చెప్పుతో దాడి చేయడమంటే వీధి రౌడీలను తలపించే విధంగా ఉందన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఎక్సైజ్ సీఐ హసీనాబానును పూర్తిగా విధుల నుంచి తొలగించి కేసు నమోదు చేసి శిక్షించాలన్నారు. కార్యక్రమంలో ఫైట్ ఫర్ రైట్స్ కేపీ రాజు. సమతా సైనిక్ దళ్ సుగామంచి శ్రీనివాసులు. విద్యార్థి నిరుద్యోగ ఐక్యవేదిక టిపి రామన్న. జేఏసీ నాయకులు రామకృష్ణ.నారాయణస్వామి. ఎగ్గడి నరేంద్ర పాల్గొన్నారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: