తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్న గద్వాల్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.*
*ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణలో కార్యక్రమానికి: జడ్పీ చైర్మన్ మరియు గద్వాల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సరితా తిరుపతయ్య గారు పాల్గొని జెండా ఆవిష్కరణ చేయడం జరిగినది*
*తెలంగాణ అమరుల కుటుంబా సభ్యులను సన్మానించిన:జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య గారు*
గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన అవతరణ వేడుకలలో *జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత తిరుపతయ్య గారు* జాతీయ జెండాను పరిష్కరించి మరియు కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగినది. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయంలో జండా ఆవిష్కరణ చేసి అనంతరం పాత బస్టాండ్ నందు గద్వాల ప్రాంతానికి చెందిన 1969 తొలిదశ ఉద్యమంలో అమరులైన కొట్టం వేణుగోపాల్, పాశ్యం సర్వారెడ్డి ల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు ఆర్పించి,వారి కుటుంబ సభ్యులను జెడ్పి చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య గారు సన్మానించారు.. అనంతరం స్మృతి వనం లోని అమరుల స్థూపం వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు...
ఈ కార్యక్రమానికి
గద్వాల్ మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్, మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్,గట్టు తిమ్మప్ప, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ టీపీసీసీ ప్రతినిధి శంకర్ అన్న గారు, జిల్లా జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు నల్లారెడ్డి గారు,మధుసూదన్ బాబు, గద్వాల్ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇసాక్ గారు,లత్తిపురం వెంకట్రామిరెడ్డి, అమరావాయి కృష్ణారెడ్డి,మోహన్ రావు,కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
Post A Comment:
0 comments: